1, ఆగస్టు 2026, శనివారం

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే ।

నిఃస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా ।। 18 ।।



ప్రతిపదార్థ:


యదా — ఎప్పుడైతే; వినియతం — పూర్తిగా నియంత్రించబడి; చిత్తం — మనస్సు; ఆత్మని — ఆత్మ యొక్క; ఏవ — ఖచ్చితంగా; అవతిష్ఠతే — ఉండును; నిఃస్పృహః — తృష్ణ (కోరికలు) లేకుండా; సర్వ — సమస్త; కామేభ్యః — ఇంద్రియ వాంఛల కోసం; యుక్త — పరిపూర్ణ యోగములో స్థితుడై ఉండి; ఇతి — ఈ విధంగా; ఉచ్యతే — అంటారు; తదా — అప్పుడు.



తాత్పర్యము: 


వారు సంపూర్ణ క్రమశిక్షణతో, మనస్సుని అన్ని స్వార్థ పూరిత వాంఛల నుండి వెనక్కి మరల్చి, పరమశ్రేష్ఠమైన ఆత్మ శ్రేయస్సుయందే లగ్నం చేస్తారు. ఇటువంటి వారు యోగములో ఉన్నారు అని చెప్పబడతారు, మరియు వారు సమస్త ఇంద్రియ కోరికలకు అతీతంగా ఉంటారు.



వివరణ:


ఒక మనిషి యోగ సాధనమును ఎప్పుడు పూర్తి చేసినట్టు? దీనికి సమాధానం ఏమిటంటే, నిగ్రహింపబడిన చిత్తము (మనస్సు) ఎప్పుడైతే కేవలం భగవంతుని యందు మాత్రమే నిలిచి స్థితమై పోతుందో అప్పుడు. ఆ సమయంలో, మనస్సు దానంతట అదే ఇంద్రియ లౌల్యముల నుండి మరియు ప్రాపంచిక భోగాల నుండి వీగిపోయి దూరమైపోతుంది. ఆ సమయంలో వ్యక్తిని 'యుక్తుడు'గా పరిగణించవచ్చు లేదా పరిపూర్ణ యోగములో ఉన్నట్టు. ఈ అధ్యాయం చివరలో ఆయన ఇంకా ఇలా అన్నాడు: ‘యోగులందరిలో కెల్లా ఎవరి మనస్సులైతే ఎప్పుడూ నా యందే స్థితమై ఉండునో, మరియు ఎవరైతే దృఢ విశ్వాసంతో నా పట్ల భక్తిలో నిమగ్నమై ఉందురో, వారిని నేను అత్యున్నతులుగా పరిగణిస్తాను. (శ్లోకం 6.47).’

కామెంట్‌లు లేవు: