3, జూన్ 2021, గురువారం

తెలుగు

 *తెలుగు చమత్కారం*💥💥💥

🙂 🙂 🙂 🙂 🙂 🙂


'ఓ పల్లెటూరి కిరాణా వ్యాపారి టీచర్ దగ్గరకొచ్చి ' సింతపండు' అని రాసినందుకు నా కొడుకుని దండించారట. ' చింతపండుని సింతపండు అంటే దాని పులుపేమైనా తగ్గిపోతుందా ? ఎలా రాసినా పర్వాలేదు.


కొంచెం కిరణాపద్దులు రాయడం నేర్పండి చాలు' అంటాడు. మునిమాణిక్యం వారి రచనలలోని సన్నివేశం ఇది.భాష ప్రయోజనం భావ వ్యక్తీకరణకే. కానీ కొన్ని పదాలు వాటి మూలాలు తెలుసుకుంటే చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. చూడండి.


'వాడెదవ' అంటే తిట్టనుకునేరు .చెరకుగడ చివరిభాగం.


tip of the sugar cane అన్నాడు బ్రౌన్.


'సమాజం' అనబోయి 'సమజం' అన్నారనుకోండి.ప్రజా సమూహం కాస్తా 'పశువుల మంద' అయిపోతుంది.

'రామబాణం' అంటే మనకు తెలిసిన అర్ధమే కాదు. 'తాటాకు గ్రంధాలను తొలిచే పురుగు' అనే అర్ధం కూడా ఉంది. (ఈ అర్ధం బాగుంది కదా!)

'శ్రీ' అంటే విషం అనే అర్ధం కూడా ఉందండోయ్.


'దస్తూరి' అంటే చేతిరాత అనే కాదు 'సుంకం' అని కూడా .(customary fee - బ్రౌన్)


'ముండపులుసు' అనేది దూషణ అనుకునేరు. ' మృతుని ఇంటికి దూరపు బంధువులు వచ్చినపుడు భోజనం చేసివెళతారట. ఆ భోజనంలో తాలింపు లేకుండా ఉప్పు, కారం, చింతపండు, వేసి పచ్చిపులుసు చేస్తారట అదే ముండపులుసు.


( తెలంగాణా జాతీయాలు, వేముల పెరుమాళ్ళు )


కొన్ని కుటుంబాల్లో పిల్లల్ని 'దొంగ బడవా' అని ముద్దుగా పిలుస్తుంటారు. ఈ మాటకు ' ముండలను తార్చేవాడు' 'లుచ్చా' అనే అర్ధాలిచ్చాడు బ్రౌన్.


ఒకాయన ఉదయాన్నే ఓ పండితుడి ఇంటికి వెళ్లి అతని కుమారుణ్ణి " మీ నాన్నగారున్నారా ? " అని అడిగాడట.


తండ్రికి తగ్గ ఆ కొడుకు " పెరట్లో పుష్పిక విముక్తికై నిష్టీవన కార్యక్రమంలో ఉన్నారు " అన్నాడట ఆ పెద్ద మనిషి అదేదో పూజా కార్యక్రమం అనుకుని వెళ్ళిపోయాడు పాపం. ఇంతకీ ఆ పండితుడు పళ్ళు తోముకుంటున్నాడు. పుష్పికం అంటే పళ్ళ పాచి ( దంత మలం అని శబ్దరత్నాకరం ) నిష్ఠివనం అంటే ఉమ్మేయడం.


ఒక మీటింగులో ఓ వక్త మాట్లాడుతూ " మన మంత్రిగారు సభాజనమును బాగా ఆకట్టుకుంటారు " అన్నాడట . 'సభాజనము' అంటే చుట్టాలను కౌగాలించుకుని సంతోష పెట్టడం( శబ్దరత్నాకరం)


సొంతవిషయాలను పదేపదే చెబుతుంటే ' నీ సొద ఆపు అంటాం . విసుగెత్తించే ప్రసంగం అనే అర్ధం మాండలికాల్లో ఉంది కానీ "


శవాన్ని కాల్చడానికి పేర్చిన కట్టెల పోగు " అనేది నిఘంటు అర్ధం.


ఫలానా రాజకీయ నాయకుడికి ప్రజలు 'బ్రహ్మరధం' పట్టారు అంటారు. గొప్ప సత్కారం అనే అర్ధమే తీసుకుంటాం. కానీ బ్రహ్మరథం అంటే 'చనిపోయిన సన్యాసులను తీసుకుపోయే వాహనం' అని సూర్యరాయాంధ్ర నిఘంటువు లో ఉంది.


' గ్రామీణ ప్రాంతం' అంటున్నాం. 'గ్రామీణ' అంటే వేశ్య అనే అర్ధం కూడా ఉంది.


గందానికి లేని ఒత్తు తగిలించి 'గంధం' అని రాస్తున్నాం.


'బోగి పండుగ' ను 'భోగి పండుగ' అనకపోతే మనకి పండగలా అనిపించదు.


గొడుగు అంటే తెలుసు. మరి 'గిడుగు' అంటే? కర్ర లేని గొడుగు.


పంగనామం అంటే తెలుసు మరి 'బుంగనామం' ఏమిటి ? తెల్ల నామానికి ఎర్ర నామానికీ ఎడము లేకుండా ఉండే నామం.


బాధితులకు నష్ట 'పరిహారం' ఇవ్వాలంటారు. 'పరిహారం' అంటే విడిచిపెట్టడం అనే అర్ధం కూడా ఉంది


'ఇలాగే ప్రయోగించండి' అని చెప్పడానికో, చర్చ కోసమో కాదు ఇది. ఆసక్తి ఉండాలే కానీ నిఘంటువులు తిరగేస్తే ఇలాంటి విశేషాలెన్నో చూడొచ్చని చెప్పడానికి.



( డాక్టర్ కె ఆనంద్ కిషోర్, పూర్వ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ గారి వాల్ నుండి)

పేదరికం పోగొట్టేందుకు

 ఒకసారి #కృష్ణార్జునులు కలిసి వెళుతున్నారు


వారికి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు.

 చూసి జాలిపడిన అర్జనుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచీ నిండుగా బంగారు నాణేలు ఇచ్చాడు.

 సంతోషంగా తీసుకువెళుతున్న ఆ యాచకుడిని మార్గంమధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు

మళ్లీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చేయసాగాడు.

మళ్లీ ఓరోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జనుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు.

ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలన ఉన్న, వినియోగంలో లేని ఒక కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు. 

తెల్లారింది. 

చూస్తే భార్య లేదు. 

అంతేకాదు ఆ కుండ కూడా లేదు.

 పరుగెట్టుకుంటూ నదీతీరం వద్దకు వెళ్లాడు. 

భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు. 

కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు. 

నదిలో నీళ్ల కోసం వంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది.

తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్లీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్లాడు.

మళ్లీ కృష్ణార్జునులు అతన్ని విచారించారు ఏమైందని.

 ఇంక ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా, ఇతనెవరో పరమ దురదృష్ణవంతుడిలా ఉన్నాడు

అన్నాడు అర్జనుడు శ్రీ కృష్ణుడితో.

లేదు అర్జున. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం 

అని బ్రాహ్మణుడి చేతిలో రెండు బంగారు నాణేలు పెట్టాడు శ్రీకృష్ణుడు. 

ఒకప్పుడు సంచీడు బంగారు నాణేలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు.

 ఈ రెండు నాణేలేమైనా నా తలరాతను మారుస్తాయా నా పిచ్చికానీ అనుకుంటూ ఇంటికెళుతున్నాడు ఆ బ్రాహ్మణుడు.


దారిలో ఒక జాలరి వలకి చిక్కి విలవిలలాడుతున్న చేపను చూశాడు. 

అతని హృదయం ద్రవించింది.

 కృష్ణుడు నాకిచ్చిన రెండు నాణేలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు. పాపం మూగజీవి దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న రెండు నాణేలూ ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకెళ్లి ఒక నీళ్ల గిన్నెలో ఉంచాడు. 

అతని భార్య ఆ చేపను చూసి అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుంది అండీ అందుకే గిలగిలా కొట్టుకుంటోంది అని పిలిచింది.

 ఇద్దరు కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుకున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు.

నదిలో తాము జారవిడుచుకున్న వజ్రం.

 ఆనందంతో ఉక్కిరిబిక్కిరై “దొరికింది...దొరికింది నా చేతికి చిక్కింది” 

అని గావుకేకలు పెట్టాడు.

 అదే సమయంలో అతనింట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారుపడ్డాడు. 

గతంలో అతన్ని దారిదోపిడి చేసి బంగారు నాణేలా సంచి దొంగలించాను, నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టాను, నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు అనుకుని వణికిపోయాడు.

ఆ బ్రాహ్మడు దగ్గరకి వచ్చి నీకు దణ్ణం పెడతాను, నీ బంగారు నాణేలు నువ్వు తీసేసుకో నన్ను రక్షకభటులకు మాత్రం పట్టివ్వద్దు 

అని ప్రాధేయపడ్డాడు. 

ఇప్పుడు నివ్వెరపోవడం బ్రాహ్మణుడి దంపతుల వంతయింది. 

తాము పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులూ తమకు చేరాయి. 

పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పాడు. 

కృష్ణా, నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణేలు, వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు. కానీ నీవిచ్చిన రెండు నాణేలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఎలా సాధ్యమైంది 

అని ప్రశ్నించాడు అర్జునుడు.

అర్జునా, అతని వద్ద బంగారం, వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను, తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు. అదే రెండు నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచిచెడులు, ఈతిబాధలు, కష్టసుఖాలు గురించి ఆలోచించాడు. నిజానికి అది దేవుడి చేయాల్సిన పని. తనూ పంచుకున్నాడు. అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను

అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ 🙏🙏🙏🙏 


🍁🍁 నేను నా ఆలోచనలు 🍁🍁

వృద్ధులకు శుభవార్త

 *వృద్ధులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం* 


* సీనియర్ సిటిజెన్స్‌కు మోడీ గవర్నమెంట్ బూన్ - మెడికల్ కన్సల్టింగ్ పూర్తిగా ఉచితం *


 సీనియర్ సిటిజన్లు మరియు ఇతర పౌరులందరికీ కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన కన్సల్టింగ్ పథకాన్ని ప్రారంభించింది.

 వృద్ధులు, ముఖ్యంగా అధిక రక్తపోటు, డయాబెటిస్ మొదలైనవారు OPD కోసం ఆసుపత్రికి వెళ్లరు.  తలనొప్పి, శారీరక నొప్పి వంటి చిన్న రోగాలకు వారు ఇంట్లో చికిత్స పొందుతారు మరియు ఆసుపత్రికి వెళ్ళడానికి సిద్ధంగా లేరు.


 మీరు ఇప్పుడు క్రింది లింక్ ద్వారా Google Chrome లో కన్సల్టెన్సీ మరియు చికిత్సను యాక్సెస్ చేయవచ్చు. 


 గమనిక:

 * 1 *.  రోగి నమోదును ఎంచుకోండి.


 * 2 *.  మీ మొబైల్ నంబర్‌ను టైప్ చేయండి.  రిజిస్ట్రేషన్ కోసం మొబైల్‌లో OTP టైప్ చేయండి.


 * 3 *.  రోగి వివరాలు మరియు జిల్లా నమోదు చేయండి.  ఇప్పుడు, మీరు ఆన్‌లైన్‌లో డాక్టర్‌తో కనెక్ట్ అవుతారు.  ఆ తరువాత, మీరు వీడియో ద్వారా మీ ఆరోగ్య సమస్యలకు వైద్యుడిని సంప్రదించవచ్చు.  డాక్టర్  ఔషధాన్ని ఆన్‌లైన్‌లో సూచిస్తారు. 

 మీరు మెడికల్ ఫార్మసీ షాపులో చూపించి medicine ఔషధం తీసుకోవచ్చు.


 *ఈ సేవ పూర్తిగా ఉచితం.*

                                      

 మీరు ఈ సేవను ప్రతిరోజూ ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 3.00 వరకు, ఆదివారం సహా ఉపయోగించవచ్చు.


 దయచేసి దీన్ని మీ సంప్రదింపు, సమూహ జాబితాలోని సీనియర్ సిటిజన్లకు పంపండి.


 ఇది కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్:


 *https: //www.eSanjeevaniopd.in*


  https://play.google.com/store/apps/details?id=in.hied.esanjeevaniopd


 ఇది సీనియర్ సిటిజన్లకు అద్భుతమైన దశ ....

 దయచేసి ప్రయోజనం పొందండి మరియు మీకు తెలిసిన అందరూ సీనియర్ సిటిజన్లకు ఫార్వార్డ్ చేయండి.

 

 🙏🙏🙏🙏🙏

అష్టమస్థాన పరిక్ష. 4

 ఆయుర్వేదము నందు గల అష్టమస్థాన పరిక్ష గురించి సంపూర్ణ వివరణ  - 4 . 


      అంతకు ముందు పోస్టులలో అష్టమస్థాన పరీక్షలలో ప్రధమం అయిన నాడీ పరీక్ష గురించి వివరించాను. ఇప్పుడు మిగిలిన వాటిగురించి వివరిస్తాను. 


 *  స్పర్శ పరీక్ష  - 


    స్పర్శ అనగా రోగిని తాకి పరీక్షించడం . రోగిని తాకి చల్లదనము , గరుకుదనము , చమట , ఆవిరి మున్నగు వాటిచే వ్యాధులను గుర్తించుట . 


  వాతము  - 


        వాతము నందు శరీరము యొక్క స్పర్శ ఆరిపోయి చల్లదనం కమ్ముచుండును. 


  పిత్తము  - 


        పిత్తము నందు శరీరము వేడిగా ఉండును . 


  శ్లేష్మము  - 


       శ్లేష్మము నందు శరీరము చల్లగా ఉండును. 


      

                 జ్వరము నందు శరీరము పోగలుగా , తాపము చెంది ఉష్ణముగా మరణముగా ఉండును. చనిపోవు వానికి శరీరము కొయ్యబారి పోవును . 


 *  రూపము  - 


        రోగి యొక్క శరీర స్థితిని బట్టి రోగ కారణము నిర్ణయించు పద్దతి. రోగి వాత సంబంధ దోషము కలిగి ఉన్న శరీరము నలుపురంగుతో , పిత్తము నందు పసుపుపచ్చ , శ్లేష్మము నందు తెలుపు వర్ణములు కలిగి ఉండును. ఆయా వ్యాధులను బట్టి రోగి యొక్క ఆకారము తెలుపు మున్నగు రంగులను కలిగి ఉండును. పాండు వ్యాధి నందు శరీరం తెల్లగా పాలిపోయి ఉండును. క్షయరోగము నందు ఆరిపోవును . శరీరము నందు కొవ్వు శాతం తగ్గిపోవును . కామెర్ల వ్యాధి నందు శరీరం పచ్చగా ఉండును. ఇలా వ్యాధిని బట్టి తెలుసుకొనవలెను . 


  *  శబ్దము  - 


         శబ్దము అనగా రోగి యొక్క మాట్లాడు ధ్వనిని బట్టి రోగనిర్ధారణ చేయుట . వాతము నందు శబ్దము హెచ్చుతగ్గులతో నిలకడలేకుండా ఉండును. పిత్తము నందు అధికంగా ఉత్సహముగా ధ్వని ఉండును. శ్లేష్మము నందు హీనస్వరము కలిగి ఉండును. భ్రమ , అపస్మారము , పైత్యజ్వరము , సన్నిపాతము మున్నగు వ్యాధులలో రోగి అతిగా ధ్వని కలిగినవాడై ఉండును. వికృతముగా అరుచును. రహస్యములు పైకి చెప్పువాడై ఉండును. కఫము నందు భయము , సిగ్గు , దుఃఖం మున్నగు వాటి యందు శబ్దము క్షీణించి ఉండును.   


       పైన చెప్పినవిధముగా వాత, పిత్త , కఫ దోషాల గురించి తెలుసుకోవచ్చు . మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు. 


  

                 తరవాతి పోస్టు నందు అష్టమస్థాన పరీక్ష యందలి మిగతావిషయాల గురించి వివరిస్తాను . 


       గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి.  పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

_*WHO ARE YOU?*_

 _*WHO ARE YOU?*_ 


🤔🤔🤔


During one of his travels, *Kalidasa* felt very thirsty and looked around for water. He saw *a woman* drawing water from a well.


He went up to her and asked her for water. She agreed to give him water, but asked him, *“Who are you? Introduce yourself.”* 


Now Kalidasa thought that an ordinary village woman was not worthy of knowing who Kalidasa was. So he said, *“I am a traveller.”* 


But his lady replied, “In this world there are only *2 travellers* – the *Sun* and the *Moon.* Both Rise and Set every day and keep travelling perpetually.”


Then Kalidasa said, “Alright then, *I am a guest.”* The lady promptly replied, “In this world there are only *2 guests* – *Youth* and *Wealth* … both are temporary and hence can only be called as guests.”


Intrigued Kalidasa said, “I am a *Tolerant person* (sahansheel vyakti).” Now the lady replied, “In this world only 2 truly know the meaning of Tolerance – *Bhoomi (Earth)* and *Tree* . How much ever you stamp the earth or throw stones at the tree (for the fruits), both continue to nurture us.”


Now Kalidasa was completely perplexed. He said, “Fine. *I am a stubborn person (hatavaadi).”* The lady smiled and said, “There are only *2 truly stubborn* personalities – our *nails* and our *hair.* We keep cutting them non-stop, but they continue to grow.


Kalidasa realised that he had been *outsmarted* . He fell at the feet of the lady and when he touched her feet and then got up, whom did he see?


 *Mata Saraswati* – the Goddess of Learning and Wisdom. She said, “Kalidasa, you are wise. But only if you know yourself do you become a *Manushya* (human being). A person without any awareness of self has not reached the pinnacle of being a Human.


 *Note:* 

The Guru who recounted this story in His Pravachan said, *“Children should become a Manushya* & know themselves. More than teaching them how to earn more money and become rich, parents should teach them to become aware of themselves and become better Human beings..

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*తీవ్ర సాధన..తీరిపోయిన సందేహం..*


*(నలభై ఏడవరోజు)*


శ్రీ స్వామివారు సాధన చేసుకునే సమయంలో..నేలమాళిగ లోపల కూర్చుని, దానిమీద ఒక చెక్క పలకను మూతగా పెట్టుకొని..ధ్యానం చేసుకునేవారు..


లోపల ఊపిరాడుతుందా?..స్వామివారికి ఏ ఆపదా కలుగదు కదా?..కనుక్కుందాము అని శ్రీధరరావు ప్రభావతి గార్లకు తోచింది..ఒకసారి ఆశ్రమానికి వెళ్లి, ఆయనతో నేరుగా మాట్లాడి తెలుసుకుందామని అనుకుని..గూడు బండి సిద్ధం చేయించుకొని ఉదయం తొమ్మిది గంటలకల్లా ఆశ్రమానికి చేసురుకున్నారు..ప్రహరీ ద్వారం తీసే ఉన్నది..దంపతులిద్దరూ లోపలికి అడుగు బెట్టేసరికి.. శ్రీ స్వామివారు బావి వద్ద నిలబడి..సూర్యనికి నమస్కారం చేసుకుంటున్నారు..ఒక్క రెండు మూడు నిమిషాల లోనే వీళ్ళిద్దరిని చూసి..సంతోషంతో నవ్వుతూ..


"అమ్మా!..మీరిద్దరూ మనసులో తల్లడిల్లిపోతున్నారా?..నాకు ఆ జగన్మాత ఆశీస్సులు ఉన్నంతవరకూ ఏ ఆపదా రాదు..మాలాటి అవధూతలకు ఇటువంటి కఠోర సాధన అవసరం..దానిని మేము చేసి తీరాలి..మోక్షానికి దగ్గర మార్గాలు లేవు!..మనసును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి..సరే..మీరిద్దరూ సందేహంతో ఇక్కడిదాకా వచ్చారు..ఆ సందేహాన్ని నివృత్తి చేస్తాను..నాతో రండి.." అన్నారు..


అత్యంత ఆశ్చర్యం తో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ప్రభావతి శ్రీధరరావు గార్లు..తాము ఎందుకోసం వచ్చిందీ ముందుగానే చెప్పేసారు శ్రీ స్వామివారు..ఇక తమ ఇద్దరికీ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు..స్వామివారి వెనకాలే ప్రధాన గది వద్దకు వెళ్లారు..


"శ్రీధరరావు గారూ..నేను ఈ క్రింద ఉన్న గది లోపలికి వెళ్లి కూర్చుంటాను..మీరు పైన ఆ చెక్క పలకతో మూసివేసి..ఒక ప్రక్కగా కూర్చోండి..తరువాత మీకు అన్నీ అవగతం అవుతాయి..సరేనా?.." అని చెప్పి..శ్రీ స్వామివారు లోపలికి దిగి పద్మాసనం వేసుకొని కూర్చున్నారు..శ్రీధరరావు గారు ప్రక్కనే ఉన్న చెక్క పలకను ఆ నేలమాళిగ పైన మూతగా పెట్టి..ఆ గదిలోనే ఒక మూలనున్న చాప పరచుకొని దానిమీద ప్రభావతి గారి తో సహా కూర్చున్నారు..


సుమారు ఓ పదిహేను ఇరవై నిమిషాల తరువాత..ఈ దంపతులిద్దరికీ ఏదో మైకం లాగా వచ్చేసింది..తమకు తెలీకుండానే నిద్రలోకి జారిపోయారు..ఆ గదిలోనే చాప మీద వాలిపోయారు.. గంట..రెండు గంటలు..ఇలా కాలం గడిచిపోతోంది.. ఉదయం తొమ్మిది, తొమ్మిదున్నర గంటల ప్రాంతంలో గదిలోకి వెళ్లిన ఆ దంపతులకు మెలకువ వచ్చేసిరికి..సమయం చూసుకుంటే..సాయంత్రం నాలుగు దాటుతోంది..ఒక్కసారిగా ఇద్దరికీ గుండె గుభేల్ మంది..


దాదాపు ఏడు గంటల పాటు తాము దిక్కుతెలీనంత గా నిద్రపోయారు.. తమ ఒళ్ళు తమకు తెలీదు..క్రింద నేలమాళిగ లో కూర్చున్న ఆ స్వామివారు ఎలా ఉన్నారో?..ఏమిటో?..అనుకుంటూ..గబ గబా లేచి చాప చుట్టి పక్కన పెట్టి..నేలమాళిగ పైన మూతగా పెట్టిన చెక్క పలకను తొలగించి.."స్వామీ..స్వామీ!.." అంటూ శ్రీధరరావుగారు.." నాయనా!..నాయనా!." అంటూ ప్రభావతి గారు పిలిచారు ఆతృతగా..


అరవవద్దు అన్నట్లు చేతితో సైగ చేస్తూ..శ్రీ స్వామివారు లేచి నిలబడ్డారు.. తన రెండుచేతులు ఆసరాగా పెట్టుకుని..ఆ గోతిలాంటి గది నుంచి ఒక్క ఉదుటున బైటకు వచ్చారు..శ్రీ స్వామివారిని చూసిన తరువాత గానీ వీళ్ళిద్దరికీ ఆత్రుత తగ్గలేదు..


కానీ..చిత్రం..కనీసం గాలికూడా చొరబడని ఆ చిన్న గోతి లాంటి గదిలో దాదాపు ఏడు గంటల పైగా ధ్యానం లో ఉన్న శ్రీ స్వామివారి శరీరం పై ఒక్క చెమట బిందువు లేదు..ఉదయం ఎంత స్వచ్ఛంగా ఉన్నారో..ఇప్పుడూ అంతే స్వచ్ఛతతో..చిరునవ్వుతో..వున్నారు..ఆ ముఖం లో దేదీప్యమైన కాంతి కనబడుతోంది..అప్రయత్నంగా దంపతులిద్దరూ చేతులు జోడించి నమస్కరించారు..


శ్రీ స్వామివారు చప్పున..నమస్కరించవద్దన్నట్లు వీరిని వారించి.."అమ్మా..మీ ఇద్దరి సందేహమూ తీరిపోయిందా?..ఇది సాధనలో ఒక భాగం అమ్మా..అవధూత సంప్రదాయం లో ఇటువంటి తీవ్ర సాధన కూడా ఒక భాగం..ఆ సాధన సక్రమంగా చేస్తే..అణిమాధ్యష్ట సిద్ధులూ వశం అవుతాయి..కానీ వాటిని సక్రమంగా సమాజహితానికి వాడుకోవాలి..అప్పుడే ఆ సాధనకు ఫలితం..స్వార్ధానికి ఉపయోగిస్తే..తాత్కాలిక భోగాలు లభించి..చివరకు పతనం అవుతారు.."


"శిరిడీ లోని సాయిబాబా..అరుణాచలం లోని శ్రీ రమణులు ఉత్తమ సాధకులకు అత్యుత్తమ ఉదాహరణలు..వారు తమను తాము తరింపచేసుకొని..తమతో పాటు ఈ సమాజానికి మార్గదర్శనం చేసారు.. ప్రస్తుతం శ్రీ పరమాచార్య వారూ వారి పంథాలో వారు జాతిని ఉద్ధరిస్తున్నారు..


(శ్రీ స్వామివారు ఈ మాటలు చెప్పేనాటికి అంటే..1974 సంవత్సర ప్రాంతంలో..మన ఆంధ్రప్రాంతంలో కొంతమందికి మాత్రమే శిరిడీ లో ప్రకటమైన శ్రీ సాయిబాబా గురించి అవగాహన ఉన్నది..నేటి లాగా విపరీత ప్రాచుర్యం లేదు..అలాగే శ్రీ రమణమహర్షి గురించి కూడా..కానీ..శ్రీ స్వామివారు ఆ ఇద్దరినీ ఉదహరించారు..అవధూత లు "ద్రష్ట" లు అనడానికి..వారికి కుల, మత, జాతి విబేధాలు లేవు అనడానికి..ఇదొక నిదర్శనం..)


"శ్రీధరరావు గారూ తపస్సులో అనేక మార్గాలున్నాయి..ఒక్కొక్కరిదీ ఒక్కొక్క పంథా..మీరు నా గురించి ఏ విషయం లోనూ చింత పడవద్దు..అన్నీ సక్రమంగా జరిగిపోతాయి..అమ్మా!..ఏ నిమిషంలో మీకు సందేహం వచ్చినా..నిరభ్యంతరంగా నా వద్దకు రండి..ఇప్పటికే కాలాతీతమైనది..వెళ్ళిరండి!.." అన్నారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లు శ్రీ స్వామివారి వద్ద సెలవు తీసుకొని బైట ఉన్న తమ బండి వద్దకు వచ్చారు..చిత్రం..అప్పటికి కూడా బండి తోలే మనిషి..నిద్ర లోనే వున్నాడు..ఎద్దులు కూడా జోగుతున్నాయి..వీళ్ళు లేపేదాకా ఆ పనివాడు లెయ్యలేదు.."మొద్దు నిద్ర పట్టింది స్వామీ!..ఎప్పుడూ ఎరగను!..ఎద్దులకు నీళ్లు కూడా పెట్టలేదు.."అంటూ ఎద్దులను అదిలించి..బండి సిద్ధం చేసాడు..దంపతులిద్దరూ శ్రీ స్వామివారు తమకోసం చూపిన ఈ చిత్కళ ను తలుచుకొని మనసులోనే నమస్కరించి ఇంటికి బయలుదేరారు..


మరో అనుభవం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*సమాధి గది నిర్మాణం..సూచన..*


*(నలభై ఐదవరోజు)*


శ్రీ స్వామివారు దగ్గరుండి ఆశ్రమ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు..మీరాశెట్టి దంపతులు ఆర్ధిక సహాయం చేస్తున్నారు..పనివాళ్ళు ను శ్రీధరరావు గారు ఏర్పాటు చేస్తున్నారు..చక చకా నిర్మాణం జరుగుతున్నది..


ఒకరోజు మధ్యాహ్నం తరువాత, మీరాశెట్టి గారు మొగలిచెర్ల లోని శ్రీధరరావు గారింటికి వచ్చారు..మామూలు కుశల ప్రశ్నల తరువాత..తీరుబడిగా కూర్చున్నాక..


"స్వామివారు ఈరోజు ఒకమాట చెప్పారు..ప్రధాన గదిలో.. భూగృహం లాగా కట్టించమన్నారు.. అందులో కూర్చుని తాను తపస్సు చేసుకుంటానని చెప్పారు.." అని మీరాశెట్టి గారు శ్రీధరరావు దంపతులతో చెప్పారు..


ఆ మాట విని ప్రభావతి గారు  ఆశ్చర్యంగా.."ప్రత్యేకంగా భూగృహం నిర్మించమని చెప్పారా?..ఇందులో ఏదో అర్ధం దాగివుంది.." అని..శ్రీధరరావు గారి వైపు చూసి.."శ్రీవారూ!  మీరు వెళ్లి పూర్తివివరం కనుక్కోండి..మీరాశెట్టి గారూ మీరు కూడా తొందరపడి భూగృహం పని మొదలుపెట్టకండి..అన్ని సంగతులూ కూలంకషంగా మాట్లాడి ఆపైన చూద్దాము.." అన్నారు..


"అందుకే గదమ్మా నేను ఇక్కడిదాకా పరిగెత్తుకొచ్చింది..నాకు వివరం చెప్పలేదు..ఇప్పుడు లోపల మళ్లీ గొయ్యి త్రవ్వి..అందులో చిన్న గది లాగా తయారు చేయడం అనేది నాకు మనసుకు సరిగ్గా తోచడం లేదు..మీరిద్దరూ ఒకసారి ఆయనతో మాట్లాడండి.." అని శ్రీధరరావు గారితో ప్రభావతి గారితో చెప్పారు మీరాశెట్టి గారు..


అప్పుడు సమయం మధ్యాహ్నం మూడు గంటలు..శ్రీధరరావు గారు ఆలస్యం చేయలేదు..పని వాడికి చెప్పి గూడుబండి సిద్ధం చేయించి..నాలుగు గంటల కల్లా ప్రభావతి గారిని కూడా వెంటబెట్టుకొని మీరాశెట్టి గారితో సహా ఫకీరు మాన్యం చేరారు..


వీళ్ల రాక కోసమే ఉన్నట్లు..శ్రీ స్వామివారు పాక వెలుపల..ఆశ్రమానికి అభిముఖంగా నిలబడి వున్నారు..ముగ్గురూ శ్రీ స్వామివారి వద్దకు వెళ్లి కలిశారు..


"నాయనా..లోపల భూగృహం కట్టించమని చెప్పారట..ఎందుకోసం?..మీ తపస్సుకు ఈ గది సరిపోతుందని మీరే చెప్పారు కదా!..మీరిచ్చిన కొలతల ప్రకారమే నిర్మాణం జరుగుతున్నది..మధ్యలో ఈ భూగృహ ప్రస్తావన ఎందుకు?.." ప్రభావతి గారు గబ గబా అడిగేసారు..


శ్రీ స్వామివారు పక పకా నవ్వారు.."మీరాశెట్టి మిమ్మల్ని వెంటబెట్టుకొచ్చాడా?..సరే!..రండి..ఈ సందేహం కూడా నివృత్తి అవ్వాలి గదా!.." అన్నారు శ్రీ స్వామివారు ..


వీళ్ళందరినీ వెంటబెట్టుకొని ఆ గది ముందు వైపు నిలబడి గంభీరంగా చూస్తూ..


"అమ్మా!..నేను సాధకుడిని..తీవ్ర సాధన నా లక్ష్యం..ఇక్కడ గది లాగా కట్టిస్తున్నారు..బాగానే వుంది..దానికి తలుపులు కూడ వస్తాయి..నేను లోపల కూర్చుని ధ్యానం చేసుకోవడానికి పెద్ద ఇబ్బంది లేదు..కానీ తరచూ హఠయోగ ప్రక్రియలో సమాధి స్థితి కి వెళుతుంటాను..ఆ సమయంలో ఒక్కొక్కసారి చిన్నపాటి అలికిడికి కూడా సమాధి స్థితి భగ్నం అవుతుంది..ఇతమిద్దంగా ఇలా జరుగుతుంది అని నేను మీకు వివరించలేను..అది అనుభవించేవారికే అవగతం అవుతుంది..అందుకని నేను ముందుగా ప్రతిపాదించిన గదిలోనే..నాలుగు అడుగుల లోతు.. నాలుగడుగుల వెడల్పు తో చిన్న గది "నేలమాళిగ" లాగా కట్టించమన్నాను..నా తపోసాధన కొఱకు జాగ్రత్తలు నేను తీసుకోవాలి కదా?.."


"మరో విషయం కూడా మీకు తెలియచేయాల్సిన అవసరం ఉంది..నా తదనంతరం ఈ ప్రదేశం ఒక పుణ్యక్షేత్రంగా మారుతుంది..ఇప్పుడు నిర్మించబోయే ఆ భూగృహమే నా సమాధి అవుతుంది..నేను అందులోనే వుండబోతాను..ఎందరో తమ తమ కోర్కెలు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు..ఆ సమాధినే దర్శించి తరిస్తారు..ఇక్కడ నేను ధారపోస్తున్న తపశ్శక్తి మహిమాన్వితం అయినది..అది ఈ క్షేత్రం లో కొన్ని వందల ఏళ్ల పాటు నిక్షిప్తమై ఉంటుంది..ప్రతి పనికీ ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది..నాకు నిర్దేశింపబడిన కర్మను నేను పూర్తిగా నెరవేర్చి..మోక్షానికి వెళతాను..నేను చేస్తున్న ఈ తపో యజ్ఞానికి సహాయం చేసిన మీ అందరి పేర్లూ కూడా చిరస్థాయిగా నిలచిపోతాయి.." 


శ్రీధరరావు దంపతులతో పాటు మీరాశెట్టి గారు కూడా నివ్వెరపోయి వింటున్నారు..ఇంతా ఈ ఆశ్రమ నిర్మాణమే ఓ కొలిక్కి రాలేదు..మరి ఈ స్వామివారేమో..తన తదనంతరం ఇక్కడ సమాధి ఉంటుంది అని చెపుతున్నారు..ఇంతా చేస్తే శ్రీ స్వామివారు ముప్పై యేళ్ళ వయసుకూడా లేని యువకుడు..అప్పుడే మోక్షం గురించిన ఆలోచనలు చేస్తున్నారే.. పరి పరి విధాల ఆలోచించి ఆయోమయానికి గురయ్యారు..


"మీరు చెప్పినట్టు ఆ నేలమాళిగను సిద్ధం చేయిస్తాము..మీరు నిశ్చింతగా తపస్సు కొనసాగించండి..మోక్షం..సమాధి..ఇవన్నీ ఇప్పుడెందుకు స్వామీ!..మీలాటి సిద్ధపురుషులు కొంతకాలం పాటు మా మధ్యలో వుండి.. మాకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేయాలి..ఇప్పుడిప్పుడే ఇటువంటి ఆలోచనలు చేయకండి.." అన్నారు శ్రీధరరావు గారు..


శ్రీ స్వామివారు ఒక్కసారిగా పెద్దగా నవ్వి.."కాలమహిమను ఎవ్వరూ తప్పించలేరు..ముందు ముందు అన్నీ మీకు అర్ధం అవుతాయి.." అన్నారు..


శ్రీ స్వామివారికి వెళ్ళొస్తామని చెప్పి..ఇవతలికి వచ్చేసారు..మీరాశెట్టి గారు అటునుంచి అటే తమ గ్రామానికి వెళ్లిపోయారు..శ్రీధరరావు దంపతులు మాత్రం శ్రీ స్వామివారి మాటలనే తలుచుకుంటూ మౌనంగా మొగలిచెర్ల కు చేరారు..


తపోసాధన..సందేహం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

శివ శబ్ద మహిమl

 శివ శబ్ద మహిమ


#శివ_శబ్ద_మహిమ


ఒకసారి ఓ పల్లెటూరి వానికి ఒక సందేహం కలిగింది. అతడు ఒక యోగి దగ్గరకు వెళ్లాడు. శివా అని పిలిచినంతనే పుణ్యం వస్తుంది అంటారు కదా. నిజంగా వస్తుందా అని అడిగాడు. అతడీ ప్రశ్నను కైలాసవాసుడే విన్నాడు. యోగి దగ్గరకు సన్యాసిగా వచ్చి ఈ ప్రశ్నకు నేను జవాబు చెప్తాను అన్నాడు. యోగి చిరునవ్వుతో అంతకన్నా కావాల్సింది ఏముంది స్వామీ అన్నాడు. ఓ జానపదుడా ఇదిగో ఈ నీకు కనిపించే ఈ చీమ చెవి దగ్గర ‘ఓం నమశివాయ’ అని అరువు అని చెప్పాడు. చీమ చెబుతుందా అన్నాడు జానపదుడు. ముందు అయితే చెప్పింది చేయి అన్నాడు సన్యాసి. జానపదుడు అట్లాగే చేశాడు. చీమ కాస్తా ప్రాణాలు కోల్పోయింది. రామ రామ! ఎంత ఘోరం జానపదుడు అనుకొన్నాడు. అట్లానే సీతాకోక చిలుక, లేడి దగ్గర శివనామం చెప్పించి వాటినీ హరీ అనిపించాడు. అంతలో అక్కడికి ఓ దంపతులు అప్పుడే పుట్టిన శిశువును తీసుకొని వచ్చి అయ్యా! ఈ శిశువును ఆశీర్వదించండి అన్నారు. సన్యాసి ఎప్పటిలాగా శివనామం చెప్పమన్నాడు. జానపదుడు గడగడా వణికి, అయ్యా! అన్నాడు. మరేం ఫర్లేదు చెప్పు అని ప్రోత్సహించాడు సన్యాసి. ‘నమఃశివాయ’ అని జానపదుడు అనగానే ఆ శిశువు ‘అయ్యా! పరమ పుణ్యచరితా! మరొక్కసారి నమశివాయ అనవా’ అన్నాడు. ఇదేమి చిత్రం అని చూస్తుంటే ఆ శిశువు ఇలా చెప్పాడు. ‘అయ్యా! చీమ దగ్గరనుంచి ఇప్పటిదాకా ఆ శివనామం చెపితేనే మనిషిగా మారాను. మరి ఇప్పుడు మరోసారి శివనామం వింటే నేను దివ్యునిగా మారిపోతాను కదా. సందేహం ఎందుకు’ అన్నాడు. శివశబ్దంలోని మహిమ తెలుసుకొన్న జానపదుడు ఆగకుండా శివనామాన్ని జపిస్తూ కదులుతున్నాడు.


ఓంనమఃశివాయ

ధన్వంతరి అమృత్* 🌿

 🌿 *ధన్వంతరి అమృత్* 🌿

💪 *(రోగనిరోధక శక్తి వృద్ధిని)*💪


*ప్రాచీన ఆయుర్వేద గ్రంధాలలో 📖 వైరస్ మరియు మానవ శరీరానికి హాని కలిగించే సూక్ష్మ క్రీములను🦠 నాశనం చేసి మనిషి సంపూర్ణ ఆయురారోగ్యాలతో 🧬 ఉండేలాగా ఒక అద్భుతమైన మందు 🔬 ధనవంతరీ మనకు అందించారు దానిపేరే..* 

*..."ధన్వంతరి అమృత్"...*


ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో🚨 ఇది అద్భుతమైన *మందు* గా పనిచేస్తోంది.. 


📌 *రోగనిరోధక శక్తిని 💪, తెల్ల రక్తకణాలలో🩸 పోరాడే శక్తిని పెంపొందించుకోవడంలో ఇంకా ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో చాలా సహాయపడుతుంది. ప్లేట్‌లెట్స్ 🧫 సంఖ్య పెరగగలదు.*

*ముఖ్యంగా 🧘‍♂️శ్వాస బాగా తీసుకోగలరు🧘‍♀️..*


*మందు తయారి పదార్థాలు*


1) రుద్ర జడ  

2) జఠామాంసి  

3) సునాముఖి 

4) బ్రహ్మీ పత్రం 

5) చిన్న మోము తమల 

6) జాతి ఫల 

7) లవంగాలు 

8) పచ్చ కర్పూరం 

9) మిరియాలు 

10) అల్లం 

11) శొంఠి 

12) దాల్చిన చెక్క 

13) మోర్రంగడ్డ చెక్క

14) రతాలం

15)  పెండలం చెక్క

16) సుగంధి వేర్లు పొడి


*మందు వాడే విధానం*


*పరగడుపున* ☀️ (అంటే పొద్దున నిద్రలేచి, దంతథావనం కాగానే, వేరేమీ తీసుకోకుండా) మరియు *మధ్యాహ్నం*🌞 ఇంకా *రాత్రి* 🌙 ఆహారం తీసుకోవటానికి 4️⃣0️⃣ నిముషాలు ముందు *ఒక గ్లాస్ వేడి నీటిలో 40 ml* ఈ మందు కలుపుకొని రోజుకి మూడు పూటలా తాగవలెను. ఇలా 5️⃣ రోజులు వాడి, తరువాత 20ml రోజుకు ఒకసారి రోజూ తీసుకోవాలి. అవసరమైతే మరొకసారి తీసుకోవొచ్చు... 


*ధన్వంతరి అమృత్* ఎలా పని చేస్తుంది?



వేడి నీటితో కలిపి తీసుకున్న ఈమందు నేరుగా 40 నిముషాల తరువాత మానవ రక్త కణాల్లోకి చేరి శరీరానికి ప్రమాదకరమైన వైరస్, బాక్టీరియాలని, మృతకణాలని, చెడు రక్తకణాలని.. మూత్రం ద్వారా బయటకి నెట్టేస్తుంది. 

ఆ తరవాత బిపి, షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తూ గొంతులో మరియు ఊపిరి తితుల్లో ఉన్న వైరస్ ని నాశనం చేసి స్వచ్ఛమైన ఆక్సీజన్ మనకు అందే విధంగా తోడ్పడుతుంది. 

ఈ ప్రాసెస్ వల్ల మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెరిగి సంపూర్ణ ఆరోగ్యవoతులు అవుతారు...


*వెల స్వల్పము ఫలం అధికము.* 💓


🍃🍃🍃🍃🍃🍃🍃🍃


*DHANWANTARI AMRUTH*

Ancient- Ayurvedic Medicinal- Decoction


🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃


** *Dhanwantari Amruth* is a preventive & cure to lead a healthy life.


** Get Excellent relief from After - Effects.

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃


*ధన్వంతరి అమృత్* ని మా సంస్థ అయిన *SreeDeva Enterprises* ద్వారా పొందవచ్చు. 

*ధన్వంతరి అమృత్* కావలసినవారు క్రింద ఇచ్చిన నెంబర్ కి మెసేజ్ / కాల్ చెయ్యగలరు. 

*1 లీటర్ ధర - హైదరాబాద్ లో ₹999 మాత్రమే (Delivery charges extra)*

*1 లీటర్ ధర - మిగిలిన ప్రాంతాల్లో ₹999 మాత్రమే (Shipping charges extra)*

GPay / Phone Pe ఈ నెంబర్ కి *(+91-9581546773)* చెయ్యొచ్చు.

Delivery of product takes 3 - 4 working days.


మీ ఆదరణ తోడైతే *ధన్వంతరి అమృత్ మరియు దంతవైద్య* తో పాటు మరికొన్ని ఇంట్లో చెయబడే ఆయుర్వేద ఉత్పత్తులను మీముందుకు తీసుకువచ్చే ప్రయత్నంలో ఉంటాము. 🙏


*📞- 9581546773*


*https://wa.me/qr/BNRF2NKJYSUEH1*

స్వంత అనుభవం - చిన్న చిట్కా.*

 *కరోన విస్తృతంగా విస్తరిస్తున్న సమయంలో నా స్వంత అనుభవం - చిన్న చిట్కా.*


నాకు గత 12 సంవత్సరాలుగ ప్రతీ మూడు నెలలకు ఒకసారి జలుబు గొంతు నొప్పి దగ్గు లాంటివి వచ్చేవి. తిరగని హాస్పిటల్ లేదు చేయని పరీక్ష లేదు. వాడని మందులు లేవు.


ఫిబ్రవరి 2020 లో అప్పుడే కొరోనా మహమ్మారి దేశంలో వ్యాప్తి చెందతోంది. అనుకోకుండా నాకు తీవ్ర మైన దగ్గు, స్వల్పంగా జ్వరం, దగ్గులో రక్తం పడటం లాంటి సమస్యలు  ఎదురయ్యాయి. ముందు ఎక్సరే. అందులో ఏం తేలలేదు. ఆ తరువాత సిటీస్కాన్ లో ఊపిరితిత్తులలో ఫంగస్  మరియు ఇన్ఫెక్షన్ ఉందని మందులు ఇచ్చారు. తగ్గలేదు. ఆ తరువాత   హైదరాబాదు చెస్ట్ హాస్పిటల్ లో చూపించాను.  క్షయ పరీక్షతో సహా అన్ని పరీక్షలులు చేసారు. మందులు యిచ్చారు. కానీ ఫలితం శూన్యం. అప్పుడప్పుడే కరోనా రోగులు చేరుతున్నారు. 


అనుకోకుండా నా కూతురుకి తీవ్రమైన దగ్గు జ్వరం. SR Nagar Sowmya Hospital లో వారం తరువాత కోలుకుంది.  కాని నాకు మాత్రం దగ్గు తగ్గలేదు. దాదాపు ప్రాణాల మీద ఆశ వదులు కున్నాను. అప్పుడు జరిగింది ఒక అద్భుతం. చాలా రోజుల తరువాత  మా తాతగారితో మాట్లాడి నా బాధ మొత్తం ఆయనతో ఫోన్ లో చెప్పాను.


ఆయన నాకు 10 సంవత్సరాల వయసులో తలనొప్పి (పార్శపు నొప్పి) వస్తే కేవలం మూడు తమలపాకులతో శాశ్వతంగా తగ్గించాడు. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఖరీదైన వైద్యం అది. ఆయన నా సమస్యకు ఒక్క చిట్కా చెప్పాడు. విన్నప్పుడు హైదరాబాదులో ఇంగ్లీషు వైద్యానికి అలవాటు పడ్డ నాకు ఆ ఏమి పనిచేస్తుందిలే అనిపించింది. కాని మరో మార్గం లేదు కనుక తప్పనిసరిగా ఆయన చెప్పిన వైద్యం మొదలు పెట్టాను.


అది ఏమిటంటే ఒక్క వెల్లుల్లి పాయ గడ్డను తీసుకుని మెత్తగా నూరి ఒక్క పల్చటి బట్టలో కట్టుకొని రాత్రి మొత్తం వాసన చూస్తు నోటి ద్వారా ఊపిరితిత్తుల నిండా పీల్చడం.


అదే‌ నా జీవితంలో జరిగిన అద్భుతం. మూడు రోజులలో ఊపిరితిత్తులలో ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం బయటకు వచ్చింది. ఇప్పటిదాకా మరలా జలుబు, జ్వరం, దగ్గు లాంటివి రాలేదు. చాలామందికి చెప్పగా, వాడిన ప్రతీ ఒక్కరికీ కచ్చితంగా అద్భుతంగా పనిచేసింది.


ఫ్రెండ్స్, కొరోనా మరల విజృంభించే సమయంలో కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీకి గురికావద్దు. మన ఇంట్లో లేక బంధువులు, స్నేహితుల కుటుంబాలలో ఎవరికైనా జలుబు, దగ్గు లాంటి లక్షణాలు వచ్చిన వెంటనే వెల్లుల్లి గడ్డ మెత్తగా నూరి ముక్కు ద్వారా, నోటి ద్వారా గట్టిగా పీల్చమని చెప్పండి. కొరోనా కూడా మనని ఏమీ చెయ్యలేదు. ఇది నా స్వానుభవం. వాడిన తరువాత నాకు కృతజ్ఞతలు చెప్పడం, పదిమందితో మీ అనుభవం పంచుకోవడం మరువకండి.


మర్రి విష్ణువర్ధన్ రెడ్డి, LL B                                                                                                                                                                           9059119195.


Dr Purushotham

9700675350


ఒక్క నాటు వైద్యుడి సలహాతో నేను వెల్లుల్లి రెమ్మల వాసన చూడడం వల్ల కేవలం మూడు రోజులలో కొరోనా నుండి బయట పడ్డాను.దానికి శాస్త్రీయమైన కారణాలు వెతికే ప్రయత్నంలో చాలా విషయాలు,  మరియు ఆనందయ్య మందుపై కొందరు మేధావులు అడిగిన చాలా ప్రశ్నలకు ‌సమాధానాలు దొరికాయి. వెల్లుల్లి వాసన చూడటం గురించి కొన్ని ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో ఉంది.


పచ్చి వెల్లుల్లిలో చాలా బలమైన యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరస్ మరియు యాంటీ పంగల్ లాంటి గుణాలే కాకుండా రక్తం గడ్డకట్టకుండా చేసె లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.  పచ్చి వెల్లుల్లి తినడం ద్వారా కొన్ని యాసిడ్ ల వల్ల కడుపులో మంట లాంటి లక్షణాలు వస్తాయి. అలాగే వెల్లుల్లి జీర్ణం అయ్యి రక్తంలో కలిసే సరికి కొంత శక్తి తగ్గడం చాలా సమయం పడుతుంది. వండి తినడం వల్ల కూడా వెల్లుల్లి ఆయుర్వేద గుణాలను కోల్పోతుంది. ఆశ్చర్యం ఏమిటంటే 1968లో వచ్చిన Influenza నుండి ఖాట్మాండ్ లాంటి కొన్ని ప్రాంతాలలో ఈపచ్చి వెల్లుల్లి వాసన చూడడం వల్లనే రోగం నుండి బయటపడటం.


*పచ్చి వెల్లుల్లి వాడటం రెండు రకాలు*


1) ఐదు పచ్చి వెల్లుల్లి రెమ్మలను మెత్తగా దంచి పలుచని బట్టలో కట్టి రెండు మూడు గంటలు వాసన చూడడం వల్ల కరోనా రాకుండా కాపాడుకోవడమే కాకుండా జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి లక్షణాలనుండి మరియూ కరోనా నుండి కూడా కేవలం నాలుగు గంటల నుండి రెండు రోజులలో ఖచ్చితంగా కోలుకుంటారు.


2) రెండు వెల్లుల్లి రెమ్మలు తీసుకుని ముక్కలు చేసి మీ అరికాళ్ళలో నాలుగు రెమ్మలు సాక్షుల సహాయంతో‌ వుంచుకొని మరో రెండు రెమ్మల ముక్కలు రెండు చంకలలో పెట్టుకుని ఒక్క రెమ్మ నాలుక కింద పెట్టుకొని రెండు తోక మిరియాలు ఒక్కదాని వెనక ఒక్కటి నోట్లో వేసుకొని నమలడం (రెండు కలిపి అరగంట నమలాలి) ద్వారా, కేవలం నాలుగు గంటల‌ నుండి రెండు రోజులలో కొరోనా నుండి ఎలాంటి మందులు లేకుండా 100% బయట పడవచ్చు. మానవ పాదాల అరి కాళ్లలో రంధ్రాల సాంద్రత ఎక్కువగా ‌ఉంటుంది.  మీరు అరికాళ్ళలో వెల్లుల్లి ‌ముక్కలు వుంచిన పది నిమిషాలలో మీ నోట్లో నుండి వెల్లుల్లి వాసన రావడం మీరే గమనించవచ్చు.  కంటిలో మందు వేస్తే ఊపిరితిత్తులలో ఆక్సిజన్ ఎలా పెరుగుతుంది అనే మేధావులకు ఇది సవాలు చేసే సమాధానం.


సంవత్సరం పాప నుండి అందరూ వాడే ఎలాంటి చెడు ఫలితాలులేని గొప్ప ఔషధం. ఖచ్చితంగా నాలుగు గంటల నుండి రెండు రోజుల్లో కొరోనా నుండి కోలుకుంటారు. మీకు ఇంకా  ఆధారాలు కావాలంటే ఈ వ్యాసం చదవండి.


https://thehimalayantimes.com/opinion/opinion-raw-garlic-smell-therapy-for-covid-19.


దయచేసి ఈ అమూల్యమైన సమాచారాన్ని అందరికీ చేరేటట్లు చూడండి. కొరోనా నుండి దేశాన్ని మనందరం కాపాడుకుందాం.

Rishis were beyond wise

 Clear instructions taught by puranas and vedas in 5000 BC (ie 7000 years ago and earlier). Obviously, our Rishis were beyond wise. Even today, if we follow our ancient wisdom we will benefit, especially during these Pandemic times.


1. लवणं व्यञ्जनं चैव घृतं

    तैलं तथैव च । 

    लेह्यं पेयं च विविधं 

    हस्तदत्तं न भक्षयेत् ।। 

    धर्मसिन्धू ३पू. आह्निक


Salt, ghee, oil, rice and other food items should not be served with bare hand. Use spoons to serve.


2. अनातुरः स्वानि खानि न 

    स्पृशेदनिमित्ततः ।।

    मनुस्मृति ४/१४४


Without a reason don't touch your own        indriyas (organs like eyes, nose, ears, etc.)


3. अपमृज्यान्न च स्न्नातो

    गात्राण्यम्बरपाणिभिः ।। 

    मार्कण्डेय पुराण ३४/५२


Don't use clothes already worn by you & dry yourself after a bath.


4. हस्तपादे मुखे चैव पञ्चाद्रे

    भोजनं चरेत् ।।

    पद्म०सृष्टि.५१/८८

    नाप्रक्षालितपाणिपादो

    भुञ्जीत ।।

    सुश्रुतसंहिता चिकित्सा

    २४/९८


Wash your hands, feet, mouth before you eat.


5. स्न्नानाचारविहीनस्य सर्वाः 

    स्युः निष्फलाः क्रियाः ।।

    वाघलस्मृति ६९


Without a bath or Snan and Shudhi, all Karmas (duties) done are Nishphal (no use).


6. न धारयेत् परस्यैवं

    स्न्नानवस्त्रं कदाचन ।I

    पद्म० सृष्टि.५१/८६


Don't use the cloth (like towel) used by another person for drying yourself after a bath.


7. अन्यदेव भवद्वासः

    शयनीये नरोत्तम ।

    अन्यद् रथ्यासु देवानाम

    अर्चायाम् अन्यदेव हि ।।

    महाभारत अनु १०४/८६


Use different clothes while sleeping, while going out, while doing pooja.


8. तथा न अन्यधृतं (वस्त्रं 

    धार्यम् ।।

   महाभारत अनु १०४/८६


Don't wear clothes worn by others.


9.  न अप्रक्षालितं पूर्वधृतं

     वसनं बिभृयाद् ।।

     विष्णुस्मृति ६४


Clothes once worn should not be worn again before washing.


10. न आद्रं परिदधीत ।।

      गोभिसगृह्यसूत्र ३/५/२४


Don't wear wet clothes.


These precautions were taught to every Indian five thousand years ago in the Sanatana Dharma .

We were forewarned about importance of maintaining personal hygiene, when no microscopes existed, but our ancestors using Vedic knowledge prescribed these Dharma as Sadhaachaaram and followed these.

ఆయుర్వేదంతో ఎన్నో

 కళ్ళల్లో మందు వేస్తే ఊపిరితిత్తులకు ఎలా వెళ్తుంది ?


ఆయుర్వేదంలో పరిశోధనలు మొదలుపెట్టండి... అద్బుత సత్యాలు సాంకేతికతలు వెలుగు చూస్తాయి.*


ఆయుర్వేద శాస్త్రం ప్రకారం 

ఒక వ్యక్తి గుండె కొట్టుకోవడం 

ఆగినంత మాత్రానా లేదా 

శ్వాస ఆడనంత మాత్రాన అంటే ప్రాణవాయువు సంచరించనంత మాత్రాన శ్వాసకోశ వ్యవస్థ పనిచేయనంత మాత్రాన చనిపోయినట్లు కాదు.

నాడి పరీక్షించాలి. 

నాడి ఆడుతున్నట్లయితే కొన ఊపిరితో ఉన్నట్లు.


ఈ నాడీ వ్యవస్థ కు ఉదానవాయువు ప్రధాన ఆధారం. 

ఈ వాయువుకు అత్యవసర 

ద్వారాలు కళ్ళు. 

కళ్ళ ద్వారా సరైన ఔషధం  ప్రాణవాయువుకు అందించగలిగితే అది నాడీమండలమును చైతన్యపరుస్తుంది


నాడీ మండలము శరీరమంతా వ్యాపించి ఉంటుంది కావున శరీరమంతటా వ్యాపించి యున్న వ్యాన వాయువును చైతన్యపరుస్తుంది. 


ఈ వ్యాన వాయువు ఉత్తేజమైతే 

అపాన, సమాన, ప్రాణవాయువు లను చైతన్య పరచును.

అపాన వాయువు చైతన్యం వల్ల విసర్జక వ్యవస్థ,సమానవాయువు చైతన్యం వల్ల జీర్ణవ్యవస్థ, ప్రాణవాయువు చైతన్యం వల్ల శ్వాసకోశ వ్యవస్థ చైతన్యం పొందుతాయి. 


ఈ విధంగా ఊపిరితిత్తులకు మళ్ళీ చలనం వస్తుంది. 

పంచప్రాణాలు పంచేంద్రియాలనబడు అత్యవసర ద్వారాలతో అనుసంధానించబడి ఉంటాయి


1.ప్రాణవాయువు - ముక్కు

2.సమాన వాయువు - నాలుక

3.అపాన వాయువు - చెవులు

4.వ్యాన వాయువు - చర్మం

5.ఉదాన వాయువు - కళ్ళు

అలాగే పంచప్రాణాలు వాటి కేంద్ర స్థానాలు

1.ప్రాణవాయువు - గుండె

2.సమానవాయువు - నాభి

3.అపానవాయువు - పాయువు

4.వ్యానవాయువు - శరీరమంతటా

5.ఉదానవాయువు - కంఠం


ఉదానవాయువు అనబడు పంచమప్రాణం గాలిలో కలవనంతవరకు పంచప్రాణాలు ఉన్నట్లే.


దీన్నిబట్టి అర్థంచేసుకోవచ్చు "నా కంఠంలో ప్రాణమున్నంత వరకు" 

అని ఎందుకు అంటారో మరియు మరణశిక్షను ఉరిశిక్ష తో ఎందుకు అమలు చేస్తారో!


ఇది సామాన్య మానవులకు సైతం అర్థమయ్యే సంక్షిప్త సంగ్రహణ వివరణ మాత్రమే.


ఇందులో మళ్ళీ పంచ ఉప ప్రాణవాయువులు వాటి స్థానాలు,విధులు, పంచ కర్మేంద్రియాలు, పంచకోశాలు, షడ్చక్రాలు,షడ్రసాలు,త్రిగుణాలు,    త్రిదోషాలు,ద్వైతము,అద్వైతము    ఇలా ప్రతీ ఆధ్యాత్మిక అంశం కూడా ఆరోగ్య సంబంధమే.


అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం.

ఆయుర్వేదం ఆయుః ఆరోగ్య ఆధ్యాత్మిక ఆనంద రసాత్మక సకలశాస్త్ర విజ్ఞానం.


కళ్ళతో శ్వాసక్రియ ఎలా అనే సందేహం కలగవచ్చు కొంతమంది విజ్ఞానులకు. దానికి సమాధానం విజ్ఞానంలో కూడా ఉంది.


అది ఏమిటంటే కప్ప చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది కదా? 

అలాగే అత్యవసర పరిస్థితుల్లో మనిషికి పంచేంద్రియాలు శ్వాసేంద్రియాలు/ventilators అవుతాయి.

ఈతరాక నీటిలో మునిగిపోయిన వారిని రక్షించిన తరువాత వారి పొట్ట పై నొక్కుతారు.

నోటిలో నుండి నీళ్ళు బయటకు వచ్చిన తర్వాత అరికాళ్ళు అరిచేతులు బాగా రుద్దుతారు.

తలను గుడ్డ తో తుడిచి బట్టలు మార్చి చలిమంట దగ్గర కూర్చోబెడతారు.

ఈ ప్రథమ చికిత్స ఇంగ్లీష్ వైద్యం రాక ముందు లేదా? మరి దాన్ని నాటు చికిత్స అందామా ? 

దాని శాస్త్రీయత కూడా ఇదే. 

శరీరమంతా వ్యాపించి ఉన్న నాడీమండల వ్యవస్థ ను చైతన్య పరచడం ద్వారా వ్యాన వాయువును తద్వారా అపాన, సమాన, ప్రాణవాయువు లను చైతన్య పరచడం.

ఇక్కడ ventilator గా చర్మం (అరికాళ్ళు, అరిచేతులు, తల, ఒళ్ళు రుద్దడం తుడవడం) ద్వారా చికిత్స చేస్తాం.

పాము కరచినప్పుడు కొంతమంది ఆయుర్వేద వైద్యులు రావి ఆకుల కొనలను రెండు చెవుల్లో ఉంచడం ద్వారా బ్రతికిస్తారు. 

ఎలాగంటే పైన చెప్పినట్లు అపానవాయువు/విసర్జక వ్యవస్థ(విషాన్ని బయటకు విసర్జింపచేయడం) పనిచేయనప్పుడు చెవులు అత్యవసర ద్వారాలవుతాయి.

చెవుల ద్వారా శ్వాసక్రియ జరిపించి పాము విష ప్రభావమును వికటింపచేసి మనిషిని కాపాడుతారు. ఇప్పుడు ఆ నైపుణ్యం కల వైద్యులు లేనంత మాత్రాన ఇది అసత్యం కాదు. 

ఆయుర్వేదంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

కానీ ప్రయోగాలు అల్లోపతి లో చేస్తున్నారు.

మరి సత్యం ఎలా ఆవిష్కరించ బడుతుంది? 

అందుకే ఆయుర్వేదంలో పరిశోధనలు మొదలుపెట్టండి.

అద్బుత సత్యాలు సాంకేతికతలు వెలుగు చూస్తాయి.

అవి ఉచిత పథకాలకు కూడా ఉపయోగపడి సామాన్యులకు ఉపయోగపడతాయి.

సేకరణ : ఐ-హబ్

వైశాఖ పురాణం - 24 వ

 _*వైశాఖ పురాణం - 24 వ అధ్యాయము*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*వాయుశాపము*



☘☘☘☘☘☘☘☘☘



అంబరీషునితో నారదుడీవిధముగ వైశాఖ మహాత్మ్యమును వివరించెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తికి శంఖవ్యాధుల సంవాదమును వివరించుచు నిట్లనెను.


శంఖముని మాటలను విని కిరాతుడిట్లనెను. స్వామీ ! విష్ణువునుద్దేశించి చేయుధర్మములు పూజలు , ప్రశస్తములు వానిలో వైశాఖమాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తములని చెప్పిరి. బ్రహ్మజ్ఞానీ ! ఆ విష్ణువెట్టివాడు. వాని లక్షణమేమి ? వానిని చెప్పు ప్రమాణమేది ? వానిని తెలిసికొనుటయెట్లు ? వానికి చెందిన ధర్మములేవి ? వీనిచేనతడు సంతోషించును ? నీ సేవకుడనగు నాకీ విషయములను దయయుంచి చెప్పగోరును అని శంఖమహాముని సవినయముగ నడిగెను.


శంఖుడును కిరాతుడా ! వినుము చెప్పెదను. శ్రీమహావిష్ణువు రూపము పాపరహితము. ఆలోచనకు అందనిది. బ్రహ్మమొదలగు దేవతలు మహాత్ములగు మునులను తెలిసికొనజాలనిది. శ్రీమహావిష్ణువు శక్తి గుణములు సర్వధా సంపూర్ణములు నిశ్చయముగా సమస్తమునకు అధిపతి. గుణరహితుడు నిష్కలుడు , అనంతుడు , సచ్చిదానందరూపుడు. చరాచరస్వరూపము సాటిలేనిది. దీనికి అధిపతి ఆశ్రయము. శ్రీమహావిష్ణువు. ఇవన్నియు పోయినను శ్రీహరి స్థానముపోదు ఆయన నిత్యుడు. ఉత్పత్తి స్థితి , సంహారము , వీని ఆవృత్తి , ప్రకాశము , బంధమోక్షములు , వీని ప్రవృత్తులన్నియు , నివృత్తులును , పరమాత్మవలననే జరుగును. ఇదియే పరబ్రహ్మ లక్షణము. ఇతడే పరబ్రహ్మయని జ్ఞానులయభిప్రాయము. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మయని చెప్పుదురు. చతుర్ముఖ బ్రహ్మ మున్నగు వారిలోని బ్రహ్మపదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు. పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరబ్రహ్మపదమునకు వాచ్యులెట్లగుదురు ? కారు. జన్మాద్యస్యయతః అను సూత్రము వలన శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకమగు పరబ్రహ్మ పదార్థమని వేదాంతము కూడ నిర్ణయించినది. శాస్త్రములు , వేదములు , స్మృతులు , పురాణములు , ఇతిహాసములు , పంచపాత్రాది ఆగమములు , భారతము మున్నగు వానిచేతనే పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని తెలిసికొన వీలగును మరి వేరువిధములచే తెలిసికొనజాలము. కావున వేదాదుల నెరుగనివారు పరబ్రహ్మమగు శ్రీమన్నారాయణు నెరుగజాలరు. పరదైవము వేదవేద్యుడు సనాతనుడునగు శ్రీహరిని ఇంద్రియాదులచేత అనుమానాది తర్కముల చేతను తెలిసికొనశక్యము కాదు. ఇతని యవతారములను కర్మలను తమ బుద్దికొలదిగ దెలిసి కొని సర్వజీవములు ఆయన యధీనవృత్తులై ముక్తిని పొందుచున్నవి. శ్రీహరి మహిమను క్రమక్రమముగ నెరుగవలయును. ఇతడు సర్వశక్తిసంపన్నుడు. దేవతలు , ఋషులు , పితృదేవతలు మున్నగు వారు ఒకొక్క విధమైన శక్తినే కలిగియున్నారు.


బలము , జ్ఞానము , సుఖము మున్నగునవి యుండుటచే , ప్రత్యక్ష , ఆగమ , అనుమానాది ప్రమాణములచే సర్వప్రాణులలో మనుష్యుడు ఉత్తముడని యెరుగవలయును. అట్టి మనుష్యుని కంటె జ్ఞానాదులుండుటవలన రాజు వందరెట్లు గొప్పవాడు. అట్టి రాజుకంటె మనుష్య గంధర్వులు నూరురెట్లు గొప్పవారు. తత్త్వాభిమానులగు దేవతలను మనుష్య గంధర్వులకంటె నూరురెట్లు గొప్పవారిని యెరుగుము. అట్టిదేవతలకంటె సప్తర్షులు గొప్పవారు , సప్తర్షులకంటె అగ్ని , అగ్నికంటె సూర్యుడు , సూర్యునికంటె గురువు , గురువుకంటె ప్రాణము , ప్రాణము కంటె ఇంద్రుడు మిక్కిలి గొప్పవారు బలవంతులు.


ఇంద్రునికంటె గిరిజాదేవి , ఆమెకంటె జగద్గురువగు శివుడు , శివునికంటె మహాదేవియగు బుద్ది , బుద్దికంటె మహాప్రాణము గొప్పవి. అట్టి మహాప్రాణముకంటె గొప్పదిలేదు. ఆ ప్రాణమునందే సర్వము ఉన్నది. ఆ ప్రాణము నుండియే ప్రాణాత్మకమగు విశ్వమన్నది పుట్టినది. సర్వము ప్రాణమునందే కూడియున్నది. ప్రాణమువలననే సర్వము కదలుచున్నది. నల్లని మబ్బువలె ప్రకాశించు నీ ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెప్పుచున్నారు. లక్ష్మీ కటాక్షముచే ప్రాణము నిలిచియుండును. ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించును. అట్టి సర్వాధారుడు సర్వోత్తముడగు శ్రీమహావిష్ణువుకంటె గొప్పది సమానమైనది యేదియును లేదు అని శంఖుడు వివరించుచుండగా కిరాతుడు స్వామీ ! ప్రాణము అన్నిటికంటె గొప్పదో , ప్రాణముకంటె విష్ణువు గొప్పవాడో వివరింపుమని శంఖమునిని ప్రార్థించెను.


అప్పుడు శంఖుడిట్లనెను. కిరాతా వినుము. సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుదును వినుము. పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో నిట్లనెను. దేవతలారా ! నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతిగ / రాజుగ నియమించుచున్నాను. మరిమీలో గొప్పవారెవరెవరో చెప్పిన వానిని యువరాజుగ చేయుదును. అతడు శీలము , శౌర్యము , ఔదార్యము మున్నగు గుణములను కలిగి యుండవలెను అని శ్రీహరి పలుకగ ఇంద్రాదులు నేను గొప్పయనగ నేను గొప్ప అని పరస్పరము వివాదపడిరి. కొందరు సూర్యుడు గొప్పవాడనిరి , ఇంద్రుడు గొప్పయని కొందరనిరి. కొందరేమియుఅనక మౌనముగ నుండిరి. ఇంద్రాది దేవతలు యువరాజు పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకొనలేక శ్రీమన్నారాయణుని కడకు పోయి ఆయననే అడిగిరి.


అప్పుడు శ్రీహరి నవ్వుచు *"విరాట్ పురుషుడు సృజించిన యీ స్థూలదేహము వైరాజమనబడును. ఈ దేహమున చాలమంది దేవతలు అంశరూపముననుండిరి. ఏ దేవుడు ఏ దేవుని అంశ ఈ శరీరమునుండి బయటకు వచ్చిన ఈ దేహము పడిపోవునో ఎవరు ప్రవేశించిన లేచునో అతడే ఆ దేవుని అంశయే బ్రహ్మ తరువాత యువరాజు పదవికి తగిన దైవమని పలికెను. శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరును అంగీకరించిరి.


స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడను దేవశ్రేష్ఠుడు వెలుపలకి వచ్చెను. అప్పుడా శరీరము నడువలేక యుండెను. కాని వినుట , చూచుట మున్నగు సర్వకార్యములను చేయుచుండెను. అప్పుడా దేహినికుంటివాడనిరి. స్థూలదేహము గుహ్యవయవమునుండి దక్షుడను ప్రజాపతి ఈవలకు వచ్చెనను శరీరము పడిపోలేదు. వినుచు , చూచుచు , పలుకుచు గాలిని పీల్చుచునుండెను తరువాత హస్తప్రదేశమునుండి ఇంద్రుడు వెలుపలకు వచ్చెను. అప్పుడా దేహిని హస్తహీనుడనిరి. ఆ శరీరము ఇంద్రుడు బయటకు వచ్చినను చూచుట మున్నగువానిని చేయుచునే యుండును. తరువాత కన్నులనుండి సూర్యుడు వెలుపలికి వచ్చెను. చూపులేకపోయెను కాని ఆ శరీరము వినుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము ముక్కునుండి అశ్వినీ దేవతలు వెలుపలికి వచ్చిరి. వాసన చూడలేక పోయెను గాని వినుట మున్నగువానిని శరీరము చేయుచునే యుండెను. దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలికి వచ్చినవి. అప్పుడా దేహికి వినికిడిశక్తి లేకపోయెను. చెవిటి వాడనియనిరి. చూచుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము నాలుక నుండి వరణుడు వెలుపలికి వచ్చెను. దేహికి రుచి తెలియకుండెను. వినుటమున్నగు వానిని చేయుచుండెను. శరీరము పడిపోలేదు. పిమ్మట వాక్కునకు అధిపతియగు అగ్ని బయటకు వచ్చెను. ఆ శరీరి మాటలేకపోవుటచే మూగవాడయ్యెను. చూచుట మున్నగు వానిని చేయుచునే యుండెను. జ్ఞాన స్వరూపుడగు రుద్రుడు శరీరము నుండి వెలుపలికి వచ్చెను. శరీరికి జ్ఞానములేదుగాని వినుట మున్నగునవి యుండెను. తరువాత ప్రాణము , వాయువు వెలుపలికి వచ్చెను. అప్పుడా శరీరము , కన్నులు , చెవులు , మాట మున్నగునవి పనిచేయుచున్నను నిశ్చేష్టమై పడిపోయెను. దీనిని చూచి దేవతలందరును ఆశ్చర్యపోయిరి. అప్పుడు శ్రీహరి ఇట్లనెను. ఇట్లు నిర్జీవమై పడిన శరీరమును యే దేవత ప్రవేశించి లేవదీయునో అతడే యువరాజని పలికెను.


శ్రీహరి మాటలను విని జయంతుడు దేహి పాదములను ప్రవేశించెను. కాని శరీరము లేవలేదు. దక్షుడగు గుహ్యమును ప్రవేశించెను. శరీరము లేవలేదు. ఇంద్రుడు హస్తములను ప్రవేసించినను ఆ కళేబరము కదలలేదు. సూర్యుడు కన్నులలో ప్రవేసించినను ఆ కళేబరము కదలలేదు. దిక్కులు చేవులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. అగ్నిప్రవేశించినను ఆ కళేబరమునుండి మాటరాలేదు. రుద్రుడు మనసులో ప్రవేశించినను కళేబరము కదలలేదు. పిమ్మట ప్రాణము ప్రవేశింపగా నా శరీరము లేచెను. అప్పుడు బలము , జ్ఞానము , ధైర్యము , వైరాగ్యము బ్రతికించుట మొదలగు వానియందు శక్తిమంతమగు ప్రాణమునే యువరాజుగ దేవతలు భావించిరి. శరీరము జీవించుటకు కారణమగుటచే ప్రాణమే సర్వాధికమని యనిరి.


ఈ ప్రాణము తన అంశలచేత పూర్ణభాగము చేత ప్రపంచమంతటను వ్యాప్తమైయుండెను. ప్రాణహీనమగు జగత్తు లేదు. ప్రాణహీనమగు ప్రాణియు నీ సృష్టిలో లేదు. అట్టి ప్రాణహీనమునకు వృద్ది లేదు. ప్రాణము లేనిదేదియని ఉండుటలేదు. కావున ప్రాణము సర్వజీవములకంటె అధికము. దానిని మించిన బలాఢ్యమైనది యేదియును లేదు. ప్రాణముకంటె గొప్పవారు సమానులు యెవరును ఉన్నట్లుగ నెవరును చెప్పలేదు , చూడలేదు. ప్రాణదేవుడొక్కడే అయినను ఆయా పనులను చేయుటచే బహుస్వరూపుడగుచున్నాడు. కావున ప్రాణము సర్వోత్తమమని ప్రాణోపాసన పరులనుచున్నారు. సర్వసృష్టికి వినాశమునకు స్థితికి ప్రాణదైవమే సమర్థము. విష్ణువు తప్ప మిగిలిన దేవతలెవరును ప్రాణమును తిరస్కరింపలేరు.


ప్రాణదేవత సర్వదేవాత్మకము , సర్వదేవమయము నిత్యము శ్రీహరిని అనుసరించియుండును. శ్రీహరివశమున నుండును. ప్రాణదైవము. శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినదు చూడడు. రుద్రుడు , ఇంద్రుడు మున్నగువారు శ్రీహరికి వ్యతిరేకమును చేసిరి. ప్రాణదైవము మాత్రము శ్రీహరికెప్పుడును వ్యతిరేకమును చేయుదు. కావున ప్రాణము శ్రీహరికి బలమనిరి. కావున శ్రీమహావిష్ణువు మహిమను లక్షణమును తెలిసినజీవి పూర్వకర్మవశమున సిద్దమైన స్థూలము తన శరీరముపై నున్న కుబుసమును విడిచినట్లు విడిచి తుదకు సర్వోత్తమము. వినాశవహితమునగు శ్రీహరి పదమును చేరుచున్నాడు.


అప్పుడు శంఖమహాముని వివరించెను. ఆ మాటలను విని కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినయముగా మరల శంఖుని యట్లడిగెను. స్వామీ ! బ్రహ్మజ్ఞానీ ! మహానుభావుడు జగద్గురువు సర్వేశ్వరుడునగు ప్రాణము యొక్క మహిమ లోకమున నెందులకు ప్రసిద్దము కాలేదు ? దేవతలు , మునులు , మహాత్ములు మున్నగువారి మహిమ లోకమున పురాణాదులయందు వినబడుచున్నది. కాని ప్రాణమహాపురుషుని మహిమ యెందులకు ప్రఖ్యాతము కాలేదు అని ప్రశ్నించెను.


అప్పుడు శంఖమహాముని ఇట్లనెను. పూర్వము ప్రాణమహాపురుషుడు. సర్వోత్తముడగు శ్రీహరిని అశ్వమేధయాగముల చేసి సేవింపదలచి గంగాతీరమునకు బోయెను. నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్దిచేసి యాగశాలలను నిర్మింపదలచెను. నాగళ్లచే దున్నించుచుండగా పుట్టలో తపము చేసికొను కణ్వమహామునికి నాగలి తగులుటచే తపోభంగమై కోపించెను. పుట్టనుండి వెలుపలికి వచ్చి కోపగించి తనకు విఘ్నము నాచరించిన ప్రాణపురుషుని జూచి ప్రధానుడనని గర్వించిన నీవిట్లు నా తపమునకు విఘ్నము నాచరించితివి గాన నీకు ముల్లోకములయందును. ప్రఖ్యాతియుండదు. భూలోకమున మరింతగా ప్రఖ్యాతి యుండదని శపించెను. శ్రీహరి యవతారములు ప్రసిద్దములగును గాని నీవు మాత్రము ప్రసిద్దుడవు కావని యనెను.


ప్రాణమహాపురుషుడును కోపించి దోషము లేని నన్ను తప్పుచేయకుండనున్న వానిని ఇట్లు శపించితివి కావున కణ్వమునీ ! నీవు గురుద్రోహివి కమ్మని శపించెను. నీ ప్రవృత్తి నందరును నిందింతురని యనెను. కణ్వముని శాపము వలన ప్రాణమహాపురుషుడు భూలోకమున ప్రసిద్దుడు కాలేదు. కణ్వుని ప్రాణశాపము ననుసరించి తన గురువు భక్షించి సూర్యునికి శిష్యుడయ్యెను. కిరాతా ! నీవడిగిన వానినన్నిటిని చెప్పితిని. ఇంకను అడుగవలసినది యున్నచో నడుగమని శంఖుడు పలికెను. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు వివరించెను.

సప్త గిరులు

 సప్త గిరులు అనగానే సప్తఋషులు తపస్సు చేసే చోటు. ఋషులు ఆకాశంలో ఋషి మండలంలో వుండగలరు భూమి పైనా వుండగలరు. వారు దర్శించని శక్తి లేదు. వారు దర్శించబట్టే మన జీవ వునికి .అటులనే సప్తగిరులు శేషాచల, అంజనాద్రి, గరుడాద్రి... మెుదలుగాగల సమస్త ప్రకృతికి కారణమైన గిరులు దాని మూలమైన శక్తి రూపంలో వాడుకలో ఎప్పటినుండో అనగా సృష్టి మూలమైన వరాహ అవతారంనుండే కాదు కాదు మత్స్యావతారం నుండే సృష్ట్యాదినుండే సంభవించినది.సప్త గిరులు సమస్త ప్రకృతికి మూలం. ఎవరూ సృష్టించ లేదు. మహాత్ములు లోక కళ్యాణం కొరకు భగవత్ శక్తి రూపంలోఆయా ప్రాంతాలలో జన్మిస్తారు. దానిని వ్యవహారికంగా పరంపరగా వస్తాయి వాడుకలోకి. యీ గిరులు పేర్లు ఎవరూ పెట్టినవి కావు. భగవతృష్టి. గనుక యీ వివాదము యింతటితో సమాప్తి చేసి పరబ్రహ్మ తత్వాన్ని దర్శించి అనంతమైన ఆ శక్తిని తెలుసుకొనే ప్రయత్నం చేసి తరించుటే పరమాత్మ తత్వం. అనవసర కాలయాపన కూడా. యిది వేరుగా అర్ధం చేసుకోవద్దని మనవి.

పరమేశ్వర శక్తిని సంబోధన

 జగత్భద్రాయమాణోదయా అని పరమేశ్వర శక్తిని సంబోధన.దీనినే ఋగ్వేదం అణో భద్రా సూక్తము వివరించింది. భద్రం అనగా చాలా అర్దములు కలవు. జాగ్రత్త, వ్యవహారిక క్రియ నామమే. అనగా వాడు

కలో చేసే పనులలో జాగరూకులుగా వుండమని. కర్మలను ఆచరించునప్పుడు జాగ్రత్త లేనియెడల ఆ కర్మ ఫలం వేరుగా యుండును. ఫలం వలన కర్మ ఫలితం గుణం అనుభవించిన గాని అది మంచి చెడ్డలు యనే ఙ్ఞానం కలుగదు. అది ఎవరికి వారికి అనుభవముచే వారి వరకే ఆ కర్మ, లేదా యితరులు కూడా దాని వలన నష్టం సంభవించును.యితరులను నష్టపరచే హక్కు నీకు లేదు. ఎవరి కర్మ ఫలం వారే అనుభవం. అందువలన కర్మ నీకే పరిమితం. వేరొక పరిశీలనలో జగత్తు భద్రం అనే గుణం కలిగియున్నది. జగత్తు అనగానే చైతన్యమైనదే కాని అదీ ప్రకృతి వలననే. దాని లక్షణము దర్శించుటకై. కొన్ని కంటికి కనబడవు. కరోనాలాగానే. కంటికి కనపడకపోతే దాని నిర్ణయం లక్షణము ద్వారానే తెలియును గాని లేదని ఎలా చెప్పుట. అనుభవం వలన తెలియుట. జగత్తు భద్రం అయితే అనగా భూమి ప్రకాశవంతమైన యెడల దానికి మూలము అణోదయా. అణువు ఉదయించుట.అణువు వుదయించుట యనగా శక్తి చైతన్యమైనదే. నిద్ర లేచుట యనగా అణువు వికశించుటయనగా, ఆత్మ చైతన్యం నిద్రలో చైతన్య లక్షణము ప్రాకృతింకంగా తెలియదు. ప్రకృతి లక్షణము నిద్రలో తెలియనట్లు చీకటి యనే అఙ్ఞానంలో అనగా తమస్సునుండి జ్యోతి లోనికి వెళ్లుట. సాధన వలననే. తమలోనన్న తన జ్యోతి ఉష్ణ రూపంగా.ఉష్ణమునువచైతన్యపరచిన౭ాని దాని లక్షణము తెలియనట్లు. దీనికి ఆత్మను జాగరూకతతో క్రమ పధ్దతిలో  నీవు ఎంచుకున్న మార్గము అదియేదైనాగాని కర్మ ఫలమును స్థిరమైన చలనములో చైతన్యపరచుటయే దీని పరిశీలన, అనగా సాధన. జగత్ భద్రాయం అణోదయా. ఆణో భద్రాయం సూక్తం వివరణ యిదియే. యింత అనంతమైన ఙ్ఞానం నేను అనే  ప్రకృతిని దాని సూత్ర కారకుడైన విష్ణు పరమైన ఈశ్వర శక్తియేయని తెలియవలెను. దానిని మామూలు దృష్టికి అందనిది. సూక్మరూపంగా నిశిత పరిశీలన ఆత్మతో అనుసంధానము చేసిన గాని దానిగురించి సత్య దర్శనం కాదు. దీనినే భవాయచ అని భవాయచ, రుద్రం  వ్యాప్తి వలన భవాయచ  భవానీ అయి రూపం దాల్చినది.యిక్కడ భవానీ అనగా రూపం తెలిసినది. పదార్థ లక్షణము తెల్సిన తదుపరి పదార్థమని తెలిసినది.యివి అన్నియు శక్తి యెుక్క వ్యాప్తమునకు సూత్రములు యని తెలియవలెను. సమస్త అనంతమైన ప్రకృతి శక్తి కాంతి లక్షణము ప్రయెూగ శాలలో శోధించుట కాని పని. ప్రత్యక్షంగా కంటికి పదార్ధరూపంలో ప్రకృతిగా కనబడుచున్నది. పదార్ధ లక్షణము కూడా తెలుస్తూనే వున్నది అనుభవ పూర్వకంగా.తెలుసుకుంటూనే వూందాం. ఆచరిస్తూనే వూందాం.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*తీవ్ర సాధన..తీరిపోయిన సందేహం..*


*(నలభై ఏడవరోజు)*


శ్రీ స్వామివారు సాధన చేసుకునే సమయంలో..నేలమాళిగ లోపల కూర్చుని, దానిమీద ఒక చెక్క పలకను మూతగా పెట్టుకొని..ధ్యానం చేసుకునేవారు..


లోపల ఊపిరాడుతుందా?..స్వామివారికి ఏ ఆపదా కలుగదు కదా?..కనుక్కుందాము అని శ్రీధరరావు ప్రభావతి గార్లకు తోచింది..ఒకసారి ఆశ్రమానికి వెళ్లి, ఆయనతో నేరుగా మాట్లాడి తెలుసుకుందామని అనుకుని..గూడు బండి సిద్ధం చేయించుకొని ఉదయం తొమ్మిది గంటలకల్లా ఆశ్రమానికి చేసురుకున్నారు..ప్రహరీ ద్వారం తీసే ఉన్నది..దంపతులిద్దరూ లోపలికి అడుగు బెట్టేసరికి.. శ్రీ స్వామివారు బావి వద్ద నిలబడి..సూర్యనికి నమస్కారం చేసుకుంటున్నారు..ఒక్క రెండు మూడు నిమిషాల లోనే వీళ్ళిద్దరిని చూసి..సంతోషంతో నవ్వుతూ..


"అమ్మా!..మీరిద్దరూ మనసులో తల్లడిల్లిపోతున్నారా?..నాకు ఆ జగన్మాత ఆశీస్సులు ఉన్నంతవరకూ ఏ ఆపదా రాదు..మాలాటి అవధూతలకు ఇటువంటి కఠోర సాధన అవసరం..దానిని మేము చేసి తీరాలి..మోక్షానికి దగ్గర మార్గాలు లేవు!..మనసును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి..సరే..మీరిద్దరూ సందేహంతో ఇక్కడిదాకా వచ్చారు..ఆ సందేహాన్ని నివృత్తి చేస్తాను..నాతో రండి.." అన్నారు..


అత్యంత ఆశ్చర్యం తో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ప్రభావతి శ్రీధరరావు గార్లు..తాము ఎందుకోసం వచ్చిందీ ముందుగానే చెప్పేసారు శ్రీ స్వామివారు..ఇక తమ ఇద్దరికీ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు..స్వామివారి వెనకాలే ప్రధాన గది వద్దకు వెళ్లారు..


"శ్రీధరరావు గారూ..నేను ఈ క్రింద ఉన్న గది లోపలికి వెళ్లి కూర్చుంటాను..మీరు పైన ఆ చెక్క పలకతో మూసివేసి..ఒక ప్రక్కగా కూర్చోండి..తరువాత మీకు అన్నీ అవగతం అవుతాయి..సరేనా?.." అని చెప్పి..శ్రీ స్వామివారు లోపలికి దిగి పద్మాసనం వేసుకొని కూర్చున్నారు..శ్రీధరరావు గారు ప్రక్కనే ఉన్న చెక్క పలకను ఆ నేలమాళిగ పైన మూతగా పెట్టి..ఆ గదిలోనే ఒక మూలనున్న చాప పరచుకొని దానిమీద ప్రభావతి గారి తో సహా కూర్చున్నారు..


సుమారు ఓ పదిహేను ఇరవై నిమిషాల తరువాత..ఈ దంపతులిద్దరికీ ఏదో మైకం లాగా వచ్చేసింది..తమకు తెలీకుండానే నిద్రలోకి జారిపోయారు..ఆ గదిలోనే చాప మీద వాలిపోయారు.. గంట..రెండు గంటలు..ఇలా కాలం గడిచిపోతోంది.. ఉదయం తొమ్మిది, తొమ్మిదున్నర గంటల ప్రాంతంలో గదిలోకి వెళ్లిన ఆ దంపతులకు మెలకువ వచ్చేసిరికి..సమయం చూసుకుంటే..సాయంత్రం నాలుగు దాటుతోంది..ఒక్కసారిగా ఇద్దరికీ గుండె గుభేల్ మంది..


దాదాపు ఏడు గంటల పాటు తాము దిక్కుతెలీనంత గా నిద్రపోయారు.. తమ ఒళ్ళు తమకు తెలీదు..క్రింద నేలమాళిగ లో కూర్చున్న ఆ స్వామివారు ఎలా ఉన్నారో?..ఏమిటో?..అనుకుంటూ..గబ గబా లేచి చాప చుట్టి పక్కన పెట్టి..నేలమాళిగ పైన మూతగా పెట్టిన చెక్క పలకను తొలగించి.."స్వామీ..స్వామీ!.." అంటూ శ్రీధరరావుగారు.." నాయనా!..నాయనా!." అంటూ ప్రభావతి గారు పిలిచారు ఆతృతగా..


అరవవద్దు అన్నట్లు చేతితో సైగ చేస్తూ..శ్రీ స్వామివారు లేచి నిలబడ్డారు.. తన రెండుచేతులు ఆసరాగా పెట్టుకుని..ఆ గోతిలాంటి గది నుంచి ఒక్క ఉదుటున బైటకు వచ్చారు..శ్రీ స్వామివారిని చూసిన తరువాత గానీ వీళ్ళిద్దరికీ ఆత్రుత తగ్గలేదు..


కానీ..చిత్రం..కనీసం గాలికూడా చొరబడని ఆ చిన్న గోతి లాంటి గదిలో దాదాపు ఏడు గంటల పైగా ధ్యానం లో ఉన్న శ్రీ స్వామివారి శరీరం పై ఒక్క చెమట బిందువు లేదు..ఉదయం ఎంత స్వచ్ఛంగా ఉన్నారో..ఇప్పుడూ అంతే స్వచ్ఛతతో..చిరునవ్వుతో..వున్నారు..ఆ ముఖం లో దేదీప్యమైన కాంతి కనబడుతోంది..అప్రయత్నంగా దంపతులిద్దరూ చేతులు జోడించి నమస్కరించారు..


శ్రీ స్వామివారు చప్పున..నమస్కరించవద్దన్నట్లు వీరిని వారించి.."అమ్మా..మీ ఇద్దరి సందేహమూ తీరిపోయిందా?..ఇది సాధనలో ఒక భాగం అమ్మా..అవధూత సంప్రదాయం లో ఇటువంటి తీవ్ర సాధన కూడా ఒక భాగం..ఆ సాధన సక్రమంగా చేస్తే..అణిమాధ్యష్ట సిద్ధులూ వశం అవుతాయి..కానీ వాటిని సక్రమంగా సమాజహితానికి వాడుకోవాలి..అప్పుడే ఆ సాధనకు ఫలితం..స్వార్ధానికి ఉపయోగిస్తే..తాత్కాలిక భోగాలు లభించి..చివరకు పతనం అవుతారు.."


"శిరిడీ లోని సాయిబాబా..అరుణాచలం లోని శ్రీ రమణులు ఉత్తమ సాధకులకు అత్యుత్తమ ఉదాహరణలు..వారు తమను తాము తరింపచేసుకొని..తమతో పాటు ఈ సమాజానికి మార్గదర్శనం చేసారు.. ప్రస్తుతం శ్రీ పరమాచార్య వారూ వారి పంథాలో వారు జాతిని ఉద్ధరిస్తున్నారు..


(శ్రీ స్వామివారు ఈ మాటలు చెప్పేనాటికి అంటే..1974 సంవత్సర ప్రాంతంలో..మన ఆంధ్రప్రాంతంలో కొంతమందికి మాత్రమే శిరిడీ లో ప్రకటమైన శ్రీ సాయిబాబా గురించి అవగాహన ఉన్నది..నేటి లాగా విపరీత ప్రాచుర్యం లేదు..అలాగే శ్రీ రమణమహర్షి గురించి కూడా..కానీ..శ్రీ స్వామివారు ఆ ఇద్దరినీ ఉదహరించారు..అవధూత లు "ద్రష్ట" లు అనడానికి..వారికి కుల, మత, జాతి విబేధాలు లేవు అనడానికి..ఇదొక నిదర్శనం..)


"శ్రీధరరావు గారూ తపస్సులో అనేక మార్గాలున్నాయి..ఒక్కొక్కరిదీ ఒక్కొక్క పంథా..మీరు నా గురించి ఏ విషయం లోనూ చింత పడవద్దు..అన్నీ సక్రమంగా జరిగిపోతాయి..అమ్మా!..ఏ నిమిషంలో మీకు సందేహం వచ్చినా..నిరభ్యంతరంగా నా వద్దకు రండి..ఇప్పటికే కాలాతీతమైనది..వెళ్ళిరండి!.." అన్నారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లు శ్రీ స్వామివారి వద్ద సెలవు తీసుకొని బైట ఉన్న తమ బండి వద్దకు వచ్చారు..చిత్రం..అప్పటికి కూడా బండి తోలే మనిషి..నిద్ర లోనే వున్నాడు..ఎద్దులు కూడా జోగుతున్నాయి..వీళ్ళు లేపేదాకా ఆ పనివాడు లెయ్యలేదు.."మొద్దు నిద్ర పట్టింది స్వామీ!..ఎప్పుడూ ఎరగను!..ఎద్దులకు నీళ్లు కూడా పెట్టలేదు.."అంటూ ఎద్దులను అదిలించి..బండి సిద్ధం చేసాడు..దంపతులిద్దరూ శ్రీ స్వామివారు తమకోసం చూపిన ఈ చిత్కళ ను తలుచుకొని మనసులోనే నమస్కరించి ఇంటికి బయలుదేరారు..


మరో అనుభవం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).