10, నవంబర్ 2018, శనివారం

రాముడు కృష్ణుడు

పూర్వం సీతానగరం అనే ఒక చిన్న  గ్రామంలో ఒక ఆమె ఉండేది ఆమె పేరు పార్వతి.  ఆమెకు ఒక చిన్న పిల్లవాడు పేరు రాముడు. దాదాపు 10 సంవత్సరాల లేత వయస్సు వాడు వుండే వాడు. ఆమె భర్త రెండు సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఆమె వక్కతె తన పిల్లవాడితో జీవితాన్ని గడుపుతున్నది.  ఊర్లో యేవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళ బ్రతుకు యిడుస్తున్నరు.  పిల్లవాడికి ఇప్పుడిప్పుడే ఊహలు వస్తున్నాయి. వాళ్ళ ఊరిలో పాఠశాల లేనందున అక్కడికి దగ్గరలోని కొంచం పెద్ద ఊరుకి వెళ్లి చదువుకోవాలి. రాముడిని కూడా పార్వతి ప్రక్కవూరైన నాగలూరుకి పిల్లవాన్ని పాఠాశాలలో చదివించటానికి పంపింది. ఆ రెండు ఊర్ల మధ్య ఒక దట్టమైన అడవి వున్నది. ఆ అడ్డవి దాటితేనే కానీ నాగలూరు రాదు.  రాముడు చిన్న పిల్ల వాడు మరియు వాళ్ళు పేదవారు కావటంతో రాముడిని వెంట తీసుకొని వెళ్ళటానికి మిగితా పిల్లలు వప్పుకొనెవారు కాదు.  పాపం పార్వతి ఎంతోమంది పిల్లలని వాళ్లతోపాటు తన రాముడిని కూడా తీసుకొని వెళ్ళమని వేడుకొనేది కానీ వాళ్ళు సరే అన్న రాముడిని మాత్రం వెంట తీసుకొని వెళ్లే వారు కాదు.  దానితో ఎంతో ప్రేమగా రాముడితో పార్వతి నాన్నా నీవు పెద్ద వాడివి అయ్యావు నీకు ఏమి భయం లేదు నీవు వంటరిగా వెళ్లగలవు అని ఎన్నో రకాలుగా చెప్పి చూసింది.  సరే అనిఅన్నా రాముడికి ఆ అడవి దాటాలంటే చాలా భయం వేసేది. యేవో సాకులు చెప్పి తరచూ బడి ఎగ్గొట్టేవాడు.  దానితో పార్వతికి ఏమి చేయాలో తోయక ఒకరోజు ఈ విధంగా చెప్పింది.  నాన్న రాము నీకు అడవిలో ఒక అన్నయ్య వున్నాడు అతని పేరు కృష్ణుడు.  నీకు అడవి దాటి వెళ్ళేరప్పుడు నీకు తోడుగా ఉండమని నేనుచెప్పాను.  నీకు భయం వేస్తే నీవు పిలిస్తే వెంటనే నీకు సాయంగా వస్త్తాడు అని ఇంట్లో వున్నా కృష్ణుని విగ్రహం చూపించింది.  ఆ మరుసటి రోజు పొద్దున్నే రాముడు లేచాడు కాలకృత్యాలు తీర్చుకొని ఉత్సాహంగా తయారయ్యాడు. చద్దన్నం పెట్టి పిల్లవాడి రెండు బుగ్గలని ఎడమచేతితో పట్టుకొని బొట్టుపెట్టి రాముడిని బడికి పంపింది పార్వతి.  పార్వతికి రాముడి ఉత్సాహంచూసి ముచ్చటేసింది.  రాముడు ఒంటరిగా అడవిదారి నుండి బడికి బయలుదేరాడు.  అతని కన్నులు తన కొత్త అన్నయ్య క్రిష్నుడి కోసం వెతక సాగయ్యే.  నిజంగా కృష్ణ అన్నయ్య ఉన్నాడా తాను వచ్చి తనను అడవి దాటిస్తాడా అని ఆలోచిస్తూ అడవిలో నడుస్తున్నాడు రాముడు.  ఇంతలో ఎక్కడినుండి వచ్చిందో ఒక పెద్ద శబ్దం ఏదో క్రూరమృగం అరుపు.  ఆ అరుపుకి రాముడి ఫై ప్రాణాలు పైనే పోయాయి.  వెంటనే పెద్దగా అన్నయ్య కృష్ణ అన్నయ్య అని తన శెక్తి ఉన్నంత పెద్దగా పిలిచాడు.  ఎవ్వరు రాలేదు భయంతో వణికి పోతున్నాడు.  ఏమి చేయాలో పాలు పోలేదు. మళ్ళా బిగ్గరగా కృష్ణ అన్నయ్య అని పిలిచాడు.  ఈసారి తన గొంతే కొండలనుండి తెరిగి తనకి వినిపించింది.  రాముడు అరచి అరచి సొమ్మసిల్లి మూర్ఛ పోయాడు.  ఏమైందో ఏమో తాను లేచే సరికి తన ప్రక్కన ఎంతో ప్రశాంతంగా వున్నా ఒక వ్యక్తి వున్నాడు.  ఆటను అచ్చంగా ఇంట్లో వున్నా క్రింష్ణుడి విగ్రహంలానే వున్నాడు.  వెంటనే రాముడు అన్నయ్య కృష్ణ అన్నయ్య అన్నాడు అప్రయత్నంగా దానికి తమ్ముడు నేను వచ్చాను నీకు ఏమి భయం లేదు  అన్నాడు. తన అన్నయ్య తన తోడు వున్నాడన్న ధైర్యం రాముడి మొఖంలో కొట్టొచిన్నట్లు కనపడ్డాడు.  రాముడు కృష్ణుడిని గట్టిగా కౌగిలించుకున్నాడు.  అన్నయ్య నీవు నన్ను వదిలి పోవద్దు అన్నాడు.  కృష్ణుడు రాముడి భుజం తట్టి రాము నీకేమి భయం లేదు ఈ అడవి దాటె వరకు నీకు తోడుగా వుంటాను, అంతేకాదు నీకు మంచి మంచి కథలు చెపుతాను అని రాముడి భుజం మీద చేయి వేసి నడుస్తూ భాగవతంలోని కథలు చెప్పుతూ అడవి దాటించాడు. ఆ రోజునించి రాయుడు ఏ విధమైన గొడవ చేయకుండా ప్రతి రోజు బడికి వెళ్లటం పార్వతికి ఆనందాన్ని ఇచ్చింది. కాని రాముడు భయం లేకుండా అడవి ఎలా దాటుతున్నాడో మాత్రం ఆమెకి తెలియలేదు. 
రాముడికి బడికి సెలవ ఇస్తే చికాగుగా ఉండేది. అమ్మా  రోజు బడి వుంటే యెంత బాగుంటుంది అన్నాడు.  వాడికి చదువు మీద కలిగిన శ్రద్ధకు పార్వతి నివ్వెర పోయింది.  రోజుకొక భాగవత కథ తల్లికి వినిపించేవాడు రాముడు.  దానికి కారణం ఏమిటో పార్వతికి అర్ధం కాలేదు.  నాన్న నీకు ఇన్ని కథలు ఎవరు చెప్పుతున్నారు.  మీ స్నేహితులకి ఎవరికి ఇవి తెలియవుకథ అన్నది పార్వతి.  దానికి రాముడు అమ్మ నీవు చెప్పినట్లే నాకు అడవిలో కృష్ణ అన్నయ్య నాతొ పాటు వచ్చి అడవి దాటించటమే కాకుండా నాకు రోజుకొక కధ చెపుతున్నాడు.  అమ్మ అన్నయ్య చాల మంచివాడు అన్నాడు.  అది విని పార్వతి నివ్వర పోయింది.  పిల్లవాడు చెప్పేది నిజామా కాదా అని ఆలోచనలో పెద్దది.  వాడు చెప్పింది నిజం కాకపోతే వాడికి అన్ని భాగవత కధలు ఎలా వస్తాయి? మీ అన్నయ్య ఎలా వున్నాడు అని వాడిని అడిగింది పార్వతి అమ్మ అచ్చంగా మన ఇంట్లో వున్నా కృష్ణుడిలాగానే వున్నాడు అన్నాడు రాముడు.  సందేహం లేదు తన పిల్లవానికి కృష్ణ భగవానుడు కనపడ్డాడు అనుకున్నది ఆ తల్లి.  
రాముడి తోటి పిల్లలకి కూడా రాముడు కొత్తకొత్త కధలు చెప్పటంతో నీకు ఎవరు ఇన్ని కథలు చెప్పారు అన్నారు.  రాముడు తన అన్న అడవిలో వున్నదని ఆ అన్నయ్యే కధలు చెప్పారు అన్నాడు.  ఐతే మీ అన్నయ్యని మాకు చూపించమని తోటి పిల్లలు రాముడిని అడిగారు. రాముడు అడవికి వాళ్ళని తీసుకొని వెళ్లి రోజు అన్నయ్యని కలిసే చోట పెద్దగా అన్నయ్య అన్నయ్య అని పిలిచాడు.  వాళ్ళకి వాడి గొంతే కొండలకి తాకి ప్రతిధ్వనించింది.  మళ్ళి మళ్ళి బిగ్గరగా పిలిచాడు రాముడు.  ఏమి ప్రయోజనం లేదు ఎంతసేపు పిలిచినా కృష్ణుడు రాలేదు.  అందరు రాముడిని నీకు అన్నయ్య లేడు ఎవరు లేరు నీకు పిచ్చి పట్టింది అని ఎగతాళి చేశారు.  రాముడు ఏడ్చుకుంటూ వాళ్ళ వెంట తన ఇంటికి వచ్చాడు.  ఏమి చేయాలో పాలు పోలేదు.  ఎందుకు అన్నయ్య తనకి ఈరోజు కనపడలేదు.  తనని తన స్నేహితులముందు చులకన చేసాడు అని వాడికి కృష్ణుడి పైన కోపం వచ్చింది.  వెంటనే తన ఇంట్లో కృషుడి విగ్రహం వున్నా గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని పెద్దగా ఏడవ మొదలు పెట్టాడు.  కానీ కృష్ణుడు కనపడలేదు.  అప్పుడు రాముడు తన తలను కృష్ణుడి విగ్రహం కాళ్ళ దగ్గర బాదుకోసాగాడు.  తలా పగిలి రక్తం కారుతుంది అట్లా కొంత సేపు ఐన తరువాత తమ్ముడు అనే పిలుపు వినిపించింది.  అదే పిలుపు తన అన్న కృష్ణుడి పిలుపు కానీ కళ్ళు తెరిచే ఓపిక లేదు తల మొత్తం రక్తంతో తడిసి వుంది.  అతి కష్టంగా కళ్ళు తెరచి చూసాడు రాముడు.  తన తలని వడిలో పెట్టుకొని నిమురుతూ వున్నాడు కృష్ణ అన్నయ్య.  అన్నయ్య చెయ్యి పడగానే రక్తం మొత్తం కనిపించకుండా పోయంది కొత్త శక్తీ వచినట్లయంది రాముడికి.  అన్నయ్య నీ మీద నాకు కోపం వచ్చింది నా స్నేహితుల ముందర నన్ను అవమానపరచవు అన్నాడు రాముడు.  తమ్ముడు నేను అందరికి కనపడను కేవలం నీ లాంటి మంచి వాళ్లకి మాత్రమే కనపడతాను.  నీ స్నేహితులు నీ లాగా మంచి వాళ్ళు కాదు వళ్ళంతా నిజమైన భక్తి లేని వాళ్ళు.  అందుకే నేను వాళ్లకు కనపడనని అన్నాడు.  రాముడికి తన అన్న మళ్ళి కనపడి తనను ఊరడించినందుకు చాల సంతోషం వేసింది.  అప్పడి నుండి రాముడు తన అన్న విషయం ఎవ్వరికీ చెప్పకుండా తాను తనలో తానే దాచుకొని అన్నయ్య ప్రేమను పొందాడు.  

ఈ కథగుర్చి:-
నేను 1977 వ సంవత్సరంలో చదివిన ఇంద్ర ధనస్సు అనే  మా అమ్ముమ్మ(జి. సీత దేవి)  గారి చిన్ననాటి తెలుగు పుస్తకంలోని ఒక కధ  ఆ పుస్తకంలో ఐదు కధలు వున్నాయి అన్ని ఒకదానికి మించి ఒకటిగా ఉంటాయి.  బహుశా 1930 దశకంలో అముమ్మ గారు  చదివినది కావచ్చు నాకు జ్ఞ్యాపకం ఉన్నంత వరకు నా ఊహతో చెప్పిన కధ, అసలు కధ కొంచెం భిన్నంగా వుండి  ఉండవచ్చు.  

5, నవంబర్ 2018, సోమవారం

శ్రీ రామాయణ రైలు

మన దేశంలో మొట్టమొదటిసారిగా మన సంస్కృతికి నిదర్శనంఐన రామాయణ ఘట్టాలను ఒకే ఒక రైలు ప్రయాణంలో చూసే అవకాశం మన కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ కల్పిస్తున్నది.  ఈ రైలుకి శ్రీ రామాయణ రైలు అని పేరు పెట్టటం విశేషం.  ఈ రైలు ఛార్జి రూ. 15,120 రైలు ఈ నవంబర్ 14వ తారీకునుండి నడుస్తుంది. ఈ రైలు ఢిల్లీ లోని స్ఫదరగంజి స్టేషన్ నుండి బయలుదేరి 16 రోజుల ప్రయాణం ముగించుకొని తిరిగి వాపసువస్తుందిముందుగా డిల్లీ నుండి ప్రారంభమై ఆయొధ్య, నందిగ్రాం, జనకపూర్, సీతామర్రి, ప్రయాగ, వారణాసి, చిత్రకూట్, శ్రింగవేరపుర్, నాసిక్, హంపి ల మీదగా రామేశ్వరం చేరుతుంది …. మరలా అక్కడి నుండి భక్తులను, విమానాల ద్వారా శ్రీలంకకు తీసుకువెళతారు. శ్రీలంకలొని సీతమ్మవారు ఉన్న అశొకవనం ప్రదేశాలను, రాయాయణ యుద్ధం జరిగిన ప్రదేశాలను, అత్యంత ప్రసిద్ధి చెందిన మునేశ్వరం దేవాలయం, రంబొడా, చిలావ్  లను చూపించి, తిరిగి విమానంలొ మన దేశానికి తీసుకు వస్థారు.
ఈ పర్యటనమెత్తం, రైల్వే అధికారులే దగ్గరుండి, ప్రయాణికులకు అన్నీ క్షేత్రాలను చూపిస్థారు. రైల్వే స్టేషన్ల నుండి బస్సుల ద్వారా, ఆయా పవిత్ర క్షేత్రాలకు తీసుకువెళ్ళి దైవదర్శనం, చారిత్రాత్మక కట్టడాలను, గురుతులను దగ్గరుండి చూపిస్థారు.  అంతేకాకుండా ఈ క్షేత్రాలలొని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలొ రాత్రి పూట బసచేసే అవకాశం కల్పిస్థారు. బుకింగులు మొదలైనాయి.  వివరాలకోసం irctc సైటు చుడండి.