5, సెప్టెంబర్ 2024, గురువారం

సెప్టెంబర్, 06, 2024*🪷 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

        🌹 *శుక్రవారం*🌹

🪷 *సెప్టెంబర్, 06, 2024*🪷

      *దృగ్గణిత పంచాంగం*                 


 *స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*

*దక్షిణాయణం - వర్షఋతౌః*

*భాద్రపద మాసం -  శుక్లపక్షం*


*తిథి     : తదియ* మ 03.01 వరకు ఉపరి *చవితి*

*వారం : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం  : హస్త* ఉ 09.25 వరకు ఉపరి *చిత్త* 


*యోగం  : శుక్ల* రా 10.15 వరకు ఉపరి *బ్రహ్మ*

*కరణం  : గరజి మ 03.01 వణజి* రా 04.20 తె ఉపరి *భద్ర*


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 09.30 - 10.30 సా 05.00 - 06.00*

అమృత కాలం  :*ఈరోజు లేదు*

అభిజిత్ కాలం  : *ప 11.41 - 12.30*


*వర్జ్యం          : సా 06.28 - 08.17*

*దుర్ముహూర్తం  : ఉ 08.23 - 09.12 మ 12.30 - 01.20*

*రాహు కాలం : ఉ 10.33 - 12.06*

గుళికకాళం      : *ఉ 07.27 - 09.09*

యమగండం    : *మ 03.11 - 04.44*

సూర్యరాశి : *సింహం* 

చంద్రరాశి : *కన్య/తుల*

సూర్యోదయం :*ఉ 05.55* 

సూర్యాస్తమయం :*సా 06.16*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం   :  *ఉ 05.54 - 08.23*

సంగవ కాలం    :      *08.23 - 10.51*

మధ్యాహ్న కాలం  :*10.51 - 01.20*

అపరాహ్న కాలం : *మ 01.20 - 03.48*

*ఆబ్ధికం తిధి        : శూన్య తిథి*

సాయంకాలం :  *సా 03.48 - 06.16*

ప్రదోష కాలం   :  *సా 06.16 - 08.36*

రాత్రి కాలం   :  *రా 08.36 - 11.42*

నిశీధి కాలం    :*రా 11.42 - 12.29*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.22 - 05.08*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


జగన్మాతర్నమస్తుభ్యం నమస్తుభ్యంకృపావతీ 

దయావతినమస్తుభ్యం విశ్వేశ్వరినమోన్నమః 

నమఃక్షీరాబ్ధితనయే నమస్త్రైలోక్యధారిణి 

శశివక్త్రేనమస్తుభ్యం రక్షమాంశరణాగతం

        

🪷 *ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః*🪷


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌷🪷🪷🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🌷🌷🌹🌷

 🌹🍃🌿🌹🌹🌿🍃🌹

వ్యవసాయ క్షేత్రం నుండి

 సమీదలు మా వ్యవసాయ క్షేత్రం నుండి 

పిడకలు -మా గోశాల నుండి 

పసుపు మా సేంద్రియ వ్యవసాయ దారులనుండి 

కుంకుమ గోశాల నుండి 

నూనె మేము మర ఆడించినది 

ఆగరాబత్తిలు గోశాల నుండి టైర్లు, బొగ్గు కాల్చినవి కాదు 

గోమయ బతి్తీ లు 

వత్తులు స్వచ్ఛమైన జడపత్తి, హ్యాండ్ మేడ్ 

Pure గంధం మాకు అమ్మే లైసెన్స్ లేదు 

సింధూరం pure ఉంది 

సాంబ్రాణి 

విభూతి pure అవుపిడకల భస్మము 

గంగా జలం 

పన్నీరు అయితే pure 

తేనే pure 

పాలు గోశాలపాలు 

పెరుగు మేము order మీద చేస్తాము 

వెన్న order మీద supply

నెయ్యి purebilona 

గోమూత్రం మనం తాగే qwality 

గోమయం ఇంటి వద్దే ఆవు ఉన్నది ఇవ్వగలము 

పండ్లు, కూరగాయలు మా సొంతం గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండినవి 

వస్త్రాలు మగ్గమునుండి నేరుగా వచ్చినవి ధర కూడా సరసమైనది 

Blouses కూడా 

Ikkath, barder, kanchi silk కాటన్, pure cotton 

Couple పట్టు dhothi, matching sarees 

Light in weight 

వస్త్రాలు 

రిటర్న్ గిఫ్ట్స్ 40/-నుండి start

చెక్క సంప్రదాయ బొమ్మలు 

అన్నిటికి మించి పూజ చేసుకోవడానికి ప్రాఖ్యత ఋషిపీఠం (బ్రహ్మశ్రీ dr. సామవేదం షణ్ముఖ శర్మ గారి )ప్రచురణలు 

బాపూగారి books👍🏽

దేవుళ్ళ చిత్రపటా లు 

వట్టివేరు దండలు 

వరి తోరణాలు 

వంట పాత్రలు 

కంచు 

రాగి 

ఇత్తడి 

తగరము 

పోతయినుము 

రాతి మరిగలు 

రాగి antique విగ్రహాలు 


విషరహిత ఆహార ధాన్యాలు 

Snacks

Biscuits 

సాంప్రదాయ చిరుతిండ్లు 

చిరుధాన్యాలు millets 

పొడులు, ఊరగాయలు 

ఇవన్నీ ఉన్నపుడు కల్తీ చింత మీకెందుకు

ఒక్కసారి రండి దర్శించండి 

మీ కొనుగోలు మా గోశాల కు ఊత మిస్తుంది 

మాలో మరింత ఉత్సాహమిస్తుంది 

సదా మీ సేవలో 

మీ శ్రేయోభిలాషి 

Sushena organics 

Sasikala vanam 

7659927777

9490280126

Behind muncipal park

Khadhi colony 

Tirupathi 

మా ధ్యేయం విషరహిత ఆహారము అందించడం ద్వారా ప్రకృతి వ్యవసాయదారులకు తోడ్పాటు 

&గోశాల అభివృద్ధి 

మీరు charity ఇస్తే అవుకు మాత్రమే మేలు 

ఇలా అయితే రైతు, గోవులకు కూడా మేలు చేసినవారవుతారు

మీరు సేంద్రియ ఉత్పత్తులు rate కొంచం ఎక్కువ కానీ ఫలితము రెంట్టింపు అనేది మారుస్తున్నారు

Please share the information 

Support goshala 

Jai hind

వినాయక చవితి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

               *వస్తున్న*

*వినాయక చవితి సందర్భంగా*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

        *వినాయక వ్రత కల్ప*

      *పద్యములు/ శ్లోకములు*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం।*

*ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే॥*


*అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్।*

*అనేక దం తం భక్తానాం ఏకదం తముపాస్మహే।*


*గణానాం త్వా గణపతిం హవామహే।*

*కవిం కవీనా ముపమశ్రవస్తమమ్।*

*జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పత ఆనం*

*శృణ్వన్నూతిభి స్సీద సాధనమ్ మహాగణాధిపతయే నమః।*


*భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్।*

*విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ॥*


*ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం।*

*పాశాంకుశధరం దేవం ధ్యాయే త్సిద్ధి వినాయకమ్ ॥*


*ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం।*

*భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం ॥*


*ద్యాయే ద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం।*

*చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ॥*


*సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః।*

*లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః।*

*ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః।*

*వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః।*

*షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయాదపి।*


*నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన,*

*ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్।*


*వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ*

*నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.॥*


*తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌।*

*మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.।*

*కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై*

*యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌.॥*


*తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్।*

*ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెద నేకదంత*

*నా వలపటి చేతి గంటమున వాక్కున నెప్పుడు బాయకుండుమీ*

*తలపున నిన్ను వేడెద దైవగణాధిప లోకనాయకా!*


*తలచెదనే గణనాథుని*

*తలచెదనే విఘ్నపతిని తలచినపనిగా*

తలచెద నే హేరంబుని*

*దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌॥*


*అటుకులు కొబ్బరి పలుకులు*

*చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌।*

*నిటలాక్షు నగ్రసుతునకు*

*బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌.॥*


*గం గం గణేశాయ నమః।*

*ఓం నమః శివాయ॥*


*శుభమస్తు. అవిఘ్నమస్తు.*

*శుభోదయం. శుభదినం.*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

కంచిపరమాచార్యవైభవం

 🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

   *కంచిపరమాచార్యవైభవం*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

  *సనాతన ధర్మం - పునర్జన్మ*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*ఒకసారి మన సనాతన ధర్మంపై, వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు పరమాచార్య స్వామివారిని దర్శించాలని కంచి మఠానికి వచ్చాడు. అతను కొన్ని సందేహాలను అడగాలని అనుకున్నాడు. వెంతనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. సమయం వృధా చెయ్యకుండా తన సందేహాలను స్వామివారి ముందుంచాడు.*


*”స్వామిజి, నేను మీ సనాతన ధర్మ యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను, వాటిని గౌరవిస్తాను కూడా. కాని ఈ ‘ఒకే ఆత్మ పాప పుణ్యాల ఫలం వల్ల మళ్ళీ జన్మించడం, క్రిందటి జన్మ కర్మఫలం ఈ జన్మకు రావడం’ అనే ఈ పునర్జన్మ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు. మీరు ఈ విషయంలో నాకు కొంచం చెప్పగలరా?” అని అడిగాడు.*


*”ఎందుకంటే మా ధర్మం ప్రకారం. ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తాము. అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు. కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు” అని చెపాడు.*


*అప్పుడు మహాస్వామి వారు అతని దగ్గర కారు ఉన్నదా అని అడిగి ఈ కంచీపురంలో వెళ్ళి కొంచెం సమాచార గణాంకాలను సేకరించుకు రాగలవా అని కనుక్కున్నారు. అతను వెంటనే ఒప్పుకున్నాడు. కాని తన ప్రశ్నకు ఎందుకు వెంటనే సమాధానం చెప్పలేదు అని అనుకున్నాడు.*


*”సరే స్వామీజి, ఏమి చెయ్యమంటారో సెలవివ్వండి” అని అడిగాడు. అందుకు మహాస్వామి వారు, “కాంచీపురంలోని ఒక పది ప్రసూతి వైద్యశాలలకు వెళ్ళు. అక్కడ గత రెండు రోజులలో పుట్టిన పిల్లల వివరాలు, వారి ఆరోగ్యం, తల్లితండ్రుల పేర్లు, వారి స్థితి, వారి విద్యార్హతలు, పుట్టిన సమయం వంటివి తెలుసుకుని రా” అని చెప్పారు.*


*ఆ విదేశీయుడు, “సరే ఇదేమి పెద్ద పని కాదు” అని తన కారులో వెళ్ళిపోయాడు. సాయిత్రం లోపల కావల్సిన వివరాలతో మహాస్వామి వారి ముందు వచ్చాడు. ఆ వివరాలను స్వామి వారికి చెప్పాడు.*


*“ఈ రెండు రోజులలో పది ఆస్పత్రులలో 15 మంది పిల్లలు పుట్టారు. 7గురు మగపిల్లలు, 8మంది ఆడపిల్లలు. వారిలో ముగ్గురికి పోషకాహార లోపం ఉంది. ఇద్దరు ధనికులైన తల్లితండ్రులకు ప్రథమ సంతానం. వారు అత్యంత ఖరీదైన ఆస్పత్రులలో పుట్టారు. నలుగురు పిల్లలు రోజుకూలి చెసుకునే వారికి పుట్టారు. వారికి అప్పటికే పిల్లలు ఉన్నారు” అని చెప్పుకొచ్చాడు.*


*స్వామివారు అతణ్ణి చూసి, కొన్ని ప్రశ్నలు వెయ్యడం మొదలుపెట్టారు.*


*”వీరు పుట్టిన ఈ రెండు రోజులలొ వారు నిజాయితీగా ఉండడమో లేదా కపట బుద్ధితో ప్రవర్తించడమో చేసారని నువ్వు అనుకుంటున్నావా?”*


*“లేదు వారు కనీసం తమ తల్లిని కూడా గుర్తించలేని చంటిపిల్లలు. కాబట్టి ఈ జన్మలో వాడికి పాపము పుణ్యము అనేది ఏమి లేదు” అని చెప్పాడు.*


*మహాస్వామి వారు ”మీ సిద్ధాంతము ప్రకారం ఈ పిల్లలందరూ ఏ పాపము పుణ్యము చెయ్యలేదు కాబట్టి అందరూ ఒకేలాగా ఉండాలి. కాని లేరు. కొంత మంది అరోగ్యం బాగులేదు. కొంత మంది ధనవంతుల పిల్లలు, కొంతమంది కూలివాని పిల్లలు. ఒకేరోజు, ఒకే అక్షాంశం, రేఖాంశం ఒకే ఊరిలో పుట్టిన పిల్లలైనా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో ఉన్నారు. ఇదే పునర్జన్మ సిధ్ధాంతం”*


*ఆ విదేశీయుడు ఈ మాటలను విని స్థాణువైపోయాడు. ఇక్కడే పునర్జన్మ సిద్ధాంతం నిజం అనేది తేటతెల్లమవుతోంది. ఈ పిల్లలందరూ వారి వారి పూర్వజన్మ పాపపుణ్యాల ఫలితంగానే ఈ జన్మలో ఇలా పుట్టారు.*


*ఆ విదేశీయుడిని చూసి సనాతనధర్మ సాకారరూపం చిరునవ్వుతోంది.*


*సనాతన ధర్మానికి పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం. దాన్ని నమ్ముతాను అని చెప్పడానికే నుదుట బొట్టు పెట్టుకోవడం.*


*పునరపి జననం పునరపి మరణం*

*పునరపి జననీ జఠరే శయనం ||*


*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*

*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।*


*ఓం శ్రీ గురుభ్యోనమః॥*


*ఓం నమః శివాయ॥*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

పాలవెల్లి

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐 

*పాలవెల్లి ఎందుకు కడతారు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🕉️

*వినాయక చవితి రోజున పాలవెల్లి ఎందుకు కడతారో తెలుసుకుందాం.*


*వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచారమూ ఇతర పండుగలకి భిన్నంగానే సాగుతుంది. వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి. పాలవెల్లి లేకపోతే గణేశుని పూజకి ఏదో లోటుగానే కనిపిస్తుంది.*


*ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే...అందుకు ఒకటేంటి చాలా కారణాలే కనిపిస్తాయి.*


*ఈ అనంత విశ్వంలో భూమి అణువంతే! ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోటానుకోట్లు కనిపిస్తాయి. ఒక పాలసముద్రాన్నే తలపిస్తాయి. అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటాము. ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు.*


*గణేశుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా! ప్రకృతిలో సృష్టి, స్థితి, లయలనే మూడు స్థితులు కనిపిస్తాయి. గణేశుని పూజలో ఈ మూడు స్థితులకూ ప్రతీకలని గమనించవచ్చు. ఈ భూమిని (సృష్టి) సూచించేందుకు మట్టి ప్రతిమను, జీవాన్ని (స్థితి) సూచించేందుకు పత్రినీ, ఆకాశాన్ని (లయం) సూచించేందుకు పాలవెల్లినీ ఉంచి ఆ ఆరాధనకి ఓ పరిపూర్ణతని ఇస్తాము.*

 

*గణపతి'* *అంటే గణాలకు అధిపతి, తొలిపూజలందుకునే దేవత. మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే కదా! ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అనుకోవచ్చు. అలా పాలవెల్లిని సమస్త దేవతలకూ ప్రతికగా భావించవచ్చు.*


*పాలవెల్లి అంటే పాలపుంతే అని తేలిపోయింది. మరి అందులో నక్షత్రాలు ఏవి! అందుకే వెలగపండుని కడతాము. దాంతో పాటుగా మొక్కజొన్నపొత్తులు, మామిడిపిందెలు, జామ, దానిమ్మలాంటి పండ్లనీ కడతాము. ఇవన్నీ వివిధ ఖగోళవస్తువులకు సూచన అన్నమాట.*

 

*ఏ దేవతకైనా షోడశోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ. కానీ వినాయకుడంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కదా! పైగా గణాధీపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి. అలాంటి స్వామికి ఛత్రంగా ఆ పాలవెల్లి కాక మరేముంటుంది.*


*గణపతి పూజ ఆడంబరంగా సాగే క్రతువు కాదు. మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో భగవంతుని కొలుచుకునే సందర్భం. బియ్యంతో చేసిన ఉండ్రాళ్లు, చెట్ల మీద పత్రి లాంటి వస్తువులే ఇందులో ప్రధానం. ఏదీ లేకపోతే మట్టి ప్రతిమను చేసి, పైన పాలవెల్లిని వేలాడదీసి, గరికతో పూజిస్తే చాలు....పండగ అంగరంగవైభవంగా సాగిపోయినట్లే! పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టిన పాలవెల్లి గణేశుని పూజకి అద్భుతమైన శోభనిస్తుంది.*


*ఓం గం గౕం గణాధిపతయే నమః౹*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

ఆది శంకరాచార్య చరిత్రము 3

 *ఆది శంకరాచార్య చరిత్రము 3 వ భాగము*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻


*శంకరుని బాల్యలీలలు:*


ఒకనాడు ఆర్యాంబ బిడ్డకు పాలిచ్చి ఉయ్యాలలో జోకొట్టి బిడ్డ నిద్రపోయాక లోపలికి వెళ్ళింది. భర్తకూ శిష్యులకూ భోజనాల య్యాక.తానుపెట్టుకొనితింటున్నది. అంతలో ఉయ్యాల లోని బిడ్డ క్రింద పడినట్లు చప్పుడయ్యింది. గుండెలు దడదడ కొట్టు కొంటూండగా పరుగు పరుగున వెళ్ళి బిడ్డను చూచి గుండెలు బాదుకొంటూ గొల్లుమన్నది. భార్య రోదన విన్న శివగురువు వెళ్ళి చూచే సరికి ఆర్యాంబ మూర్చ లో ఉంది. ఉపచారాలు చేయగా లేచి 'పాము మెడలో ఆడుతోంది బిడ్డను బ్రదికించండి, పాముల వాణ్ణి పిలిపిం చండి' అన్న మాటలు విని భర్త కూడా ఒళ్ళు పట్టు తప్పి పడ్డాడు. 'పాము పాము' అన్న కేకలు విన్న శిష్యులు పరుగున కఱ్ఱలతో వచ్చారు. బిడ్డ సుఖంగా ఆడుకొంటు న్నాడు. ఏమీ కాలేదు లేవండి అని తెలివి వచ్చిన తల్లికి చెప్పారు. తల్లి బిడ్డను ఎత్తుకొని రొమ్ముకు అద్దుకొంది. పెద్దలు 'మీ శంకరుడు నాగధరుడు. తన లీలలు మీకు చూపిస్తున్నాడు. మీరెంతో ధన్యులుసుమా!' అన్నారు.


వేరొక రోజున మరొక విచిత్రం జరిగింది. బిడ్డకు ఉగ్గుపెట్టి, నీళ్ళు పోసి, పాలిచ్చి నిద్ర పుచ్చాక దొడ్లోనికి స్నానానికి వెళ్ళుతూండగా భర్త ఎదురయ్యాడు. 'శంకరుడు నిద్రపోతున్నాడు. నేను ఇప్పుడే వస్తాను బిడ్డను చూస్తుండండి' అని చెప్పి వెళ్ళింది ఆర్యాంబ. 'సరే' అన్న శివగురుడు గది గుమ్మంలో కూర్చొని పార్వతీ పరిణయం పారాయణ చేస్తున్నాడు. అంతలో గదిలో పెద్ద వెలుగు వెలిగింది. గది లోనికి తొంగి చూచాడు. బలిసిన ఒక పెద్ద యెద్దు, దాని మెడలో పెద్ద గంట చెవులు గింగురు మనేలా గణగణ ధ్వని వినిపించాయి. శివగురుని గుండెలు దడదడ కొట్టుకొన్నాయి. ఆ యెద్దుపై హస్తం ఆన్చి నిలబడి ఉంది ఒక నల్లని వనిత. ఉయ్యాల లోని బిడ్డను చూస్తూ ఒయ్యారంగా ముసి ముసి నవ్వులను అందిస్తోంది ఆమె. బిడ్డడు నవ్వుల మూటగా చూస్తున్నాడు. అంతలోనే ఆ దృశ్యం మటుమాయ మయింది. సంగతి విన్న ఆర్యాంబ, శివగురువులు పరమేశ్వ రునికి పరిపరి విధాలుగా నమస్కారాలు చెప్పుకొన్నారు.


మరొక సమయంలో బిడ్డ పరుండిన తర్వాత బిడ్డను చూస్తుండమని శిష్యులకు చెప్పి బయటికి వెళ్ళింది ఆర్యాంబ. శివగురుడు ఆవుకు కుడితి పెడుతు న్నాడు. శిష్యులు పాఠాలు వల్లెవేస్తున్నారు. మధ్య మధ్య ఒక శిష్యుడు గది లోనికి వెళ్ళి బాలుణ్ణి చూచి వస్తున్నాడు. అలా వెళ్ళిన శిష్యుడు చూచి గొంతెత్తి పెద్ద కేక వేసాడు. విని మిగిలిన శిష్యులూ వచ్చి వాళ్ళూ గొల్లు మన్నారు. గందరగోళం విన్న ఆర్యాంబా, శివగురువూ వచ్చి చూస్తే మాటరాక క్రింద చదికిల పడ్డ శిష్యులు, ఉయ్యాల లో హాయిగా పరున్న బిడ్డడు. కొంత తమాయించు కొన్న పిదప చెప్పారు శిష్యులు తాము చూచినది. నాలుగు చేతులున్న నల్లని వాడు, నాలుగు ముఖాల వాడు, గడ్డాలు మీసాలు ఉన్న వాళ్ళు పలువురు బిడ్డ చుట్టూ మూగి తొంగి తొంగి చూస్తున్నారట. బిడ్డను ఎత్తుకు పోతారేమో అని భయం వేసిందండీ అని చెప్పారు. ఆ మాటలు విన్న ఆర్యాంబా శివగురువులకు ఏమి చెప్పాలో తెలియ లేదు.


శంకరుడు ఆరోజుకారోజు ఎదుగుతున్నాడు. కూర్చుండడం, ప్రాకడం కలకల లాడుతూ ఇల్లంతా కలయబ్రాకేవాడు. గడపలు పట్టుకొని నడవడంతో మొదలుపెట్టి తప్పటడుగు లతో మెల్లి మెల్లిగా నడక నేర్చుకొంటున్నాడు. అయినా తల్లి బిడ్డను చంకను వేసుకొనే తిరిగేది ఎక్కడ కంది పోతాడో అని. కాలడిలో అందరూ శివభక్తులు కాదు. అలాంటి వాళ్ళు కూడా ఈ బాలుణ్ణి చూచి ఆ వర్ఛస్సు, నుదుటనున్న ముక్కంటి రేఖ, కంఠాన నాగరేఖలూ మొదలైనవి చూచి తేరుకొని శంకరావతారమే అని నిర్ధారించుకొని వెళ్ళారు.


*పరివారము:*


రావణాది క్రూరరాక్షసుల ను సంహరించడానికి భగవానుడు

శ్రీరామునిగా అవతరించినపుడు సోదరులుగా భరత లక్ష్మణ శత్రుఘ్నులుకూడ భువిపై వెలశారు. తర్వాతి యుగంలో శ్రీకృష్ణునితో బాటు యుధిష్ఠిరాదులు జనించారు. యుగే యుగే ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి పూనుకొంటాడు పరమాత్ముడు. కలియుగంలో మన శంకరుని అవతారాశయ ము కూడ ధర్మ సంస్థాపనమే. క్షీణించుచున్న కర్మకాండ లను ఉద్ధరించడానికి కుమారస్వామి అంశతో కుమారిల భట్టు, బ్రహ్మగారి అంశతో మండనమిశ్రుడు జన్మించారు. విష్ణ్వంశతో పద్మపాదుడు పుట్టి గురుభక్తి మహిమను లోకానికి చాటాడు. సూత్రభాష్యాన్ని, ఉపనిషద్భావాలను సుళువుగా తెలియజేయ డానికి బృహస్పతి అంశతో ఆనందగిరి ఉద్భవించాడు. హస్తామలకుడు వాయు దేవుని అంశతో పుట్టాడు. భారతదేశం ఆనాడు అల్లకల్లోల స్థితిలో ఉంది. నాస్తికత బలపడింది. ఆస్తికపండితులు పరస్పర వైరుద్ధ్యాలతో దారి తెన్ను తెలియని అయోమయ అవస్థలో మునిగిఉన్నారు. వైదిక ధర్మార్థాన్ని పునరుద్ధరించవలసిన అవసరం బలవత్త రంగాఉంది. ధర్మానికిగ్లాని కలిగినపుడు ఉదయిస్తా నన్నాడు కదా పరమాత్మ. ఆపరిస్థితులలో శంకరావతారమునకు ఆవశ్యకత ఏర్పడిన అపురూపమైన తరుణం అది.


*సరస్వతికి శాపము:*


చతురాననుని అధ్యక్షతలో సత్యలోకంలో ఒక మహా సభ. మహర్షులు నిలబడి వేదవాక్కులతో బ్రహ్మను ప్రస్తుతిస్తున్నారు. నలువ రాణి వింటున్నది కాని ఆ మహామహిషికి రుచించడం లేదు. కారణం దూర్వాసుని బోసినోట వెడలిన ఉచ్చారణ స్వరం. సరస్వతీదేవి పక్కున నవ్వింది. కారణం


అర్థం చేసికొన్న దూర్వాసమహర్షికి అవమానంతో క్రోధాగ్నితో భగభగ మండింది శరీరం. శపించాడు ఆ వాగ్దేవిని: 'మానవులకు సుస్వరం లేదని నీకు తెలియదా? ఈ విషయం నీవు తెలిసికోవలసి ఉన్నది. ఇందుకు మానవజన్మ ఎత్తుదువు కాక!'. శాపం విన్న శారదామాత బ్రహ్మ వైపు చూచింది. మహర్షుల వైపు చూచింది. అందరూ దిగ్భ్రాంతులై చేసేది లేనివారుగా అవాక్కుల య్యారు. ఋషి శాపానికెదురు లేదా? ఎవ్వరూ ఉలుకరు పలుకరు. అప్పుడు గత్యంతరం లేక ఆ దూర్వాసమునీశ్వరుని వంక తిరిగి నమస్కరించింది. తక్కిన ఋషులందరు ధైర్యంతో దూర్వాసుని వేడుకొన్నారు శాపోపహరణం కోసం. అప్పటికి కొంత దిగిన కోపోగ్రతతో ఇలాఅన్నాడు. 'అద్వైతమతవ్యాప్తికై పరమేశ్వరుడు శంకరావతారం ధరిస్తాడు. వారి దర్శనంతో నీకు శాపవిముక్తి లభిస్తుంది. పైగా నీ పతి దేవుడు కూడ నీతోనే ఉంటాడు'. ఈవిధంగా బ్రహ్మ గారికి కూడా తన శాపాన్ని తగిలించాడు మహర్షి పుంగవుడు! మహనీయుల శాపాలు శాపవిమోచ నాలూ అన్నీ లోకకల్యాణకరాలే!


*సరస్వతి భూలోకమున జన్మించుట:*


శోణనదీ తీరాన పరమ శ్రోత్రియవంశం లోని విశ్వమిత్రుడు విద్యా వినయసంపన్నుడు, తేజోమూర్తి. భాగ్యశాలి అయినా నమ్రశీలి. అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ బంధు మిత్రులకు ఏడుగడయై, ఎల్లరి మన్ననలను పొందుతున్న గృహస్థగ్రామణి. లేక లేక పుట్టింది ఆ యింట వంశ పావనిగాసాక్షాత్తు సరస్వతీ మాత. తెల్లని మేని ఛాయతో, దివ్య తేజస్సుతో, పద్మపత్రాల వంటి కన్నులతో చూపరులకు అద్భుతంగా కనిపిస్తూ వెలసినదా చదువులతల్లి. శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానయై ఆ బిడ్డ పసితనంలోనే చూపించిన తెలివితేటలు ప్రజలకు మిక్కిలి అబ్బురంగా అనిపించాయి.


ఆ బిడ్డను తడవు లేకుండా ఉభయభారతి అనే సార్థక నామంతో పిలిచారు. యుక్త వయస్సు వచ్చాక ఆమెకు తనకు కాబోయే వరుడెక్కడ ఉన్నాడో తెలిసికోవాలన్న తపన మొదలైంది. విశ్వమిత్రుని యింటికి ప్రతిరోజూ విప్రవర్యులు దూరదేశాల నుండి వచ్చే వారు. ఆ వచ్చిన వారి నుండి వివరాలు అడిగి తెలిసికొనేది తనకు కాబోయే వరుడెక్కడ వెలిసాడోనని. జాడ తెలియక అలమట పడేది.


*విశ్వరూపునిగా బ్రహ్మ ఆవిర్భావము:*


వేరొక పవిత్ర గృహంలో అవతరించి ఉన్నాడు విరించి. కతిపయదూరంలో ఉన్న హిమమిత్రుడనే పుణ్యాత్మునింట విశ్వరూపనామం ధరించి. అటు ఉభయభారతిలాగే ఈయన కూడా తపన పడుతున్నాడు తనకై ఉదయించిన సత్యలోకపు యిల్లాలు గురించి. ఈ ఉభయుల తపనలూ ఆందోళనలు, ఆరాటాలు రోజు రోజుకీ పెరిగిపోతూ శరీరాల్ని కృశింప జేస్తు న్నాయి. అటు ఉభయ భారతి తల్లిదండ్రులకు గాని, ఇటు విశ్వరూపుని మాతాపితలకు గాని ఈ ఇరువురి మనోగత విరహాగ్ని పరిస్థితులు తెలియనే తెలియవు. ఏ విధమైన లోట్లు లేవు. ఏ రకపు అసంగతపు విషయాలు లేనే లేవు. ఆకలి దప్పులు లేని విధంగా ఏదో విధమైన బెంగ ఆవహిల్లి వారిద్దరి దేహాలను క్రుంగదీస్తోంది. పెద్ద వాళ్ళకు ఏమీ తోచక భిషగ్వరులను రప్పించి చూపించారు. కారణం ఎవ్వరికీ అవగతం కాలేదు. ఒక్క విషయంలో ఇరు వైపుల వైద్యులూ ఆయా చోట్ల ఒకే నిర్ణయానికి వచ్చారు అచ్చట విశ్వరూపునికీ ఇక్కడ ఉభయభారతి గురించీ. ఏ రుగ్మత లేదని తేల్చి చెప్పారు. అయినా తల్లిదండ్రులకు చింత పోలేదు. అక్కడ హిమమిత్రుడు పుత్రుణ్ణి చేరదీసి 'నాయనా! నువ్విలా చిక్కిపోతుండడం చూడలేకపోతున్నాము. నిన్ను వేధిస్తున్నది, బాధిస్తున్నది ఏదయినా ఉందా? దాచక చెప్పు' అని అడిగాడు.


అదే విధంగా ఒకనాడు విశ్వమిత్రుడు ప్రియ పుత్రికను చేరదీసి 'అమ్మా! నిన్ను మనస్సు వికలం చేస్తున్నదేమో చెప్పు. ఏ నగలు కావాలి? ఏ నాణ్యాలు కావాలి?' అని అడగగానే ఉభయభారతి తండ్రితో 'నాయనా! నాకు కావలసినది, మీరియ్యనిదేమున్నది?' అని సమాధానం చెప్పింది.


ఒక నాడు హిమమిత్రుడు ఊరకుండ లేక తనయుణ్ణి నిర్బంధంగా అడిగాడు దాచక కారణం చెప్పమని. ఇక దాచి లాభం లేదని తెలుసుకొన్న విశ్వరూపుడు తండ్రి దగ్గఱ తన వ్యథ నంతటినీ వెల్లడించాడు: 'నాన్నా! శోణనదీ తీరంలో విశ్వమిత్రుడనే బ్రాహ్మణోత్త ముడున్నాడు. ఆయనకు ఒక్క గానొక్క కూతురు రూప గుణ విద్యా వైభవాదులలో సరి లేని కాంతామణి. మీకు కోడలుగాను అమ్మ ఆశయాలకు అను గుణం గాను. అమ్మ ఆశయాలకు తగినదై ఈ యింటికి కోడలు కాదగ్గ కాంత, కాకుండా పోతుందేమో అని దిగులు పడుతున్నాను' అని విశదీకరించాడు వెంటనే హిమ మిత్రుడు సమర్థు లైన విప్రవరులను ఇద్దరిని రావించి కావలసిన దారిబత్తెములిచ్చి విశ్వమిత్రుని ఊరికి పంపిం చాడు.


అటు ఇక వేచి ఉండలేక ఉభయభారతి కూడ తండ్రితో తన మనోవ్యథకు కారణం బయట పెట్టింది. 'తన ఆశయాల కనుకూలుడు సుగుణరాశి అయిన సుందర రూపుడొకడున్నాడు. అతని పేరు విశ్వరూపుడు. నిరంతరం నా వైకల్యానికి కారణమదే. మనస్సు ఆయన పాదారవిందాలనే భజిస్తోంది. అలాంటి అల్లుడు మీకు లభించడం అదృష్టం. మీరందుకు తోడ్పడాలి' అని తల్లి దండ్రులను వేడుకొన్నది ఉభయభారతి. విశ్వమిత్రుని హృదయం కుదుటపడ్డది తమ ముద్దుల బిడ్డ అన్ని విధాలా తగిన వరుణ్ణి ఎన్నుకొన్నదని. కాని ఆ ప్రాంతము వారి ఆచారం ప్రకారం నాడు కన్యాన్వేష ణే కాని వరాన్వేషణ చేసే వారు కాదు. అందు వలన వరుని కొఱకు ఎదురు చూస్తున్నాడు.


*హరహర శంకరకాలడి శంకర* 


*శ్రీ శంకరాచార్య చరిత్రము*

*3 వ భాగము సమాప్తము*

🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము* *2

 *శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము* 

*2 వ భాగము* 

🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗


*ఆర్యాంబా శివగురుల తపస్సు:* 

ఆర్యాంబ మనసు లోని తపన శివగురునికి అర్థం అయ్యింది. కాలంపరుగెత్తు చున్నది, వయసు మీరు తోంది. పుత్రుల వలననే పరలోకసుఖాలు లభిస్తవి. పుత్రులు లేక పోతే వంశం అంత రిస్తుంది. ముందుముందు సంతాన హీనుల్ని పలకరించే వారు కూడా ఉండరు.ఇలావారు ఇరువురూ మానసికంగా తపిస్తూండగా ఒక నాడు ఆర్యాంబ ధైర్యం చేసి, నాధుడితో ఇలా అంది. 'స్వామీ! పరమేశ్వరుడు మన కోరిక తప్పక తీరుస్తాడు. ఆయన పరమ కరుణామయుడు. త్వరగా ఆ విశ్వేశ్వరుని వేడుకొందము రండి' అని భర్తకు పిలుపు నిచ్చింది. శివగురునికి ఈ ఉపాయం బాగా నచ్చింది.


మరునాటి వేకువనే లేచి కాలకృత్యాలు చేసికొని, పూర్ణా నదిలో స్నానం చేసి, సంధ్యను ఉపాసించి తర్వాత వారిరువురు నది ఒడ్డున సుఖాసీనులయి నారు. చిత్తాలను పరమేశ్వరా యత్తం చేసి, నిమీలిత నేత్రాలతో తపస్సు మొదలు పెట్టారు. కొలది రోజులు కంద మూలాలను తిని, తరువాత అవి మాని వాయు భక్షణం చేస్తూ కఠోర నియమాలతో వారి ఘోర తపం నడుస్తోంది. ఆర్యాంబ శరీరం శుష్కించ సాగింది.


*శివుని వరము*: 

ఒకనాటి రాత్రి స్వప్నంలో శివగురునికి పరమశివుని సాక్షాత్కారం లభించింది. భక్తుని కోరిక విన్న పరమేశ్వరుడు శివ గురువును ఇట్లా అడిగాడు.

‘అల్పాయుష్కుడై సద్గుణ సంపన్నుడైన ఒక పుత్రుడు కావాలా లేక పెక్కురు దుష్ట సంతానం కావాలా?' అని. శివగురువు సత్పుత్రుణ్ణి కోరు కొన్నాడు. ఈశ్వరుడు అట్లనే కలుగునని ఇక తపస్సు మానమని సెలవిచ్చి అంతర్ధానమ అయినాడు. మెలకువ వచ్చి భార్య ఆర్యాంబతో జరిగిన వృత్తాంతము చెప్పాడు. తపం చాలించి ఇంటికి మరలారు. నిజ నివాసంలో బ్రాహ్మణ సమారాధన చేసి శేషించిన ఆ ప్రసాదం భుజించిన శివగురువులోనికి ఈశ్వర తేజం ప్రవేశించింది. తన కోరిక ఫలించిన ఆర్యాంబ ఈశ్వర తేజస్సుతో గర్భం ధరించింది.


శివుని పరమానుగ్రహ మహిమ సామాన్యమా? ఆర్యాంబ నూతన కాంతు లతో వెలుగుతోంది. పదునాల్గు భువనాలు మోయడ మంటే మాటలా. నడక మంద మయినా ఉత్సాహం నానాటికీ ఇనుమడిస్తోంది. ఆభరణాలు గంధ మాల్యాదులు ధరించ డానికి ఆమెకు భారం మెండుగా ఉంది. ఇరుగు పొరుగువారు అనుమానం తో అదో రకంగా పలుకరిస్తున్నారు. ఆర్యాంబ మనస్సులో క్రొత్త క్రొత్త కోరికలు ఉదయింప సాగాయి. అవి తీర్చబోతే తిరస్కరించేది. మరల మరొక కోరిక పుట్టడం, దానిని తీర్చబోతే తిరిగి తిరస్కరించడం మామూలై పోయింది. బంధుమిత్రులు ఆప్యాయంగా తీసుకొని వచ్చిన సూడిదలన్నీ గ్రామంలో అందరికీ పంచిపెట్టడమే. మామూలుగా గర్భవతులకు వచ్చే అరుచి, ఆందోళన, నీరసం అలాంటివి ఆర్యాంబకు లేవు. నడుస్తున్నా, పని చేస్తున్నా చూచే వాళ్ళకు జాలి పుట్టు కొచ్చేది. ఇన్నాళ్ళకు గర్భం వచ్చింది ఎలా మోస్తుందో పాపం అనుకొన్నారు చుట్టుప్రక్కలవాళ్ళు. కాని భిషగ్వరుడు సాక్షాత్తు సర్వేశ్వరుడే ఆమె గర్భంలో ఉండగా ఆరోగ్యానికి ఏమికొదవ? మరి కొన్నాళ్ళకు ఆర్యాంబకు శంకరుడు చాటుగా మాటుగా కనిపించడం మొదలు పెట్టాడు. ఆమె గుమ్మాలు ఎక్కడం దిగడం మానుకొంది. ఒకనాడు స్వప్నంలో జయజయ నాదాలమధ్య సపరివారంగా కనిపిం చాడు. కళ్ళు విప్పి చూస్తే ఏమీ లేదు. విభ్రాంతురాల య్యింది. ఆమె చూపే దయ ఆదరం పరమ సాత్వికత వలన ఊరంతటికీ ఆర్యాంబ ప్రీతిపాత్రురాలు. పదవ మాసం వచ్చి పది రోజులయ్యింది. ఆర్యాంబ బాగా సొక్కింది. అలాటి సమయం పరమ పవిత్ర మయినది. లోక కల్యాణ కరుడు ధర్మసంస్థాపనా చార్యుడు సాక్షాత్ పరమశివుడే భూతలాన అవతరించినవేళ. దేవతలు పుష్పవర్షం కురిపించారు. దేవ దుందుభులు మ్రోగాయి. కృష్ణద్వైపాయనాది మహర్షులు హర్షాతిరేకం పొందారు. శంకర జననంతో ఆ గది కోటి సూర్యుల వెలుగునకు ఆకారమయ్యింది. బిడ్డ పుట్టగానే క్షణం సేపు మూర్ఛిల్లిన తల్లి అంతలో తేరుకుంది.


*శంకరుని జననము:*


నెమళ్ళు పింఛాలు ఎత్తి మనోహరంగా నాట్యం చేస్తున్నాయి. చూపరులను మైమరపించే విధంగా తరు లతాదులు పుష్పశోభలతో ఆనందంగా సుగంధాల్ని దశదిశలా వెదజల్లు తున్నాయి. ఆనంద బాష్పాలు గ్రుమ్మరిస్తున్నాడు సంతోషంతో ఉబ్బిన మేఘుడు పర్వతవీధుల నుండి. సెలయేళ్ళ కోలాహలం చెప్పనలవి కాదు. నదీఝరులు కన్ను మిన్ను కానని రీతిలో ఉరకలు వేసికొంటూ ఒడ్లను దూసు కొంటూ పారుతున్నాయి. సహజ వైరుధ్యమున్న జంతువులు మైత్రీభావంతో మెలగుతున్నాయి.


సుజనులకు శుభ నిమిత్తాలు, దుర్జనులకు దుర్నిమిత్తాలూ గోచరించ సాగాయి. యుధిష్ఠిర శకంలో రెండు వేల ఆరు వందల ముప్పది సంవత్సరాలుగడచాయి. నందన నామ సంవత్సరం. వైశాఖ శుక్ల పంచమి భానువారం కర్కాటక లగ్నం,మేషమందు రవి, పునర్వసులో చంద్రుడు గురుని తోడ, మందుడు తులయందు, అంగార కుడు మకరమందు ఉన్నారు. ఈ వార్త క్షణంలో ఊరంతా ప్రాకి, స్త్రీ లందరూ చూడ వచ్చి చూడలేక పోతున్నారు ఆ రవిసహస్ర దేదీప్యమాను డైన చిట్టి పాపణ్ణి. మంత్రసానికి కోద్దామంటే బొడ్డు కాన రావటం లేదు. అంతా చాలా హడావిడిగా ఉంది.. 


బిడ్డ కెవ్వుమన్న ఏడ్పు అందరు బిడ్డలలా లేదు. ఓంకారరవం అంటున్నారు. బొడ్డు కోసి నీళ్ళు పోసి బిడ్డను పరుండ బెట్టారు. పాపని చూచిన వారుచూచి నట్లుగా నిలబడిపోయి ఉంటున్నారు. ఒకసారి చూచిన వాళ్ళే తనివి తీరక మరల మరల వచ్చి చూస్తున్నారు.


బిడ్డడు కేవలం అవతార పురుషుడని చెప్పు కొంటున్నారు. అది విన్న మగవాళ్ళు కూడ చూడ వచ్చారు. ఆనాడు శివగురుని గృహం ఒక యాత్రాస్థలం అవ్వడంలో ఆశ్చర్యమేముంది? పుట్టిన శిశువు సామాన్యుడయితే కదా! మూడు నెలల బిడ్డ డేమో అన్నట్లు ఉన్నాడు.చక్కటి ముక్కు, తామర రేకుల వంటి కన్నులు, శ్రీకారాలను పోలిన చెవులు, విశాల ఫాలం, వెడల్పయిన వక్షఃస్థలం, మల్లెపువ్వు వంటి మేని ఛాయ, తుమ్మెద రెక్కల బోలిన నల్లని కురులు, బిడ్డ రూప విలాసాలు ముచ్చట గొలుపుతు న్నాయి. ఆర్యాంబా శివగురుల తపఃఫలమని అందరూ సంబరపడ్డారు.


శివగురుడు జన్మకాల ఘడియలు కట్టుకొని జాతకం వ్రాసి కొన్నాడు. పురుడు పది రోజులు సుఖంగా గడిచాయి. పదకొండవ నాడు పురిటిస్నానం చేయించి శాంతులు తీర్చి జాతకర్మ యథావిధిగ చేసికొన్నాడు. వంశం వారందరూ శివ భక్తులు. శివ ప్రసాదంగా జనించిన బిడ్డడు కాబట్టి శంకరుడని నామకరణం చేసాడు. శ్రీ శంకరుడే ఇలా అవతరించాడని తెలియదు కదా!


*శంకరుని పసితనము*:


తెలివైన దైవజ్ఞులను రావించి కుమారుని జాతకం వ్రాయించాడు శివగురుడు. భావాలన్నీ పరిశీలించారు వారు. పిల్లవాడు మంచి మేధావి, విద్యలకు వ్యాసుడు, స్వాతంత్ర్య విషయానికి సర్వేశ్వరుడు, ధర్మమూర్తి, గురువులకు గురువు, కవనానికి ప్రాచేతసుడు, మేధలో సురగురుడు, బ్రహ్మణ్యుడు, యోగరాశి, శాంతమూర్తిగా ప్రఖ్యాతి గాంచుతాడని ఆనంద కరమైన ముత్యాలను కుప్పగా పోశారు. తండ్రికి ఆ రాజాధిరాజ యోగాలు వీనుల విందొన గూర్చాయి. ఆయువు సంగతి మఱుగయ్యింది. సంతోషంతో వారికి మంచి పారితోషికాలిచ్చి పంపించాడు.


మంచి ముహూర్తం చూచి ఆర్యాంబ ముద్దుబిడ్డను తొట్టెలో పెట్టడానికి సంరంభం ఆరంభిం చింది. ఊరి ముత్తైదువు లందరినీ పిలుచుకొని వచ్చి, వచ్చిన పేరంటాండ్రకు కాళ్ళకు పసుపులు తానే రాసి బొట్లు పెట్టి చందన చర్చ చేసింది. శనగలు, అరటి పండ్లతో బాటు అత్తరువు లద్దిన రవికల గుడ్డలతో తాంబూలాలిచ్చి ముచ్చట తీర్చుకుంది. ఉయ్యెలకు మధ్యగా మణులతో మనోహరంగా అలంకరించి కట్టి వేళ్ళాడ దీసినారు. ఆ పాలవెల్లిని చూచి శిశువు సుఖంగా ఆడుకొంటాడని. వచ్చిన నారీమణులు బిడ్డను ఎత్తుకొని ముద్దాడి విడువ లేక విడువ లేక ఎవరి ఇండ్లకు వారు వెళ్ళే సరికి జాము రాత్రి అయ్యింది ఆనాడు. అమ్మలక్కలందరూ ఏదో వేళ వచ్చి ఆ బిడ్డను చూడకుండా ఉండగలిగే వారు కారు. వారి దైనందిన కార్యక్రమంలో ప్రముఖ స్థానం అది! శంకరశిశువు వారికి ప్రత్యక్ష శివునిలానే అనిపించి అలరించేవాడు. ఆ పరమా నందానుభవంలో వారు ఇల్లూ, వాకిలీ, భర్తా, బిడ్డలూ మరచిపోయే వారు. 


ఆర్యాంబాశివగురువుల గృహం శివాలయమే అయింది. చీకటి పడే సరికి పిల్లవాడు ఓంకార రవం చేసేవాడు. అప్పుడొక ముసలి అవ్వ వచ్చి విభూతి మంత్రించి పెట్టమన్నది. అలా చేయగానే బిడ్డ ఊరకుండి పరుండేవాడు. పరమేశ్వరునికి విభూతి ప్రీతికరమైనది కదా! మరొక పెద్దముత్తైదువు వచ్చి రుద్రాక్ష కట్టింది. ఒక ఉవిద తాయెత్తును, మరొకామె మొలకు పులి తోలును కట్టింది. వేరొక వనిత మెడ కొక మంత్రించిన త్రాడు వేసింది. ఇవన్నీ చూస్తే శివదర్శనానుభూతి కలిగినట్లు పరవశించి పోయే వారందరూ.


*శంకర శంకర కాలడి శంకర* 

**

*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 2 వ భాగము*

*సమాప్తము* 

🌸☘️🌸☘️🌸☘️🌸☘️🌸☘️🌸☘️

Slokam


 

Panchaag


 

టీచింగ్ వృత్తి కాదు

 *టీచింగ్ వృత్తి కాదు... విలువల జాతి నిర్మాణం..!* 

*ఈ చిన్న కథ విన్నారా…?!*

*ఎండ... చెమట... ఈసురోమంటూ నడుస్తున్నాడు ఓ పెద్దమనిషి....!* 

*అనుకోకుండా ఓ యువకుడు ఎదురయ్యాడు... పలకరించాడు... వంగి, కాళ్లు మొక్కాడు...* 

*మాస్టారూ, బాగున్నారా..? 'సర్, నన్ను గుర్తుపట్టలేదా..?* 

*'ఎవరు బాబూ నువ్వు..? చూపు సరిగ్గా ఆనడంలేదు., గుర్తుపట్టలేకపోతున్నాను'*

*'సర్, నేను మీ ఓల్డ్ స్టూడెంట్ ను..'*

*'ఓహ్, నిజమా? సంతోషం, నాకు గుర్తు రావడం లేదు, ఏం చేస్తున్నావ్ బాబూ ఇప్పుడు..?*

*అంటే, బతకడానికి ఏం చేస్తున్నావ్ అని..?'*

*'నేను టీచరు అయ్యాను మాస్టారూ...’*

*'గుడ్, వెరీ గుడ్, నాలాగే టీచర్ అయ్యావన్నమాట..?'*

*'అవును సర్, నిజానికి టీచర్ కావడానికి మీరే స్పూర్తి తెలుసా..?'*

*'అదేంటి..? అదెలా..?'*

*'బహుశా మీకు గుర్తుండదు! ఓరోజు జరిగిన సంఘటన, నేను చెబుతాను, వినండి..!’*

*********************

*“ఓసారి నా ఫ్రెండ్ ఒకడు మంచి ఖరీదైన, మోడరన్ వాచీ స్కూల్ కి తెచ్చుకున్నాడు.*

*దాన్ని చూడగానే నాలో దొంగ బుద్ధి ప్రవేశించింది, చేతులు పీకేస్తున్నయ్, మనసు లాగేస్తోంది... ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాను, వాడి జేబులో నుంచి లాఘవంగా దొంగతనం చేశాను.* 

*కాసేపటికి వాడికి తన వాచీ పోయిందని తెలిసొచ్చింది. లబోదిబో మని ఏడ్చాడు.*

*టీచరుకి కంప్లయింట్ చేశాడు..!* 

*అప్పుడు ఆ క్లాస్ టీచర్ మీరే..!*

*’ఒరేయ్ పిల్లలూ, ఇది మంచి పని కాదు! వాడి వాచీ ఎవరు తీశారో తిరిగి ఇచ్చేయండి, నేను క్షమిస్తాను, ఎవరినీ ఏమీ శిక్షించను!’ అన్నారు మీరు.* 

*నేనేమీ భయపడలేదు, నాకు ఇవ్వాలని లేదు, ఇవ్వడం కోసమా చోరీ చేసింది? అందుకే తిరిగి వాచీ ఇవ్వలేదు, ఇవ్వాలనే ఉద్దేశం నాకు ఉంటే కదా?* 

*’అప్పుడు మీరేం చేశారో గుర్తుందా మీకు..?’*

*కిటికీలు, తలుపులు మూసేశారు, అందరినీ ఓ సర్కిల్ గా నిలబెట్టారు. ప్రతి ఒక్కరి జేబు చెక్ చేస్తానన్నారు. కాకపోతే అందరినీ కళ్లు మూసుకోవాలని చెప్పారు.* 

*జేబుల చెకింగ్ అయిపోయేవరకు కళ్లు తెరవొద్దని గట్టిగా హెచ్చరించారు.*

*తప్పదు కదా మరి, మీరు ఒక్కొక్కరి జేబూ చెక్ చేస్తూ వెళ్లారు, నా జేబులో దొరికింది మీకు,*

*తీసుకున్నారు, అడ్డగోలుగా దొరికిపోయాను.*

*అనుకున్నాను, కానీ ఆ తరువాత కూడా మిగతా అందరి జేబులూ చెక్ చేశారు.* 

*నాకు అర్థం కాలేదు...!*

*‘వాచీ దొరికింది, కళ్లు తెరవండి!’ అన్నారు మీరు.*

*అన్ని జేబుల తనిఖీలు పూర్తయిపోయాక... ఫలానా వారి జేబులో దొరికిందని మీరు చెప్పలేదు, నన్ను పట్టుకుని నాలుగు తగిలించలేదు, నలుగురిలో నా ఇజ్జత్ మీరు కాపాడారు!* 

*అది తరువాత అర్థమైంది... ఒకసారి నాపై మీరు ఆరోజే దొంగ అనే ముద్ర వేసి ఉంటే, నిజంగానే దొంగగా మారిపోయి ఉండేవాడినేమో..?’*

*అలా నన్ను రక్షించారు మీరు..! నాలో ఓ మార్పు తెచ్చింది ఆనాటి ఎపిసోడ్...!*

*కనీసం మీరు పక్కకు తీసుకుపోయి నన్ను మందలించలేదు కూడా. నా అంతట నేనే మారిపోయేలా చేశారు. ఇప్పుడు గుర్తొచ్చిందా సర్..? కానీ నా దగ్గర వాచీ దొరికాక కూడా, నన్నెందుకు మందలించలేదు..? ఇప్పటికీ జవాబు దొరకని ప్రశ్న సర్, ఇప్పుడైనా చెప్పరా ప్లీజ్...”*

*’అప్పుడు ఆ టీచర్ సావధానంగా చెప్పాడు ఇలా...*

*“ఒరేయ్, మీరు నా పిల్లలురా..! నా బిడ్డలురా!! టీచరు పిల్లలను ప్రేమతో చూసుకుంటూ భయం, భక్తులు అలవడేట్లుగా పిల్లలును మార్చుతూ పాఠాలు చెప్పాలి!* 

*ఆరోజు..*

*అందరి జేబులూ చెక్ చేశాను... నీ దగ్గర వాచీ దొరికాక నీమొహం చూసి, నిన్ను మందలిస్తే, ఇక నిన్ను చూసినప్పుడల్లా వీడు దొంగ అనేదే గుర్తొస్తుంది నాకు, ఫలితంగా బోధనలో వివక్షకు, నీపట్ల నాప్రవర్తనలో తేడాకు కారణం కావొచ్చు...!*

*అందుకేరా అబ్బాయ్, నేను కూడా ఫలానా వాళ్ల దగ్గర వాచీ దొరికింది అనే సంగతి నాకూ తెలియకుండా ఉండటం కోసం.... నేను కూడా కళ్లు మూసుకునే అందరి జేబులూ చెక్ చేశాను...”*✍️

*అందుకే…*

*గురుబ్రహ్మ గురుర్విష్ణుః*

*గురుర్దేవో మహేశ్వరః*

*గురుస్సాక్షాత్ పరబ్రహ్మ*

*తస్మై శ్రీ గురవే నమః*

*ఒకదేశం ఉన్నత స్థితిలో ఉందీ అంటే… దానికి కారణం ఇలాటి గొప్ప ఉపాధ్యాయుల వల్లనే…!*🙏*ఆనందాశృవులతో…*

*ఉపాధ్యాయులందరికీ అంకితం...*

*ఓ అద్భుతమైన వెలుగు*

 జై శ్రీ రామ్ 

*గురువు...*


        *ఓ అద్భుతమైన వెలుగు*

                ➖➖➖✍️


ఒకప్పుడు గురువు దగ్గర

మొట్టికాయలు తిన్నాను... 

కనుకనే మనో నేత్రం 

తెరుచుకుంది!!... 

బుద్ధి, జ్ఞానం విచ్చుకుంది!!...

బట్టీ పట్టిన పాఠాలు

బతుకుకు దారిచూపాయి!!...


మెదడుకు పదును పెట్టిన పాఠాలన్నీ 

పటిష్ఠతకు ప్రాణం పోశాయి...

విశిష్టమైన దారిలోకి నెట్టాయి!!...

విశిష్ఠ అవతారాన్ని ఇచ్చాయి...

అందుకే సాహిత్య సముద్రంలో

నిరంతరం ఈదుతూనే ఉన్నాను!!...


తెలియకుండానే ఈదడం వచ్చేసింది!!.

సరిహద్దులు లేని సముద్రాన్ని...

హద్దులను అందుకొని... 

తీరానికి చేరే మార్గాలను వెతుకుతున్నా!!...


అలనాడు గురువు నేర్పిన

అక్షరాల సందాయమే...

ఈనాడు కలిసొచ్చిన అదృష్టంగా...

నడిచొచ్చిన సాహిత్యంగా...

కవితావేశం నాలో పొంగుతోంది!!...


అందమైన వాక్యాలు

నాచుట్టూ అల్లుకున్నాయి!!...

నాలో మెదిలిన అద్బుతమే...

అక్షరాలలో ఇమిడిన భావం!!... 

దాని అంతరాత్మను తెలుసుకోవడం

అందిన ప్రతి వస్తువును

అందుకోవడం జరిగింది!!...


గురువు ఓ అద్బుత సృష్టి...!

ఆయన చూపులు ఓ పరిపుష్టి..!!

ఆయన చేసిన ఉపదేశమే... 

నా ఆలోచనల ప్రవాహానికి పుష్టి..!!!

ఈ అక్షర సంపద ఆయన పెట్టిన భిక్ష!!..


పిచ్చిగీతలు గీసినప్పుడు...

అక్షరాలు పలకనప్పుడు...

తగిన పదాలు రాయనప్పుడు...

ఆప్యాయత.., ప్రేమ స్పర్శతో...

అనురాగ హృదయ స్పందనతో...

అక్షరాకృతిని తొడిగించి...

భావామృతాన్ని తాగించారు !!


నన్ను శాసించి ఆశయం వైపు...

కలగన్న స్వప్నం వైపు... 

నడిపించిన మహోన్నత వ్యక్తి!..!

మానవతామూర్తి!!...

గొప్పవ్యక్తిత్వం కలిగిన గురువర్యులు...!! 

వారికివే నా శిరస్సు వంచి... 

చేస్తున్న ప్రణామములు!!🙏

జై శ్రీ రామ్ కంచర్ల వెంకట రమణ 


ఆత్మీయ ఉపాధ్యాయులందరికి

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు✍️

సత్సంగం

 🔔 *సత్సంగం* 🔔


🙏🪷మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి.


🙏🪷దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి…


*🙏శ్లో:"అనాయాసేన మరణం*

*వినా దైన్యేన జీవనం*

*దేహాంతే తవ సాన్నిధ్యం*

*దేహిమే పరమేశ్వరం."*


*🙏"అనాయాసేన మరణం"🙏*


🙏🪷నాకు నొప్పి లేక బాధ  లేని

మరణాన్ని ప్రసాదించు.


*🙏"వినా ధైన్యేన జీవనం"🙏*


🙏🪷నేను ఎవరి మీదా ఆధారపడకుండా,నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు.


*🙏"దేహాంతే తవ సాన్నిధ్యం"🙏*


🙏🪷మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేనునిన్ను దర్శించుకునే విధంగా దీవించు. 


*🙏"దేహిమే పరమేశ్వరం"🙏*


🙏🪷ఓ భగవంతుడా నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను.


🙏🪷1. అనుక్షణం నీ ప్రార్ధనలోనే గడిపే విధముగా అనుగ్రహించు. నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు.


🙏🪷2. ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ .... నా బిడ్డలకు కానీ ...సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను, కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు.


🙏🪷3. నాకు ఎప్పుడూ కూడా నీవు    సదా అండగా ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు.


🙏🪷ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాదిస్తాడని మరువకండి.


🙏🪷దీనినే ‘ *దర్పణ దర్శనం’* అంటారు, మనస్సనే దర్పణంలో  దర్శించి, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దహరాకాశాన ప్రతిష్టించుకునే ప్రయత్నమే ఈ ప్రక్రియ.


https://youtube.com/@satsangam7?si=AUiEL2nayxCMoeVb


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

ధ్యానానికి మూలము

 ॐ  05/09/2024 - ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు 🙏


శ్లో:- ధ్యానమూలం గురోర్మూర్తిః 

పూజా మూలం గురోః పదం| 

మంత్రమూలం గురోర్వాక్యం 

ముక్తిమూలం గురోః కృపాః||


తా:- ధ్యానానికి మూలము గురువు యొక్క రూపము, పూజకు మూలము గురువు యొక్క పాదములు, గురువు యొక్క పలుకులు మంత్రానికి మూలము. గురువు యొక్క కృప ముక్తికి మూలము.

శుభప్రదం భాద్రపదం*

 *సర్వ శుభప్రదం భాద్రపదం*


మానవ జీవితంలోని ఒడిదుడుకులను తొలగించి సకల శుభాలను అందించే మాసంగా భాద్రపదమాసం శాస్త్ర ప్రసిద్ధికెక్కిన కారణాలను తెలుసుకుందాం.


సకల విఘ్న నివారకుడు, గౌరీ పుత్రుడు, విఘ్నేశ్వరుడు, ప్రతికల్పంలోనూ భాద్రపద శుద్ధ చతుర్థినాడు ఆవిర్భవిస్తాడు. ఒక కల్పంలో విష్ణువే గణపతిగా పార్వతికి పుత్రుడై వచ్చినట్లుగా బ్రహ్మ వైవర్త పురాణంలో ఉంది. ఈ కల్పంలో అనగా శ్వేత వరాహకల్పంలో మాత్రం పార్వతీదేవీ శరీర నుండి ఆవిర్భవించాడు.


పార్వతీ దేవీ శరీరం దివ్య శరీరం. అయినా ఆ తల్లి కావాలని పాంచభౌతిక శరీరానికి కలిగే లక్షణాలను తన శరీరానికి కల్పించుకోవడంతో, ఆమె శరీరం నుండి మట్టి పుట్టింది. అందులో నుండి గణపతి పుట్టాడు. ఎందుకో గాని కొందరు వ్యాఖ్యాతలు దానికి నలుగు పిండి నుండి పుట్టినట్లు వ్యాఖ్యానాలు వ్రాసారు. కానీ కంచి పరమాచార్యులు మాత్రం శరీరపు చెమట నుండి పుట్టిన మట్టి నుండి గణపతి జన్మించినట్లు వివరించారు. నిజానికిక్కడ పిండి ప్రసక్తి లేనేలేదు. అలా


పుట్టిన పార్వతీ పుత్రుని శిరస్సును శివుడు ఖండించి, గజముఖం ప్రసాదించడంతో శ్రీ గణేశుడు గజముఖుడు అయ్యాడు. సర్వ విఘ్న నివారకుని జన్మకు కారణమైన భాద్రపదం భద్ర పదమే. గణేశుని పూజించి జనులు సకల శుభాలనూ పొందగలరని నారదపురాణంలోని 113వ అధ్యాయంలో ఉన్నది. శుక్ల చతుర్థినాడు 21 పత్రాలతో గణపతిని పూజించి, వినాయక ప్రతిమను దక్షిణతో గురువులకు దానం చేసిన వాడు ఐహికము, ఆముష్మికమూ రెండు పొందుతాడు, అని నారదపురాణంలో స్పష్టంగా వ్యాసుడు వివరించాడు.


భాద్రపద పూర్ణిమా తిథిన మొట్టమొదటిసారి ఉమామహేశ్వరులు అర్థనారీశ్వరులయ్యారు. అందువల్ల ఈ తిథిన మునులు ఉమామహేశ్వర వ్రతం, చేసారు. అర్ధనారీశ్వర ప్రతిమను భక్తితో, షోడశోపచారాలతో, పూజించాలి. బిల్వపత్రాలతో శివపార్వతులను పూజించిన పుణ్యాత్ములు, ఆదర్శ దంపతులై సకల సుఖాలతో జీవిస్తారు. ఇటువంటి వ్రతం మరోకటి లేదనీ, ఇంతటి వ్రతాన్ని మనకందించిన భాద్రపదమాసం వంటి మాసం లేదనీ అగస్త్యుడు అన్నాడు.


భాద్రపదం అనగానే అందరికీ స్ఫురించే విషయం. మహాలయం. పద్మకల్పంలో రుద్రుడు భాద్రపద బహుళ పాడ్యమి నుండి పదిహేను రోజుల పాటు లోకాలను తనలో లయం చేసుకున్నాడనీ, అందుకే ఆ కాలానికి అనగా భాద్రపద కృష్ణ ప్రతిపత్ తిథి నుండి భాద్రపద అమావాస్య వరకు ఉండే కాలాన్ని మహాలయ పక్షములు అంటారని వ్యాసుడు వివరించాడు. ఈ కాలంలో పితృ శ్రాద్ధాలు చేయాలి. ఈ శ్రాద్ధాల వల్ల పితృదేవతలు సంతృప్తులౌతారు. వంశాభివృద్ధి అవుతుంది మరియు అకాల మరణాలు ఉండవు. ముఖ్యంగా భరణీ నక్షత్రం నాడు పితృదేవతలకు శ్రాద్ధం పెడితే కుటుంబం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది.


*🚩 డైలీ విష్ 🚩*

ఆధ్యాత్మికం ఆనందం

గురువారం*🌷 🌹 *సెప్టెంబర్, 05, 2024*🌹

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

       🌷 *గురువారం*🌷

🌹 *సెప్టెంబర్, 05, 2024*🌹

      *దృగ్గణిత పంచాంగం*                


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - వర్షఋతౌః* 

*భాద్రపద మాసం -  శుక్లపక్షం*


*తిథి   : విదియ* మ 12.21 వరకు ఉపరి *తదియ*

*వారం : గురువారం* ( బృహస్పతివాసరే)


*నక్షత్రం  : ఉత్తర* ఉ 06.14 వరకు ఉపరి *హస్త*

*యోగం  : శుభ* రా 09.08 వరకు ఉపరి *శుక్ల*

*కరణం  : కౌలువ మ 12.21 తైతుల* రా 01.41 ఉపరి *గరజి*


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 06.30 - 08.30 & 11.00 - 12.00*

అమృత కాలం:*రా 02.37- 04.26 తె*

అభిజిత్ కాలం  : *ప 11.41 - 12.31*


*వర్జ్యం     : మ 03.45 - 05.34*

*దుర్ముహూర్తం  : ఉ 10.02 - 10.52 మ 02.59 - 03.49*

*రాహు కాలం : మ 01.39 - 03.11*

గుళికకాళం      : *ఉ 09.00 - 10.33*

యమగండం    : *ఉ 05.55 - 07.27*

సూర్యరాశి : *సింహం*

చంద్రరాశి : *కన్య*

సూర్యోదయం :*ఉ 05.55*

సూర్యాస్తమయం :*సా 06.17*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం   :  *ఉ 05.54 - 08.23*

సంగవ కాలం  :*08.23 - 10.52*

మధ్యాహ్న కాలం :*10.52 - 01.20*

అపరాహ్న కాలం:*మ 01.20 - 03.49*

*ఆబ్ధికం తిధి:భాద్రపద శుద్ధ తదియ*

సాయంకాలం :  *సా 03.49 - 06.17*

ప్రదోష కాలం  :  *సా 06.17 - 08.37*

రాత్రి కాలం    :  *రా 08.37 - 11.43*

నిశీధి కాలం    :*రా 11.43 - 12.29*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.08*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*శ్రీ దత్తాత్రేయ అజపాజప స్తోత్రం...!!*


నిత్యానందం బ్రహ్మముకుందం భగవంతం |


బ్రహ్మజ్ఞానం సత్యమనంతం భవ రూపం |


బ్రహ్మా పర్ణం నందమయం తం గురుమూర్తిం |


దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ||


🌹 *ఓం శ్రీ దత్తాయ నమః*🌹

    

🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🌹🌹🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🌷🌷🌹🌷

🌹🍃🌿🪷🪷🌿🍃🌹

ప్రపంచ పేపర్ బోయ్స్ దినోత్సవం

 *🙏జై శ్రీమన్నారాయణ 🙏* 04.09.2024,బుధవారం



*నగరం నిద్రపోతున్న వేళ... తొలి కోడి కూతకు ముందే అతడు మేల్కొంటాడు.* రవి కిరణాలు ప్రసరించక మునుపే.. ఎముకలు కొరికే చలిలోనూ *ప్రపంచాన్ని గుప్పిట పట్టి* ఆ సంగతులన్నింటినీ ఇంటింటికీ చేరవేస్తాడు. *తానెవరో కూడా కన్పించక... ఇలా వచ్చి, అలా వెళ్లిపోతాడు. పేరుకు మాత్రమే అతడు పేపర్ బాయ్...* కానీ, అతడో సామాజిక సారథి.. *వార్తా పత్రికలను పాఠకులకు చేర్చే నిత్య నూతన వారధి. అతనికి ఒక రోజు* 


*💐ఈరోజు ప్రపంచ పేపర్ బోయ్స్ దినోత్సవం💐*


మొట్టమొదటి పేపర్ బాయ్ అమెరికాకు చెందిన *బార్నీ ఫ్లాహెర్టీ.* ఆ రోజుల్లో పేపర్ వెయ్యాలంటే అక్కడి ప్రజలు నామోషీగా భావించేవారు. *బార్నీ మాత్రం డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నట్టు తన పరిస్థితికి తగ్గట్టు తాను పేపర్ బాయ్‌గా చేస్తే తనకు ఖర్చులకు డబ్బులు వస్తాయని అనుకున్నాడు.* అనుకున్నదే తడవుగా పేపర్ బాయ్ గా చేరిపోయాడు. . *1833 నాటికి అతడి వయస్సు 10 సంవత్సరాలు. ఆయన అప్పట్లో న్యూయార్క్ సన్ పేపర్ వేసేవాడు.* తెల్లవారకముందే దిన పత్రిక ఇంటికి చేరవేస్తుండడంతో ఇతర పేపర్ల వినియోగదారులు సైతం బార్నీ వేసే న్యూయార్క్ సన్ పేపర్‌నే కోరుకున్నారు.


దీంతో అనతికాలంలోనే ఆ పత్రిక చందాదారులు రెట్టింపయ్యారు. బార్నీ అనంతరం మరికొందరు పేపర్ బాయ్‌గా చేరినా వారందరికీ అతడే ఆదర్శంగా నిలిచారు. బార్నీ సేవలు గుర్తించిన పత్రికా యాజమాన్యం అతడికి మరిన్ని బాధ్యతలు అప్పగించింది. *పేపర్ బాయ్‌గా చాలా మంది పాఠకుల హృదయాల్లో స్థానం సంపాదించిన బార్నీ పుట్టినరోజు (సెప్టెంబర్ 4)ను ఆయా పత్రికా సంఘాల నాయకులు పేపర్ బాయ్స్ డే గా ప్రకటించారు.* నాటి నుంచి *ప్రపంచంలోని అన్ని పత్రికల యాజమాన్యాలు బార్నీ పుట్టిన రోజున పేపర్ బాయ్స్‌డేగా ఫాలో అవుతున్నాయి.* ఇదిలా ఉండగా *అమెరికాలోని హ్యూస్టన్‌లో టెక్సాస్ ప్రెస్ అసోస్సియేషన్ 125 వార్సికోత్సవం సందర్భంగా బార్నీ గౌరవార్థం అతడి కాంస్య విగ్రహాన్ని 2005లో ఏర్పాటు చేసింది.*


*ఉదాహరణకు రామేశ్వరంలో పుట్టిన అబ్దుల్ కలాం పేపర్ బాయ్ నుండి జీవితాన్ని మొదలుపెట్టి భారత రాష్ట్రపతి వరకు ఎదిగారు.*


*అలాగే పేపర్ బాయ్ గా సంపాదన మొదలు పెట్టి ఇండియాన్ ఐడల్ 2017 రేవంత్ విజేతగా నిలిచాడు. ఇలాంటి వారిని చూసి మనం ఆదర్శంగా తీసుకోవాలి. మనం జీవితంలో ఏదన్నా సాధించాలి అంటే చాలా కష్టపడాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలకు చేరగలం.*

దేవాలయాలు - పూజలు 31*

 *దేవాలయాలు - పూజలు 31*

🙏🙏(చివరి భాగము)🙏🙏


సభ్యులకు నమస్కారములు.


పూజాదులను మరియు దేవాలయాలను *యథాలాపంగా చూడకుండా భక్తి, శ్రద్ద,  నియమ, నిష్ఠ, నిబద్ధతతో  మరియు నిర్దేశింపబడిన ఆచారాలను పాటిస్తూ భగవత్ కృపకు పాత్రులు కావడం మానవాళి ప్రథమ కర్తవ్యం*  పూజలు మరియు ఇతర భగవత్ ఆరాధనా విషయాలను, కార్యక్రమాలను ఆషామాషీగా తీసుకోనరాదు. *శ్రీ మదఖిల చరా చరాత్మక వస్తువిస్తారానికి, ప్రాణి కోటికి మూల హేతువైన "ప్రరబ్రహ్మానికి" సృష్ఠి యావత్తు ఎల్లప్పుడూ ఋణపడియే ఉంటుంది*. పూజాదికాల ద్వారా భగవత్ అనుగ్రహం పొందడం విశ్వ కళ్యాణానికి ఒక మార్గం. 


భగవద్ అనుగ్రహం కొరకు హైందవ ధర్మం ఎన్నో మార్గాలు సూచించి  యున్నది. ధర్మ మార్గాలైన పూజలు పునస్కారాలలో  *దినవారి పూజలే గాకుండా అన్ని సందర్భాలకు, అన్ని వర్గాల (స్త్రీ, పురుష, బాల, బాలికలకు) తగిన కార్యక్రమాలు సూచించ బడినవి. ఇందులో కొన్ని మహిళలకు మాత్రమే, కొన్ని పురుషులకు మాత్రమే, మరికొన్ని చిన్న వయసుల వారికి, మరికొన్ని కుటుంబ సహితంగా ఆచరించ దగినవి*  మహిళా పూజల విభాగంలో కొన్ని  *నోములు, వ్రతములు లాంటి పూజలు తమ వ్యక్తి గత క్షేమము, సౌభాగ్య లబ్ధికి మాత్రమే పరిమితం గాకుండా ఆ ప్రభావము తమ సన్నిహితులు అనగా తమ కుటుంబంతో పాటు  సోదర సోదరీమణుల  సంక్షేమానికి గూడా ఉపకరిస్తాయి.*.*తిథి, వార, నక్షత్రాలను బట్టి గూడా వివిధ పూజలు నిర్దేశించ బడినవి* 

*నిత్యోత్సవ*....

*వారోత్సవ*.....

*పక్షోత్సవ*....

*పవిత్రోత్సవ*

*సంవత్సరోత్సవాః*...

భూయాసురితి భవంతో మహాంతో అనుగృహ్ణన్తు...

అని భగవంతుని మనం నిత్యం వేడుకునే 

 *శ్రీ నివాసగద్యం*

మనకందరికీ పరమ ప్రమాణం.


నిర్దేశించబడిన పూజలు కొన్ని దారిద్ర్య నాశనం,  కొన్ని *ఆధ్యాత్మిక ,ఆధిదైవిక*,

*ఆధి భౌతిక తాపత్రయ నివారణార్థంగా*  భగవత్ కార్యాలు రాబోయే ఆపద నివారణలు, మరికొన్ని గ్రహ దోషాలను హరిస్తాయి, మరి కొన్ని ప్రకృతి ప్రకోపాలను, వైపరీత్యాలను శాంతింప జేస్తాయి, ఇంకొన్ని మానవ మరియు విశ్వ కళ్యాణానికి తోడ్పడుతాయి. అవసరమైనప్పుడు పూజా క్రమం *అంగన్యాస కరన్యాస యుక్తంగా కూడా ఉంటుంది*. 


పూజలలో కొన్నిటిని ఉదాహరణగా  తెలుసుకుందాము:- *నోములు*

 కళ్యాణ గౌరీ, ధైర్య గౌరీ, బొమ్మల నోము, పదహారు కుడుముల నోము. *వ్రతాలు* కేదారేశ్వర వ్రతం, గౌరీ వ్రతం,

 శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, అష్టాక్షరీ మహా వ్రతం. *అర్చనలు* కవచ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అమ్మ వార్లకు కుంకుమ అర్చనలు, *యజ్ఞాలు*  తులసి యజ్ఞాలు, స్వాధ్యాయ మహా పుష్కర ప్రయుక్త బ్రహ్మ యజ్ఞము, అధర్వ యజ్ఞము, గో జప మహా యజ్ఞం, 

శ్రీ మద్భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞము, జ్ఞాన గీతా యజ్ఞాలు. *యాగములు* మహా రుద్ర సహిత సహస్ర చండీ యాగము, శ్రీ మహా రుద్ర సహిత చండి, రాజ శ్యామల యాగము, శత చండీ యాగము, ఆయుత శత చండీ యాగము, తిరుమల పుష్ప యాగము. *హోమాలు* సుదర్శన హోమము, మహా మృత్యుంజయ హోమము, నవ గ్రహ నక్షత్ర హోమము, ఆండాళ్ అమ్మ వారికి ఉంజల్ సేవా హోమము. *కల్యాణాలు* శ్రీ సీతా రామ కళ్యాణం, పార్వతీ కళ్యాణం. *పారాయణాదులు* 

లలితా సహస్ర నామ పారాయణం, 

శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ, 

శ్రీ భగవద్ గీతా పారాయణము, సుందరాకాండ పారాయణము, 

నిత్య పారాయణలు కూడా ఉంటాయి. *ఉత్సవాలు* శుక్రవారోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, పార్వేట ఉత్సవం (తిరుమల), తెప్పోత్సవాలు. *మంత్ర జపాలు* శ్రీ గాయత్రీ, నారాయణ, శివ పంచాక్షరీ,

 శ్రీ రామ, శాంతి, దశ మహా విద్యలకు సంబంధించిన మంత్రాలు.ఇలా ఎన్నో.... ఎన్నెన్నో .... అన్నీ మానవ శ్రేయస్సును కోరేవే....*స్థలాభావము వలన ఇంకా వివరాలు అందజేయలేని పరిస్థితి*. 


భగవత్ సంబంధమైన *పూజలు* అను పదంతో బాటు *పునస్కారాలు* అను పదము కూడా విడదీయరానిది. పూజలు అంటే సర్వత్రా విదితమే. *పునస్కారము* అర్థము పరిశీలిస్తే  మానసిక నివేదన, తెలియజేయట అని చెప్పబడినది. పూజల అనంతరం భగవంతుడికి మన అంతరంగం నివేదించవలసి ఉంటుంది. అంతే గాని తీర్థ ప్రసాదాలు స్వీకరణ అనంతరం  అదాట్టుగా దేవాలయం  వెలుపలికి (పూజా స్థలం నుండి)  రాకూడదు. భక్తులకు ఇబ్బందులు,  కోరికలు ఇతరత్రా లేకున్నా సరే, *భగవంతునికి ప్రణామ పూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదములు చెప్పవలసిందే. మనస్సులోని భావమును భగవంతునికి నివేదించకుంటే ఆ పూజా అసంపూర్తిగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు*.


*చివరిగా* భౌతికమైన కొలతలకు, ఋజువులకు అందనిది అయినా దివ్యమైన ప్రశాంతతను ప్రసాదించేది భగవత్ అనుభవము మరియు భగవత్ తత్వము. భగవత్ తత్వమును ఆరాధించాలి, అనుసరించాలి, అనుభవించాలి. పూజలు వేరు తత్వము వేరు అన్న వాదన కూడదు.  పూజలు పునస్కారాలు,  అర్చనలు, అభిషేకాలు, హోమాలు, యజ్ఞాలకు దేవాలయలు,ఆశ్రమాలు, గృహాలు ముఖ్యం.  ఆధ్యాత్మికం జ్ఞానానికి సంబంధము. భక్తి  మార్గం ద్వారా జ్ఞానం, జ్ఞానం  ద్వారా తత్వం సుగమము. ఇన్ని ప్రయత్నాల తదుపరి భగవత్ తత్వ దర్శన మవుతుంది. *అస్తు*


ధన్యవాదములు.

*(స్వస్తి)*

🙏🙏🙏

దేవాలయాలు పూజలు 30*

 *దేవాలయాలు పూజలు 30*




దేవాలయపు సాయం సంధ్యా పూజలలో దిన వారి పూజాధికాలతో బాటు చివరి అంకంలో మంగళ నీరాజనం, మంత్ర పుష్పం, ఛత్రం, చామరం, నృత్యం, వాయిద్యం, సంగీతం, కీర్తనం, రాత్రి సేవలలో అనంత భోగ శయ్యాసనం మరియు పవళింపు సేవలతో ఆ దినపు పూజా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. 


గత వ్యాసంలో మంగళ నీరాజనం మరియు మంత్ర పుష్పం వివరాలు తెలుసుకున్నాము.


ఇతర సేవలలో ఛత్రం:

 ఛత్రం అనగా ఆచ్చాదన = రక్షణ = పై కప్పు. ఇంకా సాధారణంగా చెప్పాలంటే *గొడుగు*. 

*చామరం* అంటే చల్లని గాలికై వీచునది = విసన కఱ్ఱ. పరమాత్మ సేద తీరుటకు విసన కఱ్ఱతో నెమ్మదిగా నిశ్శబ్దంగా గాలి అందించడం.


 ఇన్ని కార్యక్రమాలను అర్చక స్వాముల వారు *ఛత్రం ఆచ్చదాయామి, ఛామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావ్య యామి* అంటూ రాగ యుక్తంగా శుశ్రూషలు చేస్తూ స్వామి వారికి పవళింపు సేవతో ఆ రోజు దేవాలయ పూజలు సమాప్తం అంటే పరిపూర్ణం చేస్తారు. రాత్రి సేవలన్నీ దాదాపు ఏకాంత సేవలు, ఏకాంత ఆరాధనలో భాగాలు. 


అవుతే, మానవ మరియు విశ్వ కళ్యాణానికి హిందూ మత సంప్రదాయం దేవాలయ పూజలతో సరిపెట్టలేదు. మరిన్ని పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞ యాగాదుల సమాచారము గూడా తెలుసుకుందాము. అందులో కొన్ని. అర్చనలు, వ్రతాలు, ప్రదోష పూజలు, నవగ్రహ హవనాలు, మండప పూజలు, ఉత్సవ మూర్తులకు అభిషేకాలు, మూల మంత్ర జపాలు, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, కోటి గాయత్రి మహా యాగాలు, పూర్ణాహుతి , ఆరణి మథన పూర్వక అధర్వణ వేద అగ్ని ప్రతిష్టలు, సర్వ సౌభాగ్య దేవి గీతా జ్ఞాన యజ్ఞాలు, సామూహిక హోమాలు, దేవ ఋషి ప్రోక్త మహిమాన్విత స్తోత్రములు, విశేష స్తుతులు, వివిధ దేవతా అష్టోత్తరములు, త్రిశతి మరియు సహస్ర నామ పారాయణలు, యజుర్వేద ఋగ్వేద నిత్య సంధ్యా వందనములు, స్వర చిహ్నిత వేద సూక్తములు, యజ్ఞాలు, క్రతువులు, హోమాలు పవిత్రోత్సవాలు బ్రహ్మోత్సవాలు ఇంకా ఎన్నెన్నో. ...


*గమనిక* పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు ఇత్యాది భగవత్ సేవలు *మంత్రాది లోప భూయిష్టంగా* చేయబడితే పూజా ఫలాలు, హవిస్సులు అసురుల పాలవుతాయి. అందుకే పెద్దలన్నారు *తస్మాత్ శాస్త్ర ప్రమాణం, వేద ప్రమాణం*.


సాధారణంగా చూస్తూ ఉంటాము పంచేంద్రియాలు ఎడా పెడా మాలిన్యాలతో నింపేసుకోవడం అంటే అనరానివి అనడం, చూడరానివి చూడడం, చెయ్యరానివి చెయ్యడం, వినరానివి వినడం.ఇన్ని చేసి, చేస్తూ కాస్త సంధ్యావందనం, ఒక సారి దేవాలయం వెళ్ళడం ఆ తరవాత హమ్మయ్య అనుకుని ఏదో సిద్ధి పొందినట్లు భ్రమించడం. ఈ తరం ఎప్పుడు మేల్కొనేది. *మళ్ళీ ఆ పంచేంద్రియాలతోనే యధా శక్తి పాపాలను తొలగించు కోవాల్సి ఉంటుంది*. భగవత్ స్వరూపాన్ని వీక్షించండి, ప్రవచనాలను వినండి, చేతులారా భగవత్ కార్యాలు చేయండి, నోరారా భగవన్నామ కీర్తన చేయండి, నాలుగడుగులు వేసి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి. 


*ఇన్ని రకాల భగవత్ కార్యాలు చేసి పరిశుద్ధులము కాకపోతే, మానవులు చేసే దుష్కకర్మలకు ఒక్కొక్క ఇంద్రియాన్ని ప్రక్షాళన చేసేందుకు ఒక్కొక్క జన్మ ఎత్తవలసిందే*. 


ఏ మత సిద్ధంతమైనా, ఏ సంప్రదాయమైనా ఇదే చెబుతుంది.


ధన్యవాదములు.

*(సశేషం)*

6. " మహా దర్శనము

 6. " మహా దర్శనము " ---ఆరవ భాగము--అదీ దోహదమేనా ?


అదీ దోహదమేనా ? 


         ఆలంబినీ దేవి ఇప్పుడు , పగలూ రాత్రీ యనక , మడి , మైల అను ఆలోచనయే లేక మంత్ర జపము చేస్తున్నది . మంత్రపు ప్రభావమేమో , ఆమెకు దేనిని చూసిననూ ఒక తేజోరాశి వలె కాన్పించును . దానితో పాటూ ఇంకో విశేషమేమనిన , ఎవరో ఒకరు , ఎల్లపుడూ తనతో పాటే  ఉన్నట్టనిపిస్తుంది . అదెవరు అని తెలుసుకోవలెనన్న కుతూహలము ఆమెకు అప్పుడప్పుడు కలుగుతుంది . అయితే ఆ కుతూహలము ప్రయత్నముగా మారులోపే మాఘ మాసపు తేలికపాటి తెల్ల మేఘము వలె పుట్టగానే కరగిపోతుంది . ఆ భావనయే రాత్రి పూట పడుకొని యున్నపుడు ఒక చిన్న శిశువు ఒడిలో పడుకొని యున్నట్లు ఒక భావనను కలిగిస్తుంది . వెంటనే లేచి , శిశువు ఒడిలో లేనిది చూసి అటూనిటూ చూచుట సామాన్యమైపోయినది . అగ్ని పరిచర్య చేస్తూ మూఢములను ఇస్తున్నపుడైతే సందేహము లేకుండా ఎవరో అమ్మా అంటూ తన చెంగు పట్టుకొని తిరుగాడినట్లనిపిస్తుంది . పొద్దున్నే లేచి మడి కట్టుకొని వచ్చి చల్ల చిలుకుటకు కూర్చున్నపుడు " అమ్మా , ఆ తాజా వెన్న ఇక్కడ కొంచమియ్యమ్మా ’ అని ఎవరో అడిగినట్లు భ్రమ చెంది వెన్నముంతలో నుండీ ఇంత దేవుకొని ఇచ్చుటకు తిరిగి , ఎవరూ లేనిది చూసి ఇదంతా నా భ్రాంతి అనుకుంటుంది . మొత్తానికి ఆమెకు సర్వమూ భర్తీ అయినట్లు , సర్వమూ పూర్ణముగా నున్నట్లు , ఎక్కడ చూసినా అంతా సమృద్ధిగా నిండియున్నట్లు అనిపిస్తుంది . 


         ఇలాగే ఆశ్వయుజ మాసము గడచినది . కార్తీకము ప్రవేశించినది . కార్తీకముతోనే ఆలంబినీ దేవి  మాతృత్వపు దినములూ దగ్గరపడినాయి . ఇప్పుడు గర్భములో పిండము అటూ ఇటూ కదలుటయే కాదు , తాను ఒక్కోసారి మనసులో మంత్రాన్ని మరిస్తే , తేనుపు వచ్చినదానికన్నా స్పష్టమైన ధ్వనితో లోపలినుండీ పూర్ణమదః అని మంత్ర జపము చేసినట్లు వినిపిస్తుంది . వృద్దులై , పది పన్నెండుగురు సంతానమును కన్న వారిని ఇదేమిటి ? అని అడిగినది . వారు నవ్వుతూ , ’ తల్లీ , ఆలంబీ ! ఇదేమిటో విచిత్రమును చెప్పుతున్నావు . మేము పెద్దలు చెప్పగా విన్నాము , మహాపురుషులు గర్భమునకు వచ్చినపుడు ఇలాగవుతుందని . కానీ మాకు ఆ అనుభవము లేదు . నువ్వు చెప్పేది వింటుంటే  వెనకటి పెద్దల మాట గుర్తుకు వస్తున్నది . ఏమైనా కానీ , నువ్వు కోపము చేసుకోను అంటే చెబుతాను , నీ కడుపు చూస్తే నీకు కవల పిలలు పుడతారేమో అనిపిస్తున్నది . ఏదేమైనా , దేవుడి దయ వలన గింజ వేరే , పొట్టు వేరే అయ్యి , మీ తల్లీ బిడ్డలు సుఖముగా ఉండుటను చూస్తే అదే మా భాగ్యము .’  అంటారు . 


        ఆలంబినీ దేవి తల్లికి , " ఈ పెరిగిన కడుపు ఇంత పెద్దగా కనిపిస్తున్నదే ? ఇందులో ఇంత పెద్ద బిడ్డ ఉన్నదా ? ఆలంబిని ఆ బిడ్డను ప్రసవించుట ఎలాగో ? " అని ఒక చిన్న కలవరము . " అయితేనేమి ? ఆమె దినమూ శ్రద్ధగా సేవ చేస్తున్న యజ్ఞేశ్వరుడు ఆమె చేతిని విడువడు " అని తర్కాతీతమైన ఒక దృఢవిశ్వాసము .


        ఒక దినము దేవరాతుడు నడిమింట్లో ఏదో గ్రంధపరిశీలనలో యున్నాడు . హఠాత్తుగా కార్తీక శుద్ధ సప్తమి గుర్తుకు వచ్చినది . ఆ దినపు విశేషమేమి యని ఎంత ఆలోచించినా గుర్తుకు రాదు . చివరికి దీర్ఘ కాలము ఆలోచించిన పిమ్మట , యాజ్ఞవల్క్యుడు వెనుక చెప్పినది జ్ఞాపకమైనది . చివాలున లేచి భార్యను వెతుక్కుంటూ వెళ్ళినాడు . ఆమెను చూచి , " మర్నాడు సప్తమీ గురువారము , ఆ దినము నువ్వు తల్లివవుతావు " అన్నాడు . ఆమె సహజమైన సిగ్గుతో తల వంచుకున్నది . దేవరాతుడు లజ్జా సుందరియైన ఆ పత్నిని సంభావిస్తూ " ఆలంబీ , నువ్వు నాకొక వరమును ఇవ్వాలి " అని ప్రార్థించినాడు . 


        ఆమె నీరవముగా తలయెత్తి చూసి , ’ మీరు నన్ను ప్రార్థించుటయా ? ’ అన్న భక్తి భావముతో కూడిన కటాక్షమును అతని వైపుకు సారించి ,’ ఏమని ? ’ అని అడిగినది . 


        నాథుడు ఆడవారి కన్న ఎక్కువ సిగ్గు పడుతూ , " నువ్వు కన్న బిడ్డకు మేధా జననము కావలెను , అది కూడా గర్భ నాళ ఛేదనము కన్నా ముందుగనే చేయుటకు అవకాశము నివ్వవలెను . " అన్నాడు . 


        పడతి , " మీరు అడుగుట ఎంత బాగున్నది ? మంత్రసానిని ఎలా తప్పించి మీకు ఆ అవకాశము నిచ్చెదను ? సాధ్యమేనా ? మీరే చెప్పండి ? " అన్నది . ఆ మాటలో , తాను ఒప్పుకున్నా అది జరుగుట సాధ్యము కాదు అను నిర్ధారణ నిండి ఉండింది  . 


         ఆచార్యుడు భార్యను పిలుచుకొని పోయి నడిమింటికి వచ్చినాడు . అక్కడ తానొక వేత్రాసనము నందు కూర్చొని , పక్కనే ఇంకొక వేత్రాసనమును లాగి వేసి , భర్యను దానిపై బలవంతముగా కూర్చోబెట్టి ’ విను ’ అని చెప్పనారంభించినాడు . 


          " ఈ జగత్తు అగ్నిష్టోమాత్మకమైనది . దీనిలో నున్న ప్రాణులను ఖనిజములు  , ఉద్భిజ్జములు  , అండజములు , జరాయుజములు అని నాలుగు విధములుగా వర్గీకరించిననూ , వాస్తవమునకు అన్నీ జరాయుజములే ! అనగా , ఒంటి పొర సంచీ లో పెరిగేవే ! మిగిలిన మూడూ గర్భమును వదలి వచ్చిన తరువాత పెరిగేవి  , కానీ జరాయుజము మాత్రము గర్భములో పెరిగి బయటికి వచ్చును . తండ్రి బీజమును తల్లి తన గర్భములో ఉంచి , దానిని తన అంగము కన్నా ఎక్కువగా అభిమానించి తన రక్త మాంసములను దానికిచ్చి పోషించి , సర్వావయవ విశిష్టముగా తల్లిదండ్రుల వలెనే ఉండు ప్రాణిగా చేయును . నాళఛ్చేదనము వరకూ ఆ బిడ్డకు వ్యక్తిత్వము రాదు . అలాగ ఆ బిడ్డ , ప్రత్యేక వ్యక్తి యగుటకన్నా ముందే తండ్రియైన వాడు వచ్చి ఆ శిశువు కుడి భుజమును ముట్టుకొని  , విహితములైన మంత్రోచ్చారణ చేసినచో ఆ శిశువు మనస్సూ , బుద్ధీ తండ్రి మనో బుద్ధుల స్థాయికి వస్తాయి . అప్పటినుండి , పెరిగే ఆ శిశువుతో పాటే అవి కూడాపెరుగును . ఇటుల , దోహదము చేయగా , ’  పెరిగిన చెట్టు యొక్క  పెరుగుదల అనే ఫలమును పొందుట ’ వంటిదే ఇది కూడా ! కాబట్టి , నా వంశపు వృద్ధిని లక్ష్యముగా పెట్టుకొని , వంశ భూషణుడైన కొడుకును ఇచ్చు తల్లివైన నీ నుండీ ఈ వరమును కోరినాను . " 


" సరియే , కుడి భుజము అంటిరి కదా ! అదేమి ? " 


         " దేవతలు దేహము లోనికి ప్రవేశించునది కుడి భుజము నుండియే ! ఈ దేహము యజ్ఞ మహా యజ్ఞముల వలన బ్రాహ్మణమగును . అటుల జరిగినపుడు దేహములో ఎక్కడంటే అక్కడ దేవతలను చూడ వచ్చు . అలాగ దేహము దేవాయతనమగు వరకూ ఆవాహన చేయవలసిన ఆవశ్యకత ఉంటుంది . ఆ ఆవాహన కుడి భుజమును ముట్టుకొనియే చేయవలెను . అది యెటుల అను దానిని నీకు చూడవలెనన్న కుతూహలము ఉంటే , మనము అష్టకా శ్రాద్ధమును చేస్తాము కదా ! అప్పుడు గుర్తు చేయి . విశ్వేదేవతలు వచ్చి బ్రాహ్మణులలో ఉండుటనూ , కార్యాంతములో వదలి , లేచి వెళ్ళిపోవుటనూ చూపించెదను . " 


" ఈ కర్మను చేయకుండిన ఏమగును ? " 


          " మన బిడ్డ మన వంశపు విశిష్ట లక్షణములను పొందుటకు బదులుగా తన పూర్వ వాసనలకు అనుగుణముగా పెరిగి , తన వ్యక్తిత్వమును దృఢము చేసుకొనును . ఇప్పుడు నేను ఈ కర్మను చేయలేదనుకో , నీ కొడుకు మన వంశమునకు తగ్గట్టు కర్మఠుడై పెరుగుటకు బదులుగా ఇంకేమో కావచ్చును . మేము రాజభవనము నకు వెళ్ళుట తెలుసు కదా , అయితే అది రాజానుగ్రహమును యాచించుటకు కాదు , రాజును అనుగ్రహించుటకు . అప్పుడు ఇటుల కాకుండా , ఇంకెందుకో కావచ్చును . కాబట్టి అట్టి భిన్న ప్రకృతిని చూడవలసి వచ్చుట ఇష్టము లేకనే నిన్ను కోరినది . నువ్వు ఒప్పుకొనియే తీరవలెను . నీ కొడుకు తపోలోకము నుండీ వచ్చినవాడు . అదీకాక, నీచేత పగలూ రాత్రీ ’ పూర్ణ మదః ’  అను మంత్ర జపమును చేయిస్తూ పూర్ణ ధ్యానములో నున్నవాడు . వాడికి మేధా జననము కాకున్న , వాడి కర్మశ్రద్ధ  సడలిపోయి పుట్టునపుడే బ్రహ్మజ్ఞుడై పుట్టుట వలన అటులనే పెరిగి సన్యాసి కావచ్చును . అటుల కారాదు . కర్మఠుల వంశములో కర్మ లోపము కాకూడదని ఈ ప్రార్థన . " 


       ఆలంబిని ఎన్నడూ , ఏ రీతిలోనూ భర్త మాటకు ప్రతి మాట చెప్పి ఎరుగదు. ఇప్పుడు అతడు స్త్రీ సహజమైన లజ్జను త్యజించి వర్తించవలెను అని ప్రార్థన చేయుచున్నాడు . ఊ అంటే తన స్త్రీత్వము అపరాధము అంటుంది . ఊహూ అంటే పత్నీత్వమునకు ద్రోహమైనట్టవుతుంది . ఏమి చేయుట ? 


        ఆమె ఒక ఘడియ ఆలోచించినది . " భర్త చెప్పుతున్నది సరియైనదే . భర్త ఇంటి సాంప్రదాయము  కర్మకు పెట్టింది పేరు . పది మందే శిష్యులను ఇంటిలో ఉంచుకొని అధ్యాపనాదులను జరిపిస్తున్ననూ ఆచార్యుడు అను ప్రాశస్త్యానికి పాత్రమైనది . దేశ విదేశములలో ఆచార్య దేవరాతుని ఆధ్వర్యమంటే , బ్రహ్మ మొదలగు మిగిలిన ఋత్విజులందరూ ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఆర్తిజ్యమును వహించుటనూ , ఇక యాగము చేయించు యజమానులైతే , ’ ఆచార్యులు ఆధ్వర్యము వహిస్తే తమ ఇష్ట సిద్ధి ప్రాప్తించినట్లే ’  అని విశ్వాసముతో సంతోషించుటనూ తాను కళ్ళారా చూచినది . ఇప్పుడు అతడే ప్రార్థిస్తున్నపుడు కాదని ఎలాగ అనుట ? తనకు లజ్జతో ప్రాణమే పోయినట్లైననూ చింతలేదు . భర్త ఇంటి పేరు ప్రఖ్యాతులు కాపాడియే తీరవలెను . " అన్న దృఢ నిశ్చయమునకు వచ్చినది . " అలాగే కానివ్వండి  , కానీ మంత్రసాని ఉంటుంది కదా ? " 


       దేవరాతుడు అన్నాడు , " నువ్వు ఒప్పుకున్నావు , ఇక మంత్రసాని సంగతి వదిలేయి . ఈ దినము ఇంకా చతుర్థి . ఇంకా మూడు దినములుంది . అంతలోపల ఆమెకు కర్మ స్వరూపమును తెలియజెప్పి , జననమగునపుడు నువ్వొక ఘడియ బయటికి రావలెను అని చెప్పి ఉంచుదాము . "


       ఆలంబినికి అది అంత సులభ సాధ్యముగా అగుపించలేదు . కానీ దానికోసము తానెందుకు వెనుకాడాలి ? ఏదైనా సరే , అది వారికే కట్టబెడితే సరి , అని ’ ఆ పనేదో మీరే చేసుకోవలెను , నావల్ల సాధ్యము కాదు ’ అన్నది . 


        భార్యతో అన్నాడు , " చూడు ,మరచే పోయాను ,  మీ అమ్మగారు తొలిచూలు కానుపు అని అప్పుడే వచ్చియున్నారు . వారికి కర్మ స్వరూపమును , దాని ఫలమునూ తెలియజేయి , మిగతాది ఆమెయే చూచుకొనగలరు  " 


ఆలంబినికి ఈ మాట నచ్చింది. " సరే , అటులే " అన్నది . మొగుడూ పెళ్ళాలిద్దరికీ మోస్తున్న భారమేదో దింపినట్టైంది . 


         ఆలంబినికి ఏదో జ్ఞాపకము వచ్చి , వెళుతున్నది తిరిగి నిలచి , భర్తనడిగింది , " జననమైన తరువాత ’ భద్రం కర్ణేభిః " అనే మంత్రమును ఉపదేశము చేస్తాను అంటిరి కదా , దానివలన ఈ కార్యము జరగదా ? " 


       దేవరాతుడు భార్యకు గుర్తుందన్న తృప్తితో నవ్వుతూ , " నేను చెప్పిన కర్మ , బీజమంత్రము వంటిది . జపాదులు దానికి ఎరువు వంటివి మాత్రమే . " అన్నాడు . 


సరేనంటూ ఆలంబిని వెళ్ళిపోయింది .

దధి వామన స్తోత్రం



దధి వామన స్తోత్రం 


హేమాద్రి శిఖరాకారం శుద్ధ స్ఫటిక సన్నిభం

పూర్ణ చంద్రనిభం దేవం ద్విభుజం స్మరేత్ || 1 ||


పద్మాసనస్థం దేవేశం చంద్ర మండల మధ్యగం

జ్వలత్ కాలానల ప్రఖ్యం తటిత్కోటి సమ ప్రభమ్ || 2 ||


సూర్య కోటి ప్రతీకాశం చంద్ర కోటి సుశీతలం

చంద్ర మండల మధ్యస్థం విష్ణుమవ్యయ మచ్యుతమ్ || 3 ||


శ్రీవత్స కౌస్తుభోరస్కం దివ్య రత్న విభూషితం

పీతాంబర ముదారాంగం వనమాలా విభూషితమ్ || 4 ||


సుందరం పుండరీకాక్షం కిరీటేన విరాజితం

షోడశ స్త్రీ పరీవృతం అప్సరో గణ సేవితమ్ || 5 ||


సనకాది మునిగణైః స్తూయమానం సమన్తతః

ఋక్యజుస్సామాధర్వైర్గీయమానం జనార్దనమ్ || 6 ||


చతుర్ముఖాద్యైః దేవేశైః స్తోత్రారాధన తత్పరైః

త్ర్యంబకో మహాదేవో నృత్యతే యస్య సన్నిధౌ || 7 ||


దధి మిశ్రాన్న కబలం రుక్మపాత్రం చ దక్షిణే

కరే తు చింతయేద్వామే పీయూషమమలం సుధీః || 8 ||


సాధకానాం ప్రయచ్ఛంతం అన్న పాన మనుత్తమం

బ్రాహ్మీ ముహూర్తేచోత్థాయ ధ్యాయేద్దేవ మధోక్షజమ్ || 9 ||


అతి సువిమల గాత్రం రుక్మ పాత్రస్థమన్నం

సులలిత దధి ఖండం పాణినా దక్షిణేన

కలశ మమృత పూర్ణం వామ హస్తే దధానం

తరతి సకల దుఃఖాద్వామనం భావయేద్యః || 10 ||


క్షీర మన్న మన్నదాతా లభేదన్నాద యేవ చ

పురస్తా దన్న మాప్నోతి పునరావృతి వర్జితమ్

ఆయురారోగ్య మైశ్వర్యం లభతే చాన్న సంపదః || 11 ||


ఇదం స్తోత్రం పటేద్యస్తు ప్రాతః కాలే ద్విజోత్తమః

అక్లేశాదన్నసిద్ధ్యర్థం జ్ఞాన సిద్ధ్యర్థమేవ చ || 12 ||


అభ్ర శ్శ్యామ శుభ్ర యజ్ఞోపవీతీ సత్కౌపీనః పీత కృష్ణాజిన శ్రీః

ఛత్రీ దండీ పుండరీకాయతాక్షః పాయాద్దేవో వామనో బ్రహ్మచారీ || 13 ||


అజిన దండ కమండలు మేఖలా రుచిర పావన వామన మూర్తయే

మిత జగత్త్రితయాయ జితారయే నిగమ వాక్పటవే వటవే నమః || 14 ||


శ్రీ భూమి సహితం దివ్యం ముక్తామణి విభూషితం

నమామి వామనం విష్ణుం భుక్తి ముక్తి ఫల ప్రదమ్ || 15 ||

వామనో బుద్ధి దాతా చ ద్రవ్యస్థో వామనః స్మృతః

వామన స్తారకోభాభ్యాం వామనాయ నమో నమః || 16 ||


ఇతి శ్రీ దధి వామన స్తోత్రం సంపూర్ణం🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷

మలేరియా జ్వరము

 మలేరియా జ్వరమునకు తులసితో చికిత్స -


      మలేరియా జ్వరం వర్షాకాలం నందు విపరీతంగా వ్యాప్తి చెందును. ఇది ఇప్పుడు సర్వసాధారణం అయినది. దీనికి ఇతర వైద్యులు "క్యూనైన్ "మందుగా వాడటం జరుగుతుంది. దీనిచే జ్వరం తగ్గును. కానీ తలనొప్పి , చెవులలో హోరుమను శబ్దం , తలతిరుగుట , చెవుడు మొదలుకొని హృదయసంబంధ కాంప్లికేషన్స్ అగుపిస్తున్నాయి. మన ఆయుర్వేద వైద్యం నందు తులసితో ఎటువంటి సైడ్ ఎఫక్ట్స్ లేకుండా ఈ జ్వరాన్ని సులభంగా నివారించవచ్చు. 


  నివారణోపాయాలు - 


 * 7 మిరియాలు , 7 తులసి ఆకులు కలిపి నమిలి మ్రింగుచున్న మలేరియా జ్వరం 3 రోజులలో హరించును . 


 * మానిపసుపు , పిప్పిళ్ళు , వెల్లుల్లి , జీలకర్ర , శొంఠి , తులసి , నారింజ పిందెలు , వావిలి వ్రేళ్ళు , ఆకుపత్రి వీటిని సమాన భాగాలుగా కలిపి చూర్ణించి పూటకు అరతులం వంతున ఇచ్చుచున్న చలిజ్వరములు తగ్గును. 


 * తులసి ఆకులు 60 గ్రా , కొద్దిగా మందార పుష్పదళములు , కొద్దిగా ఉమ్మెత్త పుష్పదళములు , మిరియాలు 10 గ్రా , కొద్దిగా నీరువేసి మర్దించి బఠాణి గింజంత పరిమాణంతో మాత్రలు చేసి చలిజ్వరం వచ్చుటకు గంట ముందుగా రెండు మాత్రలు తీసుకున్న చలిజ్వరం రాకుండానే పోవును.అలాగే రొజు మార్చి రొజు వచ్చు మలేరియా జ్వరం లందు మంచి ఫలితాన్ని ఇచ్చును . 


 * మలేరియా జ్వరం మొండిగా ప్రతిసంవత్సరం వస్తూనే ఉండిన తులసీదళములు , మిరియాలు నీటిలో వేసి ఉడికించిన కషాయములో కొద్దిగా బెల్లం , నిమ్మరసం కలిపి వేడిగా ఉన్నప్పుడే కాఫీ వలే తాగి రగ్గు కప్పుకొని పడుకోవలెను . ఇలా మూడు గంటలకు ఒకమారు చేయుచుండిన మంచి ఫలితం ఉండును. 


 * తులసి వ్రేళ్ళ కాషాయం త్రాపిన బాగుగా చెమటపట్టి చలిజ్వరం వెంటనే తగ్గును. 


 * మలేరియా జ్వరం ప్రతిసంవత్సరం భాదించుచున్న వ్యక్తికీ తులసిరసం , పుదీనా రసం , అల్లం రసం ఒక్కొక్కటి 5 గ్రాముల వంతున కలిపి తాగుచున్న మంచి ఫలితం కనిపించును.


  గమనిక - 


      తులసి చెట్టు వైద్యం కొరకు కుండీలలో ఇంట్లో పెంచుకొనుట చాలా మంచిది.


  నా అనుభవం - 


         ప్రతిరోజు 2 స్పూన్స్ తులసి రసం ఇచ్చి టాబ్లెట్ లేకుండా రక్తపోటు 170 నుంచి 130 కి తీసుకొనివచ్చాను కేవలం 2 వారాలలోనే ఇలా కొంతకాలం తులసిరసం వాడటం వలన రక్తపోటు పూర్తిగా పోతుంది. 


      మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

పంచాంగం 05.09.2024

 ఈ రోజు పంచాంగం 05.09.2024 Thursday.


స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస శుక్ల పక్ష ద్వితీయ తిధి బృహస్పతి వాసర: ఉత్తరఫల్గుని నక్షత్రం శుభ యోగ: కౌలవ తదుపరి టైతుల కరణం. ఇది ఈరోజు పంచాంగం.


విదియ మధ్యాహ్నం 12:21 వరకు

ఉత్తరఫల్గుని ఉదయం 06:13 వరకు. 


సూర్యోదయం : 06:06

సూర్యాస్తమయం : 06:23


వర్జ్యం : మధ్యాహ్నం 03:44 నుండి సాయంత్రం 05:33వరకు.


దుర్ముహూర్తం : పగలు 10:12 నుండి 11:01 వరకు తిరిగి మధ్యాహ్నం 03:06 నుండి 03:56 వరకు.


అమృతఘడియలు : రాత్రి 02:36 నుండి 04:25 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.


యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.



శుభోదయ:, నమస్కార:

ప్రపంచసృష్టికి

 👆శ్లోకం 

ఉద్భవ క్షోభణో దేవః.                        

శ్రీగర్భః పరమేశ్వరః|.                         

కరణం కారణం కర్తా                         

వికర్తా గహనో గుహః||.                     


ప్రతిపదార్థ:


ఉద్బవ: - ప్రపంచసృష్టికి ఉపాదానమైనవాడు.


క్షోభణ: - సృష్టికాలమందు కల్లోలము కల్గించువాడు.


దేవ: - క్రీడించువాడు.


శ్రీ గర్భ: - సకల ఐశ్వర్యములు తనయందే గలవాడు.


పరమేశ్వర: - ఉత్కృష్ట మైనవాడు.


కరణమ్ - జగదుత్పత్తికి సాధనము అయినవాడు.


కారణమ్ - జగత్తునకు కారణమైనవాడు.


కర్తా - సమస్త కార్యములకు కర్తయైనవాడు.


వికర్తా - విచిత్రమైన ప్రపంచమును రచించినవాడు.


గహన: - గ్రహించ శక్యముగానివాడు.


గుహ: - వ్యక్తము కానివాడు. కప్పబడినవాడు.