14, జూన్ 2026, ఆదివారం

రత్నాలబాల–జ్ఞానమాల

  రత్నాలబాల–జ్ఞానమాల: తెలుగు సాహిత్యానికి సంపూర్ణ సాంకేతిక విప్లవం!

సాహిత్యం × సాంకేతికత = తెలుగు జ్ఞానానికి నూతన సాంకేతిక మార్గం. 


మన అమ్మభాషను నేటి తరానికి, ముఖ్యంగా పిల్లలకు సరికొత్తగా పరిచయం చేస్తూ, కృత్రిమ మేధ సాంకేతికతతో సందీప్ మిరియాల రూపొందించిన ఒక సంపూర్ణ సాంకేతిక ఆవిష్కరణ 'రత్నాలబాల–జ్ఞానమాల'.


పరిశోధన మరియు అభ్యాసానికి అనుకూలంగా, పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఉపయోగపడేలా పదిహేను అద్భుతమైన విభాగాళ్లను ఒకే చోట చేర్చి ఈ ఉచిత వేదికను నిర్మించాను!


🔥 ఈ సాంకేతిక వేదికలోని ముఖ్యమైన విభాగాలు:

🔤 1. బాలల డిజిటల్ అభ్యాసం (పిల్లల కోసం)

అక్షరమాల & గుణింతాల మాల: కేవలం చూడటం కాదు, స్క్రీన్‌పై అక్షరాన్ని తాకితే చాలు, స్పష్టమైన వాయిస్ వినిపిస్తుంది. ఇందులో ముప్పై నాలుగు వ్యంజనాలకు, పదహారు గుణింత రూపాల ఆడియో అమరిక ఉంది!


పదాల మాల & సామెతల మాల: అరవై మూడు రెండక్షరాల పదాలు, ఎనభై రెండు మూడక్షరాల పదాలు మరియు అక్షర క్రమంలో అమర్చిన సామెతలతో పిల్లలు ఆటపాటల మధ్య తెలుగు నేర్చుకోవచ్చు.


👶 2. కథామాల (నూట ముప్పై కి పైగా సరికొత్త కథలు)

స్మృతిమాల (పింగళి సీతమామ సిరీస్): నా చిన్ననాటి జ్ఞాపకాల ఆధారంగా, కృత్రిమ మేధ మరియు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సాయంతో నేను స్వయంగా రాసిన నూట ముప్పై నైతిక విలువల పిల్లల కథలు. ఇవి నాలుగు వేర్వేరు వయస్సుల పిల్లలకు అనుకూలంగా వర్గీకరించబడ్డాయి.


🔊 3. అక్షరాల నిధి & సంప్రదాయ సాహిత్యం

రత్నాలబాల: నా తాతగారు, ప్రముఖ కవి మిరియాల వెంకటరత్నం గారి ముప్పై నాలుగు అమూల్యమైన సంప్రదాయ పద్యాల డిజిటల్ రూపం.


మిరా పద్యాలు: ప్రముఖ రచయిత, మా పెద్దనాన్నగారు అయిన డాక్టర్ మిరియాల రామకృష్ణ గారి అద్భుతమైన పద్యాల సంకలనం (ప్రస్తుతం నిర్మాణంలో ఉంది).


శతకాలమాల (వెయ్యికి పైగా పద్యాలు): పది ప్రసిద్ధ శతకాల డిజిటల్ వేదిక. సాంకేతికత సాయంతో ఈ పద్యాలను వినడమే కాకుండా.. నేరుగా ఆడియో, దృశ్యరూపం, మరియు చిత్రంగా మార్చుకోవచ్చు!


పరాభవమాల (ఉగాది శతకం): అత్యాధునిక కృత్రిమ మేధ సాంకేతికత మరియు ఛందమ్ పరికరాల సాయంతో.. దిలీప్ మిరియాల గారి విత్తు, పరికరాల అమరిక, నిర్మాణం, పర్యవేక్షణ సృష్టించిన నూట ఎనిమిది పద్యాల ఉగాది శతకం. ప్రకృతి మార్పులను, జీవన సత్యాలను వివరిస్తూ సాగే ఈ శతకంలో ప్రతి పద్యం చివర "రా ఉగాది" అనే ఆప్యాయ మకుటం ఉంటుంది.


🔏 4. తెలుగు వ్యాకరణం

సంధి మాల & సమాస మాల: విద్యార్థులకు మరియు పరిశోధకులకు ఉపయోగపడేలా.. తెలుగు వ్యాకరణంలోని ఇరవై ఆరు సంధి నియమాలు, సమాసాల నిర్వచనాలు, రకాలు మరియు విగ్రహ వాక్యాల పూర్తి వివరణలు.


🎨 5. కవులు & రచయితల కోసం అత్యాధునిక టూల్స్

చిత్రమాల పద్య యంత్రం: మీ పద్యాలను లేదా కొటేషన్లను గురజాడ, ఎన్టీఆర్, వేటూరి, సిరివెన్నెల, తెనాలి రామకృష్ణ లాంటి పన్నెండు కి పైగా ప్రసిద్ధ తెలుగు ఫాంట్స్‌తో అందమైన డిజిటల్ పోస్టర్లుగా మార్చే అద్భుతమైన సాధనం.


స్వరమాల (వాయిస్-టు-టెక్స్ట్): తెలుగులో మాట్లాడితే చాలు, క్షణాల్లో అది అక్షరాలుగా మారుతుంది. దాన్ని ఎడిట్ చేసుకొని, నచ్చిన ఫాంట్‌తో పోస్టర్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


లిపిమాల (తెలుగు అక్షర గుర్తింపు సాధనం): టైపింగ్ కష్టం లేకుండా.. పాత పుస్తకాల ఫోటోలు లేదా చేతిరాత పత్రాలను అప్‌లోడ్ చేస్తే, అందులోని తెలుగు అక్షరాలను గుర్తించి ఎడిట్ చేయదగిన డిజిటల్ టెక్స్ట్‌గా మార్చే స్మార్ట్ సాధనం.


ఖతిమాల: ఆటో-సేవ్ (ఆఫ్‌లైన్) సపోర్ట్ మరియు యాభై కి పైగా తెలుగు ఫాంట్లతో కూడిన పవర్‌ఫుల్ రైటింగ్ టూల్. మీరు రాసిన పాఠ్యాన్ని పీడీఎఫ్ లేదా వర్డ్ ఫైల్‌గా వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


🔒 గోప్యత గమనిక (నూరు శాతం ప్రైవసీ)

ఈ వేదిక యొక్క అతిపెద్ద ప్రాధాన్యత – మీ గోప్యత. మీ డేటా, మీరు టైప్ చేసే పద్యాలు, లేదా అప్‌లోడ్ చేసే చిత్రాలు మా సర్వర్లలో ఎక్కడా సేవ్ అవ్వవు. అంతా నూరు శాతం మీ డివైస్ లోనే అత్యంత వేగంగా ఆఫ్‌లైన్‌లో ప్రాసెస్ అవుతుంది!


ఎటువంటి లాగిన్స్ లేకుండా, ఎటువంటి ప్రకటనలు లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా.. కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో ఇప్పుడే ఈ అద్భుతమైన తెలుగు సాంకేతిక వేదికను సందర్శించండి! 


🌐 లింక్: https://ratnalabala.vercel.app/


మన భాషను కాపాడుకుందాం – మన సాంకేతికతను వాడుకుందాం! ❤️


— సందీప్ మిరియాల

హోమియోపతి వైద్యం

  ఆన్లైన్లో హోమియోపతి వైద్యం

 కొరకు సంప్రదించండి


 దీర్ఘకాల రోగములకు చక్కటి చికిత్స కలదు 


తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిళం మరియు మలయాళం భాషలలో ఏ భాషలోనైనా డాక్టర్ గారితో మీరు మాట్లాడవచ్చు.


మీ సమస్యని తెలుపుకొని చికిత్స తీసుకోగలరు.


మందులు మీ ఇంటికి ఆన్లైన్లో కొరియర్ ద్వారా పంపించబడును.


వివరాలకు 9035231905 నెంబర్ను వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు . 


మీ పేరు,

వయస్సు, 

లింగము 

మీ చిరునామా

 మీ సమస్యను క్లుప్తంగా వివరించండి 


మీరు ఏ భాషలో డాక్టర్ గారి ని సంప్రదించదల్చారు పేర్కొనండి 


తరువాత డాక్టర్ గారే మీకు ఫోను చేసి మీతో మాట్లాడగలరు.

డాక్టర్ గారి ఫీజు మందుల ఖర్చులు అడిగి తెలుసుకోండి


డాక్టర్ సాయి అఖిల


 స్త్రీల రోగముల నిపుణురాలు

సదాశివ సమారంభాం ,

  🕉️ సదాశివ సమారంభాం ,, 

🚩 శంకరాచార్య మధ్యమాం /

☘️ అస్మదాచార్య పర్యంతాం ,, 

🙏 వందే గురు పరంపరామ్ //

🇮🇳 Ch.S.గోపాలరావు, RCPM. 🫡

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: ఒకటవ అధ్యాయం 

అర్జునవిషాద యోగం: అర్జున ఉవాచ


తస్మాన్నార్హా వయం హంతుం

ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ |

స్వజనం హి కథం హత్వా

సుఖిన స్స్యామ మాధవ || (37)


అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: కనుక ఓ మాధవా, బంధువులైన దుర్యోధనాదులను చంపటానికి మనం అర్హులం కాదు. సొంత వారిని చంపి మనం సుఖంగా ఎలా ఉండగలం.


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

ఆచార్య సద్బోధన:*

 


             *ఆచార్య సద్బోధన:*

                 ➖➖➖✍️

```

*ఆరోగ్యాన్ని పునరుద్ధరించి రోగిని మరలా ఆరోగ్యవంతునిగా చేయడం అనేది ఒక సృజనాత్మకమైన చర్య.


*నాశనము లేకుండా సృష్టి జరగదు కాబట్టి వినాశనము అనేది చెడ్డదీ కాదు తప్పూ కాదు! దాని వెనుకనున్న ముఖ్య ఉద్దేశం ఏమిటన్నదే పరిశీలించాలి.


*మనస్సులో ఏవిధమైన నాశనభావమూ ఉద్వేగమూ ఉండరాదు! ఆలా ఉండడం తప్పు!


*సైనికుడు వ్యక్తిగత ద్వేషం లేకుండా చంపుతాడు. నిజానికి తను ఎవరిని చంపుతున్నాడో కూడా తెలియదు. తాను చంపే వ్యక్తులపట్ల ఆ సైనికుని మనస్సులో ఎటువంటి పగ ఉండదు. ఇతడు కేవలం తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు.


*అదేవిధంగా తాను నిర్మూలించే క్రిములపై ఆ డాక్టరుకు ఏ విధమైన పగ గానీ లేదు. కానీ రోగి ప్రాణాన్ని పరిరక్షించడానికి, అతడలా చేయవలసిందే!


*ఒక పాము మీ పిల్లాడిని కరవడానికి వస్తూ ఉందనుకోండి, మీరు చూస్తూ ఊరుకుంటారా?


*అటువంటి అహింస కేవలం మూర్ఖత్వమే అవుతుంది.(నా గురువర్యులు పుస్తకం నుండి.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

ఇలాంటి మంచి విషయాలకోసం…

“భగవంతుని విషయాలు గ్రూప్”లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 8712184465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```

ఇంద్రకీలాద్రిపై

 *ఇంద్రకీలాద్రిపై అపరాజిత దేవి రహస్యం ఈ దేవిని దర్శిస్తే చాలు.. జీవితమే మారిపోతుంది?*


*జీవితంలో మనం ఎన్నో లక్ష్యాలను పెట్టుకుంటాం. కానీ మన ప్రయత్నంలో ఉన్న చిన్న చిన్న లోపాలు లేదా అనుకోని పరిస్థితుల వల్ల కొన్నిసార్లు విజయానికి దూరమవుతుంటాం.*


*ఎంత కృషి చేసినా ఫలితం రాకపోతే, "ఇక్కడ దైవ అనుగ్రహం అవసరం" అనే భావన మనసులో కలుగుతుంది. అలాంటి సందర్భాల్లో అపరాజిత దేవిని ప్రార్థిస్తే తప్పకుండా విజయం లభిస్తుందని భక్తుల విశ్వాసం.*


*🍀 ఇంద్రకీలాద్రిపై అపరాజిత దేవి దర్శనం..🍀*


*విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం చేసుకున్న తర్వాత, గర్భగుడి నుంచి బయటకు వచ్చి ఎదురుగా చూస్తే ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం వెనుక భాగంలో ఒక చిన్న అమ్మవారి స్వరూపం ఉంటుంది. ఆమెనే అపరాజిత దేవి అని పిలుస్తారు. చాలామందికి ఈ విగ్రహం వెనుక ఉన్న మహాత్మ్యం తెలియకపోవచ్చు. కొందరు అక్కడ కుంకుమ, పసుపు వంటివి విసిరే విధంగా ప్రవర్తిస్తారు, కానీ అది సరైన పద్ధతి కాదని భక్తులు చెబుతారు. అపరాజిత దేవి చాలా శక్తివంతమైన దైవ స్వరూపం.*


*🌻 అపరాజిత దేవి ప్రాముఖ్యత 🌻*


*మన జీవితంలో విద్య, ఉద్యోగం, కుటుంబ స్థిరత్వం, సామాజిక గౌరవం వంటి విజయాలు క్రమంగా రావాలని మనం కోరుకుంటాం. ఈ అన్ని విజయాలను క్రమంగా ప్రసాదించే శక్తిగా అపరాజిత దేవిని భావిస్తారు. ఆమె అనుగ్రహం ఉంటే జీవితంలో అడ్డంకులు తగ్గి ముందుకు సాగడానికి మార్గం సులభమవుతుందని నమ్మకం.*


*🕉 అపరాజిత దేవి ఆవిర్భావ కథ 🕉*


*దేవీ భాగవతం, చండీ సప్తశతి ప్రకారం, ఒకప్పుడు దేవతలు, అసురుల మధ్య భీకర యుద్ధం జరుగుతుండగా దేవతలు విజయం కోసం పరమ శక్తిని ప్రార్థించారు. ఆ ప్రార్థనకు ప్రతిస్పందనగా పరాశక్తి ఒక ప్రత్యేక రూపంలో ప్రత్యక్షమై దేవతలకు విజయాన్ని ప్రసాదించింది. ఆ దివ్య స్వరూపమే అపరాజిత దేవి అని చెబుతారు.*


*🔥 అపరాజిత దేవి స్తోత్రం మహిమ 🔥*


*చండీ సప్తశతిలో పేర్కొన్న అపరాజిత దేవి స్తోత్రాన్ని భక్తితో పఠిస్తే మన చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుందని నమ్మకం. ఈ కవచం వల్ల ప్రతికూల శక్తులు, ఆటంకాలు దూరమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. అలాగే సంక్షోభ పరిస్థితుల్లో సరైన మార్గం కనిపించడానికి ఇది సహాయపడుతుందని చెబుతారు. ప్రతిరోజు లేదా శుక్రవారం సాయంత్రం దీపం వెలిగించి ఈ స్తోత్రాన్ని చదవడం మంచిదని ఆచారం. ఇలా భక్తితో పఠిస్తే మనసులో స్థిరత్వం పెరిగి, ఆత్మవిశ్వాసం బలపడుతుందని భావిస్తారు.*


*🪷 అపరాజిత దేవి అనుగ్రహ ఫలితాలు 🪷*


*కష్టసమయంలో ధైర్యం కోల్పోయినప్పుడు, సమస్యలు ఎలా పరిష్కరించాలో అర్థం కానప్పుడు అపరాజిత దేవిని ప్రార్థిస్తే మార్గదర్శనం లభిస్తుందని భక్తుల నమ్మకం. విద్యలో ఏకాగ్రత పెరగడం, పరీక్షల్లో మంచి ఫలితాలు రావడం వంటి అనుభవాలు కూడా చాలామంది చెబుతారు.*


*🍛 నైవేద్యం, ఆచారాలు 🍛*


*శుక్రవారం రోజున లేదా ప్రత్యేక సందర్భాల్లో అపరాజిత దేవికి పాలు, ఏలకులు కలిపిన నైవేద్యం లేదా పటిక బెల్లం సమర్పించడం ఆచారంగా ఉంటుంది. భక్తిశ్రద్ధలతో చేసిన ప్రార్థనలు, ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం ఉంది. చివరగా, అపరాజిత దేవి ఆరాధన మనలో ధైర్యాన్ని పెంచి, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి మానసిక బలం అందిస్తుందని భక్తులు నమ్ముతారు.*

రమణోదయం

 🙏 *రమణోదయం* 🙏


*స్థూల సూక్ష్మములు, శూన్యత్వ పూర్ణత్వములు, ధైర్యాధైర్యములు మొదలయిన ద్వంద్వాలన్నింటినీ ఎఱిగే జ్ఞాన మొకటి ఉంది. అది అన్నింటికీ మూలమై ప్రకాశిస్తోంది. "అనంతంగా ఉన్న ఆ జ్ఞానమే ఆత్మ (నేను)".*


*భగవాన్ శ్రీరమణ మహర్షి*

(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.1043)

సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 

🪷🪷🦚🦚🪷🪷

 *స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద* |

 *కరుణామృత జలధి యరుణాచలమిది*|| 

            

🌹🌹🙏🙏 🌹🌹

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      🌞 *ఆదివారం*🌞

  *🌹14, జూన్, 2026🌹*

     *దృగ్గణిత పంచాంగం* 

              

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*అధిక జ్యేష్ఠ మాసం - బహుళ పక్షం* 


*తిథి : చతుర్దశి* మ 12.19 వరకు ఉపరి *అమావాస్య*

*వారం    : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం  : రోహిణి* రా 10.14 వరకు ఉపరి *మృగశిర*

*యోగం : ధృతి* మ 01.15 వరకు ఉపరి *శూల*

*కరణం  : శకుని* మ 12.19 *చతుష్పాద* రా 10.21 ఉపరి *నాగ*

*సాధారణ శుభ సమయాలు:*

          *-ఈరోజు లేవు-* 

 అమృత కాలం  :*రా07.26 - 08.50*

 అభిజిత్ కాలం  : *ప 11.42 - 12.34*  

*వర్జ్యం    : మ 03.14 - 04.38 & రా 03.06 - 04.30*

*దుర్ముహూర్తం :సా04.56- 05.48*

*రాహు కాలం :సా 05.03- 06.41*

గుళికకాళం    : *మ 03.24 - 05.03*

యమగండం    : *మ 12.08 - 01.46*

సూర్యరాశి : *వృషభం*               

చంద్రరాశి : *వృషభం*

సూర్యోదయం :*ఉ 05.42*   

సూర్యాస్తమయం :*సా 06.51*

*ప్రయాణశూల   :  : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం     :  *ఉ 05.35- 08.12*

సంగవ కాలం      :*08.12 - 10.49*

మధ్యాహ్న కాలం  :*10.49 - 01.26*

అపరాహ్న కాలం   :*మ 01.26- 04.04*

*ఆబ్ధికం తిధి       : అధిక జ్యేష్ఠ అమావాస్య*

సాయంకాలం      :*సా 04.04 - 06.41*

ప్రదోష కాలం      :*సా 06.41 - 08.52*

రాత్రి కాలం        :*రా 08.52 - 11.46*

నిశీధి కాలం        :*రా11.46 - 12.30*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.08 - 04.51*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

               *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🙏 ఓం నమో సూర్యదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

పుణ్యభూమి ఐన మన భారతదేశం

 *అమెరికా పర్యటనలో ఉన్న ఒక సీనియర్ సిటిజన్ ఇస్తున్న సలహా:*

ప్రియమైన మిత్రులారా,

మేము గత రెండు నెలలుగా అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో ఉన్న సియాటెల్ నగరంలో ఉంటున్నాము. భారతదేశం నుండి వచ్చేటప్పుడే నా భార్యకు శ్వాసకోస సంబంధిత సమస్య తీవ్రంగా ఉంది. ఆమె పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, మేము భారత్ నుండి తగినన్ని మందులను వెంట తెచ్చుకున్నాము. అమెరికాలో ఆ మందులు వాడిన తర్వాత ఆమె దాదాపు కోలుకుంది.

అయితే, తెచ్చుకున్న మందులు అయిపోవడంతో, మా పర్యటన సమయంలో ఆమెకు మళ్లీ శ్వాసకోస సమస్య వస్తుందేమోనని నేను ఆందోళన చెందాను. అందుకే, సియాటెల్‌లోని ఒక పల్మనాలజిస్ట్ (శ్వాసకోస నిపుణుడు) అపాయింట్‌మెంట్ తీసుకోమని నా కుమార్తెను కోరాను.

కానీ, నేరుగా నిపుణుడిని కలవడానికి వీల్లేదని, ముందుగా జనరల్ ఫిజీషియన్‌ను కలవాలని నా కుమార్తెకు చెప్పారు. దాని కోసం మాకు వారం రోజుల తర్వాత అపాయింట్‌మెంట్ ఇచ్చారు, అది కూడా కేవలం వీడియో కాల్ ద్వారా మాత్రమే.

మేము ఫోన్‌లో సుమారు 10 నిమిషాల పాటు డాక్టరుతో మాట్లాడి, ఇండియాలో నా భార్య వాడుతున్న మందుల గురించి వివరించాము. ఆయన సమస్యను అర్థం చేసుకున్నానని చెబుతూ, అందుకు తగ్గట్టుగా మందులు రాసిచ్చారు. ఆ మందులను మెడికల్ స్టోర్ నుండి తీసుకోవచ్చని చెప్పారు. తీరా మేము స్టోర్‌లో విచారించగా, ఆ మందులు వెంటనే అందుబాటులో లేవని, రావడానికి 4-5 రోజులు పడుతుందని చెప్పారు.

చివరికి ఐదో రోజున మాకు ఆ మందులు అందాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ మందులను 'సిప్లా' (Cipla) కంపెనీ తయారు చేసింది మరియు వాటిపై 'మేడ్ ఇన్ ఇండియా' అని రాసి ఉంది. అమెరికాలో తీసుకున్న మెడికల్ ఇన్సూరెన్స్ వల్ల 50% రాయితీ లభించిన తర్వాత కూడా మేము ₹21,000 చెల్లించాల్సి వచ్చింది. అంటే, ఇండియాలో కేవలం ₹2,500 ఖరీదు చేసే మందులు, అమెరికాలో అక్షరాలా ₹42,000 అన్నమాట.

భారతదేశంలో మందుల దుకాణాల్లో నేరుగా దొరికే మందులను ఇక్కడ పొందడానికి మాకు 12 రోజుల సమయం పట్టింది. వారం రోజుల తర్వాత, డాక్టర్ సంప్రదింపుల ఫీజు (కన్సల్టేషన్) కోసం మాకు $283 (సుమారు ₹23,000) బిల్లు వచ్చింది.

భారతదేశంలో వైద్య సదుపాయాలు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని భావించే నా భారతీయ మిత్రుల కోసం నా ఈ అనుభవాన్ని పంచుకుంటున్నాను.

మీ విశ్రాంత జీవితంలో మీరు భారతదేశంలో నివసిస్తున్నందుకు మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా భావించండి.


పుణ్యభూమి ఐన మన భారతదేశం లో మనం ప్రశాంతంగా బ్రతుకుతున్నందుకు సంతోషించండి. 


సేకరణ

సమస్యాపూరణం

 సమస్యాపూరణం.

సమస్య. "సంస్కృత భాషచేఁ జెడెను సంస్కృతి సర్వము భారతావనిన్".




సంస్కృత మందు గౌరవము, సాధన, శోధన ,సుంతలేని -దు

స్సంస్కృతి నేటి జాడ్యమయె, 

సంస్కృత మెంచగ శాస్త్ర మూలమౌ,

సంస్కృతి లేనివారలె య సత్యము లిట్టుల బల్కుచుంద్రుగా

"సంస్కృత భాషచేఁ జెడెను సంస్కృతి సర్వము భారతావనిన్"


సురభి శంకరశర్మ.



పాఠకులు కూడా ఈ సమస్యను   వారి కవితా పాఠవాన్ని అనుసరించి ఊరించి ఇక్కడ  కామెంట్ రూపంలో ఇక్కడ పోస్ట్ చేయవచ్చు

శ్రీమహావిష్ణుపురాణం

 116f4;

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀1️⃣1️⃣5️⃣



       *శ్రీమహావిష్ణుపురాణం:*

               ➖➖➖✍️

             115 వ భాగం 


*శ్రీకృష్ణావతారము-17* 

*జాంబవతి, సత్యభామలతో వివాహం..```

యదువంశానికి ఉపవంశమైన వృష్ణి వంశియుడైన సత్రాజిత్తు బలరామ కృష్ణులకు గల పేరు ప్రఖ్యాతులను చూసి అసూయ చెందేవాడు. బలరామ కృష్ణుల కన్నా ఎక్కువగా పేరురావాలని, యదువంశంలో అత్యంత ధన సంపన్నుడిని కావాలని సూర్యుని ఆరాధిస్తూ కఠోర తపస్సు చేసాడు. 

సూర్యుడు తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. 

సత్రాజిత్తు “నేను తేజోసంపన్నుడు, ధనసంపన్నుడు కావాలని" కోరిక కోరాడు.


సూర్యుడు తన కంఠంలో ఉన్న శ్యమంతకమణిని తీసి సత్రాజిత్తుకి ఇచ్చి "ఈ మణినిధరించినవాడు సూర్యుని వలె తేజో సంపన్నుడు అవుతాడు. ఈ మణి ఉన్న ప్రదేశంలో వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండుతాయి. ఈతిబాధలు, అరిష్టాలు ఉండవు. రోజుకి ఎనిమిది బారువుల బంగారం ప్రసాదిస్తుంది. మణిని, బంగా రాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలి. నిత్యం మణిని పూజించు!శుభం కలుగుతుంది” అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు.


తపస్సు ముగించి, శ్యమంతక మణి హారం మెడలో ధరించి సత్రాజిత్తు తన గొప్పదనం చూపించాలని ద్వారకవచ్చాడు. సూర్యుని వలె ప్రకా శిస్తు తేజస్సుతో రాజవీధులలో వస్తున్న సత్రాజిత్తుని చూసి ద్వారక ప్రజలు సాక్షాత్తు సూర్యుడే కృష్ణుడి దర్శనానికి వచ్చాడు అని భ్రమించారు. 


భటులు వెళ్లి రాజసభలో సభికుల మధ్యలో ఉన్న కృష్ణుడికి సూర్యుడు దర్శనానికి వస్తున్నాడని చెప్పి పక్కకు తప్పుకుని నిలిచారు.


కృష్ణుడు నవ్వుకుని "వచ్చే వ్యక్తి సూర్యుడు కాదు. వృష్ణి వంశీయుడైన సత్రాజిత్తు. సూర్యుని తపస్సుతో మెప్పించి శ్యమంతక మణి అనే అనర్ఘమణిని అనగా అపూర్వ శక్తి గల మణిని పొందాడు. ధరించిన వ్యక్తిని 

ఆ మణి సూర్యుని వలె ప్రకాశవంతుని చేస్తుంది. అంతేకాదు, దినమునకు ఎనిమిది బారువుల బంగారం ఇచ్చే శ్యమంతకమణి ఉన్నచోట ఈతిబాధలు ఉండవు. అరిష్టాలు ఉండవు. ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు" అని చెప్పగా సభికులు ఆశ్చర్యం చెందారు.


అటువంటి మణిని శ్రీకృష్ణునికి ఇవ్వడానికి వస్తున్నాడేమో అని అందరు భావించారు. 


శ్రీకృష్ణుడు వారి అభిప్రాయాలను గ్రహించి సభకు వచ్చిన సత్రాజిత్తుని సాదరంగా ఆహ్వానించి ఉచితాసనుని చేశాడు. సత్రాజిత్తు కంఠంలోని శ్యమంతక మణిని తీసి అందరికి చూపించి "సూర్యుడు తన తపస్సుకి మెచ్చి ఇవ్వడం, శ్యమంతకమణి గొప్పదనం, ప్రసాదించే బంగారం గురించి గొప్పగా చెప్పాడు. తను యదు వంశంలో అందరి కన్నా గొప్ప వాడిని,తేజోవంతునిఅయ్యాను కనుక బలరామ కృష్ణులు, ద్వారకా ప్రజలు తన గొప్ప దనాన్నిగుర్తించిసత్కరించాలనిగర్వంగా ప్రకటించాడు.


సభలోని వారుసత్రాజిత్తుఅహం కారానికి ఆశ్చర్యపడ్డారు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తు వద్దకు వచ్చి "మీరు నిజంగాచాలాగొప్పవారు,మహి మాన్వితులు అనడంలో సందే హం లేదు. కఠోర తపస్సు చేసి సూర్యదేవుని మెప్పించి శ్యమంతకమణిని పొందారు. ఒకసారి సూర్యదేవుడు మణినిస్తూ చెప్పిన మాటలు గుర్తు చేసుకోండి.


వ్యక్తుల వద్ద ఇటువంటి మహిమ గల మణి ఉండటం అనేక సమస్యలు వస్తాయి. ఇచ్చే బంగారం కోసం ఆశపడే స్వార్ధపరులు

మీకు ప్రాణహాని కూడా తల పెట్టవచ్చును. కనుక తమరుఈ శ్యమంత కమణిని మహరాజు ఉగ్రసేనునికిఇవ్వండి.కోశాగారం లో భద్రముగా ఉంటుంది. రోజు ఇచ్చే బంగారం తమరే తీసుకోవచ్చును. మీ మంచి కోరి సలహా ఇస్తున్నాను. తరు వాత మీ ఇష్టం" అని చెప్పాడు.


కృష్ణుడు తన మణిని తీసుకో వాలని అలా చెబుతున్నాడు అని భావించి సత్రాజిత్తు తిరస్కరించాడు. నేను కఠోర తపస్సు చేసి సంపాదించినది నా దగ్గరే ఉండాలి అని ప్రకటించి సత్రాజిత్తు కోపంగా ఇంటికి వెళ్లి పోయాడు. ఇంటికి భద్రత పెంచుకున్నాడు.శ్యమంతకమణిని పూజ సమయంలో తప్ప మిగిలిన సమయంలో తను మెడలో వేసుకునేవాడు.


ఒకరోజు అత్యవసర పనిమీద బయటకు వెళ్లవలసినఅవసరం రావడంతో మణిని సంరక్షించే బాధ్యతనుసత్రాజిత్తుతమ్ముడు ప్రసేనుడికి ఇచ్చి వెళ్లాడు. ప్రసే నుడుమణినికంఠంలోధరించి అడవికి వేటకు వెళ్లాడు.అక్కడ ఒక సింహం ప్రసేనుడికి మెడలో ఎర్రగా ప్రకాశించేమణిమాంసపు ముక్క అని భావించి అతని పై దూకి హతమార్చింది. మణిని నోట కరచుకుని సింహంపారిపో తుంటే జాంబవంతుడు అనే భల్లూకం చూసి సింహాన్ని చంపి మణిని తీసుకుని తన కుమార్తె జాంబవతికిఆడుకునేవస్తువుగా ఇచ్చాడు.

శ్యమంతకమణి ధరించి వెళ్లిన ప్రసేనుడు అడవి నుంచి తిరిగి రాకపోవడంతో, సత్రాజిత్తు రాజసభకు వచ్చి "మణి అడిగినప్పుడు ఇవ్వలేదని కృష్ణుడే వేటకు వెళ్లిన తన తమ్ముడు ప్రసేనుని చంపి అపహరించాడని" ఆరోపణ చేశాడు. తన మణిని తనకు ఇప్పించమనిఉగ్రసేనునికోరాడు. సభలోని వారు కృష్ణుని పై నిందవేసినందుకు సత్రాజిత్తుపై దాడి చేయబోతుంటే కృష్ణుడు ఆపి "తన పై వచ్చిన ఆరోపణ అసత్యం అనినిరూపించడానికి అడవికి వెళ్లి శ్యమంతకమణిని తెస్తానని" ప్రకటించి అడవికి వెళ్లాడు.


అడవిలో ప్రసేనుడి కళేబరం, కొంతదూరం వెళ్లిన తర్వాత సింహపు కళేబరం, అక్కడ నుంచి ఎలుగుబంటి అడుగు జాడలు పర్వతపు గుహలోకి వెళ్లడం గమనించాడు. తన వారిని గుహ బయటఉండమని లోపలికి వెళ్లాడు. అక్కడ ఆట వస్తువుగా ఉయ్యాలకు కట్టిన మణిని చూశాడు. ఆ ఉయ్యా లలో జాంబవతి పడుకుని ఉంది. నిద్రాభంగం కాకుండా మణిని తీసుకుని వస్తుంటే అక్కడకు వచ్చిన దాది చూసి భయపడి గట్టిగా అరిచింది.


అరుపులకు జాంబవతి నిద్ర లేచి కృష్ణుని జగన్మోహనరూపం చూస్తూనిలబడింది.జాంబవంతుడు దాది అరుపులకు అక్కడకు వచ్చి కృష్ణుడితో యుద్దానికితలపడ్డాడు.ఇరువురి మధ్య నెల రోజులు ద్వంద్వ యుద్ధం జరిగింది. ఓడి అలసి నీరసించిపోయినజాంబవతుడు తనతో పోరాడినవాడు త్రేతాయుగపు శ్రీరాముడిగా గుర్తించాడు.


శ్రీకృష్ణుడి పాదాలకు నమస్కరించి దేవా నాడుత్రేతాయుగంలో నీతో ద్వంద్వయుద్ధంచేయాలని కోరాను.ఆకోరికద్వాపరయుగంలో తీర్చావు. కృష్ణుడివి నీవే! రాముడివి నీవే! నారాయణుడివి నీవే! నా అవివేకానికి మన్నించు!" అని ప్రార్ధించాడు.శ్యమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతి ని సమర్పించాడు.


శ్యమంతకమణితో, జాంబవతి తో ద్వారకకు వచ్చి కృష్ణుడు రాజసభ ఏర్పాటు చేశాడు. సత్రాజిత్తుని పిలిపించి అందరి ముందు జరిగింది చెప్పి మణిని సత్రాజిత్తుకిఇచ్చాడు.సత్రాజిత్తు కృష్ణుడిపై అసత్య ఆరోపణ చేసినందుకు క్మార్పణచెప్పాడు. ప్రాయశ్చిత్తంగా తన కుమార్తె సత్యభామను,శ్యమంతకమణిని స్వీకరించమని ప్రార్ధించాడు.


అంతకు ముందు సత్రాజిత్తు తన కుమార్తె సత్యభామ శ్రీకృష్ణుని ఇష్టపడుతుందని తెలిసినా, కృష్ణుడి పై కోపంతో కృతవర్మ తమ్ముడు శతధ్వనుడికి ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. ఇప్పుడు కృష్ణునికి ఇచ్చి చేయడంతో శతధ్వనుడు సత్రాజిత్తు పై కోపం పెంచుకున్నాడు. కానీ బలరామ కృష్ణుల బలపరాక్ర ములకు భయపడి మౌనంగా ఉండిపోయాడు. 


శుభ ముహుర్తంలో శ్రీకృష్ణుడికి జాంబవతితో, సత్యభామతో వివాహం జరిగింది. శ్రీకృష్ణుడు వీరినే కాకుండా కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్ష్మణ అనే ఐదుగురిని వివాహమాడి అష్టభార్యలు కలిగి ఉన్నాడు.✍️(సశేషం)

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం.. 

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో..

-సేకరణ:పెండ్యాల ఉపేంద్రరావు```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

సుందరకాండ-హనుమ*

  


      *సుందరకాండ-హనుమ*

                ➖➖➖✍️


*నమోస్తు రామాయ సలక్ష్మణాయ*

*దేవ్యైచ తస్యై జనకాత్మజాయై*

*నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో*

*నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః*

```

*రావణుడు తన మధుర వాక్కులతో ప్రణయ ప్రార్థన ప్రారంభించాడు.. 

“ఓ సుందరీ నీకెందుకింత భయం? భయంతో నీ సౌందర్యాన్ని దేనికి దాచుకుంటావు? సర్వలోకాలనూ ఆకర్షించే నీ అందాన్ని అర్థిస్తున్నాను. నన్ను ఆదరించి ప్రేమించు. ఇక్కడ మానవ ప్రాణి లేదు. వీరికెవ్వరికీ కామరూప శక్తి లేదు. మీ లాగే మాకు కూడా ధర్మభీతి చాలా వుంది. పరస్త్రీలను బలాత్కరించడం, వారితో భోగించడం రాక్షస జాతి ధర్మం. ఈ ధర్మ నిర్వహణలో నేను అప్రమత్తంగా వుంటాను. నీ మనసు నన్ను కోరేవరకు నిన్ను నేను తాకను, మదన తాపం నా మనసును యెంత వేధించినా నేను నిన్ను ముట్టను. 

నీకు అంగీకారం అయ్యే వరకు వేచియుంటాను. ఎందుకింత భయం? సుఖంగా నన్ను ప్రేమించు. భోగాలు అనుభవించు. కటిక నేలపై మలిన వస్త్రంతో నిష్కారణంగా ఉపవాసాలతో ఏకవేణితో, యెందుకు దీర్ఘాలోచన చేస్తున్నావు. హాయిగా నా మాట విని నన్ను ఆదరించు. స్వర్ణాభరణాలు, సుగంధ, సుమమాలలు, చీనాంబరాలు, మణిమయ పీఠాలు, మధురమైన పానీయాలు, నృత్యాలు, గానాలు, వినోదాలు, హంసతూలికా తల్పాలు అన్నీ అనుభవించు. వెనక్కి రాని నదీ ప్రవాహంలా పోయిన యవ్వనం మళ్ళీ రాదు. సృష్టికర్త సర్వసౌందర్యరాశిగా నిన్ను సృష్టించి విశ్రాంతి తీసుకున్నాడా? పితామహుడైన బ్రహ్మకు కూడా కన్ను చెదిరే అందం నీది. నీ శరీరంలో అణువణువూ అత్యంత మనోహరమైన నా కనులకు బంధం వేస్తున్నది. నన్ను కాదనకు, నా మాట విని నన్ను గ్రహించి నా రాణీ వాసానికి పట్టమహిషి వై వుండు. దిగ్విజయ యాత్రలో నేను సాధించిన ఐశ్వర్యమంతా నీ ముందు వుంచుతాను, నేను నీ ఆధీనంలో వుంటాను. ఈ భూమండలంలో నన్నెదిరించి నిలిచే వీరుడు లేడు. నాకు శత్రువై బ్రతికిన వాడు లేడు.

ఈ మలిన వస్త్రమును వీడి సర్వాలంకార భూషితవై యదేచ్ఛగా నాతో కూడి పానక్రీడలు సాగించు. 

నీ చిత్తం వచ్చినట్లు దాన ధర్మాలు చేయు. నా సంపదలను ఐశ్వర్యాన్ని చూసావుగా యిన్ని భోగాలను అనుభవించక నారవసత్రంతో అడవుల్లో తిరిగే రామునికోసం బాధపడతావెందుకు. రామునికి సంపదలేదు, వనవాసం, కటిక నేలపై శయనం. నాకు చిక్కిన నీవు రాముని పొందలేవు. ఓ చారునేత్రీ గరుత్మంతుడు సర్పములు పట్టినట్లు నీవు, నీ సౌందర్యం నన్ను హరిస్తున్నాయి. ఈ దశలో నిను చూసిన తరువాత నా మనసు వికలమై నా అనుంగు భార్యలను కూడా ఆదరించలేకపోతున్నాను. దేవలోకంలో లక్ష్మీదేవిని ఆరాధించినట్లు నా నారీజనం నిను పూజిస్తారు, ఆదరిస్తారు, గౌరవిస్తారు. నా ఐశ్వర్యం కుబేరుని కన్నా మించి వుంది. అదంతా నీ సొంతం చేస్తాను. నా తపోబల శక్తికి కాని, సంపదలకు గాని రాముడు నాకు ఏ మాత్రం సరితూగడు. ఓ లలనా, హాయిగా స్వేచ్ఛగా నాతో కలిసి విహారాలు చేస్తూ భూమండలంలో కనీవినీ ఎరుగని సమస్త భోగభాగ్యాలను అనుభవించు. నీతో పాటు నీ బంధుకోటికి ఈ సమస్త భోగాలను అనుభవించే అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించు. సర్వాలంకారభూషితవై నాతో సర్వసుఖాలు అనుభవించు," యని పెక్కు విధముల రావణాసురుడు సీతమ్మను ప్రలోభపెట్టి తన వశం చేసుకోవడానికి ప్రయత్నించాడు. కాని సీతమ్మ తల్లి తనకున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో శ్రీరాముని పాదములను మనసులో వుంచి తపస్సు చేస్తూ వుంది. పది నెలలు గడిచినా మనుష్యకాంతగా జీవిస్తోంది. ఆమెకు దేవేంద్రుడు ప్రతి దినం పాయసాన్ని దేవతలచే పంపించగా ఈ భూమండలం పై యెక్కడా వున్నా రామలక్ష్మణులకు చెందుగాక యని వారి ప్రీత్యర్థం కొంత పాయసాన్ని భూమిపై వుంచి మరికొంత కేవలం తన రాముడు వచ్చే వరకు జీవించడం కోసం, శరీరాన్ని నిలబెట్టడం కోసం కొంత పాయసాన్ని భుజిస్తూ రామునికోసం ఎదురుచూస్తోంది. 

పది నెలలు గడిచినా రావణాసురుని ఆధీనంలో వున్న సీతమ్మ ఒక్క పండు కాని ఒక మెతుకు కాని ముట్టుకోలేదు. ఇది అనర్థం, తన యింట వున్న సాధ్వీ మణి ఉపవాసం చేస్తున్నది అది నీ లంకకు చేటు అని ఎందరు చెప్పినా వినని మూర్ఖుడు రావణుడు కామాంధుడై బుద్ధి నశించిన వాడై విజ్ఞతా విచక్షణలు మరచి ప్రవర్తిస్తున్నాడు రావణుడు.✍️(సశేషం)

*జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్*

*జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్🙏*```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

శ్రీ ఓతండీశ్వరర్ ఆలయం

 🕉 మన గుడి : నెం 1507


⚜  తమిళనాడు : తిరుమజిసై - చెన్నై


⚜  శ్రీ ఓతండీశ్వరర్ ఆలయం



💠 తమిళనాడులో చెన్నై నగర పరిధిలో ఉన్న తిరుమళిసైలో కొలువైన ఓతాండీశ్వరర్ ఆలయం శివునికి అంకితం చేయబడింది. 


💠 ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయాన్ని, 11వ శతాబ్దంలో చోళ చక్రవర్తి కులోత్తుంగ చోళుడు II నిర్మించారు. 


💠 ఇక్కడ శివుడు 'ఓతాండీశ్వరర్'గానూ, ఆయన దేవి పార్వతి 'కుళిర్వితనాయకి'గానూ ఆరాధించబడతారు.


🌀 స్థల పురాణం


💠 స్థల పురాణం ప్రకారం, చోళ చక్రవర్తి కులోత్తుంగ చోళుడు II ఒకసారి అడవిలో  మరో ప్రదేశంలో శివ దర్శనం చేసుకోవడానికి తన ఏనుగుపై ప్రయాణిస్తున్నాడు. మార్గమధ్యంలో, ఏనుగు ఒక కాలు ఒక తీగలో చిక్కుకుంది. 

ఎంత ప్రయత్నించినా అది పొద నుండి బయటకు లాగలేకపోయింది. 


💠 రాజు తన చేతులతో ఆ పొదను తొలగించడానికి ప్రయత్నించాడు కానీ విఫలమయ్యాడు.

అతను తన కత్తితో ఆ పొదను నరకడం ప్రారంభించగా, అతనికి రక్తస్రావం మొదలైంది. ఆశ్చర్యపోయిన రాజు, పొదల కింద దాగి ఉన్న ఒక శివలింగాన్ని కనుగొన్నాడు. 


💠 తాను భగవంతునికి అపచారం చేశానని గ్రహించిన రాజు, ఏమాత్రం సంకోచించకుండా అదే కత్తితో తన చేతిని నరుక్కోగా, భగవంతుడు తన నందిపై అమ్మవారితో కలిసి అతని ముందు ప్రత్యక్షమై, మునుపటిలాగే అతని చేతిని బాగుచేశాడు.


💠 రాజు యొక్క ఈ అచంచల భక్తికి మెచ్చిన శివుడు, ఆ ప్రదేశంలోనే తన దేవి పార్వతి (కుళిర్వితనాయకి)తో కలిసి 'ఓతాండీశ్వరర్' రూపంలో ఆయనకు ప్రత్యక్షమయ్యారు. 


💠 ఓతాండీశ్వరర్ కులోత్తుంగ చోళుని చేతిని తిరిగి యథాస్థితికి తెచ్చారు; 

ఈ కారణంగానే ఆయనకు 'కై తంత పిరాన్' (చేయి ప్రసాదించిన దైవం) అనే నామం కూడా ఏర్పడింది.


💠 ఈ ఆలయంలోని మూలవిరాట్టుపై ఇప్పటికీ ఒక మచ్చ ఉందని భక్తులు విశ్వసిస్తారు.

మరొక ఐతిహ్యం ప్రకారం, ఈ మూలవిరాట్టు భక్తుల శాపాలను తొలగించి వారికి బలాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి, ఈ దైవాన్ని 'మనువానుకూలేశ్వరర్' అని కూడా పిలుస్తారు.


💠 అమ్మవారు రాజుకు శివ భక్తుల కథలను చెప్పి అతని మనసును శాంతపరిచారు. 

ఈ సందర్భంలో తమిళంలో 'కుళిర్వితల్' అంటే భక్తుల దుఃఖాలను చల్లార్చేది అని అర్థం, అందుకే ఆమెను 'కుళిర్విత నాయకి' అని కీర్తిస్తారు.


💠 చరిత్ర : 

ఈ ఆలయంలో 11వ శతాబ్దానికి చెందిన చోళుల కాలం నాటి అనేక శాసనాలు ఉన్నాయి. 

కులోత్తుంగ చోళుడు II ఈ ఆలయాన్ని మరియు అందులోని ఉపాలయాలను ప్రస్తుత రూపంలో నిర్మించాడని భావిస్తారు. 

విష్ణుమూర్తి ఉపాలయం తర్వాతి కాలంలో నిర్మించబడిందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. 

సెంగుంద ముదలియార్లు ఈ ఆలయంలో అనేక ఉపాలయాలను నిర్మించి, ఆలయ పుష్కరిణిని (కోనేరును) పునరుద్ధరించారు. 

ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విజయనగర రాజులు ఆలయానికి అనేక దానధర్మాలు చేశారు. 


💠 ఓతండేశ్వరర్ ఆలయం ఏడు అంతస్తుల రాజగోపురాన్ని కలిగి ఉంది; మూలవిరాట్టు అయిన ఓతండేశ్వరర్, లింగ రూపంలో గర్భగుడిలో కొలువై ఉన్నారు. 

ప్రధాన ద్వారం నుండి ధ్వజస్తంభ మండపం, మహా మండపం మరియు అర్థ మండపం గుండా గర్భగుడిని చేరుకోవచ్చు. 

ధ్వజస్తంభం, గర్భగుడికి సరిగ్గా ఎదురుగా (అక్షరేఖపై) ఉన్న ధ్వజస్తంభ మండపంలో నెలకొల్పబడి ఉంది. 

మహా మండపంలో, ప్రధాన గర్భగుడికి అభిముఖంగా నంది విగ్రహం ఉంటుంది. 

మహా మండపానికి ముందు వినాయక మరియు మురుగన్ ఉపాలయాలు ఉన్నాయి; గర్భగుడికి ఇరువైపులా ద్వారపాలకులు కాపలాగా నిలుస్తారు.


💠 'కులిర్వితనాయకి' ఉపాలయం ఆలయ రెండవ ప్రాకారంలో ఉంది. ఈ ఆలయంలో నటరాజు (శివుని నాట్య రూపం) మరియు ఆయన దేవి శివకామి ఒకరికొకరు అభిముఖంగా ఉన్న ఉపాలయం కూడా ఉంది. 

గర్భగుడిపై ఉండే విమానం (శిఖరం), 'గజపృష్ట' శైలిలో నిర్మించబడింది; ఇది కూర్చున్న ఏనుగు ఆకారాన్ని పోలి ఉంటుంది. 


💠 ఈ ఆలయంలోని వినాయకుడిని 'ప్రసన్న వినాయకుడు' అని పిలుస్తారు. 

రెండవ ప్రాకారంలో విష్ణుమూర్తికి ఒక ఉపాలయం ఉంది. 

గర్భగుడి చుట్టూ శని, వృషభ, దుర్గ, చండికేశ్వర, దక్షిణామూర్తి మరియు నవగ్రహాల ఉపాలయాలు కూడా ఉన్నాయి.


💠 ఆలయంలోని వినాయక స్వామిని ప్రసన్న వినాయకుడిగా పూజిస్తారు.

నటరాజ స్వామి, అంబికా అమ్మవారు ఒకరినొకరు చూసుకుంటూ పూజిస్తే, ఆ దంపతుల ఐక్యత మరింత బలపడి, వారి జీవితంలో ఆనందం కలుగుతుందని భక్తులలో ప్రగాఢ విశ్వాసం ఉంది. 


💠 ఒతందీశ్వరార్ ఆలయానికి అతి సమీపంలో, జగన్నాథ పెరుమాళ్ ఆలయం అని పిలువబడే విష్ణువు ఆలయం. వినిపిస్తున్నట్లుగా, పేరు పూరీ జగన్నాథుడిని పోలి ఉంటుంది.

ఇక్కడి జగన్నాథుడిని మధ్య జగన్నాథ అని, పూరిలో ఒకటి అర్ధ జగన్నాథ అని మరియు తిరుపుల్లనైలో ఉన్నవాడు ఆది జగన్నాథ అని చెబుతారు. 

ఇక్కడ జగన్నాథ స్వామి, శ్రీకృష్ణుని రూపంలో మరియు ఆయన భార్యలైన రుక్మిణి, సత్యభామలతో కనిపిస్తారు. 


💠 తమిళ మాసమైన 'పంగుణి' (మార్చి - ఏప్రిల్) నెలలో జరిగే 'బ్రహ్మోత్సవం' మరియు 'శని పెయర్చి' (శని గ్రహ సంచారం) ఉత్సవాలు అత్యంత ప్రముఖమైనవి.



💠  చెన్నై నుండి 22 కి.మీ దూరంలో ఉంది.



రచన

©️ Santosh Kumar

ఆంగ్ల వైద్యమందు

 ఆంగ్ల వైద్యమందు నక్రమా లెరిగినా

సైడెఫెక్ట్ల గూర్చి సర్వ మెరిగి

పోరు దాని నొదిలి పోగాలమే గదా

సకురు అప్ప రావు సత్య 

మిదిర!


భావం: ఇంగ్లీష్ వైద్యంలోని మందులు విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తాయనీ, వ్యాధులను సంపూర్ణ నివారణ చెయ్యకుండా తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తూ, దీర్ఘకాలంలో వ్యాధులను ముదరబెట్టి, అనవసర మందుల వాడకంతో కిడ్నీ, లివర్ పాడు చెయ్యడంతో పాటు కేన్సర్ లాంటి వ్యాధులను సైతం పుట్టిస్తుందనీ, మెడికల్ మాఫియా మాయాజాలంతో అవసరం లేని ఆపరేషన్లతో పార్ట్లు తొలగించి, ఇంప్లాంట్స్ వేయడం, అవసరం లేకపోయినా స్టెంట్లు వేయడం, విపరీతంగా అనవసరమైన టెస్ట్లు చేయించడం, పేషెంట్లను బెదరగొట్టి, అనవసరమైన ట్రీట్మెంట్లు, ఆపరేషన్లు చెయ్యడం, సాధారణ పేషెంటును సైతం ఐసీయూలో పెట్టి, అడ్డదిడ్డమైన మెషీన్లు తగిలించి, బిల్లు పెంచడం, వంటి ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని ప్రతీ ఒక్కరికీ తెలిసినా కూడా మళ్ళీ వాళ్ళ దగ్గరకే ఈగల్లాగా పోతూ, వాళ్ల వలన నానా అగచాట్లకూ గురవ్వటం పోయే కాలం కాకపోతే ఇంకేమిటి? దీపపు పురుగులకూ, వీళ్ళకూ పెద్ద తేడా లేదు! హోమియో, ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యంలో వీళ్ళ సమస్యలకు, ఎమర్జెన్సీలకూ మందులూ, తగిన పరిష్కారమూ ఉంటాయని ఎంత అరిచి చెప్పినా అస్సలు వినిపించుకోరు! ఇదంతా వాళ్ళ ఖర్మ కాకపోతే ఇంకేమిటి? 


సకురు అప్పారావూ ఇది ఏమీ చెయ్యలేక, వీళ్ళ మైండ్ సెట్ మార్చలేక, తల బాదుకుంటూ కూర్చోవాల్సిన నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా,కరోనా లాంటి వైరస్ లు వ్యాప్తి చెందినా, రకరకాల జ్వరాలు వస్తూ, ఏడిపిస్తున్నా, ప్లేట్ లెట్స్ పడిపోవడం, ఆక్సిజన్ డౌన్ అవ్వడంతో హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ అయ్యే పరిస్థితి తలెత్తినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ ఏ హాస్పిటల్ కీ వెళ్ళే పని లేకుండా కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

నిజదారసుతోదర పోషణార్ధమై.

 శ్రీనాథమహాకవికి బమ్మెర పోతరాజునకు బావమరదుల సంబంధము చెప్పబడుచున్నది. శ్రీనాథుడు కావ్యములను వ్రాసి రాజులకునిచ్చి ధనముగొనుటలో యిష్టుడు. పోతన మాత్రము ఇట్టి కార్యమును నీచమైనదిగా భావించువాడు. పోతన దారిద్య్ర బాధల ననుభవించినప్పటికిని కావ్యము రాజదత్తము కానిచ్చుట కిష్టపడని వాడు. శ్రీనాథుడీ దరిద్ర బాధలు జూచి పోతనకు కావ్యము రాసి ధనము సంపాదించుమని సలహాయిచ్చినాడు.


కం. “కమ్మని” గ్రంథంబొక్కటి


యిమ్ముగ నే నృపతికైన గృతి యిచ్చినఁ "గై 


కొమ్మని” యీయరె యర్ధం


బిమ్మహి దున్నంగనేల యిట్టి మహాత్ముల్?


దానికి పోతన జవాబిచ్చినాడు.


ఉ: బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్


కూళలకిచ్చి యప్పడుపు కూడు భుజించుట కంటె సత్కవుల్


హాలికులైననేమి గహనాంతర సీమల కందమూలకౌ


ద్దాలికులైననేమి నిజదారసుతోదర పోషణార్ధమై.


శ్రీనాధుని సలహాకు జవాబుగా పోతన చెప్పినాడన్న ఈ చాటువు మంచన “కేయూర బాహు చరిత్ర”యoదున్నది.


పోతన్న పొలము దున్నుకొని బతికినాడని శ్రీనాథుని చాటువు వలనను, పోతన జవాబు (పై రెండు పద్యముల) వలనను తెలియుచున్నది. కావ్యము "బాల రసాలసాల నవపల్లవ కోమలయైన కన్య” వలె పోతనకు దోచినది. స్వంత కుమార్తెను దుర్మార్గులైన రాజులకిచ్చి వివాహముచేయుట కిచ్చగింపడు పోతన. రాజదూషణ మునుబట్టి సర్వజ్ఞ సింగ భూపాలునికి పోతనతో వైరము కథగా చెప్పబడుచున్నది.

💥💥💥💥💥💥💥💥

వివేకచూడామణి

  *వివేకచూడామణి*


 *శ్రీఆదిశంకరాచార్య విరచితము*


*80. విషయఖ్యగ్రహో యేన సువిరక్త్యసినా హతః*

*స గచ్ఛతి భవాంభోధే పారం ప్రత్యూహవర్జితః*


*పదవిభజన :*

*విషయ + ఆఖ్య గ్రహః + యేన - సువిరక్త్యసినా - హతః - స - గచ్ఛతి - భవ + అంబోధేః - పారం - ప్రత్యూహవర్జితః*


*భావము :*

*పరిపూర్ణ వైరాగ్యమనే ఖడ్గంతో విషయ వాసనలనే మకరాన్ని ఎవరైతే నరికివేయగలరో, వారే సంసారసాగరాన్ని దాటగలరు.*


*వివరణ :*

*విషయమనే మొసలి, ఏ పురుషునిచే దృఢతరమైన వైరాగ్యమనే కత్తిచే నశింపజేయబడుతుందో, ఆ పురుషుడు సంసార సాగరాన్ని దాటటంలో విఘ్నములు లేనివాడై, జనన మరణాది కల్లోలములతో వ్యాకులమైన సంసార సముద్రం యొక్క అంతమును - అంటే విష్ణువు యొక్క పరమపదమును పొందుతాడు. ముక్తుడవుతాడు.*

*ఇంకా, అటువంటి పురుషుని గురించి 'కఠోపనిషత్తు' ఏమి చెప్పిందంటే :*

*యస్త్వవిజ్ఞానవానవతి అమనస్కః సదా(అ )శుచిః*

*న స తత్పదమాప్నోతి సంసారం చాధిగచ్ఛతి*

*యస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్కః సదాశుచిః*

*స తు పదమాప్నోతి యస్మాద్భూయో న జాయతే*


*ఎవడు విజ్ఞానము లేనివాడై, మనోనిగ్రహము లేనివాడై, సర్వదా అశుచియై ఉంటాడో, అతడు ఆస్థానాన్ని పొందడు. సంసారాన్ని పొందుతాడు. ఎవడు విజ్ఞానవంతుడై, నిగృహీతమనస్కుడై, సర్వదా శుచియై ఉంటాడో, అతడు దేనిని చేరిన పదప మరల జన్మ పొందడో, అటువంటి పదాన్ని పొందుతాడు.*

🙏🙏🙏

పాదారవిందశతకము

 *శ్రీ మూకశంకర విరచిత* *మూక పంచశతి*


 *పాదారవిందశతకము* 


 **14 వ శ్లోకము* 


 *పవిత్రీకుర్యు ర్నః పదతలభువః పాటలరుచః* 


 *పరాగాస్తే పాపప్రశమన ధురీణాః పరశివే !*

 

 *కణం లబ్ధుం యేషాం నిజశిరసి కామాక్షి ! వివశా* 

 *వలంతోహ్యాతన్వంత్యహమహమికాం మాధవముఖాః*

 

 

*భావము :*


*నీ చరణ పరాగాన్ని తలపై దాల్చుటకు విష్ణ్వాదులు తహతహలాడుతూ తొందరపాటుతో ప్రతిచోటా సంచరిస్తున్నారు. అమ్మా కామాక్షీదేవి ! పాపపరిహారంచేసే నీ పాదధూళులు మమ్ములను పావనం చేయాలి సుమా !*


*అమ్మ పాదదూళి మాహాత్మ్యం వివరిస్తూ జగద్గురువులు చెప్పిన 'సౌందర్యలహరి'లో చెప్పిన 3 వ శ్లోకం, భావం :*

 

*అవిద్యానామంత-స్తిమిర-మిహిర ద్వీపనగరీ*

*జడానాం చైతన్య-స్తబక మకరంద శ్రుతిఝరీ*

*దరిద్రాణాం - చింతామణిగుణనికా జన్మజలధౌ*

*నిమగ్నానాం దంష్ట్రా - మురరిపు వరాహస్య భవతి*

 *అమ్మా ! నీ దివ్యచరణారవిందముల పాదధూళి, అజ్ఞానమనే చీకటిలో ఉన్నవానికి కాంతులతో నిండిన సూర్యోదయ పట్టణమువంటిది.(అనగా నీ పాదసేవ వలన అజ్ఞానము తొలగి జ్ఞానం కలుగుతుంది). అదేవిధంగా, తెలివిలేని మందబుద్దులైన కదలలే‌ని బద్దకస్తుల పాలిట వారికి చైతన్యము కలిగించే కల్పవృక్ష పుష్పగుచ్ఛమునుండి*

 *జాలువారే మకరందము వంటిది.( నీపాదభక్తి జడులను చైతన్యవంతులను చేస్తుంది). ఇక కోరికలు తీరని దరిద్రులపాలిట సకల కోరికలనూ తీర్చే చింతామణి వంటిది.( నీ పాదపూజ దరిద్రాన్ని పోగొట్టి కోరికలను తీరుస్తుంది). సంసార సాగరములో మునిగిపోవువారి పాలిట, వారిని ఉద్దరించే విష్ణు అవతారమై భూమిని ఉద్దరించిన యజ్ఞవరాహము యొక్క కోరలవంటిది.( నీ పాదస్మరణ భవసాగరమును దాటించి ముక్తిని ప్రసాదిస్తుంది).*

 

*ఆ తల్లి* 

*పాదపద్మములకు నమస్కరిస్తూ* 🙏🙏🙏

వంటింటి చిట్కాలు part 2

   వంటింటి చిట్కాలు part 2

=================

పోపుల పెట్టె లో దాగున్న మరిన్ని ఆరోగ్య రహస్యాలు మరికొన్ని మనం తెలుసుకుందాం. వాస్తవానికి ఇవి అన్నీ మనకి తెలిసినవే అయినా మనం పాటించడం మానేసాము.


పేరిన నెయ్యి లో కాసింత బెల్లం వేసుకుని తింటే గొంతు గర గర తగ్గుతుంది. అదే విధంగా తమలపాకులు పరగడుపునే తింటే కఫం తగ్గుతుంది అని చెప్పేవారు. తమలపాకులు తడిపి నుదిటిపై పెట్టుకుంటే తల నొప్పి మటు మాయం అవుతుంది. ఈ మధ్య పెళ్ళిళ్ల ల్లో తములపాకుల బజ్జిలు వేయడం ఎక్కువ అయ్యింది.మంచిదే తమలపాకులు ఎక్కువ వాడటం. అయితే అతి సర్వత్రా వర్జినియేత్ మరువకండి...దేనికీ అతి పని చేయదు.


అన్నం అరుగుదలకు కూడా తమలపాకులు బాగా పనిచేస్తాయి. అందుకే పూర్వం భోజనం తరువాత తాంబూలం తప్పనిసరిగా వేసుకునే వారు.


ఐరన్ లోపం ఉంటే తమలపాకులు లో పాత బెల్లం వేసుకుని రెండు ఆకులు తింటే నీరసం తగ్గుతుందని చెప్పెవారు.

 అందుకే ప్రతి ఇంట్లో తమలపాకులు పాదు ఉండాలి. పెంచడం కూడా చాలా సులభం.


పిల్లలు పుట్టని దంపతులకి మినప సున్ని ఉండలు పెట్టే వారు. పాలు లొ యాలకులు వేసి ఇస్తే మంచి ఫలితం ఉంటుంది.


పిలల్లు నీరసం గా, బలం లేకుండా ఉంటే ప్రతీ రోజు పప్పు అన్నం లో ఆవు నెయ్యి ఎక్కువ గా వేసి పెట్టే వారు.ఆవు నెయ్యి ఎక్కువ గా పిల్లలకు పెట్టడం వల్ల మేధస్సు పెరుగుతుంది.


 బలం తక్కువగా ఉండి ఎప్పుడు నీరసం గా, చె లాకీ తనం లేకుండా ఉండే వారికి వారం లో రెండు మూడు రోజులు గారెలు నేతిలో లో వేయించి పెట్టిన మంచి బలం కలుగు తుందని చెప్పేవారు. మరి ఎక్కువ గా తింటే కడుపు ఉబ్బరం తగ్గడానికి అల్లం రసం లేదా అల్లం పచ్చడి వాడమని చెప్పేవారు.


ఇంతకు ముందు తరం బలం గా ఆరోగ్యం గా ఉండటానికి కారణం వారు తీసుకునే బలమైన ఆహారంమే.


కాళ్ళు నొప్పులు గా ఉంటే కొబ్బరి నూనె తో కాళ్ళు మర్ధనా చేసుకుని వేడినీటిలో నిమ్మకాయ చెక్క పిండి ఒక పదినిముషాలు కాళ్ళు మునిగే వరకూ వేడి నీటిలో ఉంచితే కాళ్ళు నొప్పులు తగ్గుతాయని చెబితే అర్చర్యం కలుగుతుంది....నిమ్మకాయ బదులు ఉప్పు వేసుకుంటే కాళ్ళు పగుళ్ళు తాగుతాయి.


ఇలా ఇలా అనేక చిట్కాలు... నేను స్వయంగా చూసాను...వీలైతే తప్పకుండ ఆచరించండి...

వంటింటి చిట్కాలు మరువ కండి. ఇది పెద్దలు మనకి ఇచ్చిన ఆస్తి.....


సురేష్ వంకాయలపాటి

పోపుల పెట్టె

  పోపుల పెట్టె

=========

రచన:- వంకాయలపాటి వెంకట సూర్య నారాయణ ( సురేష్) పిఠాపురం

==================


అమ్మ ప్రేమతో నిండిన వంటింటి మూలన

నవ్వుతూ నిల్చున్న పోపుల పెట్టె.

చిన్నదే కానీ లోపల

రుచుల ప్రపంచం నింపుకొని,

విస్మయం కలిగించే

మందుల గుట్ట....


జీలకర్ర సువాసనల జ్ఞాపకాలు,

ఆవాల ఆత్మీయతతో,

మెంతుల గుబాళింపుల తిరుగుమోతతో

పదిలంగా దాచుకున్న

పసిడి మూటలా మెరిసే పెట్టె.....


పసిడి లాంటి పసుపు,

ఆత్మీయంగా కలిసే లవణం,

ధనియాల ధ్వనిలో

మనసుకు మధుర సంగీతం వినిపించే

ఆ చిన్న లోకం.....


పొయ్యి పొగలోనూ

అమ్మ ప్రేమ పరిమళం;

పోపుల పెట్టె తెరిచినప్పుడల్లా

ఇంటంతా పండుగ వాతావర నం.


చిన్న పెట్టె అయినా

చెప్పే కథలెన్నో;

చిన్నదే అయినా

తగ్గించే రోగాలెన్నో....