16, ఆగస్టు 2026, ఆదివారం

గ్యాస్ సమస్య

 తీవ్రమైన గ్యాస్ సమస్య నివారణ కొరకు అద్భుత యోగం  -


    ప్రస్తుత కాలంలో చాలామంది తీవ్రమైన గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం సరైనటువంటి ఆహారం సరైనవేళల్లో తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం . ఇప్పుడు నేను చెప్పబోవు ఈ అద్భుత చిట్కా మిమ్మల్ని గ్యాస్ సమస్య నుంచి మిమ్మల్ని అద్భుతంగా బయటపడవేయును.


      వాము  ౨50 గ్రాములు .


      జీలకర్ర  ౨50 గ్రాములు .


      ధనియాలు  ౨50 గ్రాములు . 


         మూడింటిని వేరువేరుగా నూనె కాని నీరు కాని వేయకుండా కడాయిలో ఒక నిమిషంపాటు సన్నటి సెగ మీద వేయించి మూడింటిని కలిపి మెత్తటి చూర్ణంగా చేయవలెను . ఆ చూర్ణమును ఒక డబ్బా యందు గాలి పోకుండా నిలువ చేసుకొనవలెను . ఒక గ్లాసు నీటిని బాగా మరిగించి పొయ్యి మీద నుంచి కిందకి దింపిన తరువాత ౨ స్పూనుల చూర్ణాన్ని మరిగించిన నీటిలో వేసి మూత పెట్టవలెను కొంచం ఆగి గోరువెచ్చగా అయినతరువాత వడకట్టుకొని తాగవలెను. ఇలా ప్రతి ఉదయం బ్రష్ చేసిన వెంటనే మరియు సాయంత్రం ఆహారానికి గంట ముందు మరలా చేసుకుని తాగవలెను.


            పైన చెప్పిన యోగం 40 రోజులపాటు చేసినచో మీ గ్యాస్ సమస్య సంపూర్ణంగా పోవును . అలాగే ఆహారం తీసికొనుటకు అర్థగంట ముందు చిన్న అల్లం ముక్క కు ఉప్పు అద్ది నోటి యందు ఉంచుకుని రసం మింగుతూ ఉండవలెను . దీనివలన జీర్ణక్రియ మెరుగుపడి ఆహారం సంపూర్ణంగా జీర్ణం అగును.


  అజీర్ణరోగముతో బాధపడువారు పాటించవలసిన ఆహార నియామాలు  -


  పాటించవలసిన నియామాలు  -


      తేలికయిన పాతబియ్యపు అన్నం . పాతబియ్యపు నూకల జావ , బార్లీ జావ , పెసలు , పేలాలు , పెసరకట్టు , మేక మాంసం , చిన్న చేపలు , అల్లం , ఉప్పు , తక్కువ కారం , లేత ముల్లంగి , వెల్లుల్లి , ఉల్లిపాయ , లేత అరటికాయలు , లేత మునగ కాయ , పొట్లకాయ , బీరకాయ , లేత వంకాయ , కాకరకాయ , నక్క దోసకాయ , చుక్కకూర , పెరుగు తోటకూర , పొన్నగంటి కూర , మెంతికూర , ఉశిరికాయ , దానిమ్మ , నారింజ పండు , బత్తాయి , మజ్జిగ , పలచని మిరియాల చారు , తాంబూలం , వేడినీరు , తేనె , చేదు , నూనె పలచటి పదార్దాలు , వగరు , చేదుగల పదార్దాలు తీసికొనవలెను . వ్యాయమం చేయవలెను .


 పాటించకూడనివి  -


       కొత్త బియ్యపు అన్నం , పెద్ద చేపలు , బచ్చలికూర , అధికంగా నీరు తాగరాదు , ఆలస్యముగా జీర్ణం అయ్యే పదార్ధాలు . కంద , పెండలం , చామ , ఆలుగడ్డ , నేరేడు పండ్లు , గోధుమలు , పాలు , పాలతో చేసిన పదార్థాలు , చారపప్పు , జీడిపప్పు , నూనె అధికంగా ఉపయోగించి చేసే పదార్దాలు , వేపుళ్లు , పాతపచ్చళ్లు , ఉడకని పదార్దాలు , ముందు తినిన ఆహారం జీర్ణం కాక మునుపే మరలా తినరాదు . అమిత భోజనం , నిద్ర మేలుకుని ఉండటం , మలమూత్ర నిరోధం . టీ మరియు కాఫీ నిషిద్దం 


          పైన చెప్పిన ఆహారనియమాలు పాటిస్తూ నేను చెప్పిన యోగాన్ని పాటించుచుండిన అతి త్వరగా మీ సమస్య నుంచి విముక్తి పొందగలరు.


   విరేచనం సాఫీ లేనప్పుడు కూడా గ్యాస్ వచ్చును . దానికొరకు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఆహారం + మీరేదన్న ఇతర సమస్యలకు ఔషధాలు వాడుచున్న  అవన్నీ తీసుకున్న గంటన్నర తరువాత ఒక చిన్న స్పూన్ త్రిఫల చూర్ణం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి లోపలికి తీసుకోవలెను. మీరు తీసుకున్న ఆహారం మరియు మీరు నిద్రించడానికి మధ్య సమయం కనీసం 2 గంటలు ఉండాలి . 


       మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


    

ధర్మో రక్షతి రక్షితః*

 *ధర్మో రక్షతి రక్షితః*


*ధర్మాన్ని కాపాడిన వారిని ధర్మమే కాపాడుతుంది.*


*ఈ  మహావాక్యం మన భారతీయ సంస్కృతికి మూలస్తంభం. ఈ వాక్యం మనుస్మృతిలో ప్రసిద్ధిగా పేర్కొనబడింది.*


*మన వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, ధర్మశాస్త్రాలు అన్నీ మానవుడు ధర్మమార్గంలో నడవాలని బోధిస్తాయి. సంపద, అధికారం, కీర్తి, విద్య కంటె ధర్మమే గొప్పదని మన ఋషులు చెప్పారు.*


*ధర్మం అంటే ఏమిటి ?*


*ధర్మం అంటే కేవలం పూజలు, యజ్ఞాలు చేయడం మాత్రమే కాదు. సత్యం మాట్లాడటం, ఇతరులకు హాని చేయకుండా జీవించడం, తల్లిదండ్రులను గౌరవించడం, నిస్వార్థంగా సేవ చేయడం, న్యాయంగా ప్రవర్తించడం, తన కర్తవ్యాన్ని నిజాయితీతో నిర్వర్తించడం  ఇవన్నీ ధర్మమే.*


*ఈ సృష్టిలో ధర్మాచరణను మించిన మహిమాన్వితమైన కార్యం మరొకటి లేదని మన పెద్దలు చెప్పారు.*


*ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది.*


*ఈ ప్రపంచానికి నీవు ఏమి ఇస్తావో, అదే నీకు తిరిగి వస్తుంది.*


*ప్రేమ ఇస్తే ప్రేమ లభిస్తుంది.*

*సహాయం చేస్తే సహాయం లభిస్తుంది.*

*మోసం చేస్తే మోసమే ఎదురవుతుంది.*

*బాధ కలిగిస్తే బాధనే అనుభవించాల్సి వస్తుంది.*


*సమాజానికి కీడు చేసి, తనకు మాత్రమే మంచి జరగాలని కోరుకోవడం ధర్మానికి విరుద్ధం. ధర్మం ఎప్పటికైనా తన ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది.*


*కర్మఫలం తప్పదు.*

*మనిషి చేసే ప్రతి పనికీ ఫలితం ఉంటుంది.*

*మంచి చేస్తే మంచి ఫలితం.*

*చెడు చేస్తే చెడు ఫలితం.*

*కొన్నిసార్లు ఫలితం ఆలస్యంగా రావచ్చు. కాని, అది తప్పకుండా వస్తుంది. ధర్మం ఆలస్యం చేయవచ్చు కాని, అన్యాయం చేయదు.*

*మంచి ఆలోచనలు, మంచి పనులు, మంచి మాటలు మన జీవితాన్ని సంతోషంతో నింపుతాయి. ఇదే సృష్టి ధర్మం. సత్ప్రవర్తనే రక్షణ.*

*మన సత్ప్రవర్తనే మనకు నిజమైన రక్ష.*


*సత్యం, నిజాయితీ, వినయం, దయ, క్షమ, ప్రేమ వంటి గుణాలు కలిగినవారికి జీవితంలో చివరికి విజయం తప్పకుండా లభిస్తుంది.*

*ఆధ్యాత్మిక జీవితానికి ధర్మమే పునాది.*

*మనిషికి ఆధ్యాత్మిక చైతన్యం కలిగించేది ధర్మం.*

*ఆత్మజ్ఞానం, భగవద్భక్తి, సద్గుణాలు, శాంతి, ఆనందం అన్నీ ధర్మాచరణ ద్వారానే లభిస్తాయి.*


*ధర్మాన్ని కాపాడడం అంటే :*

*ప్రతి పనిలో నిజాయితీగా ఉండటం.*

*ఇతరులకు హాని చేయకపోవడం.*

*న్యాయాన్ని పాటించడం.*

*తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం.*

*సత్యాన్ని విడవకపోవడం.*


*అప్పుడు ఆ ధర్మమే మన జీవితాన్ని కాపాడుతుంది.*

*మనుస్మృతి ప్రకారం :*

*ధర్మం మనిషిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది.* *అధర్మం పతనానికి కారణమవుతుంది.*


*మహాభారతం మనిషి ఎలా జీవించాలో విపులంగా బోధించింది.*


*"నీకు ఇష్టం లేని పని ఇతరులకు చేయవద్దు" అనే ధర్మసూత్రం మహాభారతంలోని గొప్ప బోధలలో ఒకటి.*

*నన్నయ భారతాన్ని ధర్మశాస్త్రంగా అభివర్ణించారు.*

*ఎందుకంటే జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితికీ ధర్మబద్ధమైన మార్గాన్ని మహాభారతం చూపిస్తుంది.*


*వ్యాస మహర్షి ధర్మసారాన్ని సంక్షిప్తంగా వివరించారు.*

*ఇతరులకు మంచి చేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపం కలుగుతుందని చెప్పారు.*

*ధర్మాచరణే పరమ తపస్సు.*


*మహాత్ములు చెప్పినట్లు :*

*ధర్మాచరణమే పరమ ధర్మం.*

*సచ్ఛీలతే తపస్సు.*

*సద్చరిత్రే పరమ జ్ఞానం,*


*ఉత్తమ ధర్మం :*


*మనం ధర్మాన్ని ఆచరించడం మాత్రమే కాదు, ధర్మంగా జీవించే వారికి తోడ్పడటం కూడా ఉత్తమ ధర్మమే.*


*త్యాగం – సద్గుణాల మార్గం :*

*ధర్మం మనకు*

*భోగాల కంటే త్యాగం,*

*అహంకారం కంటే వినయం,*

*ద్వేషం కంటే ప్రేమ,*

*స్వార్థం కంటే సేవ*

*ఎక్కువ గొప్పవని బోధిస్తుంది.*


*మానవతా ధర్మం :*

*నిస్సహాయులకు, వృద్ధులకు, అనాథలకు, బాధలో ఉన్నవారికి సహాయం చేయడం మానవతా ధర్మం.*


*నిజమైన ధర్మం :*


*నీవు ఇతరుల నుండి ఏ విధమైన ప్రవర్తన ఆశిస్తున్నావో, అదే ప్రవర్తనను నీవు ఇతరుల పట్ల చూపడం నిజమైన ధర్మం.*


*ధర్మవంతులకు జయం*


*ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో, వారికి చివరికి విజయం తప్పకుండా లభిస్తుంది.*

*కష్టాలు వచ్చినా ధర్మాన్ని విడువకూడదని మన పురాణాలు బోధిస్తున్నాయి.*


*మనిషి జీవితాంతం ఎంత సంపాదించినా, మరణానంతరం ఒక్క రూపాయి కూడా వెంట తీసుకెళ్లలేడు.*


*భార్య ఇంటి గుమ్మం వరకు మాత్రమే వస్తుంది.*

*బంధువులు శ్మశానం వరకు మాత్రమే వస్తారు.*

*శరీరం కూడా బూడిదైపోతుంది.*

*కాని, జీవితంలో చేసిన ధర్మం, పుణ్యకార్యాలు మాత్రమే మన వెంట వస్తాయి.*


*ధర్మం అనేది కేవలం గ్రంథాల్లో ఉండే మాట కాదు; ప్రతి రోజూ మన ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో ఆచరించాల్సిన జీవన విధానం.*


*ధర్మాన్ని అనుసరించినవారికి మనశ్శాంతి, సమాజంలో గౌరవం, భగవంతుని అనుగ్రహం, చివరికి శాశ్వత ఉపకారం లభిస్తాయి.*


*ధర్మాన్ని కాపాడుదాం... ధర్మమే మనలను కాపాడుతుంది.*

🙏🙏🙏