13, జూన్ 2023, మంగళవారం

సుమంగళి కోరిన వైధవ్యం:*

 

   *సుమంగళి కోరిన వైధవ్యం:*

               ➖➖➖✍️


```ఒక నాడు పరమాచార్య స్వామి వారి దగ్గరకు ఓవృద్ధ సువాసిని వచ్చి,స్వామి వారిని ఓ విచిత్రమైన కోరిక కోరింది.


"స్వామీ ఒకవేళ నాభర్తకు ఏదైనా జరగ రానిది జరిగి ఆయువుచెల్లితే, అదినేను ఉండగానే  జరిగేలా    ఆశీర్వదిoచoడి. నా కన్నా ముoదు,      నా కళ్ళ ముందు ఆయన వెళ్ళిపోయేటట్టు     అనుగ్రహించండి" అని ఆర్తితో వేడుకుంది.


వెంటనే మహాస్వామివారు చిరునవ్వుతో "అలాగే అవుగాక" అని           దీవించి పంపారు. కానీ అక్కడ ఉన్నవారందరూ ఈ మాటలను విని నిశ్చేష్టులైపోయారు.


ఆమె అలా వెళ్ళిన వెంటనే స్వామివారి తో    “స్వామీ!    పెళ్ళి కాక ముందు చేసే నోములూ వ్రతాలు మంచిభర్త రావాలనీ పెళ్ళైన తరువాతచేసే సమస్తపుణ్యకర్మ  లూ        భర్త ఆయురారోగ్యాలతో ఉండి ఆయన చేతుల్లో    తను     పుణ్య స్త్రీ గా పోవాలనీ కదా!     మరి    ఈవిడ ఇoత విపరీతమైన కోరిక కోరడమేమిటి? మీరు కూడా అలాగే అని దీవించడం....”అని ఆశ్చర్యoగా అడిగారు.

   

అందుకు స్వామివారు చిరునవ్వుతో... "వారిది అన్యోన్య దాంపత్యం! భర్తమీద వల్లమాలిన ప్రేమ ఆవిడకి.    ప్రారబ్ధమో లేక శాపమో వారికి పిల్లలు లేరు. వృద్ధా ప్యం మరో బాల్యం అంటారు కదా!    ఈ వృద్ధాప్యంలో   ఆ భర్తకు  ఈవిడే అన్నీ. ఆయన్ని  చoటి పిల్లాడిలా  సాకుతోంది. పైగా  ఆయనకు    జిహ్వచాపల్యo  కాస్తఎక్కువ. మరి ఆవిడే ముందు కాలoచేస్తే ఆయన్నెవరు  చూసుకుoటారు,  ఆయన అవసరాలను పట్టిoచుకునేదేవరు  అని బెoగ ఆ తల్లికి!      అందుకే ఆ కోరరాని కోరిక కోరింది" అని సెలవిచ్చారు.


భర్తకోసం పద్నాలుగేళ్ళు   కారడవులను సైతం లెక్కచేయక  ఆయన తోడిదే    నా స్వర్గం అని సమస్త భోగాలను  త్యజించి ఆయన్ని అనుసరిoచిన సుకుమారియైన రాకుమారి మన సీతమ్మ తల్లి. ఇప్పటికీ అటువంటి    ఎoదరో    మహాతల్లులకు సీతమ్మ తల్లి ఆదర్శం.!


  భర్తే తన దైవoగా భావిoచి   "శ్రీవారు" అని పిలుస్తూ        గృహస్థాశ్రమంలోనే తరిoచిన అనేక మహాతల్లులు నడయాడిన నేల ఇది!వారoదరినీ సీతమ్మవారి అoశగాగాక మరెలా పరిగణిoచగలo?


అందుకే స్వామి వారికి అంతటి అపార కరుణ ఆ తల్లిపై...```



అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య

వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్

ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.✍️

https://t.me/paramacharyaVaibhavam

                   

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

వాల్మీకి రామాయణం: 29 వ భాగం:

 29.

రామాయణం...

ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది...


            వాల్మీకి రామాయణం:

                  29 వ  భాగం:

                  ➖➖➖✍️



అలా లోపలికి వచ్చిన రాముడిని చూసిన కౌసల్యాదేవి పరిగెత్తుకుంటూ రాముడి దగ్గరికి వెళ్ళి "నాయనా రామా! నీకు యువరాజ పట్టాభిషేకం జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, మన వంశంలో పుట్టిన ఎందరో గొప్పవాళ్ళలాగ నువ్వు కూడా కీర్తిని సంపాదించు" అని ఒక బంగారు ఆసనాన్ని చూపించి రాముడిని కుర్చోమంది.


అప్పుడు రాముడు ఆ ఆసనాన్ని ఒకసారి ముట్టుకొని కౌసల్యతో… 

"అమ్మా! నేను కూర్చోడానికి సమయం లేదు, నాన్నగారు భరతుడికి పట్టాభిషేకం చేస్తానన్నారు, నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమన్నారు. అందుకని నేను దండకారణ్యానికి వెళ్ళిపోతున్నాను. నేను దర్భలతో చేసినటువంటి ఆసనముల మీద కూర్చోవాలి కాని, ఇటువంటి వాటి మీద కాదు. నీ ఆశీర్వాదం తీసుకొని వెళదామని వచ్చాను" అని రాముడన్నాడు.


ఈ మాటలు విన్న కౌసల్య నిట్టనిలువునా కింద పడిపోయింది.

తరువాత ఆమెకి కొంత సపర్యలు చేశాక బాహ్య స్మృతిని పొంది ఇలా అంది…  "రామా, నువ్వు చెప్పిన మాటలు విన్నాక నాకు అసలు పిల్లలు పుట్టకుండా ఉండి ఉంటే బాగుండు అనిపిస్తోంది. పిల్లలు లేకపోతే నన్ను అందరూ గొడ్రాలు అంటారు, అంతకుమించి నాకు వేరే బాధ ఉండదు. కాని ఇవ్వాళ నేను పొందుతున్న బాధ సామాన్యమైనది కాదు. రామా, నీకొక నిజం చెప్తాను,


న ద్ఋష్ట పూర్వం కల్యాణం సుఖం వా పతి పౌరుషే |

అపి పుత్రే విపశ్యేయం ఇతి రామ ఆస్థితం మయా ||


నేను దశరథుడికి భార్యగా ఉన్నప్పుడు ఏ మంగళకరమైన ఆనందాన్ని పొందలేదు. ఎందుకంటే ఆయన కైకేయికి వశుడై ఉన్నాడు.    కైకేయి మనస్సు నొచ్చుకుంటుందని ఒక జేష్ఠ భార్యకి ఇవ్వవలసిన మర్యాద నాకు ఇవ్వకుండా, కైకేయి యొక్క దాసీజనంతో సమానంగా చూశాడు. ఇవ్వాళ నీకు యుక్త వయస్సులో పట్టాభిషేకం జరిగి యువరాజుగా నిలబడితే, నిన్ను చూసి, నీ పరిపాలన చూసి కనీసం రాజమాతగా ఆనందం అనుభవించచ్చు అని అనుకున్నాను. కాని ఇవ్వాళ నాకు ఆ ఆనందం కూడా లేకుండాపోయింది. ఊసర క్షేత్రంలో విత్తనం వేస్తే అవి మొలకెత్తకుండా ఎలా నిష్ప్రయోజనం అవుతాయో, అలా నేను చేసిన వ్రతాలు, పూజలు నిష్ప్రయోజనం అయ్యాయని అనుకుంటున్నాను రామా! దైవానుగ్రహము నా మీద లేదు. నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇక్కడ చూసుకునే వాళ్ళు ఎవరున్నారు. నువ్వు వెళ్ళిపోయాక నేను ఈ రాజ్యంలో ఎవరిని చూసుకొని బతకాలి, అందుకని నేను మరణిస్తాను" అని కౌసల్య అన్నది.


ఇప్పటిదాకా ఈ మాటలన్నీ వింటున్న లక్ష్మణుడు ఆగ్రహంతో…"అన్నయ్యా! నాన్నగారికి వృధాప్యం వచ్చింది కాని కామం తీరలేదు, విషయసుఖాలకి లొంగి కైకేయితో హాయిగా కాలం గడుపుతున్నాడు. ఏ అపరాధం చెయ్యని నిన్ను అడవులకు పంపిస్తున్నారు. నువ్వేమో ధర్మము, పితృవాక్య పరిపాలన అని వెళ్ళిపోతున్నావు. అమ్మ ఇక్కడ ఇంత బాధపడుతోంది. చేతకానివాడిలా నువ్వు వెళ్ళిపోవడం ఎందుకు, నువ్వు ఒకసారి "ఊ" అను, నేను నా అస్త్ర-శస్త్రాల చేత ఈ అయోధ్యలోని ఏనుగుల తొండాలని పర్వతాల్ని పడేసినట్టు పడేస్తాను, భరతుడి పేరు చెప్పిన వాడిని, భరతుడు రాజుగా కావాలన్న వాళ్ళని   ఒకే బాణంతో కొన్ని వందల మందిని చంపేస్తాను. ఇంతటి ధర్మాత్ముడైన కొడుకిని అడవులకు పంపిస్తున్న                ఆ దశరథుడిని బంధించి కారాగృహంలో తోసేస్తాను, లేకపోతే చంపేస్తాను. నిన్ను రక్షించుకోలేకపోతే నీ పక్కన నేను ఉండి ఎందుకు, కావున నాకు అనుమతి ప్రసాదించు" అని అన్నాడు.


లక్ష్మణుడి మాటలు విన్న కౌసల్య ఇలా అంది.. "రామా! నిన్ను విడిచి నేను ఉండలేను, ఉంటే నీతో పాటు నేను ఉండాలి, లేదా నువ్వు నాతో ఉండాలి. నీతో పాటు నేను అడవులకు వస్తే, నువ్వు ఏది తింటావో నాకు అదే పెట్టు. లేదంటే లక్ష్మణుడు చెప్పిన ఆలోచన గురించి ఆలోచించు. తండ్రి మాట బిడ్డ ఎలా వినాలో, తల్లి మాట కూడా అలానే వినాలి. తండ్రి అనుమతిచ్చాడు కనుక వెళ్ళిపోతానంటున్నావు, కాని తల్లిగా నేను నీకు అనుమతిని ఇవ్వడంలేదు. ఒకవేళ నువ్వు నా మాట కాదని వెళితే నేను విషం తాగి చనిపోతాను. నువ్వు వెళ్ళడానికి వీలులేదు" అని కౌసల్య అన్నది.


అప్పుడు రాముడు "అమ్మా! నువ్వు చెప్పింది తప్పు అని నేను అనను. ఖండువు అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన తండ్రి ఒకసారి పిలిచి గోవుని చంపమంటే, ఆ మహర్షి గోవుని చంపేసాడు. పరశురాముడిని ఆయన తండ్రి జమదగ్ని పిలిచి నీ తల్లి అయిన రేణుక శిరస్సు నరకమన్నాడు, పరశురాముడు ఎందుకు నాన్నా అని అడగకుండా తన తల్లి కుత్తుక కోసేశాడు. అలాగే మన వంశంలో పూర్వీకుడైన సగర చక్రవర్తి తన 60,000 కుమారులని పిలిచి ఈ భూమి మొతాన్ని తవ్వమంటే, అలా తవ్వడం పాపం కదా అని వాళ్ళు ఆలోచించలేదు, తండ్రి చెప్పాడని తవ్వేశారు. ఒకేసారి తల్లి మాట, తండ్రి మాట వినవలసి వస్తే, తండ్రిమాటకే గౌరవం ఇవ్వాలి. నేను ఇప్పుడు తల్లి మాట విని ఆగిపోతే, పూర్వం మన వంశంలో తండ్రి మాట విన్నవాళ్ళు అవివేకులవుతారు. నేను వారి ప్రవర్తనని అవమానించకూడదు. అందుకని నేను ఇప్పుడు దశరథ మహారాజు మాట విని అడవులకు వెళ్లిపోవాలి" అన్నాడు.


తరువాత లక్ష్మణుడితో…


తవ లక్ష్మణ జానామి మయి స్నేహమనుత్తమం |

విక్రమం చైవ సత్యం చ తేజశ్చ సుదురాసదం |

మమ మాతుర్మహద్దుఃఖమతులం శుభలక్షమ్ణ |

అభిప్రాయం అవిజ్ఞాయ సత్యస్య చ శమస్య చ ||


"లక్ష్మణా! నువ్వు ఎంతటి పరాక్రమవంతుడివో నాకు తెలుసు, కాని నువ్వు అన్నటువంటి మాటలు వలన అమ్మ దగ్గర అనుమతి తీసుకొని అరణ్యవాసానికి వెళదామని వచ్చిన నాకు ఎంత ఇబ్బందిగా ఉన్నాయో చూశావా. సత్యమేదో, శాంతికి స్థానమేదో తెలుసుకోవడంలో అమ్మ తత్తరపడుతోంది.


ధర్మః హి పరమః లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం |

ధర్మ సంశ్రితం ఏతచ్ చ పితుర్ వచనం ఉత్తమం ||


ధర్మమునందు సత్యము ప్రతిష్టితమై ఉంటుంది, అందుకని ధర్మాన్ని విడిచిపెడితే, సత్యధర్మములు రెండిటిని విడిచిపెట్టినట్టు అవుతుంది. ఒక ధర్మాన్నో, ఒక సత్యాన్నో పట్టుకోకూడదు. సత్యంతో కూడిన ధర్మాన్ని పట్టుకోవాలి.


త్వయా మయా చ వైదేహ్యా లక్ష్మణేన సుమిత్రయా |

పితుర్నియోగే స్థాతవ్యమేష ధర్మః సనానః ||


అమ్మా, నీకొక ధర్మాన్ని చెపుతాను. నాన్నగారు నిన్ను, సుమిత్రని, నన్ను, లక్ష్మణుడిని, సీతని శాసించచ్చు, మనమందరం దశరథుడు ఎలా చెప్తే అలా ప్రవర్తించాలి. (తండ్రి మాత్రమే కుటుంబానికి యజమాని). ఇది సనాతనమైన ధర్మము.


ధర్మార్థకామాః ఖలు తాత లోకే సమీక్షితా ధర్మఫలోదయేషు |

తే తత్ర సర్వే స్యురసంశయం మే భార్యేవ వశ్యాభిమతా సుపుత్రా ||


లక్ష్మణా! ధర్మము, అర్థము, కామము అని మూడు పురుషార్ధాలు ఉంటాయి, ఇందులో నువ్వు ధర్మం ఒక్కదాన్ని పట్టుకుంటే అది అర్థకామాలని తీసుకోచ్చేస్తుంది. ధర్మాన్ని వదిలి పట్టుకున్న అర్థం లోక ద్వేషాన్ని తీసుకొస్తుంది, ధర్మాన్ని వదిలి పట్టుకున్న కామం 

నీ పతనాన్ని తీసుకొస్తుంది. ధర్మం భార్యవంటిది. (అందుకే మనం భార్యని కామపత్నిగా చూడము, ధర్మపత్ని అని అంటాము. ధర్మబద్ధమైన పత్ని వల్ల కలిగిన కామము వలన అర్థము[శాస్త్రం ప్రకారం అర్థం అంటే ధనము కాదు, ధనాన్ని కర్మఫలం అంటారు, అర్థం అంటే కొడుకు అని] లభిస్తుంది.) లక్ష్మణా! నువ్వు దశరథుడిని ఖైదు చేసి రాజ్యాన్ని తీసుకోమన్నావు, అది ధర్మబద్ధం కాని రాజ్యం, అందుకని ఆ రాజ్యం నాకు అక్కరలేదు. తండ్రి చెప్పిన మాట పాటించడం కొడుకుకి ధర్మం, అందుకని నేను అరణ్యానికి వెళ్ళడానికే నిశ్చయమయ్యాను. అలాగే, నువ్వు నాకు పట్టాభిషేకం జరుగుతుందని సంతోషంగా తెచ్చినటువంటి ఈ సంభారములన్నిటిని, ఇక్కడినుంచి తీసెయ్యి. నేను అరణ్యాలకి తొందరగా వెళ్లిపోవాలి, లేకపోతే అమ్మ(కైకేయి) బాధపడుతుంది. అమ్మ మనసులో అనుమానం అనే దుఖం ఎప్పటికి రాకూడదు. అందుకని తొందరగా ఈ సంభారములన్నిటిని తీసెయ్యి. అమ్ామ నన్నూ, బరతుడిని ఎన్నడూ వేరుగా చూడలేదు. మరి ఇంతగా నన్ను ప్రేమించిన అమ్మ, నిన్న రాత్రి నన్ను పిలిచి పట్టాభిషేకం చేస్తాను అన్న నాన్నగారు, ఇవ్వాళ తెల్లవారేసరికి నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమన్నారు అంటె ఒకటి గుర్తుపెట్టుకో లక్ష్మణా......


సుఖ దుహ్ఖే భయ క్రోధౌ లాభ అలాభౌ భవ అభవౌ |

యస్య కించిత్ తథా భూతం నను దైవస్య కర్మ తత్ ||


సుఖం అవని, దుఖం అవని, శుభం అవని, అశుభం అవని, వెనకనుండి శాసించేవాడు ఆ దైవం. ఆ దైవాన్ని తిరస్కరించి నువ్వు ఏమి చెయ్యలేవు. ఒక మంచిపని చేద్దామని అనుకుంటే దానికొక ప్రతిబంధకం రావడం కూడా దైవము చేసిన పనే " అని రాముడన్నాడు.

రాముడు చెప్తున్న మాటలు వింటున్న లక్ష్మణుడు ఆ ధనుస్సుని గట్టిగా పట్టుకొని నలుపుతూ, పళ్ళు కొరుకుతూ, పాదాలు అసహనంగా కదుపుతూ రాముడితో ఇలా అన్నాడు " నీకే చెల్లింది అన్నయ్యా ఈ చేతకాని మాటలు మాట్లాడడం, అంత వృద్ధుడైన దశరథుడికి యవ్వనంలో ఉన్న కైకేయ పొందు కావలసి వచ్చిందా, ఇన్నాళ్ళు వరాలు జ్ఞాపకంలేవ కైకమ్మకి, నిన్న రాత్రి నిన్ను పిలిచి పట్టాభిషేకం అన్నాడు, రాత్రికి రాత్రే కైకేయకి రెండు వరాలు ఇచ్చి, సత్య ధర్మాలకి కట్టుబడి నిన్ను అరణ్యాలకి పొమ్మంటాడ, భరతుడికి రాజ్యం ఇస్తాడ, తండ్రి మాట నిలబెట్టడం ధర్మమని నువ్వు అరణ్యాలకి వెళతానంటావ, ఇంత ధనుర్విద్య నేర్చుకున్న నువ్వు దుంపలు తింటూ, తేనె తాగుతూ అడవుల్లో తిరుగుతావ, ఇదంతా దైవం చేశాడంటున్నావు కదా ఆ దైవాన్ని ఒకసారి కనపడమను, నా ధనుస్సుకి బాణాలని సంధించి మొదట దశరథుడి తల, తరవాత కైకేయ తల పడగొడతాను, నిన్ను తీసుకెళ్ళి సింహాసనం మీద కుర్చోపెడతాను, అప్పుడు కూడా నన్ను ఆ దైవం నిగ్రహించగలిగితే, దైవం ఉందని ఒప్పుకుంటాను, దైవమో, లక్ష్మణుడో నెగ్గాలి, నువ్వు చెప్పిన మాటలు నాకు ఎంతమాత్రము నచ్చలేదు, నువ్వు అనుమతిని ఇవ్వు దశరథుడి మీద యుద్ధం ప్రకటిస్తాను " అన్నాడు.


అప్పుడు రాముడు " లక్ష్మణా! నువ్వు మళ్ళి పొరబడుతున్నావు. ఇదంతా చేస్తున్నది ఆ దైవమె, నేను అనుమతించిననాడు కదా నువ్వు బాణం వెయ్యడం, దశరథ మహారాజు గారిని ఇచ్చిన మాట మీద నిలబెట్టడం కోసం అరణ్యాలకి వెళ్ళడం మినహా నాకు వేరొక మార్గం లేదు " అని లక్ష్మణుడితో అని, అడవులకు వెళుతున్న తనని ఆశీర్వదించమని కౌసల్యతో అన్నాడు.


" సరే, అలాగే వెళ్ళు, కాని నా కన్నీళ్ళని దశరథుడు తుడుస్తాడన్న నమ్మకం లేదు, అందుకని నన్ను నీతోపాటే తీసుకెళ్ళు, లేదా నేను ఇక్కడే విషం తాగి మరణిస్తాను, ఈ రెండిటిలో ఏది చెయ్యమంటావో చెప్పి బయలుదేరు " అని కౌసల్య రాముడితో అనింది.


భర్తుః కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియాః |

స భవత్యా న కర్తవ్యో మనసా అపి విగర్హితః ||


అప్పుడు రాముడు " ఏ స్త్రీ భర్తని విడిచిపెట్టి, తాను ఒక్కత్తే భర్తకన్న వేరుగా, దూరంగా ఉంటానని మానసికంగా అయినా ఊహ చేస్తుందో, అటువంటి స్త్రీ నృశంస(ఆమెని చూడగానే "ఛి" అనవలసిన స్త్రీ). భర్తని వదిలేసి కొడుకులతో వస్తానని దశరథ మహారాజుకి పెద్ద భార్యవైన నువ్వు ఒక్కనాటికి అనకూడదు. దశరథ మహారాజు ఎంత కాలం ఉంటాడో, నువ్వు అంతకాలం ఆయనకి శుశ్రూష చెయ్యవలసి ఉంటుంది.


భర్తారం న అనువర్తేత సా చ పాప గతిర్ భవేత్ |

భర్తుః శుశ్రూషయా నారీ లభతే స్వర్గము త్తమం |

అపి యా నిర్నమస్కారా నివృత్తా దేవపూజనాత్ ||


ఎన్ని నోములు, వ్రతాలు, పూజలు చేసినా, తన భర్త మనసు గుర్తెరిగి, భర్తకి ఆనందం కలిగేటట్టు ప్రవర్తించడం చేతకానటువంటి స్త్రీ చిట్టచివర పొందేది నరకమే. అలాగే, జీవించి ఉండగా ఎన్నడూ ఒక దేవతకి నమస్కారం చెయ్యకపోయినా, పూజలు, నోములు, వ్రతాలు చెయ్యకపోయినా కాని, భర్తని అనువర్తించి, భర్తయందు ప్రేమతో ప్రవర్తించినటువంటి స్త్రీ చిట్టచివర స్వర్గాన్నే పొందుతుంది. అందుకని అమ్మా, నువ్వు అలా మాట్లాడకూడదు, నేను అలాంటి మాటలు వినకూడదు. నేను అరణ్యవాసానికి వెళితే నన్ను రక్షించేది చల్లని నీ ఆశీర్వాదమే అమ్మా " అని కౌసల్య పాదాలకి నమస్కారం చేశాడు.


అప్పుడు కౌసల్య తెల్లటి ఆవాలు, పెరుగు, తెల్లటి పూలతో ఉన్న దండలు తెప్పించి వేదం బాగా చదువుకున్నటువంటి ఆచార్యుడిని పిలిచి, హోమం చేయించి, ఆ అక్షతలని రాముడి శిరస్సు మీద ఉంచి "నాయనా, నిన్ను సూర్యుడు, చంద్రుడు, అశ్విని దేవతలు, భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు, దిక్కులు, గృహదేవతలు, రాక్షసులు, విషక్రిములు, చెట్లు, నదులు, ఋతువులు, నక్షత్రములు అన్నీ నిన్ను రక్షించాలి. ఆ వృత్తాసురిడిని చంపినప్పుడు దేవేంద్రుడికి ఎటువంటి మంగళం జరిగిందో, నీకు అటువంటి మంగళం జరుగుగాక, గరుగ్మంతుడు అమృతాన్ని అపహరించి తెచ్చినప్పుడు ఎటువంటి మంగళం జరిగిందో, నీకు అటువంటి మంగళం జరుగుగాక, క్షీరసాగర మధనంలో రాక్షసులని సంహరించిన ఇంద్రుడికి అదితినుంచి ఎటువంటి మంగళం లభించిందో, నీకు అటువంటి మంగళం కలుగుగాక, పాదముల చేత ఈ లోకములనన్నిటిని కొలిచిన ఆ త్రివిక్రమావతారానికి ఎటువంటి మంగళం లభించిందో, అటువంటి మంగళం నీకు లభించుగాక " అని ఆశీర్వదించింది. ✍️

రేపు...30వ భాగం...

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

మాటతీరు

 

     *మాటతీరు ఎలా ఉండాలి*  

               ➖➖➖✍️


*ఈ సృష్టిలో మాట్లాడే శక్తి ఒక్క మానవుడికే ఉంది. అది మనిషికి దేవుడిచ్చిన దివ్యమైన వరం.* 


*మాట ఓ అద్వితీయ శక్తి.    దాన్ని పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.  మాటతీరు సంస్కార సంపన్నమైనప్పుడే ఎదుటి హృదయాన్ని ఆకర్షించగలుగుతుంది. మన భావాలు, ఆలోచనలు ఇతరులతో పంచుకొనేందుకు- మాటే ఓ అద్భుత సాధనం.*


*లోకంలో అర్థం కాకుండా మాట్లాడేవారు, అసమర్థంగా మాట్లాడేవారు ఎంతో మంది ఉన్నారు. అనవసరంగా, అనాగరికంగా మాట్లాడేవారూ ఉన్నారు. ప్రాణికోటిలో మనిషికి పెద్దపీట వేసింది మాటే. మాటతోనే మనిషి వ్యాప్తిచెందాడు. మాటతోనే మనిషి ఎత్తులకు ఎదిగాడు. ముందు తరాలకు మార్గదర్శకుడయ్యాడు.*


*మహనీయుల మాట మౌనం అనే మూసలో పోసిన బంగారంలా ఉంటుంది. అందుకే వారి మాటలకు ఎంతో విలువ సమకూరుతుంది.* 


*అదుపులేకుండా వాగడం మహాతప్పు.   మాటను తక్కెడలో పెట్టి తూచినట్లు మాట్లాడమంటారు విజ్ఞులు.*


*కటువుగా, అతిగా మాట్లాడేవారి పట్ల ఎవ్వరికీ గౌరవం ఉండదు. చెడ్డ మాటలు వెలువడకుండా ఉండాలంటే దానికి మౌనమే సరైన మందు అంటారు తత్త్వవేత్తలు.*


*‘ఎదుటివారు మనల్ని అర్థం చేసుకొనేందుకు ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడండి. అధిక ప్రసంగం తగదు’ అంటూ రామకృష్ణ పరమహంస తనను కలిసేందుకు వచ్చిన భక్తజనంతో చెబుతుండేవారు.*


*మాటకు ప్రాణం సత్యం. ఇది యుగాల పూర్వమే హరిశ్చంద్ర చక్రవర్తితో నిరూపితమైంది. సత్యవచనం కారణంగానే ఆయన పేరు సత్యహరిశ్చంద్రుడని శాశ్వతంగా నిలిచిపోయింది.*


*మాటల్లో అబద్ధాలు దొర్లకూడదు. అబద్ధం మాట్లాడి నోరు కడుక్కోవడం కన్నా మౌనంగా ఉండటమే ఉత్తమం అన్నది జ్ఞానుల ఉవాచ.* 


*మాట ప్రభావం అద్భుతం. అది మనిషి మనసుకు అద్దం పట్టగలదు. అడ్డంగా నిలువగలదు. కొంపలు కూల్చగలదు. కుటుంబాలను రక్షించగలదు. శిశిరంలో వసంతాన్ని సృజియించగలదు. పెదవి వదిలితే పృథివి దాటిపోగలదు.*


*ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్నయినా వెనక్కి మళ్ళించవచ్చునేమోగాని- పెదవి దాటిన మాటను బ్రహ్మదేవుడైనా వెనక్కి మళ్ళించలేడు. మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలని పెద్దలు హెచ్చరించి మరీ చెబుతుంటారు.*


*సందర్భశుద్ధి కలిగిన  మాటకే విలువ, మన్నన ఉంటుంది. మాట, దాని అర్థం ఎలా పెనవేసుకొని ఉంటాయో మహాకవి కాళిదాసు ఓ శ్లోకరూపకంగా వివరించి చెప్పాడు.*


*ఔచిత్యం అనే తక్కెడలో పెట్టి తూచినట్లు మాట్లాడటం ఓ కళ. నోటికి వచ్చినట్లు వాగడం ఓ రోగం. చెడ్డ మాటలతో చెడు ఫలితమే వస్తుంది. మంచి చేకూరదు.*


*రామాయణంలో మంథర మాటలకు చెవొగ్గిన కైకేయి ఆ తరవాత ఎంత పశ్చాత్తాపం చెందిందో తెలియనిది కాదు. తీయని మాటలతో మన వెనకాలే గోతులు తీసేవారు ఎంతో మంది ఉంటారు.*


*మాటతీరు మనిషి సంస్కారానికి సూచిక. కార్యసాధనకు పనిముట్టు. ఆకర్షణకు అద్భుత మంత్రం. అందుకే మనిషి        మంచి మాటతీరును అలవరచుకోవాలి. మనం చెప్పిన మాట ఎదుటివారికి అర్థం కాకపోతే చక్కటి సామెతల రూపంగా అర్థమయ్యేలా వివరించవచ్ఛు అప్పుడే మాటతీరుకు మంచి ఆకర్షణ, స్పష్టత, పటిష్ఠత సమకూరుతుంది.*


 *కొందరి సంభాషణల్లో అబద్ధాలు, అపశబ్దాలు, అసభ్య పదాలు, అహంకారపు కథలు దొర్లుతుంటాయి. మన మాటతీరు ఎదుటివారికి కంటిలో నలుసులా, పంటి కింద రాయిలా బాధపెట్టే విధంగా ఉండకూడదు. మంచి గంధం పూసినంత హాయి కలిగించాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మంచి మాటకు మన్నన ఉంటుంది!*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

తాళికి పసుపుకొమ్ము

 


*పూర్వము తాళికి పసుపుకొమ్ము ఎందుకు జత చేసేవారు...??*

             ➖➖➖✍️



*పసుపు కి మన సంప్రదాయాలలో విశిష్ట స్థానముంది, పవిత్రతకు చిహ్నము అని మనకందరికీ తెలిసిందే.*


*పసుపులో  ‘కర్క్యుమిన్’  అనే రసాయనము ఉండడం వల్ల ఇది ఆరోగ్యపైన కూడా మంచి ప్రభావాన్ని చూపి మానవాళికి ఎంతో మేలు చేస్తుంది.   అందుకే  ఆడవారి హృదయస్థానాన్ని నిత్యం తాకేలా పసుపుకొమ్మును తాళికి జతచేశారు మన పూర్వీకులు.*


*పసుపు చాలా ప్రభావంతమైన ఏంటీ బేక్టీరియల్, ఏంటీ ఇన్ ఫ్లమేటరీ కూడా,     ప్రేగుల్లోని మలినాలను శుద్దిచేసే గుణకారిణి.*


*నొప్పులనూ హరించగల  దివ్య ఔషదమని ఏనాడో మన ప్రాచీన ఆయుర్వేద పండితులు పసుపును విరివిగా వాడమని సూచించారు*


*పూర్వము పాము పుట్రా ఇంటిలోకి చేరకుండా కూడా పసుపుని మన గడపలకి రాసే సాంప్రదాయాన్ని పెద్దలు సూచించారు.*


*అందుకే ఆడవారికి ఇన్ ఫెక్షన్లు సోకి   కేన్సర్  బారిన  పడకుండా పసుపుకొమ్మును తాళికి జతచేశారు. పసుపులోని ఔషద గుణాలను నేటి ఆధునిక సైన్స్ కూడా దృవీకరించింది.*


*చూశారా బ్రదర్స్/సిష్టర్స్ ఎంత గొప్పవి మన సాంప్రదాయాలు మన దేశములో మన జననం జరగడం పూర్వ జన్మ సుకృతం కాదంటారా..?*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

ఆచార్య సద్బోధన

 



           *ఆచార్య సద్బోధన:*

                ➖➖➖✍️


*ఐశ్వర్యం శాశ్వతం కాదు!!...* 

```శంకర భాగవత్పాదులవారు అనేక విధాలుగా జనులకు సన్మార్గాలను ఉపదేశించారు...


వారు రచించిన స్తోత్రాల్లో కేవలం దేవతా గుణగణానువర్ణనలే కాకుండా, మనం గ్రహించాల్సిన అనేకానేక విషయాలను పొందుపరిచారు... 


ఒకచోట ఆయన భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఏం చెప్పారంటే ...


భగవంతా! నాకు కొన్ని ప్రార్ధనలు ఉన్నాయి. 

వాటిని నువ్వు అనుగ్రహించాలని ప్రార్ధించారు, ఆ ప్రార్ధనలు మనందరం ప్రతినిత్యం భగవంతుని ఎదుట చేయాల్సినవి...


ఎందుకు మనిషికి ఇంత అహంకారం? 

ఐశ్వర్యాన్ని చూసుకుని కావచ్చు. 

ఈ ఐశ్వర్యం అంతా మనకు ఎక్కడి నుండి వచ్చింది?

ఇదంతా భగవంతుడి కృప వల్ల వచ్చింది కాదూ? 

ఆయన దయలేనిదే ఇదంతా ఎక్కడుంది? 

మన సామర్థ్యం వల్ల మనం 

ఏ ఒక్కటీ సంపాదించలేం...

ఆయన కృప లేనిదే మన సామర్థ్యం దేనికీ పనికి రాదు, కాబట్టి మనకు వచ్చిన సంపాదన అంతా భగవంతుడి కృప వల్ల వచ్చిందే. 

దాన్ని సద్వినియోగం చెయ్యాలి, 

తప్పు పనులకు ఐశ్వర్యాన్ని ఉపయోగించకూడదు. 

ఎవడైతే తన ఐశ్వర్యాన్ని భగవంతుని సేవకు కానీ, సమాజ సేవకు గానీ ఉపయోగించకుండా కేవలం తాను మాత్రమే అనుభవిస్తాడో అలాంటి వాడు ‘పాపి’ అని వేదం చెబుతోంది.```✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺

అద్భుత_అరుణాచలంలో_అనుభూతి

  #అద్భుత_అరుణాచలంలో_అనుభూతి

(చివరి వరకు పూర్తిగా చదవండి)


అరుణాచల గిరి ప్రదక్షిణలో ఒక విదేశీ సోదరితో జరిగిన సంభాషణలో తెలిసిన తత్వం...


నేను: అమ్మా మీరు ఎక్కడి నుండి వచ్చారు ?


విదేశీ యువతి : ఉక్రెయిన్ నుండి... ఎందుకు అడుగుతున్నారు...?


నేను : ఏం లేదమ్మా... మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు ?


వి. యు.: శివుడి కోసమే వచ్చాము, శివుడే తీసుకువచ్చారు.


నేను : ఎంతమంది వచ్చారు ? ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ ?


వి. యు.: మొత్తం 65 మంది వచ్చాము, ఇన్ని రోజులు అని అనుకోలేదు.


నేను : మీకు శివయ్య గురించి మోటివెట్ చేసిన వారు ఎవరు ?


వి. యు.: ఎవరో మోటివేట్ చేస్తే పరిచయం వస్తుందేమో, కానీ నమ్మకం శోధనతోనే కలుగుతుంది, ఇక్కడ ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి ఉంది.

(నిజంగా చెప్పుడు మాటకు విని మతం మారుతున్న ప్రతీ హిందువు నేర్చుకోవాలి)


నేను: ఇంతకీ శివుడి గురించి మీరు ఏం తెలుసుకున్నారు. శివుడు అంటే ఎవరు ?


వి. యు.: ఎవరు అంటే, మీరూ శివుడే, నేనూ శివుడే. సర్వం శివమయం.


నేను: మరి మీరు మిగిలిన దేవుళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదా..?


వి. యు.: ఎవరి గురించి తెలుసుకున్నా అందరూ చివరికి శివుడే కదా... ఏం తేడా లేదు కదా...


నేను: శివయ్యని నమ్మాక మీకు ఏమనిపిస్తుంది ? మీరు శివయ్యను చూసారా ?


వి. యు.: చూసి నమ్మితే నిజం అంటారు ? చూడకపోయినా అనుభవం ద్వారా తెలుసుకుంటే సత్యం అంటారు. సత్యం శివం సుందరం.


నేను : మీ వయసు ఎంత అమ్మా ?


వి. యు.: 21 సంవత్సరాలు. మెడిసిన్ చదువుతున్నాను.


నేను: ఇంత చిన్న వయసులో, అంత చదువు చదువుతూ ఇలాంటివన్నీ ఎలా నమ్ముతున్నారు ?


వి. యు.: చిన్న వయసు కాబట్టే శివుణ్ణి తెలుసుకుందామని అనుకుంటున్నాను. ఇంత చదువుతున్నాను కాబట్టే, చదువు కంటే విలువైన జ్ఞానం శివుడని నమ్ముతున్నాను.


నేను : నీ పాదాలకు నమస్కారం తల్లీ... (అనుకుంటూ వాళ్ళ దగ్గర నుండి పక్కకు జరిగి వారి యాత్రను చూస్తూ తరించాను)


గమనిక : గొప్ప విశేషం ఏమిటంటే బొట్టు బరువైన భారత బాలికలలా కాకుండా, చక్కటి వస్త్ర ధారణతో, బొట్టుతో, క్రమశిక్షణతో చెప్పులు లేకుండా సాగుతున్న వాళ్ళ యాత్ర ను చూసి గుండె పులకించింది. అంతే కాదు ఆ చెల్లి నాకు సమాధానం చెబుతూ, ప్రశ్నకు ప్రశ్నకు మధ్య సమయంలో #నమః_శివాయ అంటూ స్మరణ చేస్తూనే ఉంది. 


అంతే కాదు ఇదే సంభాషణ ఎవరైనా భారతీయులతోనో, హిందువులతోనో అయితే అంత ఎక్సైట్ అయ్యేవాడిని కాదు. కానీ విదేశీయురాలు, పైగా 21 సంవత్సరాల చిన్న అమ్మాయి, శివయ్య తత్వాన్ని అంత సున్నితంగా తెల్చేసిన బంగారు తల్లి మాటలు విని ఆనంద భాష్పాలు వచ్చాయి.


ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ.. మనకు మాటలంటే ఓకే కానీ, వ్రాతకు బద్దకం కదా... అందుకే ఇంతవరకు వ్రాయగలిగాను... (చెప్పడం కుదిరిందో లేదో తెలియదు, కానీ చెప్పాలనిపించింది చెప్పాను)


భారత దేశాన్ని ఏదో చెయ్యాలని విదేశీ మతాలు కుట్రలు చేస్తుంటే, యెటువంటి కుట్రలతో పని లేకుండా ప్రపంచమంతా హిందుత్వం వైపు నడుస్తుంది. ఇది ధర్మ విజయం...


ఏది ఏమైనా, రెండో సారి వెళ్ళినప్పుడు మాత్రం అరుణాచలం గొప్పదనాన్ని ఆస్వాదించాను.


శివయ్య... పునః దర్శన ప్రాప్తిరస్తు

ధర్మం యొక్క లక్షణాలు

 .   

                      _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*శ్రుతిః స్మృతిః సదాచారః* 

*స్వస్య చ ప్రియమాత్మనఃl*

*ఏతచ్చతుర్వి ప్రాహుః* 

*సాక్షాత్ ధర్మస్య లక్షణమ్ll*


తా𝕝𝕝  

*వేదములు, ధర్మశాస్త్రములు, సదాచారములు, వ్యక్తికి సమాజానికి కూడా శాశ్వత శ్రేయస్సు కలిగించేవి - అనే నాలుగు రకాలుగా ధర్మం యొక్క లక్షణాలు ఉంటాయి.....*

* సాధకా మేలుకో -6 ఏకత్వ భావన *

 

 * సాధకా మేలుకో -6 ఏకత్వ భావన *

  

గత కండికలో మనం సాధకుడు ఆచరించవలసిన  సమ భావం గురించి   తెలుసుకున్నాము. ఇప్పుడు సాధకుడు అంతకంటే ఉత్కృష్టమైన కఠినమైనది  దాదాపు మోక్షసాధనకు చేరువయినది ఐన ఏకత్వ భావన గురించి తెలుసుకుందాము. 

ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టే ప్రతి సాధకుడు ముందుగా తెలుసుకునేది ఏమిటంటే తాను వేరు భగవంతుడు వేరు తాను భగవంతుని ఆరాధించాలి అనే భావంతో తన సాధన మొదలు పెడతాడు.  ఆరాధనలో ప్రాధమికంగా మూర్తిపూజ నుండి మొదలు పెడతాడు.  సాధన కొద్దికొద్దిగా వృద్ధి చెందుతున్న కొద్దీ గురువుల సహాయంతో ఆత్మా, పరమాత్మ అనే భావనలోకి వస్తాడు.  తదుపరి తాను దేహాన్ని కాదు దేహంలో నిగుడంగా నిక్షిప్తమయిన దేహిని అనే భావనకు వస్తాడు.  అప్పటినుండి తన సాధన మూర్తిపూజనుండి మారాలి పరమాత్మను తెలుసుకోవాలనే తపనతోటి ముందుకు సాగుతుంది.  ఎప్పుడైతే పరమాత్మా వైపు మనసు మళ్లుతుందో అప్పుడే తెలుసుతుంటాడు పరమాత్మా తప్ప మిగిలినవి అన్ని నిత్యమైనవి కావని అవన్నీ అనిత్యలని తెలుసుకొని నిత్యం, సత్యము, ఆనందము అయిన పరమాత్మా వైపు మనసు మళ్లుతుంది. 

నిత్యానిత్య వివేకము కలిగినతరువాత అనిత్యమైన విషయాలమీద విరక్తి కలుగుతుంది దానినే వైరాగ్యము అని అన్నారు. తరువాత మోక్షాన్ని పొందాలనే కోరిక బలంగా కలుగుతుంది దానికి ముముక్షుకత్వము అని పేరు ముముక్షుకత్వం స్థితిలోకి చేరుకున్న సాధకుడు తదుపరి మోక్షాన్ని చేరుకుంటాడు. 

మోక్షాన్ని చేరుకునే విధిని ఒక దుష్టాంతరంతో వివరించే ప్రయత్నం చేస్తాను. పూర్వము కన్నప్ప అనే ఒక కిరాతకుడు ఉండేవాడట అతను అడివిలో వున్న ఒక శివలింగాన్ని నిత్యం ఆరాధించేవాడట. తానూ వేటకు వెళ్లి తెచ్చిన మాంసాన్ని ముందుగా శివలింగానికి నివేదించి తరువాత తాను భుజించేవాడట. ఇలా రోజులు గడుస్తున్నాయి.  కొంతకాలం అయినతరువాత అతని కర్మ పరిపక్వ స్థితిని చేరుకున్నాడు.  అప్పుడు పరమేశ్వరుడు అతని భక్తిని పరీక్షిన్చగోరినవాడై శివ లింగంకు వున్నా ఒక కంటినుండి ధారాపాతంగా నీరు కారటం అయ్యిందట.  అది గమనించిన కిరాతకుడైన కన్నప్ప తన దగ్గరవున్న వస్త్రంతో ఆ కన్నీటిని తుడవ ప్రయత్నం చేసాడు కానీ ఏది ఫలించలేదు. చివరకు తన స్వామి కన్ను చెడిపోయినదని భావించి దాని స్థానంలో తన కన్నును పెట్టాలని ఆలోచించి తన వద్దవున్న బాణంతో తన కన్నును పెరికించి లింగంకు నీరు కారే కంటికి అమర్చాడట వెంటనే ఆ కన్ను నీరు కారటం  ఆగినదట. అది చూసిన కన్నప్పకు సంతోషం కలిగింది స్వామి నా కన్ను పోయినా నీ కన్ను బాగుపడిందని ఆనందించాడట.  కానీ అతని ఆనందం క్షణకాలం కూడా వుండలేదు వెంటనే లింగంకు రెండవ కంటిలోనుండి నీరు కారటం మొదలైనదట అయ్యో ఇప్పుడు ఎట్లా అని ఒక నిముషం ఆలోచనలో పడి తరువాత తన రెండవ కన్నును కూడా పీకి స్వామికి సమర్పించాలని నిర్ణయించుకున్నాడట.  కానీ తన రెండవ కన్ను తీసివేస్తే తాను చూసేది యెట్లా అని ఆలోచనలో పడ్డాడు వెంటనే తన కాళీ బొటన వేలితో పరమేశ్వరుని రెండవ కాంతిని పట్టి గుర్తింపుగా చేసుకొని తన రెండవ కంటిని తీసి స్వామికి సమర్పించారట అప్పుడు పరమేశ్వరుడు ప్రసన్నుడై కన్నప్పను దర్శనమిచ్చి తనలో ఐక్యత చేసుకొన్న విషయం మనందరికీ తెలిసిందే. 

సాధారణ భక్తి భావనలో వున్న సాధకుడికి తాను వేరు భగవంతుడు వేరు అని అనుకుంటాడు కాబట్టి శివలింగం కన్నుకు నీరు కారితే తన కన్ను పెట్టాలని అనుకోడు. 

శివలింగమును కాలితో తాకటం అపచారంగా సాధారణ భక్తులు భావిస్తారు. 

కానీ కన్నప్ప శివుడు వేరు తాను వేరు కాదని ఏకత్వ సాధన చేసిన వాడు కాబాట్టి తనను తానువిస్మరించి కేవలం శివుడే సర్వస్వము అనే భావనలోకి వచ్చాడు అదే ఏకత్వం అంటే ఇక్కడ ఆత్మ పరమాత్మ అనే రెండు వుండవు కేవలం పరమాత్మా తత్వమే ఉంటుంది. దీనినే త్వమేవ అహం అనే భావనగా పేర్కొనవచ్చు. 

 ఇంకా విఫులంగా అర్ధంకావటానికి మరొక దుష్టాంతరం చూద్దాము. పూర్వాము ఒక గ్రామంలో ధర్మపాలుడు అనే ఒక బ్రహ్మచారి ఉండేవాడట వానికి చిన్నప్పటినుంచే దైవచింతన కలిగి ఉండేవాడు తనకు బ్రహ్మజ్ఞ్యానం బోధించగల గురువు ఎవరైనా దొరుకుతారా అని అన్ని చోట్లకు తిరిగి వెతికేవాడట ఆలా వెతుకుతూ వెతుకుతూ ఒక అరణ్య సమీపంలోని ఒక పల్లెకు చేరుకున్నాడు.  అక్కడి వారిని విచారించగా ఆ పల్లెలోని ఒక ఆసామి నాయనా బ్రహ్మ జ్ఞ్యానులు ఎలావుంటారో నాకు తెలియదు కానీ ఈ అరణ్యంలో ఒక పాడుబడిన శివాలయం వుంది అందులో ఒకవ్యక్తి ఉంటాడు అయన ఎటువంటి దుస్తులు ధరించాడు చూడటానికి పిచ్చివానిగా ఉంటాడు ఎవరితోడి మాట్లాడాడు కేవలం ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు బహుశా నీవు వెతికే బ్రహ్మ జ్ఞ్యాని ఆయనే ఏమో చూడు నాయనా అనగా ఆహా ఏమి నా భాగ్యము నేను వెతికే సద్గురువు నాకు తారసపడిపోతున్నాడు నాకు తప్పక జ్ఞనబోధ చేస్తాడు అని ఆలోచిస్తూ ఆ శివాలయాన్ని చేరుకున్నాడు. అది ఒక పాడుపడిన దేవాలయం చుట్టూతా చెట్లు చేమలు వుంది అక్కడికి పోవటానికే దుర్లభంగా వుంది కానీ మన ధర్మపాలకునికి అవేమి కనిపించటం లేదు దేవాలయంలో వుండే తన గురువుగారి అతని ముందర కదులాడుతున్నట్టు  అనిపించింది. ఆ చెట్ల మధ్యనుంచి శివాలయాన్ని  చేరుకున్నారు. శివాలయం అంటా దుమ్ము దూళితో కుడి వుంది ఆలయంలో ఎక్కడ మానవ సంచారం ఉన్నట్లు తెలియటంలేదు.  అలాగే గర్భ గుడికి   అక్కడ మసక వెలుతురో ఒక మనిషి పడుకున్నట్లు కనపడించి బహుశా ఆయనే కాబోలు తాను వెతికే సద్గురువు అని తలంచాడు. 

అతనికి చూడగానే ధర్మపాలునికి మతి పోయినట్లయినది ఆయన శివలింగం మీద తన రెండు పాదాలను మోపి పడుకొని వున్నాడు వెంటనే అతని మీద కోపం వచ్చింది ఇదేమిటి సాక్షాత్తు పరమేశ్వరుని లింగం మీద కాళ్ళు మోపి పడుకునేవాడు ఒక మూర్ఖుడు అవుతాడు కానీ సద్గురువు ఎలా అవుతాడు అని అనుకోని అయన దగ్గర నేను జ్ఞ్యాన సముపార్జన చేయటం అటుంచి ముందుగా ఈయనకు నేను దైవ భక్తిని తెలియచేయాలి అని అనుకోని స్వామి మీరు ఏమి చేస్తున్నారో అర్ధం అవుతున్నదా అని అడిగాడు దానికి ఆయన తెలియదు నాయనా పడుకొని వున్నాను నేను ఏమి చేయటం లేదు అని అన్నాడు. 

స్వామీ మీరు శివలింగం మీద మీ పాదాలు మోపి పడుకున్నారు అపచారం, అపచారం అని అన్నాడు. అలానా నాయనా ఈ మసక చీకటిలో చూసుకోలేదు నాకు కళ్ళు సరిగా కనిపించవు శివలింగం లేని చోట నా కాళ్ళు పెట్టి వేళ్ళు నాయనా అని అన్నారు ఆయన అలాగే అని అతని కాళ్ళను ప్రక్కన ఉంచినాడు మన ధర్మ పాలుడు 

ఆశ్చర్యం ఆయన కాళ్ళు ఎక్కడ పెట్టాడో అక్కడ ఇంకొక శివలింగం ఉద్బవించింది. అక్కడినుండి ఇంకోచోటికి మరల్చాడు అక్కడకూడా ఇంకో లింగం వచ్చింది అట్లా ఆయన కాళ్ళు ఎన్ని చోట్లకు మార్చినా అన్ని చోట్ల శివలింగాలు పుట్టటం వాటిమీదనై ఆయన కాళ్ళు ఉండటం గమనించి మన ధర్మపాలునికి మతి పోయింది స్వామి తమరు ఎవరు ఈ చిత్రం ఏమిటి తెలియచేయమని  వేడుకున్నాడు. 

అప్పుడు ఆ జ్ఞ్యాని ఇలా న్నారు నాయనా నీవు కేవలం శివలింగంలోనే భగవంతుని చూస్తూవున్నావు అన్ని నేను ఈ జగత్తు మొత్తంలో భగవంతుని చూస్తూవున్నాను ఇప్పుడు చెప్పు నేను నా కళ్ళను శివలింగం లేని చోట యెట్లా పెట్టాలో అని అన్నారు. 

అప్పుడు మన ధర్మ పాలుడు ఆ మహా జ్ఞ్యానికి పాదాక్రాంతుడై తనకు బ్రహ్మ జ్ఞనాన్ని బోధించ వలెనని వేడుకొనినాడు. 

కాబట్టి సాధక మిత్రమా ఎప్పుడైతే సాధకుడు తన సాధనలో ముందుకు వెళతాడో అప్పుడు ఏకత్వం సిద్ధిస్తుంది ఆ సిద్దె మోక్ష సిద్దిగా మన మహర్షులు పేర్కొన్నారు.    

ప్రతి సాధకుడు సదా జాగరూకుడై వుండి విచక్షణతో మెలగాలి సాధన సంపత్తితోమోక్షపదాన్ని చేరాలి.

 ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు 

మీ భార్గవశర్మ

తెలుసుకుందాం

 *దర్గాలంటే ఏంటి అని తెలుసుకుందాం*🙏


ఈ పోస్ట్ చదవకపోతే, మోసపోతూనే ఉంటాం.

"దేవో దుర్బల ఘాతుకః"

అప్పుడు మనల్ని దేవుడు కూడా బాగుచేయలేడు.


*👉దర్గాలో ఉండెది హజ్రత్ లు అంటే?*


*మన హిందూ పూర్వీకులను హత్యలు, మానభంగాలు, హిందూ దేవాలయాల ధ్వంసం చేసే రాక్షసుల సమాధులు...*


ఇప్పట్లో బాగా చదువుకున్న PHD, MBBS, M-TECH చేసిన వారికి, ఆయా కోర్సులకు సంబంధించి "డిగ్రీ పట్టా"లాంటివి అందజేస్తుంటారు..!!


👉 "ముస్లిం" ఆక్రమణదారుల పాలనలో ఉన్న సమయంలో... 


ఎవరైనా ముస్లిం సైనికుడు గానీ, సైనికాధికారి గానీ హిందువులను కనీసం "100 మంది"కి పైచిలుకు, విచ్చలవిడిగా హత్యలు చేసి ఉంటే... అటువంటి సైనికుడ్నీ, ఆ అధికారినీ, ఆ ముస్లిం రాజులు, "హజ్రత్" అనే బిరుదుతో సత్కరించి...

ఆ రాజు ఆస్థానంలోని ఏదైనా ప్రదేశానికి "మెజిస్ట్రేట్"గా నియమించి అక్కడి పన్ను వసూళ్ళూ, పాలనా వ్యవహారాలను వారికందించేవారు.


అందుకే మీకెక్కడైనా దర్గాలు కనిపిస్తే,

ఒకసారి చూడండి.

అక్కడ వాళ్ళ పేరుకు ముందు "హజ్రత్" అని రాసి ఉంటుంది..!!


ఉదాహరణకు:-

హజ్రత్ సయ్యద్, హజ్రత్ హుస్సేని ఆలం, హజ్రత్ అలీ ఖాన్, ఇలా దర్గాలకు పేర్లుంటాయి.


ఈ "హజ్రత్"లు స్థానిక హిందూ యువతులపై విచ్చలవిడిగా అత్యాచారాలకు పాల్పడేవారు. "చిన్న చిన్న ఆడ పిల్లల్ని" ఇంట్లోకి దూరి కుటుంబ సభ్యుల ముందే, ఇంట్లోని పెళ్ళికాని ఆడపిల్లల్ని, వితంతువుల్ని ఎత్తుకుపోయేవారు. *"అందుకే హిందువులు బాల్యవివాహాలు మొదలుపెట్టారు. వితంతువులు సతీసహగమనం చేసేవారు".* కానీ మన చరిత్ర పుస్తకాలలో "బాల్యవివాహాలు, సతిసహగమనం" దురాచారాలు అని చెప్పారు కానీ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆ పరిస్థితిని చెప్పలేదు.

మరి "బురఖా" కప్పుకోవడం మతాచారం ఎందుకు అయింది?

దురాచారం ఎందుకు కాలేదు?

నలుగురిని పెళ్లి చేసుకోవడం, నలుగురిని కనడం ఎందుకు దురాచారం కాలేదు? 


మన చరిత్ర పుస్తకాలను రాసిన వారు కూడా ముస్లింలే? కావాలంటే గూగుల్ లో "who is first Indian education minister"? అని టైప్ చేసి సెర్చ్ చేయండి. Maulana Abul Kalam Azad అనే ముస్లిం పేరు వస్తుంది. ఆయన మక్కాలో పుట్టారు. మదర్సాలో చదువుకున్నారు. ఆయన 10 సంవత్సరాల 160 రోజులు భారతదేశ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఇది కూడా గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. వీళ్లు మొగలులు బ్రిటిష్ వారు గొప్పవారు అని రాశారు తప్ప, అసలు సిసలైన భారతీయ సంస్కృతి, చరిత్రను, భారతీయ రాజుల గురించి పూర్తిగా లేకుండా చేశారు.


వీరికి ఎవరిమీదైనా కన్నుబడితే...

ఆ అమ్మాయి వీరు పిలిస్తే, తప్పక వెళ్ళాల్సిందే... 

లేకపోతే పరిస్థితి వేరేలా ఉండేది..!!


ఇంకా కొత్తగా పెళ్ళైన జంట, వీళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాల్సి వొచ్చేది... 


అలా ఆశీర్వాదాల కోసం వెళ్ళినపుడు, పెళ్ళి కూతురు ఎవరైనా. ఈ "హజ్రత్"లకు నచ్చితే, అటువంటి ప్రతీ అమ్మాయి, ఒక్కతే పూజ పేరుతో మొదటి రాత్రి అతనితో గడపాల్సి వొచ్చేది..!!


అంతే కాకుండా 


ఆ ప్రాంతంలో వీరు అవసరమైనప్పుడల్లా విచ్చలవిడి వసూళ్ళకూ, దోపిడీలకూ పాల్పడుతూ ఉండేవారు..!! హిందువుల ముఖ్యంగా వాళ్లు కష్టపడి సంపాదించిన సంపదను దేవాలయాలలో దాచుకునేవారు. వీళ్ళు ఆ దేవాలయాలను కూడా వదలకుండా దోపిడీ చేసేవారు, అడ్డు వచ్చిన వారిని చంపేవారు.


ఉదాహరణ:-

వేములవాడ రాజన్న దేవాలయం.

హజరత్ సయ్యద్ కాజా అనేవాడు, శివరాత్రి రోజున వేములవాడలో పూజలు జరుగుతున్న సమయంలో, శివలింగంపై మూత్ర విసర్జన చేసాడు. అది చూసిన అక్కడి భక్తులు వాడిని చంపేశారు. అప్పట్లో ముస్లిం రాజులు పరిపాలనలో ఉన్న సమయంలో అక్కడికి ముస్లిం రాజు వచ్చి, అతడి శవాన్ని అక్కడే పూడ్చిపెట్టి, మీరు ముందు సమాధిని (దర్గాను) దర్శించిన తర్వాతే మీ దేవుడి దర్శనానికి వెళ్లాలని, అలా మొగలుల కాలంలో అక్కడ సుఫీ దర్గా వచ్చింది. పీకల మీద కత్తులు పెట్టి, మొక్కేలా చేశారు, బానిసత్వాన్ని అలవాటు చేశారు. అది ఇప్పటికీ అలాగే మన రక్తంలో ఉండిపోయింది.


అలా ఏర్పడ్డవే ఈ "ముస్లిం దర్గాలు"..!!


ఆ ప్రాంతంలోని వారందరూ ఆ "దర్గా"కి "దినా"లనాడు డబ్బులు సమర్పించడం, పూజలు చెయ్యడం లాంటివి చేసి.

ఆ "హజ్రత్ దర్గాల"పైన తమ భయభక్తులూ, గౌరవ మర్యాదలూ చాటుకునే వారు..!!


👉 ఇదే పద్ధతి ఇప్పటికీ దేశంలో చాలా చోట్ల కొత్తగా పెళ్ళైన జంట, ఏదైనా కోరికలున్న వాళ్ళు మొక్కులు మొక్కుకుంటూ.

అక్కడికి వేళ్తే తమ కోరికలు నెరవేరి, తమకు అంతా మంచే జరుగుతుందని భ్రమపడుతూ ఉంటారు.


👉 "నిజాముద్దీన్ దర్గా"... దాని పేరుతో ఉన్న స్పెషల్ ట్రైన్ గురించి (నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్) మీకు తెలియదా?


ఈ దర్గాలకు వెళ్ళడం అచ్చంగా "హిందూబానిసత్వ లక్షణం"


*దర్గా గురించి తెలుసుకున్నాం కనుక, ఇప్పుటి నుండి దర్గాలకు వెళ్ళడం మానుకుందాము.*

*ఈ విషయాన్ని మన హిందువులందరికీ తెలియజేద్దాం.*

🚩🚩జై శ్రీరామ్ 🚩🚩

   🙏🙏🙏



https://kutumbapp.page.link/ytHzGhfUaz3A953w5?ref=F4LTY

Save Hinduism


 


 

రాజలక్ష్మి మెడికల్ కాలేజీ హాస్పిటల్.*

 ఇది నిజమేనా🥱💃....


🔷దయచేసి అందరికి షేర్ చేయండి*


🔷స్టార్ హోటల్ లాంటి హాస్పిటల్*


 

 🔷చెన్నై శ్రీపెరంబుదూర్ సమీపంలో ఉంది! అది రాజలక్ష్మి మెడికల్ కాలేజీ హాస్పిటల్.*


🔷 శారీరక సమస్య కారణంగా, ఒక వ్యక్తి స్నేహితుడితో వెళ్లాడు! మీరు ప్రవేశించిన వెంటనే, అడ్మిషన్ నుండి స్పెషలిస్ట్ డాక్టర్ వద్దకు తీసుకెళ్లడానికి ఇద్దరు సిబ్బంది ఉన్నారు.*


🔷ఒక్కో విభాగానికి కనీసం 4 మంది వైద్యులు. ఫస్ట్ క్లాస్ చికిత్స అంటే ఏమిటో ఇక్కడ తెలుసుకోండి!*


🔷అతన్ని చాలా ఆశ్చర్యపరిచిన విషయం..*


🔷1. వైద్య రుసుము లేదు.*


🔷2. ప్రవేశ రుసుము లేదు.*


3. అడ్మిషన్ తర్వాత, రోగి ఇంటికి వెళ్లే వరకు ఆహారం మరియు మాత్రల గది ఉచితం. ఆహారమే కాదు రుచికరమైన ఆహారం.*


4. ఎక్స్ రే, డిజిటల్ ఈసీజీ, వీడియో ఎండోస్కోపీ, యాంజియోగ్రామ్ అన్నీ ఉచితం.


5. అన్ని శస్త్రచికిత్సలు ఉచితం.*


మందులు కూడా ఉచితం


🔷చాలా పరిశుభ్రమైన ఆసుపత్రి. అద్భుతమైన సంరక్షణ.*


🔷నా స్నేహితుడికి చిన్నపాటి ఆపరేషన్ అవసరమని చెప్పారు. 4 రోజులు ఉండాలి. అపోలోలో లక్షన్నర. పోరూర్ రామచంద్రలో 84,000, మరో చిన్న ఆసుపత్రిలో 45,000. అయితే ఇక్కడ ఇది ఉచితం మరియు స్కాన్, ECG, మందులు ఇలా అన్నీ ఉచితం*


 *దయచేసి ప్రచారం చేయండి.*


🔷రాజలక్ష్మి మెడికల్ కాలేజీ హాస్పిటల్ - చెన్నై (శ్రీపెరంబుదూర్) -


 🔷 ప్రజలందరూ ఆసుపత్రికి వెళ్లేందుకు అన్ని గ్రామాల నుండి ఉచిత బస్సును నడుపుతున్నారు మరియు ఆపరేషన్లు పూర్తిగా ఉచితం.*

*(ఫోన్:- 6364109600

* 9994648533) ************************* _*దయచేసి దీన్ని ఫోరమ్ గ్రూపులకు పంపడం ద్వారా సహాయం చేయండి... ధన్యవాదాలు ..*_

సృష్టి యొక్క అద్భుతం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*ఒక ఆదివారం ఉదయం ఒక ధనవంతుడు తన బాల్కనీలో సూర్యరశ్మిని, కాఫీని ఆస్వాదిస్తూ కూర్చున్నాడు. బాల్కనీ యొక్క ఒక వైపు నుండి మరొక వైపుకు వెళుతున్న ఒక చిన్న చీమ దాని పరిమాణం కంటే అనేక రెట్లు పెద్దదైన ఆకును మోసుకెళ్లుతున్నది. ఆ వ్యక్తి గంటకు పైగా దానిని చూశాడు. చీమ తన ప్రయాణంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంటూ ఆగి దారి మళ్లించి గమ్యం వైపు వెళ్ళింది. ఒకానొక సమయంలో ఆ చిన్న జీవికి నేలలో పగుళ్లు కనిపించాయి. కాసేపు ఆగి విశ్లేషించి ఆ తర్వాత పెద్ద ఆకును ఆ పగులు మీద ఉంచి ఆకు మీద నడిచి అవతలి వైపుకు వెళ్లి ఆకును తీసుకొని మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగించింది. దేవుని సృష్టిలో చిన్న జీవులలో ఒకటైన చీమ యొక్క తెలివితేటలకు ఆ వ్యక్తి ఆకర్షితుడయ్యాడు. ఈ సంఘటన అతనిని విస్మయానికి గురి చేసింది మరియు సృష్టి యొక్క అద్భుతం గురించి ఆలోచించేలా చేసింది. అది సృష్టికర్త గొప్పతనాన్ని చూపించింది. అతని కళ్ళ ముందు దేవుని యొక్క ఈ చిన్న జీవి ఉంది పరిమాణం తక్కువగా ఉంది కానీ విశ్లేషించడానికి, ఆలోచించడానికి, తర్కించడానికి, అన్వేషించడానికి, కనుగొనడానికి మరియు అధిగమించడానికి మెదడును కలిగి ఉంది. కొద్దిసేపటి తరువాత ఆ జీవి తన గమ్యాన్ని చేరుకున్నట్లు ఆ వ్యక్తి చూశాడు. అదే దాని భూగర్భ నివాసానికి ప్రవేశ ద్వారం ఉన్న నేలలో ఒక చిన్న రంధ్రం. ఈ సమయంలోనే చీమ యొక్క లోపం ఆ వ్యక్తికి తెలియ వచ్చింది. చీమ తాను జాగ్రత్తగా గమ్యస్థానానికి తీసుకు వచ్చిన పెద్ద ఆకును చిన్న రంధ్రంలోకి ఎలా తీసుకెళ్లగలదు? దానికి అది సాధ్యంకాలేదు! అందుకని ఆ చిన్న ప్రాణి ఎంతో కష్టపడి, మరెంతో శ్రమించి, మార్గమధ్యంలో అన్ని కష్టాలను అధిగమించి తెచ్చిన పెద్ద ఆకును వదిలేసి ఖాళీచేతులతో ఇంటికి (రంధ్రంలోకి) వెళ్లిపోయింది. చీమ సవాళ్లతో కూడిన తన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ముగింపు గురించి ఆలోచించలేదు. చివరికి ఆ పెద్ద ఆకు దానికి భారంగా మారింది తప్ప ఉపయోగపడలేదు. ఆ జీవి తన గమ్యాన్ని చేరుకోవడానికి దానిని విడిచి పెట్టడం తప్ప వేరే మార్గం లేదు. ఆ రోజు ఆ వ్యక్తి గొప్ప పాఠం నేర్చుకున్నాడు. మన జీవితాలకు సంబంధించిన సత్యం కూడా అదే. మనము మన కుటుంబం గురించి చింతిస్తాము. మన ఉద్యోగం గురించి చింతిస్తాము. ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలి.  ఎక్కడ నివసించాలి. ఎటువంటి వాహనం కొనాలి. ఎటువంటి దుస్తులు ధరించాలి. ఏ ఉపకరణాలను మేలైనవి కొనాలి అని ఆలోచించి మన గమ్యం (సమాధి) చేరుకోగానే వీటన్నిటినీ వదిలేస్తాం. మన జీవిత ప్రయాణంలో వాటిని కోల్పోతామనే భయంతో, ఎంతో శ్రద్ధతో మోస్తున్న భారాలు మాత్రమేనని, చివరికి అవి నిరుపయోగంగా పడి ఉంటాయని, వాటిని మనతో తీసుకెళ్లలేమని మాత్రం గ్రహించలేము! అందుకే ఒకసారి ఆలోచించండి!*

🙏🏼🙏🏽🙏🏼

*సేకరణ:- వై.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 89*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 89*


ఆ స్వాగత ద్వారము అపూర్వ శిల్పకళా నైపుణ్యము ఉట్టిపడుతూ చూపరుల ప్రశంసలను అందుకుంటోంది. ఆ ద్వారము మధ్య భాగంలో నిర్మించబడిన పద్మము చాలా పెద్దది. 'ఊరేగింపు ఆ ద్వారం మధ్యకు రాగానే ఆ పద్మము రేకులువిచ్చుకుంటాయని, దాని మధ్య నుండి అపూర్వ పుష్ప వర్షము చక్రవర్తిపై కురుస్తుందని' ఆ ప్రాంతాన గుమిగూడిన ప్రజలు చెప్పుకోవడం చాణక్యుని చెవుల పడింది. 


"ఆ ద్వారము నిర్మించిన వారు ఎవరు ?" అని చాణక్యుడు అడిగిన ప్రశ్నకు "దారువర్మ" అని ఎవరో జవాబిచ్చారు. చాణక్యుడు తల తిప్పి ఆ జవాబు ఇచ్చిన వానివైపు చూసాడు. చాణక్యుని దృష్టి తన మీద పడగానే ఆ వ్యక్తి చిరునవ్వు నవ్వాడు. ఆ వ్యక్తి ప్రచ్చన్న దుస్తుల్లో ఉన్న సేనాని బాగురాయణుడు. 


చాణక్యుడి పెదాల మీద వికృత మందహాసమొకటి తళుక్కున మెరిసి మాయమైంది. అతడు తన గుర్రాన్ని పక్కకు తప్పించి రాజమార్గం ప్రక్కన జనం వెనక నిలిపాడు. 


ఊరేగింపు క్రమంగా ఆ ద్వారాన్ని సమీపించింది. ఒక్కొక్క బృందమే ద్వారం క్రిందినుంచి సాగిపోతోంది. భద్రగజం చంద్రరేఖ ద్వారాన్ని సమీపించింది. జనాలు బిగ్గరగా "జయహో... చంద్రగుప్త మహారాజ్ కి జయ... జయ.." అంటూ ఉత్సాహంతో నినాదాలు చేస్తున్నారు. 


చాణక్యుడు జనం చాటునుంచి రెప్పవాల్చకుండా ఆ ద్వారం మధ్యన అమర్చిన యాంత్రిక పద్మం వైపు చూస్తున్నాడు. చంద్రరేఖ సరిగ్గా యాంత్రిక పద్మం క్రిందికి వచ్చింది. 


అప్పుడు... అప్పుడు... 


చంద్రోదయాన్ని కాంచగానే వికసించిన కమలంలా పద్మం రేఖలు యాంత్రికంగా విచ్చుకున్నాయి. విచ్చుకున్న పద్మదళాల మధ్యనుంచి పుష్ప వర్షం కురుస్తోంది. పుష్ప వర్షం మధ్య నుంచి మెరుపులా భద్రగజం మీదకి దూకాడో వ్యక్తి. అతడు ఏనుగు మీదికి దూకుతూనే బొడ్డులోంచి బాకుతీసి మహారాజు గుండెల్లో పొడిచాడు. 


"అడుగో వాడే దారువర్మ... చక్రవర్తిని పొడిచేశాడు..." 


అరుపులతో పాటు మహారాజు గిలగిలా తన్నుకుంటూ భద్రగజం పైనుంచి కిందికి జారి నేలమీద పడి ప్రాణాలు వదిలాడు. అతడి ముఖానికి అడ్డుగా వ్రేలాడుతున్న పూలహారాలు తొలగిపోయాయి. అతను చంద్రగుప్తుడు కాడని అందరికీ అర్థమైంది. 


"వాడే దారువర్మ... హంతకుడు... వధించండి..." జనం వెనుకనుంచి భీకరస్వరంతో గర్జించాడు చాణక్యుడు. అంతలో భద్రగజానికి ఇరువైపులా అంగరక్షకులుగా వస్తున్న పర్వతక సైనికులు వైరోచనుడి మృతదేహాన్ని చూసి ఆవేశపడుతూ "మోసం ... కుట్ర... ఇదంతా మాగధుల వంచన ... దెబ్బకి దెబ్బ... రక్తానికి రక్తం..." అని అరుస్తూ కత్తులు దూశారు. అదే సమయంలో బాగురాయణుడి సైగలు అందుకొని, జనం వెనుకనుంచి ముందుకు వురికిన మగధసైనికులు వైరోచనుడి అంగరక్షకులను ఎక్కడున్న వాళ్ళని అక్కడే, ఎలావున్న వాళ్ళని అలా నరికి పారేశారు. 


ఆ గొడవ, గందరగోళాలకి భద్రగజం బెదిరి చిందులు తొక్కింది. ఆ కుదుపులకు దానిపైనుంచి దారువర్మ జారి క్రిందపడ్డాడు. భద్రగజం చంద్రరేఖ తన కాళ్ళతో దారువర్మని దారుణంగా తొక్కి చంపేసింది. అదంతా కొద్ది క్షణాలలోనే ... 'ఏం జరిగిందో' జనం గ్రహించే లోపే జరిగిపోయింది... అంతలో... 


"జయహో ... మౌర్య చంద్రగుప్త సార్వభౌమా.... జయహో... జయహో..." అంటూ పెద్ద పెట్టున నినాదాలు ప్రతిధ్వనించసాగాయి. 


అశ్వారుడుడై వేగంగా అక్కడికి చేరుకున్నాడు చంద్రగుప్తుడు. అంతలో రాచబాటపై పడివున్న పర్వతసైనిక మృతదేహాలను మగధసైనికులు క్షణంలో తొలగించివేశారు. చాణక్యుడు జనం మధ్యనుంచి ముందుకు వచ్చి భద్రగజం పైనున్న మావటికి సైగచేశాడు. మావటివాడు భద్రగజాన్ని చంద్రుని సమక్షంలో కూర్చుండబెట్టాడు. 'భద్రగజాన్ని అధిరోహించమన్నట్టు' చిరునవ్వుతో చంద్రుని సూచించాడు చాణుక్యుడు. 


చంద్రుడు మోకాళ్ళమీద వంగి చాణక్యుడికి నమస్కరించాడు. చాణక్యుడు అపరిమితమైన వాత్సల్యంతో చంద్రుని లేవదీసి కౌగిలించుకున్నాడు. ఆ అపూర్వ దృశ్యాన్ని చూస్తూ... 


"జయహో .... మౌర్య చంద్రగుప్త సార్వభౌమా .... జయహో .... జయహో ...." 


"జయహో... మౌర్య సామ్రాజ్య స్థాపనాచార్యా.... ఆర్యచాణక్యదేవా .... జయహో.... జయహో..." 


దశదిశలా ప్రతిధ్వనించేలా ఆ ప్రజల నినాదాలు మిన్నుముట్టుతుండగా... వైతాళికులు జయగీతికలు ఆలపిస్తుండగా చంద్రగుప్త మౌర్యుడు ఆర్యచాణక్యుల వారి ఆదేశానుసారం భద్రగజం చంద్రరేఖని అధిరోహించాడు. మరుక్షణం మంగళతూర్య భేరి నినాదాలు ఉధృతంగా ప్రతిధ్వనిస్తూ ఉత్సాహపూరిత వాతావరణాన్ని వుత్తేజితం చేశాయి. 


చాణక్యుడు చరచర ముందుకెళ్లి వేదాంగ వేత్తలు, పండిత, పురోహిత బృందంతో కలిసి వేద పఠనం చేస్తూ ముందుకు నడిచాడు. మాగధుల జయహోషలతో, దారిపొడవునా పూలవర్షపు జల్లులతో సాగిన ఊరేగింపు సుగాంగ ప్రసాదాన్ని చేరుకుంది. 


రాజపురోహితులు, పండితులు, ' పనస ' చదువుతూ పూర్ణకుంభంతో చంద్రగుప్తునికి స్వాగతం పలికారు. సముద్రతరంగంలా పోటెత్తిన జయజయధ్వనుల మధ్య సుగాంగ ప్రాసాదంలో అడుగుపెట్టాడు చంద్రగుప్తుడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

దశ మహా విద్యలు

 దశ మహా విద్యలు - వాటి ఫలితాలు.

1. తొలి మహా విద్య శ్రీకాళీదేవి

🌟కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్రేయసంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది.

2వ మహావిద్య శ్రీతారాదేవి

🌟దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది.

3వ మహా విద్య శ్రీషోడశీదేవి

🌟అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి.

4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి

🌟దశ మహావిద్యలలో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.

5వ మహావిద్య శ్రీ త్రిపుర భైరవీ దేవి

🌟దశమహావిద్యలలో 5వ మహా విద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీ దేవి. ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్జిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పారాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది.

6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి

🌟దశ మహావిద్యలలో 6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచినీ, ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. శాక్తేయ సంప్రదాయంలో భిన్నమస్తాదేవికీ ఎంతో ప్రశస్తివుంది. ఈ దేవిని నిష్టతో ఉపాసిస్తే సరస్వతీసిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది.

7వ మహావిద్య శ్రీ ధూమవతీ దేవి

🌟దశ మహావిద్యలలో 7వ మహావిద్య.. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతి దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.

8వ మహావిద్య శ్రీ జగళాముఖీ దేవి

🌟దశమహావిద్యలలో 8వ మహావిద్య.. పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీ జగళాముఖీ దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.

9వ మహావిద్య శ్రీ మాతంగీదేవి

🌟దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య.. మరకతమ వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీదేవి కి చెందింది. వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్చిష్టచండాలి, అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.

10వ మహావిద్య శ్రీ కమలాత్మికాదేవి

🌟పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రశస్తిపొందింది. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన ఈదేవికి మార్గశిరే అమావాస్యతిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది

మూర్ఖజనచిత్తమును

 శుభోదయం🙏


మూర్ఖజనచిత్తమునుమార్చుటకష్టము!


మకరముఖాంతరస్థమగు మానికమున్బెకలింపవచ్చు బా

యక చలదూర్మికా నికరమైన మహోదధి

దాటవచ్చు,మ

చ్చికగొని పూలదండవలె సర్పమునైన ధరింపవచ్చు ,మ

చ్చికఘటియించి మూర్ఖజన చిత్తముదెల్ప నసాధ్సమేరికిన్!

భర్తృహరి సుభాషితములు.మూర్ఖపధ్ధతి.


       లోకంలో అసాధ్యమైనవెన్నో సుసాధ్సంచేయవచ్చు.కానీ,మూర్ఖునిహృదయాన్ని మాత్రం మార్చలేం.

           ఎలాగంటారా? అయితే వినండిమరి.

   మొసలి బహు భయంకరమైనది 

దానినోరోభయంకర క్రకచం.అంటే రంపం. అలాంటి దానినోటిలో చేయిపెట్టి

అందున్న మాణిక్యమునైనా సులువుగా తీయటంసులువు.

          ఉత్తాలవిశాలచలత్తరంగాలతో మహా భయదమైన సముద్రమునైనా సునాయాసంగా దాటటంతేలిక,

         కంఠదఘ్నమైన ఆశీవిషంతోకూడిన భయంకరమైనసర్పమునైనా పూలదండవలె ధరించటం సుకరం. కానీ

మూర్ఖునిహృదయాన్ని మార్చటంమాత్రం చేతగానిపనే!!!🙏🙏🙏

నిజాలు

 *కొన్ని..... నిజాలు:*


యవ్వనంలో ఉన్నప్పుడు *"మొటిమల్ని"* గురించి బాధపడే వాళ్ళం! 


ముసలితనం వచ్చినప్పుడు  *"ముడతల్ని"*  గురించి బాధపడుతుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు *"ఆమె"* చెయ్యి పట్టుకోవాలని ఆశతో ఎదురుచూసే వాళ్ళం!


ముసలితనం వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి *"చేయి"*  పట్టుకుంటారా....అని ఎదురు చూస్తుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను *"ఒంటరిగా"* వదిలేస్తే బాగుండును...అనుకునేవాళ్ళం!


ముసలితనం వచ్చినప్పుడు అందరూ *"ఒంటరిగా"* వదిలేస్తారేమో.... అని బాధపడుతుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైనా సలహాలు ఇస్తే *"చికాకు"* పడేవాళ్ళం!


ముసలితనం వచ్చినప్పుడు ఎవరూ కనీసం *"మాట్లాడటం"* లేదే అని బాధపడుతుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు *"అందాన్ని"* ఆస్వాదించే వాళ్ళం!


ముసలితనం వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రతి దాంట్లోనూ *"అందాన్ని"* చూసుకుంటుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు నాకు *"చావు"* లేదు అనుకుంటాం!


ముసలితనం వచ్చినప్పుడు .... *"రోజులు దగ్గర పడ్డాయి"* అని బాధపడుతుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు స్నేహితులతో *"ప్రతి క్షణాన్ని"* పండగ చేసుకునే వాళ్ళం!


ముసలితనం వచ్చినప్పుడు ఆ *"తీపి జ్ఞాపకాల్ని"*  నెమరు వేసుకుంటుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు *"నిద్రలేవడం"* కష్టంగా ఉండేవాళ్ళం!


ముసలితనం వచ్చినప్పుడు *"నిద్రపోవడానికి"* కష్టపడుతుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు ధైర్యంగా *"గుండెల మీద"* పిడిగుద్దులతో  గుద్దుకునే వాళ్ళం!


ముసలితనం వచ్చినప్పుడు ఈ *"గుండె ఎప్పుడు ఆగి పోతుందో"*  అని భయపడుతుంటాం!!


కనుక........


జీవితంలో రకరకాల *"ఆటు పోట్లు"* వస్తుంటాయి. 

దేనికీ భయపడ కూడదు. 


ధైర్యంగా ఎదుర్కోవడమే జీవిత లక్ష్యం  కావాలి.

 అదే నిజమైన *"జీవితానుభవం".* 


అది *"యవ్వనంలో"* నైనా.. *"ముసలితనంలో"* నైనా.....అన్న సత్యాన్ని గ్రహిస్తే జీవితం చాలా *"ప్రశాంతంగా"*  ఉంటుంది.


అందుకే, మిత్రమా....


 *యవ్వనంలో..... విర్రవీగకు!*

*వృద్దాప్యంలో..... బాధ పడకు!!*