1, ఆగస్టు 2026, శనివారం

పంచాంగం 01.08.2026 Saturday

  ఈ రోజు పంచాంగం 01.08.2026  Saturday,


స్వస్తి  శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం  గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస క్రిష్ణ పక్ష తృతీయ తిథి స్థిర వాసర శతాభిశం నక్షత్రం శోభన యోగః వణిజ తదుపరి బవ కరణం.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

  

 


శ్రాద్ధ తిథి: తదియ 



 

నమస్కారః , శుభోదయం

వేసవి కాలం...

  1980 వేసవి కాలం...


మద్రాస్‌ మైలాపూర్‌లోని ఓ సాధారణ ఇంటి ఆవరణలో ఏడో తరగతి చదువుతున్న ఓ బాలుడు దిగులుగా నిలబడి చూస్తున్నాడు....


అతని తండ్రి... అతని క్రికెట్ బ్యాట్‌ను తీసుకుని ఇంటి లోతైన బావిలోకి విసిరేశారు...


స్థానిక క్రికెట్ మ్యాచ్‌లో వేసిన ఓ వేగవంతమైన బంతి తాకడంతో బాలుడి కళ్లద్దాలు పగిలిపోయాయి... 


తన కుమారుడి కంటి చూపుకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని తండ్రి భయపడ్డారు...


“ఇక నీ క్రికెట్ ఆట అంతే!” అన్నారు తండ్రి.

ఆ వెంటనే అతని చేతిలో ఓ వయొలిన్ పెట్టారు...


“నీకు ఖచ్చితత్వం కావాలంటే... దీన్ని నేర్చుకో. దీన్ని సాధించు.”


ఆ బాలుడు మారాం చేయలేదు...

ఏడవలేదు...


తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్‌ను వదిలి, తన దృష్టినంతా ఆ వయొలిన్ తీగలపై కేంద్రీకరించాడు...


అలా సాధన చేస్తూ... సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించాడు...


చివరకు భారతరత్న ఎం.ఎస్. సుబ్బలక్ష్మి వంటి మహోన్నత సంగీత విద్వాంసుల సమక్షంలో వాయించే స్థాయికి ఎదిగాడు...

 

ఆమె నుంచే స్వయంగా సవరణలు, సూచనలు తీసుకునే స్థాయికి చేరుకున్నాడు...


కానీ జీవితం అతడిని మరోసారి పరీక్షించింది...


ఐదేళ్ల తర్వాత... 1985లో IIT-JEE పరీక్షలో అతను విఫలమయ్యాడు...


అతను మాత్రం ఆగిపోలేదు...


ఒక ప్రాంతీయ ఇంజినీరింగ్ కళాశాలలో చేరాడు...


అక్కడ కంప్యూటర్ సైన్స్‌లోని లాజిక్ గేట్లను, సర్క్యూట్లను నిశ్శబ్దంగా లోతుగా అధ్యయనం చేశాడు...


తన కృషితో చివరకు IIT మద్రాస్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ పరిశోధకుడిగా అడుగుపెట్టాడు....


అక్కడే PhD పూర్తి చేశాడు...


అక్కడే ప్రొఫెసర్ అయ్యాడు...


ఆ తర్వాత...


ఒకప్పుడు తనను తిరస్కరించిన అదే IIT మద్రాస్‌కు డైరెక్టర్‌గా తిరిగి వచ్చాడు!

2011 నాటికి...


ప్రపంచం స్మార్ట్‌ఫోన్ యాప్స్‌..వినియోగదారుల టెక్నాలజీ చుట్టూ పరుగులు తీస్తోంది...


కానీ ఆ ప్రొఫెసర్ ఆలోచన మాత్రం మరో ప్రమాదం చుట్టూ తిరుగుతోంది...


భారతదేశంలోని రాడార్లు, యుద్ధ విమానాలు, బ్యాంకింగ్ సర్వర్లు, రక్షణ వ్యవస్థలు... 


కీలకమైన అనేక వ్యవస్థల్లో ఉపయోగించే మైక్రోప్రాసెసర్లు విదేశీ డిజైన్లపై ఆధారపడి ఉన్నాయి...


అతని మదిలో ఒక ప్రశ్న మెదిలింది:


“విదేశీ చిప్ మనం కోరుకున్న పనినే చేస్తుందని పరీక్షించగలం...కానీ యుద్ధం వచ్చినప్పుడు...మనం కోరుకోని పని అది చేయదని ఎలా హామీ ఇవ్వగలం?”


ఆ ప్రశ్నే ఒక సంకల్పంగా మారింది...


భారతదేశం తన సొంత మైక్రోప్రాసెసర్‌ను...తన సొంత సాంకేతికతతో...తానే ఎందుకు తయారు చేసుకోకూడదు?


ప్రపంచంలోని టెక్నాలజీ దిగ్గజాలు మాత్రం ఇది అంత సులభం కాదని చెప్పాయి...


బిలియన్ల డాలర్ల పెట్టుబడులు కావాలి...


భారీ మౌలిక సదుపాయాలు కావాలి...


విదేశీ పేటెంట్ల అవసరం ఉంటుంది...


కానీ అతను వెనక్కి తగ్గలేదు...


తన బృందంతో కలిసి పరిమిత వసతులున్న ప్రయోగశాలల్లో సుదీర్ఘ గంటలు పనిచేశాడు...


ఓపెన్ సోర్స్ RISC-V ఆర్కిటెక్చర్‌ను ఆధారంగా చేసుకుని...


లాజిక్‌ను రూపొందించారు...


సిలికాన్ డిజైన్‌ను నిర్మించారు...


బిలియన్ల కొద్దీ ఇన్‌స్ట్రక్షన్ సైకిళ్లను పరీక్షించారు...


చివరకు...2018 జూలై...


“Risecreek” అనే కోడ్‌నేమ్‌తో రూపొందించిన కేవలం 16 చదరపు మిల్లీమీటర్ల పరిమాణంలోని చిన్న సిలికాన్ చిప్ ప్రయోగశాలకు చేరుకుంది...


అది కేవలం ఒక చిప్ కాదు...


భారతీయ మేధస్సు, పట్టుదల, స్వావలంబనకు ఒక సాక్ష్యం...


బృందం దాన్ని కనెక్ట్ చేసింది...స్విచ్ ఆన్ చేశారు...


ఆ చిన్న చిప్‌పై Linux ఆపరేటింగ్ సిస్టమ్ బూట్ అవుతున్న దృశ్యం తెరపై కనిపించింది...


100 శాతం భారతీయ డిజైన్‌తో రూపొందించిన సిలికాన్‌పై Linux తొలిసారి బూట్ అయింది...


అది ఒక ప్రయోగం విజయవంతం కావడం మాత్రమే కాదు...


సాంకేతిక స్వావలంబన వైపు భారత్ వేసిన ఒక కీలక అడుగు...


నేడు ఆయన రూపొందించిన SHAKTI ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ రక్షణ కమ్యూనికేషన్ల నుంచి అంతరిక్ష రంగానికి సంబంధించిన నియంత్రణ వ్యవస్థల వరకు వివిధ కీలక సాంకేతిక ప్రయోగాల్లో ఉపయోగపడుతోంది...


ఒకప్పుడు...


తండ్రి బావిలోకి క్రికెట్ బ్యాట్ విసిరేసిన ఆ చిన్న బాలుడు...


1985లో IIT-JEEలో విఫలమైన ఆ విద్యార్థి...


వయొలిన్‌ను సాధన చేసి ఎం.ఎస్. సుబ్బలక్ష్మి వంటి మహానుభావుల నుంచి మెళకువలు నేర్చుకున్న ఆ కళాకారుడు...


తనకు లభించిన IIT డైరెక్టర్ అధికారిక నివాసాన్ని కూడా వదిలి, తన తండ్రి వదిలివెళ్లిన సంస్కృత గ్రంథాలయాన్ని కాపాడేందుకు కుటుంబ ఇంట్లోనే ఉండటాన్ని ఎంచుకున్న ఆ వ్యక్తి...


ఆయనే...


ప్రొఫెసర్ వీజినాథన్ కామకోటి....


విజయం అంటే ఓటమి ఎరుగకపోవడం కాదు...


ఓటమి ఎదురైన ప్రతిసారీ... మరో దారిని వెతుక్కుంటూ ముందుకు సాగడమే...


ఒక బాలుడి చేతిలోంచి క్రికెట్ బ్యాట్ పోయింది...అతని చేతిలో వయొలిన్ వచ్చింది...


JEEలో ఓటమి వచ్చింది...అతని చేతిలో పరిశోధన వచ్చింది...


చివరకు... అతని చేతిలో దేశ సాంకేతిక స్వావలంబనకు ఒక కొత్త దారి వచ్చింది...

అదే పట్టుదల...


అదే ప్రతిభ...

అదే భారతీయ మేధస్సు....


ఈ కామకోటి గారి గురించే ప్రియాంక వాద్రా పార్లమెంటులో గోమూత్రం గాడు అంటూ హేళన చేసింది...


ఆ కుటుంబ సంస్కారం ఎలాంటిదో అర్థం అయ్యిందా...


శ్రీ Ned Narayan గారి వాల్ నుండి

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే ।

నిఃస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా ।। 18 ।।



ప్రతిపదార్థ:


యదా — ఎప్పుడైతే; వినియతం — పూర్తిగా నియంత్రించబడి; చిత్తం — మనస్సు; ఆత్మని — ఆత్మ యొక్క; ఏవ — ఖచ్చితంగా; అవతిష్ఠతే — ఉండును; నిఃస్పృహః — తృష్ణ (కోరికలు) లేకుండా; సర్వ — సమస్త; కామేభ్యః — ఇంద్రియ వాంఛల కోసం; యుక్త — పరిపూర్ణ యోగములో స్థితుడై ఉండి; ఇతి — ఈ విధంగా; ఉచ్యతే — అంటారు; తదా — అప్పుడు.



తాత్పర్యము: 


వారు సంపూర్ణ క్రమశిక్షణతో, మనస్సుని అన్ని స్వార్థ పూరిత వాంఛల నుండి వెనక్కి మరల్చి, పరమశ్రేష్ఠమైన ఆత్మ శ్రేయస్సుయందే లగ్నం చేస్తారు. ఇటువంటి వారు యోగములో ఉన్నారు అని చెప్పబడతారు, మరియు వారు సమస్త ఇంద్రియ కోరికలకు అతీతంగా ఉంటారు.



వివరణ:


ఒక మనిషి యోగ సాధనమును ఎప్పుడు పూర్తి చేసినట్టు? దీనికి సమాధానం ఏమిటంటే, నిగ్రహింపబడిన చిత్తము (మనస్సు) ఎప్పుడైతే కేవలం భగవంతుని యందు మాత్రమే నిలిచి స్థితమై పోతుందో అప్పుడు. ఆ సమయంలో, మనస్సు దానంతట అదే ఇంద్రియ లౌల్యముల నుండి మరియు ప్రాపంచిక భోగాల నుండి వీగిపోయి దూరమైపోతుంది. ఆ సమయంలో వ్యక్తిని 'యుక్తుడు'గా పరిగణించవచ్చు లేదా పరిపూర్ణ యోగములో ఉన్నట్టు. ఈ అధ్యాయం చివరలో ఆయన ఇంకా ఇలా అన్నాడు: ‘యోగులందరిలో కెల్లా ఎవరి మనస్సులైతే ఎప్పుడూ నా యందే స్థితమై ఉండునో, మరియు ఎవరైతే దృఢ విశ్వాసంతో నా పట్ల భక్తిలో నిమగ్నమై ఉందురో, వారిని నేను అత్యున్నతులుగా పరిగణిస్తాను. (శ్లోకం 6.47).’