3, జూన్ 2021, గురువారం

స్వంత అనుభవం - చిన్న చిట్కా.*

 *కరోన విస్తృతంగా విస్తరిస్తున్న సమయంలో నా స్వంత అనుభవం - చిన్న చిట్కా.*


నాకు గత 12 సంవత్సరాలుగ ప్రతీ మూడు నెలలకు ఒకసారి జలుబు గొంతు నొప్పి దగ్గు లాంటివి వచ్చేవి. తిరగని హాస్పిటల్ లేదు చేయని పరీక్ష లేదు. వాడని మందులు లేవు.


ఫిబ్రవరి 2020 లో అప్పుడే కొరోనా మహమ్మారి దేశంలో వ్యాప్తి చెందతోంది. అనుకోకుండా నాకు తీవ్ర మైన దగ్గు, స్వల్పంగా జ్వరం, దగ్గులో రక్తం పడటం లాంటి సమస్యలు  ఎదురయ్యాయి. ముందు ఎక్సరే. అందులో ఏం తేలలేదు. ఆ తరువాత సిటీస్కాన్ లో ఊపిరితిత్తులలో ఫంగస్  మరియు ఇన్ఫెక్షన్ ఉందని మందులు ఇచ్చారు. తగ్గలేదు. ఆ తరువాత   హైదరాబాదు చెస్ట్ హాస్పిటల్ లో చూపించాను.  క్షయ పరీక్షతో సహా అన్ని పరీక్షలులు చేసారు. మందులు యిచ్చారు. కానీ ఫలితం శూన్యం. అప్పుడప్పుడే కరోనా రోగులు చేరుతున్నారు. 


అనుకోకుండా నా కూతురుకి తీవ్రమైన దగ్గు జ్వరం. SR Nagar Sowmya Hospital లో వారం తరువాత కోలుకుంది.  కాని నాకు మాత్రం దగ్గు తగ్గలేదు. దాదాపు ప్రాణాల మీద ఆశ వదులు కున్నాను. అప్పుడు జరిగింది ఒక అద్భుతం. చాలా రోజుల తరువాత  మా తాతగారితో మాట్లాడి నా బాధ మొత్తం ఆయనతో ఫోన్ లో చెప్పాను.


ఆయన నాకు 10 సంవత్సరాల వయసులో తలనొప్పి (పార్శపు నొప్పి) వస్తే కేవలం మూడు తమలపాకులతో శాశ్వతంగా తగ్గించాడు. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఖరీదైన వైద్యం అది. ఆయన నా సమస్యకు ఒక్క చిట్కా చెప్పాడు. విన్నప్పుడు హైదరాబాదులో ఇంగ్లీషు వైద్యానికి అలవాటు పడ్డ నాకు ఆ ఏమి పనిచేస్తుందిలే అనిపించింది. కాని మరో మార్గం లేదు కనుక తప్పనిసరిగా ఆయన చెప్పిన వైద్యం మొదలు పెట్టాను.


అది ఏమిటంటే ఒక్క వెల్లుల్లి పాయ గడ్డను తీసుకుని మెత్తగా నూరి ఒక్క పల్చటి బట్టలో కట్టుకొని రాత్రి మొత్తం వాసన చూస్తు నోటి ద్వారా ఊపిరితిత్తుల నిండా పీల్చడం.


అదే‌ నా జీవితంలో జరిగిన అద్భుతం. మూడు రోజులలో ఊపిరితిత్తులలో ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం బయటకు వచ్చింది. ఇప్పటిదాకా మరలా జలుబు, జ్వరం, దగ్గు లాంటివి రాలేదు. చాలామందికి చెప్పగా, వాడిన ప్రతీ ఒక్కరికీ కచ్చితంగా అద్భుతంగా పనిచేసింది.


ఫ్రెండ్స్, కొరోనా మరల విజృంభించే సమయంలో కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీకి గురికావద్దు. మన ఇంట్లో లేక బంధువులు, స్నేహితుల కుటుంబాలలో ఎవరికైనా జలుబు, దగ్గు లాంటి లక్షణాలు వచ్చిన వెంటనే వెల్లుల్లి గడ్డ మెత్తగా నూరి ముక్కు ద్వారా, నోటి ద్వారా గట్టిగా పీల్చమని చెప్పండి. కొరోనా కూడా మనని ఏమీ చెయ్యలేదు. ఇది నా స్వానుభవం. వాడిన తరువాత నాకు కృతజ్ఞతలు చెప్పడం, పదిమందితో మీ అనుభవం పంచుకోవడం మరువకండి.


మర్రి విష్ణువర్ధన్ రెడ్డి, LL B                                                                                                                                                                           9059119195.


Dr Purushotham

9700675350


ఒక్క నాటు వైద్యుడి సలహాతో నేను వెల్లుల్లి రెమ్మల వాసన చూడడం వల్ల కేవలం మూడు రోజులలో కొరోనా నుండి బయట పడ్డాను.దానికి శాస్త్రీయమైన కారణాలు వెతికే ప్రయత్నంలో చాలా విషయాలు,  మరియు ఆనందయ్య మందుపై కొందరు మేధావులు అడిగిన చాలా ప్రశ్నలకు ‌సమాధానాలు దొరికాయి. వెల్లుల్లి వాసన చూడటం గురించి కొన్ని ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో ఉంది.


పచ్చి వెల్లుల్లిలో చాలా బలమైన యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరస్ మరియు యాంటీ పంగల్ లాంటి గుణాలే కాకుండా రక్తం గడ్డకట్టకుండా చేసె లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.  పచ్చి వెల్లుల్లి తినడం ద్వారా కొన్ని యాసిడ్ ల వల్ల కడుపులో మంట లాంటి లక్షణాలు వస్తాయి. అలాగే వెల్లుల్లి జీర్ణం అయ్యి రక్తంలో కలిసే సరికి కొంత శక్తి తగ్గడం చాలా సమయం పడుతుంది. వండి తినడం వల్ల కూడా వెల్లుల్లి ఆయుర్వేద గుణాలను కోల్పోతుంది. ఆశ్చర్యం ఏమిటంటే 1968లో వచ్చిన Influenza నుండి ఖాట్మాండ్ లాంటి కొన్ని ప్రాంతాలలో ఈపచ్చి వెల్లుల్లి వాసన చూడడం వల్లనే రోగం నుండి బయటపడటం.


*పచ్చి వెల్లుల్లి వాడటం రెండు రకాలు*


1) ఐదు పచ్చి వెల్లుల్లి రెమ్మలను మెత్తగా దంచి పలుచని బట్టలో కట్టి రెండు మూడు గంటలు వాసన చూడడం వల్ల కరోనా రాకుండా కాపాడుకోవడమే కాకుండా జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి లక్షణాలనుండి మరియూ కరోనా నుండి కూడా కేవలం నాలుగు గంటల నుండి రెండు రోజులలో ఖచ్చితంగా కోలుకుంటారు.


2) రెండు వెల్లుల్లి రెమ్మలు తీసుకుని ముక్కలు చేసి మీ అరికాళ్ళలో నాలుగు రెమ్మలు సాక్షుల సహాయంతో‌ వుంచుకొని మరో రెండు రెమ్మల ముక్కలు రెండు చంకలలో పెట్టుకుని ఒక్క రెమ్మ నాలుక కింద పెట్టుకొని రెండు తోక మిరియాలు ఒక్కదాని వెనక ఒక్కటి నోట్లో వేసుకొని నమలడం (రెండు కలిపి అరగంట నమలాలి) ద్వారా, కేవలం నాలుగు గంటల‌ నుండి రెండు రోజులలో కొరోనా నుండి ఎలాంటి మందులు లేకుండా 100% బయట పడవచ్చు. మానవ పాదాల అరి కాళ్లలో రంధ్రాల సాంద్రత ఎక్కువగా ‌ఉంటుంది.  మీరు అరికాళ్ళలో వెల్లుల్లి ‌ముక్కలు వుంచిన పది నిమిషాలలో మీ నోట్లో నుండి వెల్లుల్లి వాసన రావడం మీరే గమనించవచ్చు.  కంటిలో మందు వేస్తే ఊపిరితిత్తులలో ఆక్సిజన్ ఎలా పెరుగుతుంది అనే మేధావులకు ఇది సవాలు చేసే సమాధానం.


సంవత్సరం పాప నుండి అందరూ వాడే ఎలాంటి చెడు ఫలితాలులేని గొప్ప ఔషధం. ఖచ్చితంగా నాలుగు గంటల నుండి రెండు రోజుల్లో కొరోనా నుండి కోలుకుంటారు. మీకు ఇంకా  ఆధారాలు కావాలంటే ఈ వ్యాసం చదవండి.


https://thehimalayantimes.com/opinion/opinion-raw-garlic-smell-therapy-for-covid-19.


దయచేసి ఈ అమూల్యమైన సమాచారాన్ని అందరికీ చేరేటట్లు చూడండి. కొరోనా నుండి దేశాన్ని మనందరం కాపాడుకుందాం.

కామెంట్‌లు లేవు: