4, జనవరి 2022, మంగళవారం

మహాస్వామి వారి చిత్రపటం

 మహాస్వామి వారి చిత్రపటం


చిత్రకారుడు సిల్పి (పి.యమ్. శ్రీనివాసన్) తను చేస్తున్న ఒక పనికోసం నెలరోజులుగా నిరీక్షించిన పరమాచార్య స్వామి వారి దర్శనం లభించిన రోజది. ఆ గొప్ప చిత్రకారుడి జీవితాన్ని పూర్తిగా మలుపుతిప్పిన రోజు. రాత్రి చాలా పొద్దు పోయిన తరువాత, ప్రపంచం మొత్తం గాఢనిద్రలోకి జారుకున్న సమయాన ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది.


ఒకరు జగద్విఖ్యాతి చెందిన మహాపురుషులైన సన్యాసులు కాగా, మరొకరు ప్రపంచానికి అంతగా తెలియని గొప్ప చిత్రకారుడు. ఆ పరమపవిత్రమైన గదిలో, నూనెదీపపు వెలుగులో ఆ చిత్రకారునికి ఒక రహస్యాన్ని చెప్పడానికి ఆ సన్యాసి కళ్ళు అత్యంత తెజోవంతములై మెరిశాయి.


“ఇప్పటిదాకా నువ్వు ఎన్నో జన్మలు ఎత్తావు. అన్ని జన్మలలో భగవంతుణ్ణి ఎంతో భక్తితో సేవించావు. క్రిందటి జన్మలలో ఎన్నో దేవాలయాలకు స్థపతివై ఎన్నో దైవీ శక్తులు కలిగిన శిల్పాలను మలిచావు. ఇది నీకు చివరి జన్మ. నీకు సంప్రాప్తమైన ఈ దైవకళను వ్యర్థం చెయ్యకు. ఇప్పటినుండి కేవలం దేవతా రూపాలను మాత్రమె చిత్రిస్తానని వాగ్దానం చెయ్యి. నీ ప్రతిభ ఆసాదారణమైనది. నీకు జన్మతః శిలా శాస్త్రము, సాముద్రికా లక్షణము తెలుసు. ఇక వేరే చదువు నీకు అక్కరలేదు. నీ దైవదత్తమైన కళ ద్వారా దైవిత్వాన్ని అన్ని ఇళ్ళల్లో ఆవిష్కరించే లక్ష్యంతో రేపు ఉదయాన్నే ప్రపంచంలోకి వెళ్ళు” అని ఆదేశించారు.


ఆ చిత్రకారుడు శ్రీవారి వద్ద సెలవు తీసుకుని, బాహ్య ప్రపంచానికి తెలియని ఎన్నో మారుమూల దేవాలయాలకు వెళ్లి అక్కడ ఉన్న వివిధ మూర్తులను తన క్యాన్వాసుపై చిత్రిచసాగాడు. అది అంత సులువైన పని కాదు, అత్యంత నియమనిష్టలతో, భక్తిశ్రద్ధలతో ఉన్నవారికి మాత్రమె కుదిరే కార్యం.


“నీ ఊహలను ఎంతమాత్రమూ చిత్రించారాదు. శిల్ప శాస్త్రాన్ని అనుసరించి, సాముద్రికా లక్షణంలో తెల్పిన ప్రకారం వివిధ శక్తులతో ఉన్న దేవతా మూర్తులను నువ్వు ఎలా చూస్తున్నావో అలాగే చిత్రించాలి. కొత్తగా వెలుగును ఏర్పాటు చేసుకోకుండా, పరిమితమైన దీపపు వెలుగులో, నువ్వు చిత్రించే సమయంలో నీకు ధ్యానస్థితిలో అగుపించే విశేషాలను మాత్రమె చిత్రించు. నీ కుంచె కదిలికలవల్ల ఆ మూర్తి యొక్క శక్తిని, తేజస్సును కూడా నీ చిత్రాలలో చిత్రించగలుగుతావు” అని స్వామివారు చెప్పిన విషయాలను ఎన్నడూ మరువలేదు.


తనకు గురువు, దైవం, మార్గదర్శకులు చెప్పినట్టుగా కొత్త జీవితాన్ని ప్రారంభించి, జీవితాంతం స్వామివారు ఆశిస్సులే ఊపిరిగా బ్రతికాడు. సిల్పి సంసారస్థుడు. తన భార్య పరమాచార్య స్వామివారికి పెద్ద భక్తురాలు. ఆమె వయోభారం చేత మఠానికి వెళ్లి పరమాచార్య స్వామి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకోవడానికి కుదరడంలేదు. అందుకనే ఆమె పరమాచార్య స్వామివారి చిత్రపటాన్ని చిత్రించి ఇంటిలో ఉంచుకుంటే జీవితాంతం వారిని ఆరాధించుకుంటానని తన భర్తని కోరింది. 1956లో తన భార్య కోసం స్వామివారిని చిత్రించడానికి సిల్పి వెళ్ళాడు.


కాని స్వామివారు అతనికి సహకరించడం తప్ప అన్నీ చేస్తున్నారు. అటూ, ఇటూ కదులుతూ సిల్పి సహనాన్ని, భక్తిని పరీక్షిస్తున్నారు. చివరికి అంతా ముగిసిన తరువాత సిల్పి చేతిలో ఒక గొప్ప కళాఖండం రూపుదాల్చుకుంది. తన భక్తికి పరాకాష్టలా మహాస్వామివారి కాలివేలి గోళ్ళు మొదలుకుని వారి నుండి వెలువడే దివ్యకాంతి వరకు ఆ చిత్రపటంలో నిండి నిబిడికృతమైంది.


అది చాలా ప్రత్యేకమైన చిత్రపటం. మహాస్వామివారి చూపులను అత్యంత సూక్ష్మమమైన రంగుల్లో అందంగా చిత్రించాడు. వేసుకున్న బిల్వమాలలోని బిల్వ దళాలు తాజాగా ఉంటాయి. ఏ ఫోటో కూడా తనలో నింపుకోలేని తేజస్సును తన కుంచె ద్వారా ఆవిష్కరించాడు. ఆ గదిలో స్వామివారి పాదాల వద్ద వెలిగించిన ఒకేఒక్క దీపం స్వామివారి వెలుగులో చిన్నబోయింది. ఇంత అద్బుతంగా ఎప్పుడూ ఎవ్వరూ స్వామివారిని చిత్రించలేదు. ఆ గదిలో కదలకుండా కూర్చుని చిత్రకారుని గమనించి, పూర్తైన తరువాత ఆశీస్సులు అందించి మన పుణ్యవశమున దాన్ని బయలుపరిచారు.


చిత్రకారుడు సిల్పి క్యాన్వాసుపై కంచి పెరియవ శ్రీ జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఇప్పటికి సజీవంగా ఉన్నారు. 1956లో సిల్పి కుంచె నుండి జాలువారిన మహాత్తరమైన స్వామివారి చిత్రపటం ఇదే.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

ఏమి నేర్పింది

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

 *🌷ఆ కాలం ఏమి నేర్పింది?🌷* 


పొలం గట్లపై నడిపించి, తడబడకుండా *నిలదొక్కుకోవటం* నేర్పింది.


వాగు పక్కన నీటి చెలిమలు తీయించి, *శోధించే తత్వం* 

నేర్పింది.


*సీతాఫలాల కోసం చెట్ల చుట్టూ తిరిగించి, *అన్వేషణ* నేర్పింది.


*తుమ్మ ముల్లు, పల్లేరు గాయాల గుచ్ఛులతో, *జీవితం* పూలపాన్పు కాదని నేర్పింది.


*చిన్న చిన్న దెబ్బలు తగిలితే,

నల్లాలం ఆకు పసరు పోయించి,

చిన్న చిన్న ఇంటి వైద్యం *చిట్కాలు* నేర్పింది.


చెట్టుమీద మామిడికాయ

గురిచూసి కొట్టడం, లక్ష్యాన్ని 

*ఛేదించడం* నేర్పింది.


*నిండు బిందెను నెత్తి మీద పెట్టి, 

నీళ్లు మోయించి, జీవితమంటే 

బరువు కాదు, *బాధ్యత* అని నేర్పింది.


*బావి నుండి బొక్కెనతో నీళ్లు తోడించి, బాలన్స్ గా *బరువు* 

లాగటం నేర్పింది.


*ఇంటి ముంగిటకు అతిథి దేవతలు

హరిదాసులు గంగిరెద్దులను రప్పించి, ఉన్న దాంట్లో కొంత *పంచుకునే* గుణం నేర్పింది.


*విస్తరిలో, అన్నం అంచులు దాటి కింద పడిపోకుండా తినే *ఒద్దికను* నేర్పింది.


ఒక్క పిప్పర్మెంట్ ను, బట్ట వేసి కొరికి ముక్కలు చేసి,

కాకి ఎంగిలి పేరుతో స్నేహితులతో

*పంచుకోవటం* నేర్పింది.


ముళ్ళు గుచ్చుకోకుండా, ఒక్కటొక్కటిగా రేక్కాయలు తెంపే *ఓర్పును* నేర్పింది.


దారంతో విల్లును చేయించి, వస్తు తయారీ *మెళకువలు* నేర్పింది.


*అత్తా, మామా, అన్నా వదినా, అమ్మమ్మా, నాయనమ్మా, తాతయ్యా వరుసలతో,

ఊరు ఊరంతా ఒక కుటుంబమనే *ఆత్మీయత* నేర్పింది.


ధైర్యంగా బ్రతికే పాఠాలను నేర్పిన

మన బాల్యానికి జీవితాంతం 

రుణపడి ఉందాం.

శ్వాస - పంచప్రాణాలు

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

శ్వాస - పంచప్రాణాలు........!!

శ్వాస రూపంలో మనం తీసుకున్న వాయువు నాసికా రంధ్రాల గుండా ప్రవేశించగానే ఐదు భాగాలుగా విడిపోయి....

1. ప్రాణము 2. అపానము 3. వ్యానము 4. ఉదానము 5. సమానము అను ఐదు ప్రాణములుగా మారిపోతుంది.


1.ప్రాణము:- అనంతాకాశంలో నుంచి ఎవరి శక్తి మేరకు వారు లోనికి తీసుకొని వాయువు.

2. అపాన వాయువు:- బయటికి వస్తున్న వాయువును అపాన వాయువు అని అంటారు. ఈ వాయు సహాయంతోనే మల మూత్ర విసర్జనలే కాక శరీరంలోని సమస్య మాలిన్యాలను బయటకు నెట్టబడుతున్నాయి.

3. వ్యాన వాయువు:- మన శరీరానికి మానవాకృతి నివ్వడానికి సహకరించే వాయువు. ఈ వాయువు యొక్క దోషం వల్ల అంగవైకల్యం, మానసిక ఎదుగుదల లోపం, శారీరక ఎదుగుదల లోపం (మరుగుజ్జుతనం) ప్రాప్తించును.

4. ఉదాన వాయువు:- దీని సహాయంతో మనం మాట్లాడగలుగుతున్నాము. దీని లోపం వల్ల నత్తి, నంగి, ముద్ద మాటలు, బొంగురు గొంతు సమస్యలు కలుగును.

5. సమాన వాయువు:- దీని సహాయంతోనే మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి ఏ ఏ భాగానికి ఎంతెంత శక్తి పంపిణీ చేయాలో అంతంత పంపి సమతుల్యాన్ని కలుగజేస్తుంది. దీని లోపం వల్ల శరీరం తూలి పడటం సంభవించును.


శ్వాస - చక్రాలు:-

ఈ శ్వాస ప్రతిరోజు ఉదయము సరిగ్గా 6 గంటలకు మొదలై 

➡️ మూలాధార చక్రము నందు - 600 సార్లు

➡️ స్వాధిష్ఠాన చక్రము నందు - 6000 సార్లు

➡️ మణిపూరక చక్రము నందు - 6000సార్లు

➡️ అనాహత చక్రము నందు - 6000 సార్లు

➡️ విశుద్ధి చక్రము నందు - 1000 సార్లు

➡️ ఆజ్ఞా చక్రము నందు - 1000 సార్లు

➡️ సహస్రారము నందు - 1000 సార్లు 

అనగా, రోజుకు 21600 సార్లు పయనిస్తోంది.


శ్వాస - అంగుళాలు:-

సాధారణంగా శ్వాసను సాధకుడు 12 అంగుళాలు వదులుతాడు. శ్వాసను ఎవరైతే లోతుగా - నిదానంగా - దీర్ఘంగా తీసుకొని దానిపై దృష్టి ఉంచి విడవటం చేస్తుంటే శ్వాస యొక్క అంగుళాలు తగ్గును.

➡️ శ్వాసను 11 అంగుళాలకు కుదిస్తే - ప్రాణం స్థిరమవుతుంది.

➡️ శ్వాసను 10 అంగుళాలకు కుదిస్తే - మహాకవి అవుతాడు.

➡️ శ్వాసను 9 అంగుళాలకు కుదిస్తే - బ్రహ్మానందం కలుగుతుంది.

➡️ శ్వాసను 8 అంగుళాలకు కుదిస్తే - దూరదృష్టి కలుగును.

➡️ శ్వాసను 6 అంగుళాలకు కుదిస్తే - ఆకాశగమనం చేయగలుగుతాడు.

➡️ శ్వాసను 4 అంగుళాలకు కుదిస్తే - సర్వ సిద్ధులు ప్రాప్తిస్తాయి.

➡️ శ్వాసను 2 అంగుళాలకు కుదిస్తే - కావలసిన రూపం ధరించిగలుగుతాడు.

➡️ శ్వాసను 1 అంగుళానికి కుదిస్తే - అదృశ్యం అవ్వగలరు.

   మరింత సాధన చేయగా శ్వాస అవసరమే వారికి ఉండదు. అలాంటి వారు అమరులు అవుతారు.


శ్వాస - సృష్టి వయస్సు:-

 మనము రోజుకు తీసుకునే శ్వాసలను (21600) రెట్టింపు చేసి ఒక సున్నను చేర్చిన

➡️ కలియుగం - 4,32,000 సంవత్సరాలు.

➡️ రెట్టింపు చేసిన ద్వాపర యుగం - 8,64,000 సంవత్సరాలు.

➡️ మూడు రెట్లు చేసిన త్రేతా యుగము- 12,96,000 సంవత్సరాలు.

➡️ నాలుగు రెట్లు చేసిన కృత యుగము - 17,28,000 సంవత్సరాలు.

➡️ పది రెట్లు చేసిన చతుర్ యుగము ( కలి+ద్వాపర+త్రేతా+ కృతయుగములు) - 43,20,000 సంవత్సరాలు.


శ్వాస - సాధన:-

సుఖంగా ఉండే పద్ధతిలో కూర్చొని, మృదువుగా కళ్లుమూసుకుని, మన నాశికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన శ్వాస తిరిగి అదే నాశికా రంధ్రాల ద్వారా బయటకు వెళ్లడాన్ని గమనిస్తుండాలి. ఇలా చేయగా, చేయగా మనస్సు యొక్క పరుగు క్రమేపీ తగ్గి క్రమక్రమంగా ఆగిపోతుంది. అప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా అనంతమైన విశ్వమయప్రాణశక్తి లభ్యమౌతుంది.

     మరి ఇంతటి శక్తివంతమైన శ్వాసకు సంబంధించిన సాధన చేసుకునేందుకు మనము ఏ హిమాలయాలకు, ఏ అరణ్యాలకు వెళ్ళి పోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటూ, ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉంటూ, మనం చేసే పనులు ఏవి మానుకోకుండానే, ఖాళీగా ఉన్న సమయంలో ఈ అద్భుత సాధన సులువుగా చేసుకోవచ్చు. దీనిని చిన్న పిల్లల (5 సం"ల) నుండి ముసలి వారి దాకా ఎవరైనా చేయవచ్చును.

     84 లక్షల జన్మల తరువాత లభ్యమైన ఈ మానవ జీవితమును వృధా చేయకుండా, వివేకవంతులముగా దీనిని సద్వినియోగపరచుకోగలరు.