1, జూన్ 2024, శనివారం

అర్జునుని ముఖం

 స్వజనులైన యాదవులను, శ్రీకృష్ణుని చూడాలని అర్జునుడు ద్వారకు వెళ్లి చాలా రోజులు పిమ్మట తిరిగి వచ్చాడు.


 అర్జునుని ముఖం తేజో హీనంగా ఉంది. అది చూసి ధర్మరాజు అర్జునా ద్వారక నుండి సుఖంగా వచ్చావా. ద్వారకా నగరంలొ అందరూ కులాసాగా ఉన్నారు కదా దేవకి వసుదేవులు బలరామకృష్ణులు సుఖులే కదా. వారంతా మన యందు మైత్రితో మనం క్షేమం కోరుతున్నారా. 16,108 భార్యలు శ్రీకృష్ణ సేవ చేస్తూ అన్యోన్యమైన మైత్రి గలవారై చరిస్తున్నారా. ఈ కుశల వార్త వినే వరకు నా మనసు ఆత్రుత చెందుతూ ఉంది. నీ ముఖం చూస్తే శ్రీహినంగా కనిపిస్తోంది.


నిన్ను ఎవరు అవమానించలేదు కదా ఎక్కడా ఎవరూ నిన్ను నిందించలేదు కదా. ఎవరినైనా ఏ వస్తువైనా ఇస్తాన్ని వాగ్దానం చేసి ఇవ్వలేకపోయావా. బ్రాహ్మణులు బాలురు వృద్ధులు, రోగులు, స్త్రీలు మొదలైన వారు ఎవరైనా శరణంటే వారిని రక్షించలేనని విడిచి వేయలేదు కదా. 


(ఇక్కడ విశేషమేమిటంటే రాజు ప్రజల పట్ల ఏ విధంగా విధేయుడై ఉండాలి అని ధర్మరాజు ద్వారా అర్జునుని ప్రశ్నించాడు.)


నీ ముఖం చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది ఇంతవరకు ఎట్టి ఆపత్తులు కలిగిన నీ ముఖం ఇలా లేదే అని ప్రశ్నించాడు ధర్మరాజు.

శ్రీ కరింజేశ్వర దేవాలయం

 🕉 *మన గుడి : నెం 335*


⚜ *కర్నాటక  :-*


*కరింజ - దక్షిణ కన్నడ ప్రాంతం*


⚜ శ్రీ కరింజేశ్వర దేవాలయం



💠 నాలుగు యుగాలకు సాక్షిగా నిలిచిన దక్షిణ కన్నడ జిల్లాలో అపురూపమైన కొండ శిఖరం శివాలయం! కరింజేశ్వరలోని కొడ్యమలే కొండలలో సముద్ర మట్టానికి సుమారు 100 అడుగుల ఎత్తులో కరింజ కొండ శిఖరంపై గంభీరంగా ఉంది.


💠 భక్తులు తప్పనిసరిగా శిఖరానికి 355 మెట్లను అధిరోహించవలసి ఉంటుంది, అయితే చుట్టుపక్కల విస్మయపరిచే విశాల దృశ్యాలను చూడవచ్చు.


💠 శ్రీ కరింజేశ్వర ఆలయం హిందూ పురాణాలలో పేర్కొన్న 4 యుగాలకు సాక్షిగా ఉన్న ఒక ప్రత్యేకమైన ఆలయం. 

🔅 'కృతయుగం' సమయంలో ఈ ఆలయాన్ని 'రౌద్ర గిరి' అని పిలిచేవారు; 

🔅 'ద్వాపర యుగం'లో 'భీమ శైల';  🔅'త్రేతాయుగం'లో 'గజేంద్ర గిరి' మరియు 🔅'కలియుగం'లో 'కరింజ'.


💠 శ్రీ కరింజేశ్వర దేవాలయం రెండు భాగాలుగా విభజించబడింది - 

ఒకటి కొండ శిఖరంపై శివునికి మరియు మరొకటి పార్వతీ దేవి, గణేశుని కోసం కొండకు వెళ్ళే మార్గం మధ్యలో ఉంది.


💠 శివుని ప్రధాన ఆలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు. శ్రీరామచంద్రుడు తన తమ్ముడు లక్ష్మణుడితో కలిసి ఈ ప్రదేశాన్ని సందర్శించాడని.


💠 దీనికి గుర్తుగా మధ్యాహ్న పూజా సమయంలో స్వామికి పెద్ద మొత్తంలో అన్నం నైవేద్యంగా సమర్పించి, దానిని రాతి పలకపై పోస్తారు కోతుల కోసం.

వేడి అన్నం ప్రసాదం తినడానికి అడవి నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో కోతులు రావడం చూడటానికి ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడతారు.

ఆ కోతుల మందలో " వృద్ధ కోతి " ముందుగా ప్రసాదం స్వీకరించటం వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ 


💠 కథలు ద్వాపర యుగంను కూడా సూచిస్తాయి, అక్కడ పాండవులు తమ ఉత్సాహంతో ఈ ప్రదేశం చుట్టూ ఉన్న గుహలలో ఆశ్రయం పొందారు.

 బీమ సేనుడు తన గదతో తవ్వినట్లు భావించే కొండ వద్ద ఉన్న పెద్ద సరస్సు గదాతీర్థ కథకు సాక్ష్యంగా నిలుస్తుంది. 

కొండపైన వరాహ తీర్థం అని పిలువబడే అర్జునుడి బాణంచే సృష్టించబడిన మరొక నీటి వనరు ఉంది, దీనితో పాటు ఉంగుష్ట తీర్థం మరియు జనుతీర్థం అనే మరో రెండు నీటి వనరులు ఉన్నాయి, వీటిని భక్తులు గౌరవిస్తారు. నిర్దిష్ట రోజులలో ఈ నీటి వనరులలో పవిత్ర స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు నయమవుతాయని చెప్పబడింది


💠 ఈ శివాలయం యొక్క నిర్మాణ శైలి వైష్ణవ మరియు జైన నిర్మాణ శైలులచే ప్రభావితమైంది. ఆలయ ధ్వజస్తంభం పునాదిపై ఉన్న రాతి శిల్పం విజయనగర రాజ్యంలో ఉన్న కెలాడి పాలకులు ఈ ఆలయానికి రాచరికం అందించారని సూచిస్తుంది.

కరింజా శిఖరం కూడా ప్రముఖ పర్యాటక ప్రదేశంగా మారుతోంది.

ప్రజలు ఈ కొండపైన స్వచ్ఛమైన గాలిని, పచ్చని పచ్చని చల్లని నీటి పరిసరాలను ఆస్వాదించడానికి మాత్రమే ఈ కొండను సందర్శిస్తారు. 

రాత్రి సమయంలో, కొండపై నుండి సమీపంలోని పట్టణాల విద్యుత్ దీపాలను, నక్షత్రాల వలె పేర్కొనడం కనుల పండువగా ఉంటుంది.

ఈ బ్లాగు మనందరిది

  ఈ బ్లాగు మనందరిది దీని అభివ్రుద్దికి మీ వంతుగా మీకు తొచిన ద్రవ్యం ఈ మొబైలు నంబర్కు 9848647145 డొనేటు చేయండి. 

Panchaag

 


శంకర వేద విద్యాలయము

॥శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే॥


*శ్రీకంచి కామకోటి పీఠ శంకర వేద విద్యాలయము*

*అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం,కర్నూలు*


గత మూడు సంవత్సరములుగా మన కర్నూలు నగరమునందు *శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్రసరస్వతీస్వామి వార్లఆశీస్సులచే అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం* వారిచే నిర్వహించబడుచున్న మన *శంకర వేద విద్యాలయము* నందు *ఋగ్వేదము,ఋగ్వేద స్మార్తము,కృష్ణయజుర్వేదము, కృష్ణ యజుర్వేద స్మార్తము,* నందు నూతన విద్యార్థులను తీసుకొనుటకు దరఖాస్తులు స్వీకరించబడుచున్నవి.*రాయలసీమ ప్రాంతములోనే ప్రప్రథమముగా చతుర్వేదములు మరియు కృష్ణయజుర్వేద స్మార్త విద్యలతో ఎంతో వైభోగముగా విరాజిల్లుతు ఉన్నది*. ఇందు *నూతనముగా ఋగ్వేదస్మార్త విద్య విభాగమును* ప్రవేశ పెట్టటకు యాజమాన్యము వారు సంకల్పించి ప్రవేశపెట్టుట మనకు ఎంతో ఆనందాన్ని కలిగించు విషయము.


కావున ఆసక్తి గలవారు 8 సంవత్సరముల నుండి 14 సంవత్సరముల వయస్సు గల విద్యార్థులను చేర్చుటకు 15 - 06 - 2024 తేదీలోపు మీ మీ దరఖాస్తులను అందజేయగలరు. 


*గమనిక*

1. విద్యార్థులకు తగు మౌలిక సదుపాయములు మరియు విద్యా వైద్య సదుపాయములు అన్నీ కూడా పూర్తిగా ఉచితము.


2. విద్యార్థి వయస్సు 8 సంవత్సరముల నుండి 14 సంవత్సరముల లోపే ఉండవలెను. ఉపనయనము అయ్యి శిఖ ధారణ ఖచ్చితముగా ఉండవలెను. మరియు సంధ్యావందనము ఖచ్చితముగా నోటికి వచ్చి ఉండవలెను. 


3. తెలుగు చూసి చదువుట వ్రాయుట వచ్చి ఉండవలెను 


*ముఖ్య గమనిక*

దరఖాస్తులు స్వీకరించిన తరువాత గురువులు మరియు యాజమాన్యం వారి సమక్షంలో ప్రవేశ పరీక్ష చేసి ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులను మాత్రమే స్వీకరించబడును ఇతర ప్రశ్నలకు తావేలేదు.


 ఇతర వివరములకై సంప్రదించవలసినటువంటి నెంబర్స్


*పాఠశాల కరస్పాండెంట్*

*శ్రీ చిదంబర రావు గారు*

+91 97048 33439


*శ్రీకృష్ణయజుర్వేద అధ్యాపకులు*

*శ్రీ కళ్ళే ప్రతాప శర్మ గారు*

+91 91770 55817


*శ్రీకృష్ణయజుర్వేద స్మార్త అధ్యాపకులు*

*శ్రీ పాలపర్తి శివరామ శర్మ గారు*

7093089380  7013006638


*ఋగ్వేద అధ్యాపకులు*

*శ్రీ శ్రీదత్త గారు*

+91 82772 46156


*ఋగ్వేద స్మార్త అధ్యాపకులు*

*శ్రీ వేంకటేశ్వర శర్మ గారు*

8555800187


*అథర్వవేద అధ్యాపకులు*

*శ్రీ కాశీభట్ల పవనకుమార శర్మ గారు*

+91 84990 85608


*పాఠశాల మేనేజ్మెంట్*

*శ్రీ నరసింహ గారు*

97018 68448


*శ్రీ మధుసూదన గారు*

6302790576

పంచ ప్రయాగలు.

 ఓం నమః శివాయ.. శ్రీ మాత్రే నమః..!!🙏🙏

 *పంచ ప్రయాగలు...!!* 


ప్రయాగ అంటే సంగమం.

నదులు సంగంమించే పవిత్ర స్థలం.

అంటే నదులు లేక నీటి ప్రవాహాలు,

ఒకదానితో మరొకటి కలిసిపోయే ప్రదేశం అని అర్థం.


కేదార్ నాథ్, బదరీ నాథ్ వెళ్లే మార్గంలో పంచప్రయాగలు అని చెప్పబడే అయిదు 

పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి.

అవి..

విష్ణు ప్రయాగ,

నంద ప్రయాగ,

కర్ణ ప్రయాగ,

రుద్ర ప్రయాగ,

దేవ ప్రయాగ,


ఈ ఐదింటిని కలిపి పంచప్రయాగలు అని పిలుస్తారు.

ఈ క్షేత్రాలు మోక్షప్రదాలని నమ్మకం.


విష్ణు ప్రయాగ :-

బదరీనాథ్ నుండి దక్షిణంగా 38 కి.మీ., దూరంలో విష్ణు ప్రయాగ ఉన్నది.

విష్ణు ప్రయాగకు తూర్పుగా కొంతదూరంలో

‘నితి’ అనే లోయ ప్రదేశం ఉంది.

ఆ లోయలో ఉన్న కొండశిఖరాల మీద నుండి వాలుగా జారపడిన నీరు, 

ఒక నదీ ప్రవాహంగా మారి దౌలి గంగ (ధవళ గంగ) అనే పేరుతో పడమటి దిక్కుగా ప్రవహిస్తూ వచ్చి విష్ణు ప్రయాగ దగ్గర అలకనంద నదిలో కలిసిపోతుంది.

విష్ణుమూర్థి వీర నారాయణ రూపం ధరించి,

తపస్సు చేయడానికి బదరికావనం వెళుతూ,

ఈ సంగమం దగ్గర కొంతకాలం ఉండి,

తపస్సు చేశాడట.

అందువల్ల ఈ పవిత్ర ప్రదేశానికి విష్ణు ప్రయాగ

అనే పేరు వచ్చింది.

ఇక్కడ ఒక పురాతన ఆలయం ఉంది.

అందులోని దైవం శ్రీ మహావిష్ణువు.


నంద ప్రయాగ:-

బదరీనాథ్ నుండి సుమారు 106 కి.మీ.,

దక్షిన భాగాన నంద ప్రయాగ ఉన్నది.

ఇక్కడకు ఈశాన్యంగా సుమారు 75 కి.మీ దూరంలో నందాదేవి పర్వత శిఖరం ఉన్నది.

ఆ శిఖరం చుట్టూ ఉన్న పర్వతాల మధ్య,

ఒక మంచులోయ ఉన్నది.

ఆ లోయలో నుండి, నందాకిని అనే చిన్ననది పడమటి దిక్కుగా ప్రవహిస్తూ వచ్చి,

అలకనంద నదిలో కలుస్తుంది.

నందాదేవి శిఖర ప్రాంతంలో జన్మించిన కారణంగా దీని పేరు నందాకిని అని పిలవబడుతుంది.

ఈ నది పేరు మీద ఈ సంగమ ప్రదేశం

నంద ప్రయాగగా ప్రసిద్ధి చెందింది.

పూర్వం నందుడు అనే ఒక చక్రవర్తి ఈ పవిత్ర సంగమం దగ్గర గొప్ప యజ్ఞాన్ని నిర్వహింపజేశాడట. అందుచేత ఆయన పేరు మీద ఈ ప్రదేశానికి నందప్రయాగ అనే పేరు వచ్చిందని

మరొక ఐతిహ్యం ద్వారా తెలిస్తుంది.


కర్ణ ప్రయాగ:-

నంద ప్రయాగ తర్వాత అలకనంద నది యొక్క

దిశ కొంత నైఋతి దిక్కుగా మారుతుంది.

నంద ప్రయాగ తర్వాత సుమారు 22 కి.మీ., దూరంలో, అంటే బదరీనాథ్ నుండి 128 కి.మీ., దూరంలో కర్ణ ప్రయాగ ఉన్నది.

ఇక్కడ నుండి తూర్పుగా సుమారు 100 కి.మీ., దూరంలో ఉన్న ఒక మంచు లోయలో నుండి ‘పిడరగంగ’ అనే నది ప్రవహిస్తూ వచ్చి,

ఆ అలకనంద నదిలో కలుస్తుంది.

ఈ రెండు నదుల సంగమం వద్ద మహాభారత కథలోని కర్ణుడు సూర్యభగవానుని గూర్చి

గొప్ప తపస్సు చేసి, 

ఆయన నుండి కవచకుండలాలు పొందాడని స్థలపురాణం.

ఆ కారణంగా ఈ సంగమానికి కర్ణ ప్రయాగ 

అనే పేరు వచ్చింది అంటారు.

ఇచ్చటనే ఉమాదేవి అనే చక్కని ఆలయం ఉన్నది. భక్తులు ఈ ఆలయాన్ని కూడా దర్శిస్తారు.


రుద్ర ప్రయాగ:-

కర్ణ ప్రయాగ నుండి సుమారు 31 కి.మీ.,

నైఋతి దిశగా, అంటే బదరీనాథ్ నుండి 159 కి.మీ., దూరంలో రుద్ర ప్రయాగ ఉన్నది.

హరిద్వార్ – ఋషికేష్ ల నుండి వచ్చిన మార్గం రుద్రప్రయాగ దగ్గర రెండుగా చీలి,

ఒక మార్గం కేదార్ నాథ్ వైపుకు,

మరొకటి బదరీనాథ్ వైపుకు సాగిపోతాయి.

కేదార్ నాథ్ వద్ద ఉన్న కొండలలో జన్మించిన మందాకిని నది,

దక్షిణంగా ప్రవహిస్తూ వచ్చి ఈ రుద్రప్రయాగ దగ్గర అలకనంద నదిలో కలుస్తుంది.

రుద్రప్రయాగ తర్వాత మందాకిని నది ఉనికి ఉండదు అనే చేప్పాలి.

కేవలం మందాకిని నదితో కలిసిన అలకనంద మాత్రమే ముందుకు సాగిపోతుంది.

ఈ రుద్రప్రయాగలో నారద మహర్షి కొంతకాలం తపస్సు చేశాడని స్థలపురాణం చెబుతుంది.

ఈ ఊరిలో చాలా పురాతన కాలం నాటి

జగదాంబ దేవి అనే అమ్మవారి ఆలయమూ, రుద్రనాథ్ అనే శివాలయం ఉన్నాయి.

ఈ స్వామిపేరున ఈ ఊరు రుద్రప్రయాగ అని

ప్రసుద్ధి చెందింది.


దేవ ప్రయాగ:-

ఉత్రాఖాండ్ లో టేహ్రీగర్వాల్ జిల్లాలో సముద్రమట్టానికి 2723 అడిగుల ఎత్తులో ఉన్న

ఒక ప్రసిద్ధ పట్టణం దేవప్రయాగ.

ఉత్తరాంచల్ రాష్ట్రంలోని హృషికేష్ నుండి 70 కి.మీ., దూరంలో బదరీనాథ్ వెళ్లుదారిలో ఈ క్షేత్రం ఉంది. 

ఈ పట్టణంనకు ఇక్కడ నివసించిన ఒక ప్రఖ్యాత హిందూ యోగి దేవ్ శర్మ పేరు పెట్టారు.

108 దివ్యతిరుపతులలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన

ఈ క్షేత్రంలో కేదారీనాథ్ లో పుట్టిన మందాకినీ నది, బదరీనాథ్, కొండల్లో పుచ్చిన అలకనందా నది, గంగోత్రిలో పుట్టిన గంగానది మూడు నదులు ఇచ్చట కలుసుకుంటాయి.

త్రివేణి సంగమంగా పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రం శ్రౌద్ధకర్మలకు ప్రసిద్ధి చెందినది.

బ్రహ్మచర్య వ్రతంతో నాలుగు నెలల కాలం ఇక్కడ అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తే మోక్షప్రాప్తి కల్గుతుందని శివుడు నారదునితో చెప్పినట్లు స్కాంధపురాణం వివరిస్తుంది.

ఈ దేవ ప్రయాగ దగ్గర, గంగోత్రి నుండి వచ్చిన భాగీరథీ నది గంగానదిలో కలిసిపోతుంది.

దేవ ప్రయాగ తర్వాత ఉండే ప్రవాహం గంగానది

అనే పేరుతో పిలవబడుతుంది.

అటు భాగీరథి, ఇటు అలకనంద నదులు ఈ రెండు తమ ఉనికని ఈ దేవ ప్రయాగతో కోల్పోతాయి.

దేవ ప్రయాగ ఊరు కొండ ఏటవాలులో, వరుసలుగా మెట్లు మెట్లుగా ఉంటుంది.

పురాణాల ప్రకారం, ఇక్కడ శ్రీరాముడు మరియు అతని తండ్రియైన దశరథ మహారాజు ఇక్కడే తపస్సు చేశారు.

పాండవులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి ఈ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించారని ప్రతీతి. ఇచ్చట సీతారాముల ఆలయం ఉంది.

భక్తులు స్వామిని “రఘునాథ్ జీ” గా కొలుస్తారు.


ఈ ఆలయానికి వెనకవైపున హనుమాన్ ఆలయం కూడా ఉన్నది.

ప్రధాన దేవాలయంలోని “నీలమేఘ పెరుమాళ్” ఆనాడు భరద్వాజ మహర్షికి ప్రత్యక్షమైనట్లు, స్వామిని పెరియాళ్వార్, తిరుమంగై ఆళ్వార్ కీర్తించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తుంది.


ఓం నమః శివాయ..!!🙏

ఓం నమః శివాయ..!!🙏

ఓం నమః శివాయ..!!🙏

హనుమజ్జయంతి

 హనుమజ్జయంతి జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందన్నారు. జయంతి చేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు. ఒకపూట భోజనం చేసి తీరాలి. యతి పురుషులు ఈరోజు భోజనం చేయకూడదు. పూర్ణ ఉపవాసం చేయాలి. హనుమజ్జయంతి చేసే గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్కహనుమజ్జయంతినాడైనా సరే గురువింద పూసలతో ఉపాసన అని ఒకటున్నది.భర్త పూజ అంతా అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునేతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని అని..మాడ్చమని కాదు. ఒకేగోత్రంతో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమజ్జయంతి చేస్తారు. హనుమ అంత త్వరగా ప్రీతిచెందే మహాపురుషుడు మరొకరుండరు. ఈ అప్పాలను సాయంకాలం సీతారామచంద్రులకు, హనుమకు, పరివారమునకు మంత్రంతో స్వాగతం పలికి నివేదన చేసి సీతారామచంద్రులయందు అపారభక్తికలిగిన వాడు, హనుమను ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమజ్జయంతినాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి చనువు మీకున్నా వారు మీఇంటికి వచ్చేటటువంటి అనుగ్రహం వారికున్నా ఒక విషయం చేత మీ జన్మ పండుతుంది అన్నారు. అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు ఆకులు కానీ, పండ్లు కానీ, అప్పములు కానీ తీసుకెళ్ళి వారికిస్తే వారు ఆ రోజు తీసుకొని ఒక్కపండుముక్క ఆయన నోటిలో వేసుకున్నా మీజన్మ తరించిపోయినట్లే. హనుమజ్జయంతికి అయిదు అంకెతో అంత అనుబంధం. ఒకేజాతికి చెందిన అయిదు ఫలాలను ఇవాళ్టి రోజున సీతారామచంద్ర ప్రభువుయొక్క పాదములయందు అపారమైన భక్తి కలిగినటువంటి వారు, హనుమను సేవించేటటువంటి వాడు, అటువంటి వారి ఇళ్ళకు వెళ్ళగలిగిన చనువు మీకుంటే (నిత్యము,

నైమిత్తికము అని రెండు రకాల తిథులుంటాయి. సంధ్యావందనాదులు రోజూ చేస్తూ ఉంటారు.నైమిక్తికము అంటే ప్రత్యేక తిథులు వీటియందు కొన్ని ప్రత్యేకమైన పనులుంటాయి. అవి చేస్తే జన్మ తరిస్తుంది. అవి సులభ మార్గములు.)వారు పుచ్చుకుంటే మీజన్మ తరించిపోయినట్లే. ఎందుకంటే అది సాక్షాత్ హనుమయొక్క స్వీకారమే. ఇలా చెప్పింది పరాశర సంహిత. అయిదంకె మీద పండు, అయిదంకె మీద ఆకు, అయిదంకె మీద నేతి అప్పములు, ఆలయంలో అర్చన చేసేవాళ్ళు, సీతారామచంద్రులను నమ్ముకున్నభక్తులకు ఇవ్వండి. అలా ఇస్తే మీరు తరిస్తారు. హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందంటే అరటి చెట్లు బాగా కట్టి అరటి గెలలు బాగా వంగి ఉండేటట్లుగా అలంకారం చేసి అప్పుడు హనుమజ్జయంతి చేయాలి. హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే అరటితోటలోకి వెళ్ళి హనుమయంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని వ్రాసి కానీ అక్కడ పెట్టి మీరు కానీ ఉపాసన చేశారా ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతారు అని అభయమిచ్చింది పరాశర సంహిత. అన్నింటికన్నా ఆయన తొందరగా ప్రీతి చెందేది అరటిపండు వల్ల. కదళి పూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి. అలా చేస్తే ఏదో ఒక రూపంతో మీకు కంటికి కనపడే రూపంతో రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి తీరుతారు. తొందరగా ప్రసన్నుడై వస్తే వానరరూపంలో వస్తారు. తప్పకుండా అరటిపండ్లు నివేదన చేయాలి. పరమ ప్రసన్నుడౌతాడు స్వామి. ఈ రోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి. ఎవరికి హనుమ అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు.


హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు , ఉపనిషత్తులు , సంప్రదాయ గాథలలో మరికొన్ని విషయాలు , కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ , వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాథలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాథ క్లుప్తంగా ఇవ్వబడింది.


🌺🌸🌺 జననం 🌺🌸🌺


పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. అంజన అనే ఆడ వానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో , కాళ్ళు ముడుచుకుని ధ్యానంచేసుకుంటున్న వానరాన్నిని చూసి , ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా , చిన్నపిల్ల అయిన అంజన వానరం పైన పండ్లు విసిరింది. 


హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానరం రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది , కోపంతో అంజనను , ఆమె ఎవరితోనైన ప్రేమలో పడిన్నప్పుడు వానరంగా మారమని శాపం ఇచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది మరియు ఆ ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్నా , ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరమిచ్చాడు. 


అందువలన శాపవిమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒక రోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి , వెంటనే ఆమె వానర రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం *'కేసరి'* అని , వానారములకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన వానర ముఖం కలిగి ఉన్నా అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారం వానరం మరియు మానవరూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి అబ్బురపడింది. 


అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు. అంజన , ముని శాపవిమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. శివ ఆమె అభ్యర్థనను ఆమోదించాడు.


ఇంకో వైపు దశరధుడు , అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వర్తిస్తున్నాడు. తృప్తిచెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశసంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు , అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళింది. 


ఆ గాలిపటం ఆ పాయసభాగాన్ని(తీపి ఆహారము) అంజన తపస్య స్థలంలో పడవేసింది. మహాదేవుడు , అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు , గాలి దేవుడిని ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవేనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది.


ఆమె వానర ముఖంగల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించటం వలన ఆంజనేయుడని , కేసరినందనుడని , వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. తన బాల్యదశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనవాడు. అతను , తన తండ్రిఅయిన కేసరి , తల్లి , అప్సర అంజన యొక్క శక్తి , వాయువేగం గలవాడు. హనుమాన్ జననం వలన అంజన శాపవిమోచనం పొందింది మరియు స్వర్గం తిరిగివెళ్ళింది.


భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాహలుడు , బుద్ధిశాలి , కపిశ్రేష్టుడు , సర్వశాస్త్ర పారంగతుడు , స్వామిభక్తి పరాయణుడు , రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం , రామాయణం , పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడిపడి ఉంది. 


హనుమాన్ , ఏడుగురు చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. అతను లంక రాజు , రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీ రాముడికి అప్పగించాడు. హనుమాన్ కథ , మన జన్మ యొక్క రహస్యం , శక్తి గురించి తెలుసుకోవటంలో మనకు సహాయపడుతుంది.


జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి , వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు.


♦🔔♦ఆంజనేయస్వామి అవతారాలు తొమ్మిది: ♦🔔♦


హనుమంతుడు కూడా దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి తొమ్మిది. హనుమన్నవావతారాలంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది.


1. ప్రసన్నాంజనేయస్వామి.

2. వీరాంజనేయస్వామి.

3. వింశతిభుజాంజనేయ స్వామి.

4. పంచముఖాంజనేయ స్వామి.

5. అష్టాదశ భుజాంజనేయస్వామి.

6. సువర్చలాంజనేయ స్వామి.

7. చతుర్భుజాంజనేయ స్వామి.

8. ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి.

9. వానరాకార ఆంజనేయస్వామి


తంత్రశాస్త్రంలో హనుమంతుణ్ణి ఆరాధిస్తే సమస్త క్షుద్రపీడలు పటాపంచలై పోతాయి.....!!!


దశమహావిద్యలతో సమానమైన శక్తి కలవాడు ఆంజనేయుడు. హనుమంతుడు తంత్రదేవతలందరిలోకి అధికుడు. ఆంజనేయునికి అష్టసిద్ధులు ఉన్న కారణంగా ఆయనను ఉపాసించిన వారికి మానవాతీత శక్తులు లభిస్తాయి.


💠💠💠 ఆయన అష్టసిద్ధులు 💠💠💠


1. అణిమాసిద్ధి : శరీర పరిమాణం ఆవగింజంత చిన్నదిగా చేసుకోగల శక్తి.


2. మహిమాసిద్ధి : శరీర పరిమాణం పర్వతమంత పెంచుకోగల శక్తి.


3. లఘిమాసిద్ధి : శరీరం బరువును నువ్వుగింజ కన్నా తక్కువ బరువుగా చేసే శక్తి.


4. గరిమ : శరీరం బరువును పర్వతమంత బరువు పెరిగేలా చేసే శక్తి.


5. ప్రాప్తిసిద్ధి : ఎక్కడికైనా ప్రయాణించగల శక్తి.. దేనినైనా పొందగలిగే శక్తి.


6. పరకామ్యసిద్ధి : ఎవరూ తగ్గించలేని ఆత్మబలాన్ని కలిగిఉండే శక్తి.


7. వశిత్వసిద్ధి : అన్ని జీవులపైనా ఆధిపత్యాన్ని కలిగిఉండే శక్తి.


8. ఈశిత్వసిద్ధి : దేనినైనా సృష్టించగల మరియు దేనినైనా నాశనం చేయగల శక్తి.


🌀🌀🌀 హనుమంతుని ప్రదక్షిణాలు 🌀🌀🌀


హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. 'ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ , భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు , అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు , పసుపుకొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం.


'శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్'


శ్లో|| ఆంజనేయం మహావీరం - బ్రహ్మవిష్ణు శివాత్మకం

తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం


శ్లో|| మర్కటే శ మహొ త్సాహ - సర్వశోక వినాశన

శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో||


అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం , అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి


''యాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు''


అని జలాన్ని అక్షతలతో వదలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం , శిర స్స్నానం , నేలపడక , సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.



ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు వాట్సాప్ లో వ్యక్తిగతంగా పొందడానికి "HARI OM" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి. 


వాట్సాప్ 

6301029386

ఆంగ్లేయురాలైనా




 పుట్టుకతో ఆంగ్లేయురాలైనా, నలుగురు పిల్లల తల్లి అయి ఉండి, చంకలో ఉన్న  అల్లరి చేస్తున్న  కూతురుని ముద్దుగా, సహనంతో సముదాయిస్తూ, ఎక్కడ విసుగు, చిరాకు, కోపం లేకుండా చక్కగా, అందంగా నవ్వుతూ, తన భావాలను చాలా సున్నితంగా, హిందీలో అలవోకగా చెప్తూ, part time సంస్కృతం నేర్పుతున్నానని చెపుతుంటే, అసలు ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుందీ, అంతేగాక బోధించే స్థాయికి ఎలా ఎదిగిందీ అంతా అద్భుతమే....అయినా చాలా సాదాసీదాగా మామూలు భారతీయ గృహిణిలా  వ్యవహరిస్తున్న(ప్రస్తుత భారతీయ గృహిణులు గతితప్పియున్నారు) తీరు అమోఘం....భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను తనవిగా చేసుకుని ఆచరిస్తున్న ఈ స్త్రీమూర్తి ఎందరికో స్ఫూర్తి...🙏

ఇలాంటి సంప్రదాయాన్ని జాతి,కుల,మత భేదం లేకుండా అందరూ పాటించేలా చేసిన iskcon సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారికి కృతజ్ఞతలు🙇‍♀️🙇‍♀️🙇‍♀️ ఆంగ్లేయురాలైనా, నలుగురు పిల్లల తల్లి అయి ఉండి, చంకలో ఉన్న  అల్లరి చేస్తున్న  కూతురుని ముద్దుగా, సహనంతో సముదాయిస్తూ, ఎక్కడ విసుగు, చిరాకు, కోపం లేకుండా చక్కగా, అందంగా నవ్వుతూ, తన భావాలను చాలా సున్నితంగా, హిందీలో అలవోకగా చెప్తూ, part time సంస్కృతం నేర్పుతున్నానని చెపుతుంటే, అసలు ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుందీ, అంతేగాక బోధించే స్థాయికి ఎలా ఎదిగిందీ అంతా అద్భుతమే....అయినా చాలా సాదాసీదాగా మామూలు భారతీయ గృహిణిలా  వ్యవహరిస్తున్న(ప్రస్తుత భారతీయ గృహిణులు గతితప్పియున్నారు) తీరు అమోఘం....భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను తనవిగా చేసుకుని ఆచరిస్తున్న ఈ స్త్రీమూర్తి ఎందరికో స్ఫూర్తి...🙏

ఇలాంటి సంప్రదాయాన్ని జాతి,కుల,మత భేదం లేకుండా అందరూ పాటించేలా చేసిన iskcon సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారికి కృతజ్ఞతలు🙇‍♀️🙇‍♀️🙇‍♀️

Free services

 




తత్వవేత్తల నమ్మకాలను

 *ఈ పాశ్చాత్య తత్వవేత్తల నమ్మకాలను చదవండి*


అందరికి తెలియచేయండి


1)

*లియో టాల్స్ టాయ్ (1828-1910):*

హిందూవులు ఏదో ఒకరోజు ప్రపంచాన్ని పాలిస్తారు! ఎందుకంటే సనాతన ధర్మం జ్ఞానానికి, వివేకానికీ మేలుకలయిక.

2)

 *హెర్బర్ట్ వెల్స్ (1846 - 1946):*

సనాతన ధర్మాన్ని పునరుద్ధరించే వరకూ, ఈధర్మం.. ఎన్నో దురాక్రమణలు ఎదుర్కొంటుంది.

ఏదో ఒకరోజు ప్రపంచమంతా ఆ సనాతనధర్మం వైపే ఆకర్షించబడి ప్రశాంతంగా ఉంటుంది.

3)

*ఆల్బర్ట్ ఐన్ స్టీన్ (1879-1955):*

మేధస్సు మరియు అవగాహన తోనే యూదులు అన్నీ చేయలేరని నేను గ్రహించాను. సనాతనధర్మం కూడా తోడయ్యాకే  అధ్భుత శక్తిగా మారతారు.

4)

 *హుస్టన్ స్మిత్ (1919):*

సనాతన ధర్మాన్ని పూర్తిగా ఆచరించే ఒక భారతీయుడి తెలివి మరియు అవగాహన..లతో, హిందూత్వంలో ఉన్నశక్తి ప్రపంచశాంతికి దారితీస్తుంది.

5)

 *మైఖేల్ నోస్ట్రాడామస్ (1503 - 1566):*

సనాతన ధర్మమే.. ఐరోపాను పాలించే ధర్మమవుతుంది.☝️ 

ఐరోపాలోని ఒక ప్రసిద్ధ నగరం, "సనాతన ధర్మానికి" రాజధాని అవుతుంది.

ఐదు వందల యేళ్ళ క్రితం నోస్త్ర డామస్ చేసిన ఊహ నేడు బ్రిటన్ లో నిజమైంది.

(సనాతన ధర్మ సంతతికి చెందిన శ్రీ ఋషి-శునాక్  బ్రిటన్ ప్రధాన మంత్రి అయ్యారు!)

6)

 *బెర్ట్రాండ్ రస్సెల్ (1872 - 1970):*

సనాతనధర్మం గురించి తెలిసాక గ్రహించాక..  మొత్తం మానవాళి అంతటికీ ఇదే ధర్మం అని గ్రహించాను.

ఐరోపానే కాదు, సనాతన ధర్మం ప్రపంచమంతటా వ్యాపిస్తుంది,

ఏదో ఒకరోజు  సనాతన ధర్మాన్ని ఆచరించేవారే *"ప్రపంచ-ఉద్దీపన"* చేస్తారు. .

7)

*గోస్టా లోబోన్ (1841 - 1931):*

శాంతి, సయోధ్యల గురించి మాట్లాడే సనాతనధర్మం యొక్క సంస్కరణలను,  క్రైస్తవులు అభినందించాలని నేను ఆహ్వానిస్తున్నాను.✅

8)

 *బెర్నార్డ్ షా (1856 - 1950):*

మొత్తం ప్రపంచమంతా ఏదో ఒకరోజున సనాతన ధర్మాన్ని అంగీకరిస్తుంది.

అదేపేరుతో కాకపోయినా "ఏదో-ఒకపేరు"తో నయినా అంగీకరిస్తుంది. సనాతనధర్మాన్ని పశ్చిమ దేశాలు అంగీకరించాల్సిందే!👍

9)

*జోహన్ గీత్ (1749 - 1832):*

మనమందరం ఎప్పుడో ఒకసారి, సనాతన ధర్మంతో కూడిన భారతీయతను అంగీకరించాలి.

*అది, మానవాళిని ఉద్ధరించే నిజమైన మానవీయ ధర్మం!*

      👇


*భారతీయులారా...! ఇదీ, "సనాతన ధర్మం" యొక్క గొప్పతనం.*

         🚩🚩🚩🚩🚩🚩

విద్యార్థి

  

విద్యార్థి 

సాధకుడు ప్రతి విషయంమీద శ్రర్ధ వహిస్తేనే కానీ సాధనలో ముందుకు పోలేడు. ఏరకంగా అయితే ఒక విద్యార్థి పరీక్షలముందు చదువు యందు చాలా శ్రర్ధ తీసుకొని తనకు ఎక్కువ మార్కులు రావటానికి ఏయే పాఠ్యముసాలని  చదవాలి  వాటిని ఎలా ఆకటింపు చేసుకోవాలి. ప్రతి రోజు యెంత సమయం కేటాయించాలి అని ఏంటో విశ్లేషణ చేసుకొని పరీక్షలకు ముందు ప్రిపేర్ అవటం మనం చూస్తాము. విద్యార్థి తానూ ముఖం కడుకుంటున్న, స్నానమాచరిస్తున్నాన్న, భోజనం చేస్తున్నాకూడా తానూ చేస్తున్న పనులు కాకతాళీయంగా చేస్తూ మనస్సు మాత్రం తానూ చదివిన విషయాలను మనననమ్ చేసుకోవటానికి మాత్రమే వినియోగిస్తుంటారు. అలా సంపూర్ణంగా విద్య యందె నిమగ్నుడైన విద్యార్థి పరీక్షలలో ఎక్కువ మార్కులను సంపాదించుకోవటం మనం చూస్తూవుంటాము. ఒక సాధారణ పరీక్షకోసమే ఒక విద్యార్థి అంతగా కష్టపడితే మరి ఎన్నో జన్మలనుంచు ప్రయత్నిస్తున్న పరీక్ష ఇది అదేమిటంటే మోక్షపదం చేరటం అంటే యెంత కష్టంగా ఉంటుందో యెంత కృషి సల్పాలో మనం వేరే చెప్పనవసరం లేదు. మోక్షార్ధి ఒక విద్యార్థి కన్నా ఎన్నో రేట్ల కష్టం, కృషి, శ్రమ చేస్తూ నిరంతరం జ్ఞానాన్వేషణలో ఉండి ఒక సత్ గురువు ద్వారా నిత్యానిత్య వివేకా జ్ఞానాన్ని పొంది నిత్యమూ సత్యము అనంతము అయిన ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించి సదా నిదిజాసలో వుంటూ ఉంటే మాత్రమే మోక్షసిద్ది కలుగదు.

ఉత్తిష్ఠతా జాగ్రతా ప్రాప్య వరన్నిబోధతా |
క్షురస్య ధరా నిశితా దురత్యయా దుర్గాం పాఠస్తత్కవయో వదంతి || 14 ||

నిద్రలెమ్ము సాధక అంటే అజ్ఞానం అనే నిద్రలో వున్నావు నీవు ఆ నిద్రను తొలగించి జ్ఞానానం అనే ప్రకాశం వైపు నడువు ఆ దోవ ఎటువంటిదంటే ఒక క్షురకుని పదునైన కత్తిమీద నడవటం వంటిది. అటువంటి కష్టసాధ్యమైన దానిని సాదించటానికి ఒక మంచి స్టేగురువును ఆశ్రయించు అని ఈ ఉపనిషత్ మంత్రం మనకు ప్రబోధిస్తున్నది. 

సద్గురువు ఎవరు: 

కలి ప్రభావం వలన మనకు అనేక మంది తమకు తామే సద్గురువులని చెప్పుకుంటూ అనేక ఆశ్రమాలను నిర్మిస్తూ  ,లక్షలకొద్దీ శిష్యులను కలిగి నిరంతరం పాద పూజలు చేయించుకుంటూ, విలువైన వస్తువులను దక్షణలుగా తీసుకుంటూ మనకు అనేక మంది తారసపడుతున్నారు. విచిత్రమేమిటంటే వారు నిత్యం అనేక వేదాంత ఉపన్యాసాలను చేస్తూ అనేకులను ఆకాసర్షిస్తున్నారు. వారి దర్శనానికి ఫీజు, పాదపూజకు ఫీజు మనకు వారి భక్తులు చెపుతుంటారు మేము ఈ స్వామీజీని నమ్ముకున్నాము.  ఆయనకు పాదపూజ జరిపిస్తే మాకు ఈ మంచి జరిగించి ఆయనకు పూజలు జరిపిస్తే అది జరిగింది.  ఆయన సాక్షాత్తు ఫలానా దేముడి  అవతారం. మీరు మీ కోరికలు తీర్చుకోండి అని చేసే ప్రచారాలకు, ప్రలోభాలకు ప్రలోభపడి అప్పుడప్పుడే ఆత్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్న సాధకుడు తనకు భక్తిమార్గమే శరణ్యం అని అనుకుంటూ ఇటువంటి గురువుల శిష్యుల మాటలకు ఆకర్షించబడి ఆ గురువు సేవనమే తన  జీవిత పరమావధి భావంచి తన ఆమెయిల్యమైన జీవితమును వృధా చేసుకుంటున్నారు. సాధకులను త్రప్పుడు త్రోవ పట్టించి వారివద్ద వున్నా ద్రవ్యాన్ని తస్కరించి ఈ రకమైన గురువులు వారి సంపదను వృద్ధి చేసుకోవటమే కాకుండా పెద్దపెద్ద భవనాలలో  అనేక ఆశ్రమాలను   నిర్మించిప్రజా సేవ చేస్తున్నట్లుగా ప్రగల్బాలు పలుకుతూ తమ పగ్గం గడుపుకుంటున్నారు.  విచిత్రం ఏమిటంటే మన హిందువులు మాత్రమే కాకుండా మహమ్మదీయుడైన ఒక సాదువుకూడా ఇటీవల బాబాగా ప్రసిద్ధి చెంది తన మరణానంతరము  గుడులు,గోపురాలు కలిగి నిత్యం పూజలు అనుడుకోవటం మనం చూస్తూవున్నాము. బాబా భక్తీ మత్తులో వున్న వారిని తిరిగి హిందుత్వపు వైపు తీసుకొనిరావటానికి సాక్షాత్తు ఆదిశంకర భగవతపాదులకు కూడా సాధ్యం కాదేమో అని ఈ సాధకుని అనిపిస్తున్నది.  ఎందుకంటె వారు బాబా మత్తులో అడిగే ప్రశ్నలకు జవాబులు ఇవ్వటం మృగతృష్ణలోనుంచి నీటిని తోడటం వంటిది. 

ప్రతి సాధకుడు ముందుగా రెండు విషయాలు తెలుసుకోవాలి అవి సద్గురువు ఎవరు అనేది ముందుగా తెలుసుకోవాలి, రెండవది సద్గురువు కేవలం ఒక మార్గదర్శకుడిగా మాత్రమే తనకు ఉపకరిస్తాడు కానీ సద్గురువు మోక్షాన్ని ప్రసాదించే వాడు కాదు. ఒక రకంగా చెప్పాలంటే గురువును మనం ఒక ఉపకారణంలాగా మాత్రమే చూడాలి కానీ గురువుచుట్టూ తిరుగుతూ జీవితాన్ని వృధా చేయకూడదు. మనం ఒక ప్రయాణం చేస్తూవున్నాము మధ్యలో ఒక నది వచ్చింది ఆ నదిని దాటటానికి ఒక పడవను ఉపయోగిస్తాము నది దాటినా తరువాత మనకు ఆ పడవతో నిమిత్తం లేదు మరల మన ప్రయాణం మనమే చేస్తూ మన గమ్యస్థానాన్నికి చేరుకుంటాము. ఇక్కడ మన ప్రయాణంలో పడవ ఎలా ఉపయోగ పడిందో అలానే మనకు సద్గురువు కూడా గురువు బోధనలను విని మన సందేహాలను నివృతి చేసుకొని తిరిగి మన సాధనను కొనసాగించాలి. అంటే కానీ జీవితాంతం గురువుకు సేవచేస్తూ జీవితాన్ని వృధా చేసుకోకూడదు. 

సద్గురువు ఎలా వుంటారు. సద్గురువు తనకు తానుగా ఆత్మా సాక్షాత్కారం పొందినవాడుగా ఉండాలి అటువంటివాని వల్లనే మనము జ్ఞ్యానాన్ని పొందగలము మనకు జ్ఞ్యానాన్ని ఇవ్వాలనే ముందుగా మన గురువు జ్ఞాని అయివుండాలి కదా. గురువు అరిషడ్వార్గాన్ని త్యజించిన వాడై ఉండాలి.  అంటే ఆయనకు మన సామాజిక జీవనపు లక్షణాలు ఏవి వున్దకూడాదు. అంటే ఏ విషయాలమీద ఆసక్తి,  అనురక్తి,మోహము, కామము లేని వాడై  ఉండాలి. కేవలము బిక్షాటన చేస్తూ తనకు దొరికిన దానిని భుజిస్తూ పరుల సొమ్మును ఆశించని వాడు అస్సలు ఇతరులతో మాట్లాడని వాడు ఇతరులనుంచి ఏది కోరని వాడు. కౌపీనము (గోచీ) మాత్రమే ధరించే వాడు అయివుండాలి అటువంటి సత్ గురువు మీకు లభిస్తే వెంటనే ఆయన పాదాలను ఆశ్రయించి శిష్యత్వాన్ని సవీకరించండి

సాధకుడు ముందుగా ఒక భక్తుడిగా తన ఆధ్యాత్మిక జీవనాన్ని మొదలుపెడతాడు. అదే అతనికి ఒకరకంగా రెండవ జన్మగా మనం అభివర్ణించవచ్చు. దేవి దేవతల యందు భక్తి కలిగి  నిత్యం దూప దీప నైవైద్యంతో పూజలు చేసే భక్తుడు తానూ త్రికరణ శుద్ధిగా ఆచరించే పూజల ఫలితంగా ముందుగా అంతకరణ శుద్ధి ఏర్పడుతుంది. కొంతకాలం పూజలు చేసిన తరువాత కొద్దీ కొద్దిగా వాక్సుద్ధి ఏర్పడుతుంది. ముఖ వర్చస్సు పెరుగుతుంది. ఆ స్థితిలో సాధకునికి ఒక ప్రశ్న తలయెత్తుతుంది. తానూ చేసే పూజలు మాత్రము చాలవు ఇంతకన్నా ఎక్కువగా నేను ఏమైనా చేయాలి అనే  ఉదయిస్తుంది. ఆ భావన కలగటమే జీవితంలో మలుపుకు దారితీస్తుంది. అప్పుడు తరువాత  జపం,తరువాత ధ్యానం చేస్తూ సాధకుడు భగవంతునికి దగ్గరగా అవుతాడు. 

 నిత్యం భగవంతుని ధ్యానిస్తూ నిర్వికల్ప సమాధి స్థితిని పొందిన సాధకుడు బ్రతికి ఉండగానే మోక్షాన్ని సిద్దించుకున్న సిద్ధుడే.  కాబట్టి సాధకులారా మీ అమూల్య మైన సమయాన్ని వృధా చేసుకోకుండా కుటింటిత దీక్షతో  కమ్ము. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి  శాంతిః    

మీ  భార్గవ శర్మ 

వేదజ్ఞానము

 🕉️🙏 "వేదజ్ఞానము ఎందుకు పొందాలి? మన ప్రయత్నం దేనికి" మనం ఏ కొద్దిపాటి సమయం కూడా ఊరికే ఉండలేను, మనసుతో వాక్కుతో  కర్మలు చేస్తూ ఉంటాం (మనసా వాచా కర్మణా) మన ఆలోచన మాట కర్మ మంచిదై ఉండాలి, అంటే కర్మానుసారమే బుద్ధి అంటారు, మంచి కర్మ చేస్తే మంచి బుద్ధి పడుతుంది,అని అర్థం మనకు మంచి చెడుల వివేకం లేనిదే మంచి ఎలా ఆచరించ గలుగుతాము, మనకు మంచి బుద్ధి ఎలా పుడుతుంది, ఆ బుద్ధి శుద్ధిగా వుండాలి,బుద్ధి జ్ఞానముతో శుద్ధి అవుతుంది,మంచి కర్మకైన బుద్ధిశుద్ధికైన సత్యజ్ఞానమే కావాలి ప్రధానo ,మనం సంధ్యవందనం లో. గాయత్రి మంత్రం యందు బుద్దులను ప్రేరేపించూ మని ఈశ్వరుని పదే పదే ప్రార్థిస్తున్నాను, ఎందు కంటే బుద్ధి (ప్రజ్ఞా)ప్రజ్ఞాపరాధం జ్ఞానం జ్ఞాపకము నిగ్రహం ఇందులో ఏది లేక పోయిన మన వ్యవహారం సరిగా  వుండదు అందుకే ప్రేరణ  కలిగించమని కోరు చన్నాము,ప్రేరణ అంటే మేల్కొలుపు మని ప్రార్థిస్తున్నాను,మన సంస్కారాల మూలంగానే మనస్సు నిర్మాణంఅవుతుంది.ఎవరిస్వభావము వారిది సంస్కారాలు ఎలా.వుంటే అలా నడుస్తాం,సంస్కారాల స్వభావం పిక్స్ గా వుంటుంది, *మన సంస్కారాల ను మార్చే శక్తి కేవలం జ్ఞానంకే కలదు అందుకే *జ్ఞానంపొందుతూ ధ్యానం చేస్తూ ధారణ కలిగి వుండాలి,* వేద జ్ఞానం మానవమాత్రులు పొంద వలసి ఉన్నది,నిజమైన ఆనందం నశించని ఆనందము పొందాలి, ఈ ప్రపాంచిక సుఖం తాత్కాలికము నిజమైన సుఖం కోసం ప్రయత్న చేయాలి 🕉️🙏

Phto








 

డొనెషన్లు

 డొనెషన్లు

మిత్రులారా మన బ్లాగు అభివ్రుద్దికి డొనేషనులు +91 9848647145 మొబేలు నంబరుకు జీ పే, ఫొనె పె, లొ దేనితొ నయినా పంప వచ్హు. మీ స్క్రీన్ షాట్ పంపిస్తె మన బ్లాగులొ పబ్లిష్ చేస్తాము. ఇక ఆలశ్యం యెందుకు ఇప్పుడె మీరు డొనెషన్ పంపండి. మన బ్లాగు అభివ్రుద్దికి తొట్పడండి 

పద్యంలో సర్వమత సారం

 *ఒక సీస పద్యంలో సర్వమత సారం!*


ఆది కారణ మెన్న రాదు కావున స్వ

       భావము లోకమని చెప్పు బౌద్ధమతము

జగ మబద్ధము బ్రహ్మ సత్యం బటంచు నెం

       తయు, బోధపర్చు నద్వైతమతము

సగుణుఁ డీశుడు ప్రపంచము వానియిచ్ఛావి

       భూతి యంచు గణించు ద్వైతమతము

ఇహమె నిక్కము పరం బెల్లఁ గల్ల యటంచుఁ

       దెల్లము సేయు నాస్తిక మతంబు

 

ఇన్నిమతములలో సార మెంచి యెంచి

దయయు నిర్మోహము న్భక్తిధర్మబుద్ధి

నాల్గిట న్గ్రమముగఁ బొందినయము మీఱ

జయము మనమంద వలయు నో సభ్యులార!


ఆదిభట్ల నారాయణ దాసు (1883). *ఆంబరీష చరిత్రము*

సుందరే సుందరో రామః

 🐒హనుమజ్జయంతి శుభాకాంక్షలు🐒


*సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథా*

*సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనం*

*సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపిః*

*సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం?*


అనగా,సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ. సుందరమైన కథను చెబుతున్నది కావున సుందరకాండ.


సుందరియైన సీతను గురించి చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తున్నది కావున సుందరకాండ. సుందరమైన అంత్యాను ప్రాసలతో ఉపమాలంకార శబ్ధాలతో చెప్పబడినది కావున సుందరకాండ. సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నది కావున సుందరకాండ.

బంగారాన్ని




 1991 లో దేశం దివాలా తీసే పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం మన దేశం లో ఉన్న బంగారాన్ని విదేశీ బ్యాంకుల్లో కుదువ పెట్టింది,,, 1,2 kg లు కాదు దాదాపు 1  లక్ష కేజీలు..... ఇన్నేళ్లు ఎవరు ఉన్న ఏ ప్రధాని ఉన్న పట్టించుకోలేదు.....ఇప్పుడు కేంద్రం లో ని మోదీ బీజేపీ ప్రభుత్వం ఆ లక్ష కిలోల బంగారాన్ని మన దేశానికి తెస్తుంది... ఉల్లిగడ్డ పెరిగింది,,, పప్పు పెరిగింది,,, గ్యాస్ పెరిగింది మోదీ దిగిపోవాలి అని ప్రచారం చేసే దేశం లో ఉన్న దరిద్రపు పార్టీలు,,, అమ్ముడు పోయిన మీడియా,,, దేశ ద్రోహ యూట్యూబ్ ఛానెల్స్ ఇలాంటివి ఎందుకు చెప్పరు ప్రజలకు..... ప్రజలు మూర్ఖంగా ఉన్నంత వరకు అందరు మిమ్మల్ని గొర్రెల్లగా భవిస్తారు... ఇప్పటికైనా మారండి....

New scham


 

ఋగ్వేదం లో మొదట బ్యాచ్




 కంచి కామకోటి పీఠ శంకర వేద విద్యాలయం లో వేద పాఠశాల ప్రారంభం చేసి రెండు సంవత్సరాల కాలంలో ఋగ్వేదం లో మొదట బ్యాచ్ విద్యార్థులకి ఇవాళ మూలాంతము పూర్తి చెయ్యటం జరిగినది . (మూలాంతం అంటే బయట చదువులో 10 తరగతి ).అందులో భాగంగా గడిచిన రెండు సంవత్సరాల కాలంలో లోనే విద్యార్థులు కు ఇంత చదువు ఎక్కడ అవ్వదు రాయలసీమ లోనే మొదటి  చతుర్వేద పాఠశాల గా దిన దిన ప్రవృద్ధమానంగా ముందుకు సాగుతూ ఉన్నది . పూర్తి చేసిన విద్యార్థులలో ఒకరికి 13 సంవత్సరాలు కావడం కూడా విశేషం .ఇవాళ హనుమజ్జయంతి సందర్భంగా విద్యార్థులకు ఇవాళ పూర్తి చెయ్యటం నిజంగా స్వామి వారు అనుగ్రహం . ఋగ్వేదం ములాంతంలో చివరి పనస చెప్పి స్వామివారి కి సమర్పించటం జరిగినది . ఇలాగే ఎంతో మందిని వేద విద్యార్థులను తయారు చేసి వేద ధర్మాన్ని వేద సంస్కృతి నీ నిలబెడుతూ ముందుకు సాగాలని ఆ శక్తి నీ ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాలని కోరుతూ  కంచి కామకోటి పీఠ శంకర వేద విద్యాలయం అఖిల భారత బ్రహ్మణ కరివేన సత్రం కర్నూలు 🙏🙏🙏💐

స్తోత్ర సంబంధ 56 పుస్తకాలు

 *స్తోత్ర సంబంధ 56 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

లలితా సహస్ర నామ వివరణము-1 www.freegurukul.org/g/Sthotralu-1


లలితా సహస్ర నామ వివరణము-2 www.freegurukul.org/g/Sthotralu-2


లలితా సహస్ర నామ వివరణము-3 www.freegurukul.org/g/Sthotralu-3


లలితా సహస్ర నామ వివరణము-4 www.freegurukul.org/g/Sthotralu-4


తాత్పర్య సహిత స్తోత్రాలు www.freegurukul.org/g/Sthotralu-5


శ్రీపతి స్తుతిమాల www.freegurukul.org/g/Sthotralu-6


ఆంజనేయ స్తోత్ర మకరందము www.freegurukul.org/g/Sthotralu-7


దేవి మహత్యము శ్రీ చండీ నవశతి నవాంగవిది www.freegurukul.org/g/Sthotralu-8


శ్రీ విధ్యాసారధి-లలితారహస్య నామ భాష్యము www.freegurukul.org/g/Sthotralu-9


విష్ణు సహస్ర నామ స్తోత్ర వివరణం www.freegurukul.org/g/Sthotralu-10


ప్రణవస్తోత్రము www.freegurukul.org/g/Sthotralu-11


శ్రీకృష్ణ స్తోత్రాణి www.freegurukul.org/g/Sthotralu-12


దేవి మహత్యము శ్రీ చండీ నవశతి మంత్రమాల www.freegurukul.org/g/Sthotralu-13


కైవల్య సారధి-విష్ణు సహస్ర నామ భాష్యము www.freegurukul.org/g/Sthotralu-14


కృష్ణకర్ణామృతం www.freegurukul.org/g/Sthotralu-15


స్తవరాజ పంచశతి www.freegurukul.org/g/Sthotralu-16


శివ మహిమ్న స్తోత్రము www.freegurukul.org/g/Sthotralu-17


ఆదిత్య హృదయ రహస్యము www.freegurukul.org/g/Sthotralu-18


శ్రీరామ రక్షాస్తోత్రం www.freegurukul.org/g/Sthotralu-19


విష్ణు సహస్ర నామ వివరణ www.freegurukul.org/g/Sthotralu-20


మల్లిఖార్జున సుప్రభాతం www.freegurukul.org/g/Sthotralu-21


శంకర గ్రంధ రత్నావళి లలితా త్రిశతి భాష్యం -ద్వాదశ సంపుట www.freegurukul.org/g/Sthotralu-22


లలితానామ సహస్రార్ధము www.freegurukul.org/g/Sthotralu-23


దక్షిణామూర్తి స్తవం www.freegurukul.org/g/Sthotralu-24


వివిధ దేవతా అష్టోత్తర శత సహస్రనామావళి www.freegurukul.org/g/Sthotralu-25


ఆదిత్య హృదయం www.freegurukul.org/g/Sthotralu-26


వేంకటేశ్వర సుప్రభాత గీతములు వివరణ www.freegurukul.org/g/Sthotralu-27


నిత్య ధ్యాన స్తోత్రాలు www.freegurukul.org/g/Sthotralu-28


హనుమాన్ చాలీసా తెలుగులో www.freegurukul.org/g/Sthotralu-29


హనుమాన్ చాలీసా www.freegurukul.org/g/Sthotralu-30


వీరబ్రహ్మ సుప్రభాతం www.freegurukul.org/g/Sthotralu-31


వేంకటేశ్వర సుప్రభాత,అష్టోత్తర,సహస్రనామ స్తోత్రములు www.freegurukul.org/g/Sthotralu-32


శివ సహస్ర నామ స్తోత్ర వివరణము www.freegurukul.org/g/Sthotralu-33


ముకుందమాల - తిరుప్పావై www.freegurukul.org/g/Sthotralu-34


శ్రీరామ కర్ణామృతము www.freegurukul.org/g/Sthotralu-35


దేవి అశ్వధాటి www.freegurukul.org/g/Sthotralu-36


ఆంజనేయ దండకం www.freegurukul.org/g/Sthotralu-37


లలితా చింతామణి మహా అతి రహస్య ద్వీపం www.freegurukul.org/g/Sthotralu-38


చండీ స్తోత్ర చతుష్టయం - చండీ సప్త శతి www.freegurukul.org/g/Sthotralu-39


మూకపంచశతి www.freegurukul.org/g/Sthotralu-40


ఆర్తి ప్రభందము www.freegurukul.org/g/Sthotralu-41


సాయి స్తోత్రాలు www.freegurukul.org/g/Sthotralu-42


గాయత్రి విలాసము www.freegurukul.org/g/Sthotralu-43


లలితా దివ్య స్తోత్రమంజరి www.freegurukul.org/g/Sthotralu-44


దక్షిణామూర్తి స్తోత్ర వ్యాఖ్య www.freegurukul.org/g/Sthotralu-45


స్తోత్రరత్నములు www.freegurukul.org/g/Sthotralu-46


స్తోత్ర కదంబం www.freegurukul.org/g/Sthotralu-47


దేవీ మహత్యం చండీనవశతీ మంత్రమాల www.freegurukul.org/g/Sthotralu-48


కనకదుర్గఅమ్మవారిస్తోత్రమాల www.freegurukul.org/g/Sthotralu-49


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము www.freegurukul.org/g/Sthotralu-50


ముకుందమాల www.freegurukul.org/g/Sthotralu-51


స్తోత్ర రత్నావళి www.freegurukul.org/g/Sthotralu-52


శివ మహా స్తోత్రము-అర్థ సహితము www.freegurukul.org/g/Sthotralu-53


దేవీ స్తోత్ర మకరందము www.freegurukul.org/g/Sthotralu-54


శివ స్తోత్రాలు www.freegurukul.org/g/Sthotralu-55


ఈశ్వర విశ్వరూపం www.freegurukul.org/g/Sthotralu-56


🙏💐🌸🌺🌻🪷🦚🦜🌞🤔🎍

ఎక్కడ రామ నామ స్మరణ

 *ప్రియమైన ఆధ్యాత్మిక మిత్రులారా!* 


84 లక్షల జీవరాశులలో మానవ జన్మ  ఉత్కృష్టమైనజన్మ మోక్ష

ప్రాప్తికి ఆధారభూతమైన జన్మ.

అజ్ఞానాంధకారంలోకొట్టుమిట్టాడు  మానవాళిని సన్మార్గంలో పెట్టి మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్రామాయణం. అందులో మానవునికిఏర్పడే గ్రహదోషాలను తొలగించుకోవడానికి,రామాయణంలోని అనేక సర్గలు పారాయ ణచేస్తే ఫలితాలుఉన్నాయి., అందులోని సుందరకాండ పారాయణ విశేషించి ఆంజనేయస్వామికి సంబంధించినది .             

                                          *"కలౌ కపివినాయకం"* అన్నారు పెద్దలు, చిరంజీవి అయిన హనుమంతుడు వైశాఖ మాసం లో  కృష్ణ పక్షంలోని దశమితిధి శనివారం పూర్వాభాద్రనక్షత్రం లో జన్మించినట్లు పరాశరసంహిత తెలియచేస్తోంది ,హనుమంతుడు

శివాంశ సంభూతుడు , కామరూపి ప్రప్రధమంగా శ్రీరాముని చూసి నప్ప హనుమంతుడు బ్రాహ్మణ వేషంలో (పండితుడుగా) కనపడగా

శ్రీరామచంద్రుడు, లక్ష్మణుని తో

చతుర్వేద పండితుడు, శాస్త్ర పండితుడు,నవవ్యాకరణపండితుడు *" హనుమ"* అని పేరుతో చెప్పగానే హనుమంతుడు,నా ఆరాధ్యదైవం ఇన్నాళ్ళకు దర్శనం ఇచ్చాడని, పరమానందంతో పరవశించాడు. తనహృదయంలో

శ్రీరామచంద్రుని నిలుపుకొని రామనామ స్మరణచేస్తూ రామభక్తులను కాపాడుతూ మానవాళికి రామభక్తి గొప్పత నాన్ని తెలుపుతూ మానవులకు *"శ్రీరామరక్ష సర్వజగద్రక్ష"* అని

బోధించాడు , సంహిత గ్రంధాల లో హనుమంతుడు లంకలో ప్రవేశించునపుడు బ్రహ్మ హనుమంతుని 32 నామాలతో స్తోత్రంచేశారని ఆ32 నామాల వరుసని సుందరహనుత్ నామా

వళిగా ప్రసిద్ధి గాంచినవి, ఈనామావళి స్మరిస్తే విశూచీ లాంటి సర్వ వ్యాధులు నశిస్తా యని బ్రహ్మ వరం ఇచ్చినాడని తెలుపుచున్నది , అందుకే తులసీ దాసు  *" నాశైరోగ హరై సబ్ పీర జపతు నిరంతర హనుమత వీర"* అన్నారు హనుమాన్ చాలీసాలో. హనుమంతుని ,జపం పూజాది కాల వల్ల గ్రహదోషాలు నశిస్తాయని మంత్ర శాస్త్రవచనం, ముఖ్యంగా ఏలినాటిశని, ,అష్టమ శని, అర్థాష్టమశని, దోష నివారణకు హనుమంతుడిని శనివారంనాడు

నువ్వులనూనెలో గంగసిందూరం కలిపి హనుమంతుని విగ్రహానికి రాసిన శనిదోషాలు పోతాయని

ఋషివాక్యం., మనం నిద్రించే ముందు *"రామ స్కంధం"* చదివి

పడుకుంటే దుస్వప్నాలు రావు. హనుమంతుని ద్వాదశనామావళి *"హనుమాన్ అజనాసూనో వాయుపుత్రో మహాబలః"* అన్న

నామావళిని స్మరిస్తే ప్రయాణాలు క్షేమంగా జరుగుతాయని ప్రతీతి. ఎక్కడ రామ నామ స్మరణ జరుగునో అక్కడ హనుమంతుడు రక్షకుడుగా ఉంటాడని ప్రతీతి . అందుకే ఆధ్యాత్మిక భక్తులారా *ఈరోజు అనగా ఈ శనివారం హనుమజ్జయంతి* విశేషమైన రోజు ఆ హనుమంతుని పూజించి నామస్మరణచేసి ,రాబోయే రోజుల్లో,   ఆయురారోగ్యాలను, ధైర్యాన్ని  సుఖం సంతోషాలను ప్రసాదించమని వేడుకుందాము.

*శ్రీరామ జయరామ జయజయరామ*

వైశాఖ పురాణం__24_వ_అధ్యాయము

 *వైశాఖ పురాణం__24_వ_అధ్యాయము*


నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత ||


వాయు_శాపము


అంబరీషునితో నారదుడీ విధముగ వైశాఖ మహాత్మ్యమును వివరించెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తికి శంఖ వ్యాధుల సంవాదమును వివరించుచు నిట్లనెను.


శంఖముని మాటలను విని కిరాతుడిట్లనెను. స్వామీ! విష్ణువు నుద్దేశించి చేయు ధర్మములు పూజలు, ప్రశస్తములు.. వానిలో వైశాఖ మాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తములని చెప్పిరి.. బ్రహ్మజ్ఞానీ! ఆ విష్ణువెట్టివాడు. వాని లక్షణమేమి? వానిని చెప్పు ప్రమాణమేది? వానిని తెలిసికొనుట యెట్లు? వానికి చెందిన ధర్మము లేవి? వీనిచే నతడు సంతోషించును? నీ సేవకుడనగు నాకీ విషయములను దయయుంచి చెప్పగోరును అని శంఖ మహామునికి సవినయముగ నడిగెను.


శంఖుడును కిరాతుడా..! వినుము చెప్పెదను. శ్రీమహావిష్ణువు రూపము పాప రహితము. ఆలోచనకు అందనిది. బ్రహ్మ మొదలగు దేవతలు మహాత్ములగు మునులను తెలిసికొన జాలనిది. శ్రీమహావిష్ణువు శక్తి గుణములు సర్వధా సంపూర్ణములు.. నిశ్చయముగా సమస్తమునకు అధిపతి. గుణరహితుడు నిష్కలుడు, అనంతుడు, సచ్చిదానంద రూపుడు. చరాచర స్వరూపము, సాటి లేనిది. దీనికి అధిపతి ఆశ్రయము. శ్రీమహావిష్ణువు. ఇవన్నియు పోయినను శ్రీహరి స్థానము పోదు ఆయన నిత్యుడు. ఉత్పత్తి స్థితి, సంహారము, వీని ఆవృత్తి, ప్రకాశము, బంధమోక్షములు, వీని ప్రవృత్తులన్నియు, నివృత్తులును, పరమాత్మ వలననే జరుగును. ఇదియే పరబ్రహ్మ లక్షణము. ఇతడే పరబ్రహ్మయని జ్ఞానుల యభిప్రాయము. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మయని చెప్పుదురు. చతుర్ముఖ బ్రహ్మ మున్నగు వారిలోని బ్రహ్మ పదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు. పరబ్రహ్మ యగు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరబ్రహ్మ పదమునకు వాచ్యులెట్లగుదురు? కారు... జన్మాద్యస్యయతః అను సూత్రము వలన శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకమగు పరబ్రహ్మ పదార్థమని వేదాంతము కూడ నిర్ణయించినది. శాస్త్రములు, వేదములు, స్మృతులు, పురాణములు, యితిహాసములు, పంచపాత్రాది ఆగమములు, భారతము మున్నగు వాని చేతనే పరబ్రహ్మ యగు శ్రీమన్నారాయణుని తెలిసికొన వీలగును మరి వేరు విధములచే తెలిసికొనజాలము. కావున వేదాదుల నెరుగని వారు పరబ్రహ్మమగు శ్రీమన్నారాయణు నెరుగజాలరు. పరదైవము వేదవేద్యుడు సనాతనుడు నగు శ్రీహరిని యింద్రియాదుల చేత అనుమానాది తర్కముల చేతను తెలిసికొన శక్యము కాదు. ఇతని యవతారములను, కర్మలను తమ బుద్ది కొలదిగ దెలిసి కొని సర్వజీవములు ఆయన యధీనవృత్తులై ముక్తిని పొందుచున్నవి. శ్రీహరి మహిమను క్రమక్రమముగ నెరుగవలయును. ఇతడు సర్వశక్తి సంపన్నుడు. దేవతలు, ఋషులు, పితృదేవతలు మున్నగు వారు ఒకొక్క విధమైన శక్తినే కలిగియున్నారు.


బలము, జ్ఞానము, సుఖము మున్నగునవి యుండుటచే, ప్రత్యక్ష, ఆగమ, అనుమానాది ప్రమాణములచే సర్వప్రాణులలో మనుష్యుడు ఉత్తముడని యెరుగవలయును. అట్టి మనుష్యుని కంటె జ్ఞానాదులుండుట వలన రాజు వంద రెట్లు గొప్పవాడు. అట్తి రాజుకంటె మనుష్య గంధర్వులు నూరు రెట్లు గొప్పవారు. తత్త్వాభిమానులగు దేవతలను మనుష్య గంధర్వుల కంటె నూరు రెట్లు గొప్పవారని యెరుగుము. అట్టి దేవతల కంటె సప్తర్షులు గొప్పవారు, సప్తర్షుల కంటె అగ్ని, అగ్ని కంటె సూర్యుడు, సూర్యుని కంటె గురువు, గురువు కంటె ప్రాణము, ప్రాణము కంటె యింద్రుడు మిక్కిలి గొప్పవారు బలవంతులు.


ఇంద్రుని కంటె గిరిజాదేవి, ఆమె కంటె జగద్గురువగు శివుడు, శివుని కంటె మహాదేవి యగు బుద్ది, బుద్దికంటె మహాప్రాణము గొప్పవి. అట్టి మహాప్రాణము కంటె గొప్పది లేదు. ఆ ప్రాణము నందే సర్వము ఉన్నది. ఆ ప్రాణము నుండియే ప్రాణాత్మకమగు విశ్వమన్నది పుట్టినది. సర్వము ప్రాణము నందే కూడి యున్నది. ప్రాణము వలననే సర్వము కదలుచున్నది. నల్లని మబ్బువలె ప్రకాశించు నీ ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెప్పుచున్నారు. లక్ష్మీ కటాక్షముచే ప్రాణము నిలిచియుండును. ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కొద్దిపాటి దయ చేతనే మరింతగా ప్రకాశించును. అట్టి సర్వాధారుడు సర్వోత్తముడగు శ్రీమహావిష్ణువు కంటె గొప్పది సమానమైనది యేదియును లేదు అని శంఖుడు వివరించుచుండగా కిరాతుడు స్వామీ..! ప్రాణము అన్నిటి కంటె గొప్పదో, ప్రాణము కంటె విష్ణువు గొప్పవాడో వివరింపుమని శంఖమునిని ప్రార్థించెను.


అప్పుడు శంఖుడిట్లనెను. కిరాతా వినుము. సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుదును వినుము. పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో నిట్లనెను. దేవతలారా..! నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతిగ/రాజుగ నియమించుచున్నాను. మరి మీలో గొప్పవారెవరెవరో చెప్పిన వానిని యువరాజుగ చేయుదును. అతడు శీలము, శౌర్యము, ఔదార్యము మున్నగు గుణములను కలిగి యుండవలెను అని శ్రీహరి పలుకగ యింద్రాదులు నేను గొప్ప యనగ నేను గొప్ప అని పరస్పరము వివాదపడిరి. కొందరు సూర్యుడు గొప్పవాడనిరి, ఇంద్రుడు గొప్పయని కొందరనిరి. కొందరేమియు ననక మౌనముగ నుండిరి. ఇంద్రాది దేవతలు యువరాజు పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకొనలేక శ్రీమన్నారాయణుని కడకు పోయి ఆయననే అడిగిరి.


అప్పుడు శ్రీహరి నవ్వుచు "విరాట్ పురుషుడు సృజించిన యీ స్థూలదేహము వైరాజ మనబడును. ఈ దేహమున చాలమంది దేవతలు అంశరూపమున నుండిరి. ఏ దేవుడు ఏ దేవుని అంశ యీ శరీరము నుండి బయటకు వచ్చిన యీ దేహము పడిపోవునో ఎవరు ప్రవేశించిన లేచునో అతడే ఆ దేవుని అంశయే బ్రహ్మ తరువాత యువరాజు పదవికి తగిన దైవమని పలికెను. శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరును అంగీకరించిరి.


స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడను దేవశ్రేష్ఠుడు వెలుపలకి వచ్చెను. అప్పుడా శరీరము నడువలేక యుండెను. కాని వినుట, చూచుట మున్నగు సర్వకార్యముల చేయుచుండెను. అప్పుడా దేహిని కుంటివాడనిరి. స్థూల దేహము గుహ్యవయవము నుండి దక్షుడను ప్రజాపతి యీవలకు వచ్చెనను శరీరము పడిపోలేదు. వినుచు, చూచుచు, పలుకుచు గాలిని పీల్చుచు నుండెను తరువాత హస్త ప్రదేశము నుండి యింద్రుడు వెలుపలకు వచ్చెను. అప్పుడా దేహిని హస్త హీనుడనిరి. ఆ శరీరము యింద్రుడు బయటకు వచ్చినను చూచుట మున్నగు వానిని చేయుచునే యుండును. తరువాత కన్నుల నుండి సూర్యుడు వెలుపలికి వచ్చెను. చూపు లేక పోయెను కాని ఆ శరీరము వినుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము ముక్కు నుండి అశ్వినీ దేవతలు వెలుపలికి వచ్చిరి. వాసన చూడలేక పోయెను గాని వినుట మున్నగు వానిని శరీరము చేయుచునే యుండెను. దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలికి వచ్చినవి. అప్పుడా దేహికి వినికిడి శక్తి లేకపోయెను. చెవిటి వాడని యనిరి. చూచుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము నాలుక నుండి వరణుడు వెలుపలికి వచ్చెను. దేహికి రుచి తెలియకుండెను. వినుట మున్నగు వానిని చేయుచుండెను. శరీరము పడిపోలేదు. పిమ్మట వాక్కునకు అధిపతి యగు అగ్ని బయటకు వచ్చెను. ఆ శరీరి మాట లేకపోవుటచే మూగవాడయ్యెను. చూచుట మున్నగు వానిని చేయుచునే యుండెను. జ్ఞాన స్వరూపుడగు రుద్రుడు శరీరము నుండి వెలుపలికి వచ్చెను. శరీరికి జ్ఞానము లేదు గాని వినుట మున్నగునవి యుండెను. తరువాత ప్రాణము, వాయువు వెలుపలికి వచ్చెను. అప్పుడా శరీరము, కన్నులు, చెవులు, మాట మున్నగునవి పని చేయుచున్నను నిశ్చేష్టమై పడిపోయెను. దీనిని చూచి దేవతలందరును ఆశ్చర్యపోయిరి. అప్పుడు శ్రీహరి యిట్లనెను. ఇట్లు నిర్జీవమై పడిన శరీరమును యే దేవత ప్రవేశించి లేవదీయునో అతడే యువరాజని పలికెను.


శ్రీహరి మాటలను విని జయంతుడు దేహి పాదములను ప్రవేశించెను. కాని శరీరము లేవలేదు. దక్షుడగు గుహ్యమును ప్రవేశించెను. శరీరము లేవలేదు. ఇంద్రుడు హస్తములను ప్రవేసించినను ఆ కళేబరము కదలలేదు. సూర్యుడు కన్నులలో ప్రవేసించినను ఆ కళేబరము కదలలేదు. దిక్కులు చేవులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. అగ్ని ప్రవేశించినను ఆ కళేబరము నుండి మాట రాలేదు. రుద్రుడు మనసులో ప్రవేశించినను కళేబరము కదలలేదు. పిమ్మట ప్రాణము ప్రవేశింపగా నా శరీరము లేచెను. అప్పుడు బలము,జ్ఞానము, ధైర్యము, వైరాగ్యము బ్రదికించుట మొదలగు వానియందు శక్తిమంతమగు ప్రాణమునే యువరాజుగ దేవతలు భావించిరి. శరీరము జీవించుటకు కారణమగుటచే ప్రాణమే సర్వాధికమని యనిరి.


ఈ ప్రాణము తన అంశల చేత పూర్ణభాగము చేత ప్రపంచమంతటను వ్యాప్తమై యుండెను. ప్రాణహీనమగు జగత్తు లేదు. ప్రాణహీనమగు ప్రాణియు నీ సృష్టిలో లేదు. అట్టి ప్రాణహీనము నకు వృద్ది లేదు. ప్రాణము లేనిదేది యని ఉండుట లేదు. కావున ప్రాణము సర్వజీవముల కంటె అధికము. దానిని మించిన బలాఢ్యమైనది యేదియును లేదు. ప్రాణము కంటె గొప్పవారు సమానులు యెవరును ఉన్నట్లుగ నెవరును చెప్పలేదు, చూడలేదు. ప్రాణదేవుడొక్కడే అయినను ఆయా పనులను చేయుటచే బహు స్వరూపుడగుచున్నాడు. కావున ప్రాణము సర్వోత్తమమని ప్రాణోపాసన పరులనుచున్నారు. సర్వసృష్టికి వినాశమునకు స్థితికి ప్రాణదైవమే సమర్థము. విష్ణువు తప్ప మిగిలిన దేవతలెవరును ప్రాణమును తిరస్కరింపలేరు.


ప్రాణదేవత సర్వదేవాత్మకము, సర్వదేవ మయము.. నిత్యము శ్రీహరిని అనుసరించి యుండును. శ్రీహరి వశమున నుండును. ప్రాణదైవము. శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినదు, చూడడు. రుద్రుడు, ఇంద్రుడు మున్నగువారు శ్రీహరికి వ్యతిరేకమును చేసిరి. ప్రాణదైవము మాత్రము శ్రీహరికెప్పుడును వ్యతిరేకమును చేయుదు. కావున ప్రాణము శ్రీహరికి బలమనిరి. కావున శ్రీమహావిష్ణువు మహిమను లక్షణమును తెలిసిన జీవి పూర్వకర్మ వశమున సిద్దమైన స్థూలము తన శరీరముపై నున్న కుబుసమును విడిచినట్లు విడిచి తుదకు సర్వోత్తమము. వినాశ వహితము నగు శ్రీహరి పదమును చేరుచున్నాడు.


అప్పుడు శంఖ మహాముని వివరించెను. ఆ మాటలను విని కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినయముగా మరల శంఖుని యట్లడిగెను. స్వామీ.! బ్రహ్మజ్ఞానీ.! మహానుభావుడు జగద్గురువు సర్వేశ్వరుడునగు ప్రాణము యొక్క మహిమ లోకమున నెందులకు ప్రసిద్దము కాలేదు? దేవతలు, మునులు, మహాత్ములు మున్నగువారి మహిమ లోకమున పురాణాదుల యందు వినబడుచున్నది. కాని ప్రాణ మహాపురుషుని మహిమ యెందులకు ప్రఖ్యాతము కాలేదు అని ప్రశ్నించెను.


అప్పుడు శంఖమహాముని యిట్లనెను. పూర్వము ప్రాణ మహాపురుషుడు. సర్వోత్తముడగు శ్రీహరిని అశ్వమేధ యాగముల చేసి సేవింపదలచి గంగా తీరమునకు బోయెను. నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్దిచేసి యాగశాలలను నిర్మింప దలచెను. నాగళ్లచే దున్నించుచుండగా పుట్టలో తపము చేసికొను కణ్వ మహామునికి నాగలి తగులుటచే తపోభంగమై కోపించెను. పుట్ట నుండి వెలుపలికి వచ్చి కోపగించి తనకు విఘ్నము నాచరించిన ప్రాణపురుషుని జూచి ప్రధానుడనని గర్వించిన నీవిట్లు నా తపమునకు విఘ్నము నాచరించితివి గాన నీకు ముల్లోకముల యందును ప్రఖ్యాతి యుండదు. భూలోకమున మరింతగా ప్రఖ్యాతి యుండదని శపించెను. శ్రీహరి యవతారములు ప్రసిద్దములగును గాని నీవు మాత్రము ప్రసిద్దుడవు కావని యనెను.


ప్రాణ మహాపురుషుడును కోపించి దోషము లేని నన్ను తప్పు చేయకుండ నున్న వానిని యిట్లు శపించితివి.. కావున కణ్వమునీ! నీవు గురుద్రోహివి కమ్మని శపించెను. నీ ప్రవృత్తి నందరును నిందింతురని యనెను. కణ్వముని శాపము వలన ప్రాణ మహాపురుషుడు భూలోకమున ప్రసిద్దుడు కాలేదు. కణ్వుని ప్రాణశాపము ననుసరించి తన గురువు భక్షించి సూర్యునికి శిష్యుడయ్యెను. కిరాతా! నీవడిగిన వానినన్నిటిని చెప్పితిని. ఇంకను అడుగ వలసినది యున్నచో నదుగమని శంఖుడు పలికెను. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు వివరించెను.


వైశాఖ_పురాణం ఇరవై నాలుగవ అధ్యాయము సంపూర్ణము....

కనకధారా స్తవం

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝 *ఆమీలితాక్ష మధిగమ్య ముదా ముకుంద*

       *మానంద కంద మనిమేష మనంగతంత్రమ్*.

       *ఆకేకర స్థిత కనీనిక పక్ష్మనేత్రం*

       *భూత్యై భవే న్మమ భుజంగశయాంగనాయాః* (04)


          { _/ *కనకధారా స్తవం* _/ } 


తాత్పర్యం: ఇంచుక మూసుకొన్న కన్నులుగల వాడూ, ఆనందానికి ఆధారమైనవాడూ అయిన నారాయణుని ప్రీతితో పొంది, రెప్పపాటు లేనిదీ, మదనపరవశమైందీ, అర మూసిన కనురెప్పలు గలదీ అయిన ఓరగంటితో సిగ్గు బరువున *స్వామిని వీక్షిస్తున్న రమాదేవి యొక్క నేత్రదృష్టి నాకు సంపదలు ప్రసాదించుగాక*!

హనుమ జనన ఉత్సవం

 *🐒🙏 *నేడు హనుమ జనన ఉత్సవం*🙏🐒

 



🐒ఆయన భక్తులకి దేవుడు! అదే సమయంలో తానే స్వయంగా మహాభక్తుడు! ఒక భక్తుడే.. దేవుడై పూజలందుకోవటం.. కేవలం హనుమంతుడి విషయంలోనే సాధ్యం!


🐒ఆంజనేయుడనగానే మనకు శ్రీరామ భక్తుడు గుర్తుకు వస్తాడు. ఎక్కడెక్కడ రామ నామం వినిపిస్తుందో అక్కడక్కడ మారుతి ఇప్పటికీ, ఎప్పటికీ ఆనందబాష్పాలు రాలుస్తూ కూర్చుంటాడట! అంటే, మనకు రామదూత రక్షణ, అనుగ్రహం కావాలంటే ‘’రామ’’ అని పలకటమే మార్గం. ఆయన అమాంతం వచ్చి మన వద్ద వాలిపోతాడు. అటువంటి చిరంజీవి అయిన భవిష్యత్ బ్రహ్మ.. రుద్రాంశ సంభూతుడైన హనుమద్ జయంతి మాత్రం వైశాఖ బహుళ దశమి రోజున.


🐒హనుమంతుడ్ని రామాయణంలో ఒక పాత్రలా కాక ఒక పరబ్రహ్మ స్వరూపంగా దర్శించిన మహర్షి పరాశరుడు. ఆయన వ్యాస భగవానుని తండ్రి. అతడు అందించిన మహా పవిత్ర గ్రంథం పరాశర సంహిత. అందులో చెప్పిన శ్లోకమే మనకు ఆంజనేయ జయంతి జరుపుకోవడానికి ప్రమాణం. ఇక పరాశర సంహిత ప్రకారం వైశాఖ మాసంలో అమావాస్యకు ముందు వచ్చే దశమి నాడు హనుమాన్ జయంతి జరుపుకోవటం తెలుగు ప్రాంతంలో తరతరాలుగా వస్తోంది. మన రామాలయాలు, హనుమదాలయాలు వైశాఖ బహుళ దశమినాడు మహోత్సవాలకు కేంద్రాలవుతాయి.


 *శివుడే అంజనేయుడుగా జన్మించాడు* 


🐒ఒక్కసారి ఆంజనేయ అవతరణంలోకి తొంగిచూస్తే హనుమ రుద్రాంశ సంభూతుడు. ఆయన శివుడే! ఒకానొక సమయంలో గార్ధభాసురుడు అనే రాక్షసుడ్ని సంహరించాల్సి వస్తే విష్ణువు ఆ పనికి పూనుకున్నాడట. కానీ, శంకరుడు ఆ పని నారాయణుడు చేయలేడని పందానికి దిగాడట. చివరకు, గార్ధభాసురుని గోవిందుడే హతమార్చాడు. పందెంలో తాను ఓడిపోయినందుకు కైలాసనాథుడు వైకుంఠధామునికి దాస్యం చేస్తానని అన్నాడు. కానీ, లక్ష్మీపతి ఆ అవసరం వచ్చినప్పుడు చేద్దువుగాని అని మహాదేవునికి చెప్పాడు. 


🐒రావణాసుర వధకి విష్ణువు రాముడై వచ్చే ముందు ఇతర దేవతలు అందరూ తమతమ అంశలతో భువిపై వానర, భల్లూకాలుగా జన్మించారు. వారిలో ఒకడిగా పరమ శివుడు తన అంశని అవతరింపజేశాడు. ఆ రుద్రాంశ స్వరూపుడే మన ఆంజనేయుడు! ఆయన పుత్రుడి కోసం తపమాచరించిన కేసరీ సతీ అయిన అంజనా దేవీ గర్భంలో వాయు దేవుని వరంగా ప్రభవించాడు. పైగా హనుమ జననం మన తిరుమల కొండల్లోనే జరిగింది. ఇప్పటికీ ఏడు కొండల్లో ఒక దానికి అంజనాద్రి అనటం అందుకే! అక్కడే ఆంజనేయుని తల్లి నిష్ఠగా తపస్సు చేసి వాయు దేవుని వరంతో మహావీరుడ్ని తనయుడుగా పొందింది. 


🐒హనుమంతుడు పెరిగి పెద్దవాడై వాలి తమ్ముడైన సుగ్రీవునికి మంత్రి అయ్యాడు. వాలి భయంతో భార్యని, రాజ్యాన్ని వదిలి కొండపై బ్రతుకుతోన్న సుగ్రీవుడికి మళ్లీ రాజ్యం, భార్య, మరీ ముఖ్యంగా, రామానుగ్రహం కలిగింది హనుమ కారణంగానే! ఆయన దేవుడుగా భావించే శ్రీరాముడికి కూడా సీతమ్మ జాడ వెదికి పెట్టాడు. ఇలా దేవుడికే సాయం చేసిన భక్తుడు ఆంజనేయుడు తప్ప మరొకరు ఎవరూ మనకు కనిపించరు! శ్రీరాముడంతటి వాడికి భార్యా వియోగం పోగొట్టిన వాడు, తమ్ముడైన లక్ష్మణునికి సంజీవని పర్వతం మోసుకొచ్చి ప్రాణదానం చేసిన వాడు మన సంజీవరాయుడు! రాముడి నుంచీ మోక్షం కూడా కోరని పరమ నిస్వార్థ, మహా పవిత్ర భక్త శిఖామణి ఆంజనేయుడు!


🐒హనుమంతుని దేవుడుగా భావించి పూజించవచ్చు. ఆయన లంకకి వెళ్లి ఒంటరిగా సీతమ్మ జాడ తెలుసుకుని తిరిగొచ్చిన సుందర కథనంలో ఆయన ధైర్య, వీర్య, సాహసాల నుంచీ ప్రేరణ పొందవచ్చు. అలాగే, శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన కర్మఫల త్యాగం కూడా మారుతిలో ప్రత్యక్షంగా దర్శించవచ్చు. ఆయన ఏదీ చేయకుండా ఉండలేదు. అలాగని ఏదీ కూడా ప్రతిఫలంపై దృష్టితో చేయలేదు. రాముని కోసం కర్తవ్యంగా చేశాడు. ఆ కర్తవ్య దీక్ష మనమూ అలవర్చుకుంటే విజయాలు ఉప్పెనలా వస్తాయి. ఓటములు ఎన్నొచ్చినా మనల్ని పెకలించకుండా వాటి దారిన అవి పోతాయి. అందుకే, ఆంజనేయుడ్ని పూజించాలి. అంతకంటే ఎక్కువగా ఆయన గాథలు, వ్యక్తిత్వంలోంచి ఎంతో ఎంతెంతో నేర్చుకోవాలి… 


 *🐒జై శ్రీరామ్! జై హనుమాన్!🐒*

సర్వస్య శరణాగతి

 సర్వస్య శరణాగతి

(Importance of unwavering faith and complete surrender)


కరిరాజును ఊరికే బ్రోచాడా ఆ శ్రీహరి? మదంతో, కామావేశంలో ఉన్న ఆతని దుర్గుణాలన్నీ స్థానబలిమి లేని నీట మకరికి చిక్కి, పోరాడినప్పుడు అణగి, శరీరబలమంతా నశించి కృంగి కృశించి, పాపకర్మఫల సంచయమంతా పటాపంచలయ్యే సమయంలో కలిగే భావన -


లావొక్కింతయి లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్

ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్

నీవే తప్ప నితః పరంబెరుగ మన్నింప దగున్ దీనునిన్

రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా


ఇలా శరణాగతితో, ఆర్తితో రక్షింపుము అన్న స్థితి రావటానికి చాలా సమయం పట్టింది. మనకూ అంతే. నేను, నా వల్ల, నన్ను మించిన వాడు లేడు అన్న ఆలోచనలో పరమాత్మ ఉలకడు పలకడు. అన్నీ వదిలి, సమస్తము ఆయనే అన్న భావనతో శరణు కోరితే ఆయన ఒక్క క్షణం కూడా ఆగడు.


సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముం చేదోయి సంధింపడే

పరివారంబును జీరడభ్రగపతిన్ మన్నింపడాకర్ణికాం

తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాదప్రోద్ధిత శ్రీ కుచో

పరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై


పూర్తిగా తనను విశ్వసించి ఆర్తితో ప్రార్థించిన గజరాజును కాపాడటానికి ఒక్క ఉదుటున బయలుదేరాడు ఆ హరి. అప్పుడు ఆయన మనసులో ఒక్కటే - ఆ గజరాజుని కాపాడటం. మిగిలినవన్నీ పట్టవు - లక్ష్మీదేవి చెప్పడు, శంఖ చక్రములు చేతులకు అలంకరించుకోడు, పరివారానికి చెప్పడు, గరుడుని మాట వినడు, కేశములు సవరించుకోడు, లక్ష్మీదేవి పైటను సరిగా విడిపించుకోవాలన్న ఆలోచనే రాదు..కేవం ఆ భక్తుని కాపాడటమొక్కటే ఆయన ధ్యేయం, ధ్యాస.

పోతన గారి వర్ణనలోని వివరాల కన్నా అంతరార్థం భక్తుల ఆర్తిపై పరమాత్మ దృష్టి ఎలా ఉంటుంది అన్నది మనం గ్రహిస్తే మనం ఎలా ఉండాలో అర్థమవుతుంది. కావవే వరదా! నా వల్ల ఇంక కావటం లేదు (నేను, నావల్ల అన్న అహంకారం నశించినప్పుడే ఆ భావన కలుగుతుంది) అన్నది త్రికరణ శుద్ధిగా అనుభవానికి వచ్చినప్పుడు సంరక్షించు భద్రాత్మకా అన్న భావన ఉప్పొంగినప్పుడు ఆయన వింటాడు, కాపాడి తీరతాడు.

నిరంతర భక్తి భావన

 


నిరంతర భక్తి భావన - చంద్రశేఖర భారతీ స్వామి శ్రీ చరణులు

శ్రీ గురుభ్యోనమః సభాయై నమః

ఒక శిష్యుడు దూరదేశంనుండి రైలు ప్రయాణం చేసి శృంగేరి వచ్చి అప్పటి శృంగేరి పీఠాధిపతులైన జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారిని దర్శించిన తరవాత వారి సంభాషణ ఇలా జరిగింది.

శ్రీ చరణులు : ఇంటినుంచి నేరుగా వస్తున్నావా? లేక మధ్యలో ఎక్కడైనా ఆగి వస్తున్నావా ?

శిష్యుడు : లేదు స్వామీ నేరుగానే వస్తున్నాను.

శ్రీ చరణులు : మొన్న భోజనం చేసి బయలుదేరి ఉంటావు. రాత్రి భోజనం చేయటానికి వీలు లేదు మరి నిన్నటిమాటేమిటి?

శిష్యుడు : జోలార్పేట స్టేషన్లో రెండుగంటల వ్యవధి దొరికింది. అక్కడే తొందరగా స్నానం చేసి లఘువుగా జపం ముగించుకుని రెండు అరటి పళ్ళు మాత్రం తిన్నాను.

శ్రీ చరణులు : ఓ స్నానం వదలక చేస్తావన్నమాట. మరి పూజ

శిష్యుడు : స్టేషనులో పూజ సాంతం చేయడానికి వీలు లేదు.

శ్రీ చరణులు : ఔను. నిజమే స్టేషనులో పూజ సాంతం చేయడినికి కుదరదు. మరి క్లుప్తంగా?

శిష్యుడు : పూజచేయటానికి వ్యవధి ఎక్కడ?

శ్రీ చరణులు : మరి స్టేషనులో అరటిపండ్లు తినడానికి వ్యవధి ఉన్నది కదా?

శిష్యుడు : పూజ అంత సులభంగా చేయడానికి వీలు లేదు కదా?

శ్రీ చరణులు : ఎందుకు కాదు? నువ్వు తెచ్చిన అరటిపళ్ళు తినడానికి ముందు దేవతార్చనకు అర్పించి తరవాత ప్రసాదంగా స్వీకరించవచ్చును. కాదా?

శిష్యుడు : నేను అలా చేయలేదు. మూర్తి పెట్టెలోపెట్టి నా మూటలో ఉన్నది కదా.. బయటకు తీస్తే కదా నివేదనం చేసేది.

శ్రీ చరణులు : నీవు మూర్తి పెట్టెలో పెట్టి బుట్టలో ఉన్నందువల్ల నువ్వు చేసే నివేదనం ఆ మూర్తి గ్రహించలేదని నీ భావన. నువ్వు ఉపాసించే దేవతను గూర్చి నీకు తెలిసిందింతేనా?

శిష్యుడు : మీరు చెప్తుంటే అర్థం అవుతోంది. నేను నివేదన చేసి ఉండవచ్చు........

శ్రీ చరణులు : ఇంతా చెప్పడం...... మన స్థితి ఎటువంటిదైనా ఉన్నదానిలో మన కర్తవ్యం చేయాలి అని. భగవంతుడు సర్వ వ్యాపి. విస్తారంగా పూజ చేయడానికి వీలు లేనిచోట నిండు మనసుతో భగవంతుని స్మరిస్తే చాలు. ఆయన అపరిమిత అనుగ్రహాన్ని వర్షిస్తాడు.

శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య పరమ హంస పరివ్రాజకాచార్య చంద్రశేఖర భారతీ స్వామి పాదారవిందములకు నమస్సుమాంజలులతో....

--అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్

అనాయాసేన మరణం*

 #ప్రార్ధన


మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారూ.

అది ఏమిటంటే..


"అనాయాసేన మరణం

వినా ధైన్యేన జీవనం

దేహాంతే తవ సాన్నిధ్యం

దేహిమే పరమేశ్వరం."


మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి.


దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి.


"అనాయాసేన మరణం"

*****************

నాకు నొప్పి లేక బాధ కానీ లేని

మరణాన్ని ప్రసాదించు.


"వినా ధైన్యేన జీవనం"

*****************

నాకు ఎవరి మీదా ఆధారపడకుండా,

నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు.


"దేహాంతే తవ సాన్నిధ్యం"

*******************

మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను 

నిన్ను దర్శించుకునే విధంగా దీవించు.  


*దేహిమే పరమేశ్వరా*

*****************

ఓ పరమేశ్వర నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను.


1)అనుక్షణం నీ ప్రార్ధనలొనే గడిపే విధముగా అనుగ్రహించు.నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు.

2)ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు. 

3) నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా 

ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు.

ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు  చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాదిస్తాడని మరువకండి.


*అనాయాసేన మరణం*

*వినా ధైన్యేన జీవనం*

*దేహాంతేతవసాన్నిధ్యం*

*దేహిమే పరమేశ్వరా*


🚩సర్వే జనాః సుఖినోభవంతు 🚩

01.06.2024. శనివారం

 01.06.2024.      శనివారం


*శ్రీ క్రోధి నామ సంవత్సరం,ఉత్తరాయణం, వసంత ఋతువు*


సుప్రభాతం.....


ఈరోజు వైశాఖ మాస బహుళ పక్ష  *నవమి* తిథి ఉ.07.24 వరకూ తదుపరి *దశమి* తిథి రా.రే.తె.05.04 వరకూ తదుపరి *ఏకాదశి* తిథి, *ఉత్తరాభాద్ర* నక్షత్రం రా.03.16 వరకూ తదుపరి *రేవతి* నక్షత్రం, *ప్రీతి* యోగం మ.03.10 వరకూ తదుపరి *ఆయుష్మాన్* యోగం, *గరజి* కరణం ఉ.07.24 వరకూ,*వణిజ* కరణం సా.06.15 వరకూ *భద్ర(విష్టి)* కరణం రా.05.04 వరకూ తదుపరి *బవ* కరణం ఉంటాయి.

*సూర్య రాశి* : వృషభం ( రోహిణి నక్షత్రం లో)

*చంద్ర రాశి* : మీనం లో

*నక్షత్ర వర్జ్యం*: మ.01.47 నుండి మ.03.17 వరకూ

*అమృత కాలం*: రా.10.46 నుండి రా.12.16 వరకూ


( హైదరాబాద్ ప్రాంతం వారికి)

*సూర్యోదయం* : ఉ.05.41

*సూర్యాస్తమయం*: సా.06.47

*చంద్రోదయం*: రాత్రి 02.06

*చంద్రాస్తమయం*: మ.01.47

*అభిజిత్ ముహూర్తం*: ప.11.48 నుండి మ.12.40 వరకూ

*దుర్ముహూర్తం*: ఉ.05.41 నుండి 07.26 వరకూ

*రాహు కాలం*: ఉ.08.58 నుండి ఉ.10.36 వరకూ

*గుళిక కాలం*: ఉ.05.41 నుండి 07.19 వరకూ

*యమగండం*: మ.01.52 నుండి మ.03.31 వరకూ.


ఈరోజు తెలుగు రాష్ట్రాలలో *హనుమజ్జయంతి* వేడుకలు జరుపుకుంటారు. చైత్ర పూర్ణిమ రోజున ప్రారంభం అయిన 41 రోజుల హనుమాన్ దీక్ష ఈరోజుతో పూర్తి అవుతుంది.


హనుమాన్ జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం, ఉత్తర భారత దేశంలో చైత్ర పౌర్ణమి తిథి రోజున, తమిళనాడులో మార్గశీర్ష అమావాస్య తిథి రోజున, కర్ణాటక లో మార్గశీర్ష శుక్ల పక్ష త్రయోదశి తిథి రోజున జరుపుకుంటారు.


హనుమాన్ స్మరణం తో....సమస్త సన్మంగళాని భవంతు..శుభమస్తు..నమస్కారం.....సభక్తికం గా.....మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్.

ఫోన్ నెంబర్: 6281604881.

హనుమజ్జయంతి ప్రత్యేకం - 1/11

 ॐ       హనుమజ్జయంతి ప్రత్యేకం -  1/11 


    హనుమజ్జయంతి శుభాకాంక్షలు

    ఈ రోజు వైశాఖ బహుళ దశమి. హనుమ జన్మించినరోజు. 

      

    హనుమంతుని తండ్రి పేరు కేసరి. 

    అంజన ఆ కేసరి యొక్క భార్య. 

    అంజన యొక్క కుమారుడు ఆంజనేయుడు. 

    హనుమంతుడు, అంజనాదేవి గర్భాన -  వాయుదేవుడు - శివతేజస్సును ప్రవేశపెట్టడం వలన జన్మించాడు. 

    అందుచేత పవనతనయుడు, మారుతి నందనుడు వంటి పేర్లు కలిగియున్నాడు. 


I.హనుమ - వాయు పుత్రుడు - ప్రత్యేకత


    రావణ వధకై, బ్రహ్మాది దేవతల ప్రార్థనకు స్పందించి, 

    విష్ణువు - దశరథుని తండ్రిగా చేసికోవడానికి ఇష్టపడ్డాడు. 

    అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరితో 

    "అవతరించే విష్ణువుకు సహాయకులుగా ఉండుటకై బలవంతులూ కామరూపులూ అయి, మీ మీ శక్తులు కలిగియుండేలాగు పుత్రులను సృజింపుడు" అన్నాడు. 

   "ఎలుగుబంటులలో శ్రేష్థుడైన జాంబవంతుని తాను చాల క్రితమే సృజించాను" అని కూడా అన్నాడు. 


    అప్పుడు 

1.ఇంద్రుని వల్ల             - వాలి,

2.సూర్యుని వలన        - సుగ్రీవుడు, 

3.బృహస్పతి వల్ల         - తారుడు, 

4.కుబేరుని వలన         - గంధమాదనుడు, 

5.విశ్వకర్మ వలన          - నలుడు, 

6.అగ్ని వలన               - నీలుడు, 

7.అశ్వినీ దేవతల వల్ల  - మైంద ద్వివిదులు, 

8.వరుణుని వలన        - సుషేణుడు,

9.పర్జన్యుడని వలన     - శరభుడు, 

10.వాయువు వల్ల        -    హనుమ జన్మించారు. 


    పరాక్రమాలు గల అనేకమంది - గోలాంగూల (కొండముచ్ఫు) స్త్రీలయందూ, ఋక్ష స్త్రీల యందూ, కిన్నర స్త్రీలయందూ జన్మించారు. 


    ప్రధానంగా పైన పేర్కొన్న పదకొండు మందీ, పదకొండు విభాగాలకు చెందినవారు. తండ్రుల శక్తులు కలిగి, ఆయావిభాగాలలో నిష్ణాతులు.  


    ఒక భారీ పథకము (Project) చేపట్టేటపుడు కావలసిన 11 ముఖ్య విభాగాలైన 


ప్రణాళిక(Planning), 

వ్యవస్థీకృత కార్మిక రంగం(Organised working sector), 

కుశాగ్రబుద్ధి కలిగిన పరిపాలన(Correct decisive administration), , 

మేధస్సు(Intellect), 

ఆర్థికం(Finance), 

నిర్మాణం(Archetech), 

చైతన్యం(Activeness), 

ఆరోగ్యం(Health), 

నీరు(Water), 

దాపరికం(Secrecy), 

సర్వజ్ఞత(All round) అనేవి ప్రధాన విషయాలు. 


    అటువంటి వాటికి సంబంధించి వారు "రావణ వధ" అనే ప్రత్యేక ప్రణాళిక(Operation)కి గాను వచ్చిన కారణజన్ములు. 


    అందులో వాయుపుత్రుడు ఒక ప్రత్యేకమైన వాడు. 

    వాయువు సర్వత్ర వ్యాప్తిచెంది, అందరికీ ప్రాణమైనది. 

    అదే విధంగా వాయుదేవుని వలన జన్మించిన హనుమ, అందఱితోనూ అన్ని పనులలోనూ నేర్పుతో (all round) పని చక్కబెట్టగల్గినవాడు. 


    అంతేకాక, వాయువు 


(అ) సప్త మండలాలలో సప్త వాతస్కంధాలుగా కనబడుతుంది. 

(EXTERNAL - AT THE SPACE)


అవి


(i) మేఘమండలం   - ఆవహము, 

(ii) సూర్యమండలం - ప్రవహము, 

(iii) చంద్రమండలం  - సంవహము, 

(iv) నక్షత్రమండలం  - ఉద్వహము, 

(v) గ్రహమండలం     - వివహము, 

(vi) సప్తర్షిమండలం  - పరివహము, 

(vii) ధ్రువమండలం  - పరావహము 

                - అని ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క అధిష్ఠానదేవతగా ఉంటుంది. 

    అందుకనే వాయుపుత్రుడైన హనుమ అంతరిక్ష సంచారాన్ని  అలవోకగా చేస్తాడు. 

    ఆకాశమార్గంలో సముద్ర లంఘనం, సంజీవని పర్వతం పెకలించి తీసుకురావడం, తిరిగి యథాస్థానంలో ఉంచడం వంటివి ఈ కోవలోకి వస్తాయి. 


(ఆ) శరీరంలో 

      (INTERNAL - WITH IN THE BODY) 


అవి


    హృదిలో             - ప్రాణ, 

    గుదిలో               - అపాన, 

    నాభి వద్ద            - సమాన, 

    కంఠంవద్ద            - ఉదాన, 

    సర్వశరీరమందు  - వ్యాన 

                - అనే ఐదు వాయువులు అంతర్గతంగా అందరికీ జీవాధారంగా పనిచేస్తాయి. 

    వాయునందనుడు ఈ ఐదు వాయువులతోనూ శారీరకంగా అద్భుతాలు చేసినవాడు కదా!


    ఈ విధమైన కార్యాలవలనే,  విభీషణునితో జాంబవంతుడు


      "హనుమ జీవించియున్నచో వానరసైన్యము హతమైననూ బ్రతికియున్నట్లే! 

       మారుతి ప్రాణాలు విడిస్తే, మనమందరమూ బ్రతికియున్ననూ మరణించినవారితో సమానమే!" 

                - అని వాయుపుత్రుడైన హనుమ గూర్చి అనగలిగాడు. 


వాయువు: 


    "గంధనం హింసనం యో వాతి చరాచరం జగద్ధరతి బలినాం బలిష్ఠః స వాయుః" - అని వాయు పదానికి నిర్వచనం. అంటే, 

  - చరాచర జగత్తును ధరించి జీవింపజేసి లయింపచేయువాడునూ, బలవంతులకంటే బలవంతుడునూ అవడం వల్ల దానికి "వాయువు" అని పేరు అని అర్థం. 


    వాయుపుత్రుడుగా హనుమ శ్రీరామునికి ప్రీతిపాత్రుడై, మనందరికీ ఇష్టమైన "ఇహలోక రక్షకుడు". 


               జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 


          జై హనుమాన్ జై జై హనుమాన్  


                           కొనసాగింపు .... 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - వైశాఖ మాసం - కృష్ణ పక్షం  -‌ నవమి & దశమి  - ఉత్తరాభాద్ర -‌‌ స్థిర వాసరే* (01.06.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

పంచగ్రహ కూటమి


సోషల్ మీడియా పుణ్యామా అని మనం ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నాం. జూన్ లో ఏర్పడబోతున్న పంచగ్రహ కూటమి గతంలో ఏర్పడ్డ వాటితో పోల్చుకుంటే చాలా చిన్నది. ఇక్కడ గత కొంత కాలం క్రితం ఏర్పడిన వివిధ గ్రహ కూటముల వివరాలు తేదీలు సమయాలతో సహా ఇచ్చాను. అంతే కాకుండా అవి జరిగినప్పుడు లేదా జరిగిన తర్వాత ఏర్పడిన ప్రకృతి విపత్తుల వివరాలు కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఇచ్చిన తేదీలు మరియు సమయాలు భారత కాలమానం ప్రకారం ఇవ్వబడ్డాయి.


అష్ట గ్రహ కూటమి

ఫిబ్రవరి 3, 1962 సాయత్రం 5.50 నుంచి ఫిబ్రవరి 5, 1962 సాయత్రం 5.46 వరకు ఈ అష్టగ్రహ కూటమి మకర రాశిలో ఉన్నది. ఈ సమయంలో రాహువు కర్కాటక రాశిలో ఉంటే, మిగిలిన గ్రహాలన్ని మకర రాశిలో ఉన్నాయి. ఈ అష్టగ్రహ కూటమి అయ్యాక చెప్పుకోదగిన ప్రకృతి విపత్తులు ఏమి జరగలేదు. కానీ ఈ అష్టగ్రహ కూటమి అయ్యాక కొంత కాలానికి రాజకీయంగా చాలా దేశాల్లో చెప్పుకోదగిన మార్పులు జరిగాయి. కాకపోతే ఈ మార్పులు వెంటనే జరిగినవి కాదు.


పంచగ్రహ కూటమి

జనవరి 10, 1994 తెల్లవారు ఝామున 03.58కి చంద్రుడు ధనూరాశిలోకి ప్రవేశించటంతో పంచగ్రహ కూటమి ప్రారంభమయ్యి అదేరోజు మధ్యాహ్నం 12.27 కు బుధుడు మకర రాశిలోకి మారటంతో ఈ పంచగ్రహ కూటమి ముగిసింది. ఈ పంచగ్రహ కూటమి జరిగిన వారం రోజులకు అంటే జనవరి 17, 1994 రోజున అమేరికాలోని లాస్ ఏంజల్స్ ప్రాంతంలో 6.7 మాగ్నిట్యూట్ తో భారీ భూకంపం వచ్చింది.


పంచగ్రహ మరియు షడ్గ్రహ కూటమి

మే 3, 2000, అర్ధరాత్రి 12.01 కి మేష రాశిలోకి చంద్రుడి ప్రవేశంతో ఈ షడ్గ్రహ కూటమి ప్రారంభమయ్యి మే 5, 2000 రోజున అర్ధరాత్రి 01.51కు చంద్రుడు వృషభరాశిలోకి ప్రవేశించటంలో ఈ షడ్గ్రహ కూటమి ముగిసింది. చంద్రుడితో పాటు సూర్యుడు, బుధుడు, గురువు, శుక్రుడు, మరియు శని గ్రహాలు ఈ సమయంలో మేష రాశిలో సంచరించాయి. అయితే చంద్రుడు మేష రాశినుంచి వృషభరాశిలోకి మారినప్పటికి, ఏప్రీల్ 27, 2000, తెల్లవారు ఝామున 5.51కి ప్రారంభమయిన సూర్యుడు, బుధుడు, గురువు, శుక్రుడు, మరియు శని గ్రహాలతో కూడిన పంచ గ్రహ కూటమి మే 11, 2000 సాయత్రం 04.51 కి బుధుడు మేష రాశినుంచి వృషభరాశిలోకి మారటంతో ముగిసింది.


ఈ షడ్గ్రహ కూటమి జరుగుతున్న సమయంలో అంటే మే 4న ఇండోనేషియా, సుమత్ర దివుల్లో 7.6 మాగ్నిట్యూట్ తో భారీ భూకంపం వచ్చింది.


పంచగ్రహ కూటమి, షడ్గ్రహ కూటమి, సప్తగ్రహకూటమి

ఏప్రీల్ 26, 2002, తెల్లవారు ఝామున 05.50కి బుధుడు వృషభరాశిలోకి మారటంతో. రాహువు, బుధుడు, కుజుడు, శుక్రుడు మరియు శనితో కూడిన ఈ పంచగ్రహ కూటమి ప్రారంభమయ్యి మే 12, 2002, రాత్రి 8.48 చంద్రుడు వృషభరాశిలోకి రావటంతో షడ్గ్రహ కూటమిగా మారింది. ఆ తర్వాత మే 15, 2002 రోజున తెల్లవారు ఝామున 04.48కి సూర్యుడు వృషభరాశిలోకి ప్రవేశించటంతో సప్తగ్రహ కూటమిగా మారింది. అదే రోజున తెల్లవారు ఝామున 05.44 కు చంద్రుడు మిథున రాశిలోకి మారటంతో తిరిగి షడ్గ్రహ కూటమిగా మారింది. అదేరోజు సాయత్రం 4.49కి శుక్రుడు మిథున రాశిలోకి మారటంతో తిరిగి పంచగ్రహ కూటమిగా మారింది. మే 19, 2002 రోజున ఉదయం 11.12కు కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించటంతో ఈ పంచగ్రహ కూటమి కూడా ముగిసింది.


ఈ పంచగ్రహ కూటమి ప్రారంభమవటానికి ఒక రోజు ముందు అఫ్ఘనిస్తాన్ లో 6.1 మాగ్నిట్యూట్ తో భారీ భూకంపం వచ్చింది.


ఈ ప్రకృతి విపత్తులకు గ్రహ కూటములకు గల సంబంధాన్ని జ్యోతిష పరంగా ఇంకా పరిశోధన చేయాల్సి ఉంది. ఇక్కడ నా దృష్టిలోకి వచ్చిన కొన్ని విషయాలు మాత్రమే చెప్పటం జరిగింది. అయితే ఈ గ్రహకూటములేవి కూడా వ్యక్తిగతంగా ఎటువంటి సమస్యలు ఇవ్వలేదనే విషయాన్ని అందరూ గుర్తించాలి.

_జూన్ 1, 2024_*

ॐశుభోదయం, పంచాంగం ॐ 

 *ఓం శ్రీ గురుభ్యోనమః*  *_జూన్ 1, 2024_*  

*శ్రీ క్రోధి నామ సంవత్సరం*

*ఉత్తరాయణం*

*వసంత ఋతువు*

*వైశాఖ మాసం*

*కృష్ణ పక్షం*

తిథి: *నవమి* ఉ6.21

&

*దశమి* మర్నాడు తె3.53 వరకు 

వారం: *స్థిరవాసరే*

(శనివారం)

నక్షత్రం: *ఉత్తరాభాద్ర* రా2.30

యోగం: *ప్రీతి* మ2.50

కరణం: *గరజి* ఉ6.21

&

*వణిజ* సా5.07

&

*భద్ర* తె3.53

వర్జ్యం: *మ1.06-2.35*

దుర్ముహూర్తము: *ఉ5.28-7.11*

అమృతకాలం: *రా10.02-11.31*

రాహుకాలం: *ఉ9.00-10.30*

యమగండం: *మ1.30-3.00*

సూర్యరాశి: *వృషభం*

చంద్రరాశి: *మీనం*

సూర్యోదయం: *5.28*

సూర్యాస్తమయం:*6.27*

 🚩 *హనుమజ్జయంతి* 🚩

లోకాః సమస్తాః*

 *సుఖినోభవంతు*

మనసార స్మరిస్తే

 జై శ్రీమన్నారాయణ..!

01.06.2024, శనివారం



*“అజాడ్యం వాక్ పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ ”* హనుమంతుని మనసార స్మరిస్తే చాలట బుద్ధి, శరీరబలం, యశస్సు, చెదరని ధైర్యం, ఎవ్వరి వలన భయపడకపోవటమూ, ఆరోగ్యము కలుగుట, పనిలో చురుకుదనం, వాక్కు యొక్క సామర్థ్యం కలుగుతాయని ప్రమాణం. మన భారతీయ సంప్రదాయాలను మనకెన్నో పండుగలున్నా విశేషమైన భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో శ్రీ హనుమజ్జయంతి వొకటి.


 *“వైశాఖే మాసి కృష్ణాయాం దశమి మంద సంయుతా\ పూర్తప్రోష పదాయుక్తా అధనైదృత సంయుతా తసాం మధ్యాహ్ననే వాయాం జనయా మాస వైసుతమ్”* 

అంటే ఆంజనేయస్వామి వైశాఖమాసం, కృష్ణపక్షం, దశమి శనివారం, పూర్వాబాధ్ర నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో నైదృతీ నామయోగం గ్రహాలన్నియు శుభ స్థానాలలో సంచరిస్తున్న మధ్యాహ్న సమయంలో కేసరి ఆంజనాదేవి

ముక్తాఫల గర్భమున జన్మించాడు. ఆనాటి నుండి వైశాఖ బహుళ దశమినాడు *“హనుమజ్జయంతి”* ని జరుపుకుంటాం. 


హనుమ మాతృభక్తి పరాయణుడు. మనం ఆ సుగుణాన్ని అలవరచుకుంటే వృద్ధాశ్రమాలే ఉండవు. పావని ప్రభుభక్తిపరుడు. ప్రభువంటే రాజు, యజమాని. హనుమకి ప్రభువు సుగ్రీవుడు. సుగ్రీవాజ్ఞకు తిరుగులేదు. సీతజాడ కనిపెట్టమని ఆదేశించగా.. ఆంజనేయుడు సముద్రాన్ని దాటి, సీతమ్మ జాడ కనిపెట్టాడు. అటు రామకార్యాన్ని, ఇటు రాజాజ్ఞను నెరవేర్చాడు. ఆ కార్యదీక్షను, ధైర్యసాహసాలను అలవరచుకోవాలి. ఆంజనేయస్వామి- స్వామిభక్తి ప్రపూర్ణుడు. స్వామి అంటే ఎవరు? సాక్షాత్తు శ్రీరాముడు. తన వినయం, విధేయత, భక్తి, సేవలతో స్వామిని అలరించాడు. ఆంజనేయుడిపట్ల అంత నమ్మకం ఉన్నందునే తన అంగుళీయకాన్ని ఇచ్చి పంపాడు రాముడు. అతడే కార్యసాధకుడన్న మహావిశ్వాసం రాముడిది.


అడుగడుగునా ఎదురైన ఆటంకాలన్నిటినీ అధిగమించాడు. సీతా మహాసాధ్విని కలిసి,  ఆనవాలును చూపాడు. ఆ తల్లిని ఓదార్చాడు.తిరిగి రాముని చేరుకుని, ధైర్యం చెప్పి, రావణ సంహారంలో ఎన్నో విధాల సహకరించాడు. సీతారాములను కలిపాడు. అంతేనా! వారిని తన హృదయంలో స్థిరపరచుకున్న భక్తాగ్రేసరుడు అంజనీపుత్రుడు. పరోపకారానికి, లోకశ్రేయస్సుకి మరో రూపం ఆంజనేయుడు. లక్ష్మణుని బతికించడానికి ఏకంగా సంజీవని పర్వతాన్నే పెకలించుకుని వచ్చాడు. దుష్టసంహారం చేసి, జగత్తుకు ఎనలేని మేలు చేకూర్చాడు. నిత్యం రామనామ స్మరణతో భూలోకాన్నే పునీతం చేశాడు. రామభక్త హనుమంతుని ఆరాధనతో ఇన్ని సద్గుణాలు అలవడతాయి.

విరాళాలు ఇవ్వగలరు

  విరాళాలు ఇవ్వగలరు 

రోజు మన బ్లాగుని 1000 నుండి 2000 మంది ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలనుండి చూస్తున్నారని తెలుపుటకు సంతోషిస్తున్నాము. బ్లాగును ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు.  

 

 ఈ బ్లాగు అభివృద్ధికి తోడ్పడగలరు. క్రింది మొబైలు నంబరుకు జీ పే,, లేక ఫోనుపే చేయగలరు. మీరు పంపే విరాళాలను కృతజ్ఞతతో స్వీకరించి బ్లాగు అభివృద్ధికి వినియోగించ బడును. 

+91 9848647145

*హై అలర్ట్

 *హై అలర్ట్ జారీ చేయబడింది*


 *మే 31 నుండి జూన్ 4 వరకు, ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరూ (ఓపెన్ స్కై కింద) బయటకు వెళ్లకూడదు, ఎందుకంటే ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ నుండి 55 డిగ్రీల సెల్సియస్‌కు వెళుతుందని వాతావరణ శాఖ తెలిపింది, దీని కారణంగా ఏదైనా ఉంటే ఒక వ్యక్తికి ఊపిరాడకుండా లేదా అకస్మాత్తుగా అస్వస్థతకు గురైనట్లయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి, తద్వారా వెంటిలేషన్ లేకుండా, మొబైల్ వాడకాన్ని తగ్గించండి, మొబైల్ పేలిపోయే అవకాశం ఉంది, దయచేసి జాగ్రత్తగా ఉండండి మరియు ప్రజలకు తెలియజేయండి. పెరుగు, పాలవిరుగుడు, చెక్క యాపిల్ జ్యూస్ మొదలైన శీతల పానీయాలను వీలైనంత ఎక్కువగా ఉపయోగించండి.*


 *చాలా ముఖ్యమైన సమాచారం* 

 *డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ డిఫెన్స్* 

 *ఈ క్రింది వాటి గురించి పౌరులు మరియు నివాసితులను హెచ్చరిస్తుంది*

         *రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 47 నుండి 55 డిగ్రీల సెల్సియస్ మధ్య పెరగడం మరియు క్యుములస్ మేఘాల కారణంగా చాలా ప్రాంతాల్లో ఉక్కిరిబిక్కిరి చేసే వాతావరణం ఉన్నందున, ఇక్కడ కొన్ని హెచ్చరికలు మరియు జాగ్రత్తలు ఉన్నాయి.*

  *కార్ల నుండి వీటిని తొలగించాలి*

 1.గ్యాస్ కంటెంట్ 

 2 లైటర్లు 

 3. కార్బోనేటేడ్ పానీయాలు 

 4. సాధారణంగా పెర్ఫ్యూమ్ మరియు ఉపకరణం బ్యాటరీలు

 5. కారు కిటికీలు కొద్దిగా తెరిచి ఉండాలి (వెంటిలేషన్) 6. కారులోని ఇంధన ట్యాంకును పూర్తిగా నింపవద్దు. 

 7. సాయంత్రం ఇంధనంతో కారుని పూరించండి 

 8.ఉదయం కారులో ప్రయాణించడం మానుకోండి 

 9. ముఖ్యంగా ప్రయాణిస్తున్నప్పుడు కారు టైర్లను ఓవర్‌ఫిల్ చేయవద్దు.

         *తేళ్లు మరియు పాముల నుండి జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అవి వాటి రంధ్రాల నుండి బయటకు వస్తాయి మరియు చల్లని ప్రదేశాలను వెతుక్కుంటూ పార్కులు మరియు ఇళ్లలోకి ప్రవేశించవచ్చు.*

  *నీరు మరియు ద్రవాలను పుష్కలంగా త్రాగండి, గ్యాస్ సిలిండర్‌లను సూర్యరశ్మికి గురికాకుండా చూసుకోండి, విద్యుత్ మీటర్లను ఓవర్‌లోడ్ చేయకుండా చూసుకోండి* *మరియు ఇంట్లో రద్దీగా ఉండే ప్రదేశాలలో, ముఖ్యంగా విపరీతమైన వేడి సమయంలో మాత్రమే ఎయిర్ కండిషనర్‌లను ఉపయోగించండి.  మరియు రెండు-మూడు గంటల తర్వాత, 30 నిమిషాలు విశ్రాంతి ఇవ్వండి.  45-47° ACని 24-25°కి మాత్రమే ఆపరేట్ చేయండి, ముఖ్యంగా ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య సూర్యకాంతికి గురికాకుండా ఉండండి.*

         *చివరిగా: దయచేసి ఈ సమాచారాన్ని ఇతరులకు తెలియకపోవచ్చు మరియు దీన్ని మొదటిసారి చదువుతున్నందున షేర్ చేయండి.*