25, జనవరి 2021, సోమవారం

అద్బుత యోగం -

 డెంగ్యూ జ్వరం వచ్చినపుడు ప్లేట్లెట్స్ సంఖ్య హఠాత్తుగా పడిపోతున్నప్పుడు  ఉపయోగించవలసిన అద్బుత యోగం  - 


    మొదట ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ తేనే కరిగేలా చేసి దానిలో ఒకస్పూన్ గోధుమగడ్డి చూర్ణం కలిపి వెంటనే రోగికి తాగించాలి. కొంతసేపట్లో ప్లేట్లెట్ల సంఖ్య పెరగడం మొదలవుతుంది. ఒక గంట తరువాత ఒక పెద్ద గ్లాస్ నీటిలో ఒక బొప్పాయి ఆకు మొత్తం చిన్నచిన్న ముక్కలుగా చేసి పొయ్యి మీద పెట్టి అందులొ తాటిబెల్లం వేసి సగం గ్లాస్ కషాయం మిగిలేలా కాచి దానిని కూడా తాగించడం వలన వేగంగా ప్లేట్లెట్స్ సంఖ్య పెరిగి రోగి ప్రాణాయాపాయ స్థితి నుంచి బయటపడతాడు.


      గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

పంచభూత క్షేత్రం

 పంచభూత క్షేత్రం


పంచభూతాలు అనగా నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం . ఈ పంచభూతాలకు అధిపతి పరమేశ్వరుడేనని,పంచ భూతాత్మక మైన ఈ దేహం ఈశ్వర సేవలో తరించాలని పెద్దలు చెబుతారు. పంచభూతాలకు పంచలింగాలు ప్రసిద్ధి చెందాయి. ఆయా భూతతత్వాలతో స్వామి ఆయా క్షేత్రాలలో దర్శనమిస్తాడు. 


కంచిలో పృద్వీలింగం , జంబుకేశ్వరం లో జలలింగం, తిరువన్నామలై లో తేజోలింగం, శ్రీకాళహస్తి లో వా యులింగం, చిదంబరంలోఆకాశలింగం- ఈ అయిదు పంచభూత లింగాలుగా ప్రసి ద్ధి కెక్కాయి. వీటిలో నాలుగు ఆలయాలు తమిళనాడులో ఉండగా, వాయులింగ స్వామీ ఆలయము ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది.


కాంచీపురం (కంచి) ..;పృద్వీలింగం

కాశీ, కంచి పమేశ్వరునికి రెండు కళ్ళు అని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. ఇక్కడ పంచభుతాలలో ఒకటైన పృద్వికి ప్రతీక గా ఏకాంబరేశ్వరుడు మృత్తికా లింగంగా దర్శనమిస్తాడు. అభిషేక ప్రియ: శివ: శివుడు అభిషేక ప్రియుడు అని అంటారు. కాని ఇక్కడ మాత్రం స్వామికి అభిషేకం లేదు. పుష్పాలతో పూజ చేస్తారు. ఆలయము లోని మామిడి చెట్టు కింద పార్వతి దేవి తపస్సు చేసిందని, ఆమె మట్టితో ఒక శివ లింగం చేసి పూజ చేసింది అని అంటారు.ఆ మట్టి తో చేసిన లింగమే ఈ రోజు పూజ లు అందుకుంటోంది.


ఇక్కడ ఉన్న మామిడి చెట్టు సుమారు మూడు వేల ఐదు వందల సంవస్తరాల వయస్సు కలదని అంటారు . శాఖోప శాఖలుగా విస్తరించిన ఈ చెట్టుకి ఉన్న కొమ్మలలో, నాలుగు కొమ్మలు నాలుగు రుచులు గల ఫలాలను ఇవ్వటం విశేషము. సంతానము ఇచ్చే మహిమాన్విత వృక్షం గా ఈ చెట్టు ప్రసిద్ధి చెందింది.


( మామిడి చెట్టుక్రింద వెలసిన స్వామి )