21, డిసెంబర్ 2020, సోమవారం

ధార్మికగీత - 116*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                               *ధార్మికగీత - 116*

                                         *****

             *శ్లో:- యో ధ్రువాణి పరిత్యజ్య ౹*

                    *అధ్రువం   పరి షేవతే ౹*

                    *ధృవాణి తస్య నశ్యంతి ౹*

                    *అధ్రువం నష్ట మేవ చ౹౹*

                                        *****

*భా:- లోకంలో స్థిరములు, ప్రయోజన కరములు, హిత కరములు అయిన వానిని వదలి పెట్టి, అస్థిరములు, నిష్ప్రయోజకములు, అప్రియకరములు అయిన వానిని ఆశ్రయిస్తే;  స్థిరములు ఎలాగూ కావాలని వదలడం వల్ల లభ్యం  కాకపోగా,  అస్థిరమును పట్టుకున్నా, దొరికినట్లే దొరికి, సహజంగానే చేజారి పోతుంది. చివరికి రెంటికిని చెడ్డ రేవడి కావలసి వస్తుంది. పార్థుడు నిత్యుడైన పరమాత్ముని కోరుకొని విజయపథంలో నిలువగా, రారాజు అనిత్యమైన సేనాబలగాన్ని కోరి సాధించింది ఏముంది? కర్ణుడు ధర్మాన్ని వదిలి, అధర్మాన్ని ఆశ్రయించి, కొమ్ము గాచి సాధించింది ఏముంది? ప్రహ్లాదుడు మహత్తర  నారాయణ మంత్రమునే నమ్ముకొని దైవానుగ్రహాన్ని పొందితే, తండ్రి ఆ మంత్రాన్ని ద్వేషించి సాధించిందేముంది? రావణుడు కామాంధకారంలో ధర్మాన్ని త్రోసిరాజని, సీతను అన్యాయంగా చెరబట్టి సాధించిందేముంది? వినాశనం తప్ప. ఏనాటికైనా శాశ్వతమైన దానినే ఆలంబనగా చేపట్టాలి. పట్టిన పట్టును కడదాకా వీడకుండా  జీవిత లక్ష్యం నెరవేర్చుకోవాలి. నశ్వరమైన దానిని సేవించి, సముద్రంలో మునిగే నవలా తాను, తనను నమ్ముకొన్నవారిని కూడా నట్టేట ముంచడం ముమ్మాటికి తగదని  సారాంశము*.

                                   *****

                    *సమర్పణ  :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

ధర్మాచరణ

 ధర్మాచరణ!

                    ➖➖➖


ఈజగత్తులో ధర్మాచరణను మించిన శ్రేష్ఠమైన మహత్కార్యం మరొకటి లేదు. 


మనిషికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించి, సక్రమ జీవనవిధానాన్ని చూపిస్తుంది ధర్మం. 


మనిషికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేదీ ధర్మమే.


ధర్మాన్ని మనం కాపాడితే, ధర్మం మనల్ని కాపాడుతుంది. 


ధర్మాన్ని కాపాడటమంటే- అన్నివేళలా ధర్మాన్నే ఆచరించాలి. 


ధర్మం మనిషిని మంచి స్థితిలో నిలబెడుతుందని,     అధర్మం వల్ల మనిషి పతనమవుతాడని మనుస్మృతి చెబుతోంది.


శ్రీమద్రామాయణాన్ని రచించిన వాల్మీకి శ్రీరాముడి    గుణగణాలు    వర్ణిస్తూ.... 

*‘రామో విగ్రహవాన్‌ ధర్మః’* అంటాడు. 

అంటే మూర్తీభవించిన ధర్మస్వరూపుడు శ్రీరాముడు. సమస్త ధర్మాలూ ఆయనలోనే ఉన్నాయి. అందుకే ఆయన అందరికీ ఆరాధ్యదైవమయ్యాడు.


మనిషి మంచిగా బతకడానికి, ఉన్నతంగా ఎదగడానికి ఏయే ధర్మాలు పాటించాలో విపులంగా వివరించి చెప్పింది మహాభారతం. ఏ కర్మలైతే మనోవాక్కాయాలకు బాధ కలిగిస్తాయో ఆవిపరీత కర్మలను ఇతరుల విషయంలో ఆచరించకూడదు. అందుకే ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంగా భారతాన్ని భావిస్తారని నన్నయ చెబుతాడు.


వ్యాసమహర్షి కోటిగ్రంథాల్లో చెప్పినవాటిని అర్ధశ్లోకంలో వివరిస్తున్నానని ఈ విధంగా ఉపదేశిస్తారు. *‘ఇతరులకు మంచి చేస్తే పుణ్యం కలుగుతుంది. చెడు చేస్తే పాపం కలుగుతుంది.’* ఇదే అసలైన ధర్మసూక్ష్మం.


ధర్మాచరణమే పరమధర్మమని, సచ్ఛీలమే తపస్సని, సచ్ఛరిత్రమే పరమ జ్ఞానమని బోధిస్తారు మహాత్ములు. 


బ్రహ్మచారి అయిన శ్రవణ కుమారుడు సంధ్యావందనాది విహిత కర్మలు చేస్తూ, వృద్ధులు, అంధులు అయిన తల్లిదండ్రుల సేవచేస్తూ ఆత్మశక్తిని పెంపొందించుకున్నాడు. 

ధర్మవ్యాధుడు స్వధర్మ ఆచరణతోపాటు తల్లిదండ్రులకు, అతిథులకు సేవచేస్తూ వేదవిహిత కర్మలతో తపోశక్తిని సాధించిన కౌశికుడనే బ్రాహ్మణుడికి తత్వోపదేశం చేశాడు. 

కుక్కుటముని తనకు సమీపంలో ఉన్న గంగను, కాశీని సేవించక తల్లిదండ్రుల సేవలోనే పరమార్థాన్ని గ్రహించాడు. 

అందుకే మనిషి తాను చేసే ప్రతి పనినీ పరమాత్మ పూజగా భావించాలి. ధర్మాచరణతో అందరికీ తోడ్పడాలి.

భోగాలను విడిచి త్యాగగుణం పెంచుకొమ్మంటుంది ధర్మం. అహంకారం వదిలి ఆత్మతత్వం గ్రహించమని చెబుతుంది.

యుద్ధానికి సిద్ధమైన దుర్యోధనుడు తల్లిదీవెన కోసం గాంధారి దగ్గరికి వెళ్ళి తనకు జయం కలిగేలా దీవించమంటాడు. అప్పుడు గాంధారి, ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడే ఉంటుందని దీవిస్తుంది. ఆమె దీవించినట్లుగానే ధర్మపరులైన పాండవులు యుద్ధంలో విజయం సాధించారు.

ధర్మ ప్రాశస్త్యాన్ని గురించి చాణక్యుడు తాను రాసిన చాణక్య నీతిలో ఇలా వివరిస్తాడు: *‘మానవుడు తాను కష్టపడి సంపాదించిన ధనాన్ని భూమిపైన, గోసంపదను పశువుల శాలలో విడిచి మరణిస్తున్నాడు. భార్య ఇంటి ముంగిట్లోనే ఆగిపోతుంది. మిత్రులు శ్మశానం వరకు వచ్చిపోతారు. ఎంతో ప్రేమగా పోషించుకున్న శరీరం చితిమంటల్లో భస్మమైపోతుంది. జీవుడితో వెళ్లగలిగేది ధర్మం ఒక్కటే!’*


తన శ్రేయం కోరకుండా అందరి అభ్యుదయం కోరడం ఉత్తమధర్మం. 

నిస్సహాయులకు, వృద్ధులకు సహాయం అందించడం మానవతా ధర్మం. 

ఇతరుల నుంచి ఏమి ఆశిస్తారో దాన్ని నీవు ఇతరులకు చేయడం నిజమైన ధర్మం. 

ధర్మాన్ని అనుసరించినవారిని ఆ ధర్మమే రక్షిస్తుంది. 

ధర్మం ఎక్కడ ఉంటుందో జయం అక్కడ ఉంటుంది. 

ఎంతటి క్లిష్టపరిస్థితుల్లోనూ ధర్మం విడవకూడదని మన పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి.   

          ****            

లోకా సమస్తా సుఖినోభవన్తు!

🌹కావ్యసుధ 🌹

మొగలిచెర్ల

 *స్వామివారి సమాధి ముచ్చట..(1వ భాగం)*


1976 జనవరి నెల రెండవ వారం లో సంక్రాంతి సెలవులకు నేను మావూరు మొగలిచెర్ల కు వచ్చాను..అప్పటికి నేను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుకుంటున్నాను..మొగలిచెర్ల కు వచ్చిన ప్రక్కరోజే మా అమ్మగారు (పవని నిర్మల ప్రభావతి )  శ్రీ స్వామివారికి ఆహారం ఇచ్చి వచ్చే బాధ్యతను ఎప్పటిలాగే నాకు అప్పజెప్పింది..సరే అన్నాను..ఆరోజు ఉదయం 9 గంటలకు శ్రీ స్వామివారి కోసం ఒక టిఫిన్ బాక్స్ లో అన్నం పెట్టి "స్వామివారు ఈమధ్య సరిగా ఆహారం తీసుకోవటం లేదు..ఆయన ధ్యానం లో ఉంటే..కొంచెం సేపు అక్కడివుండి..ఆయన చేతికి ఇచ్చేసి వచ్చేసేయ్.." అన్నది..అలాగే అని చెప్పి స్వామివారి ఆశ్రమం దగ్గరకు వెళ్ళిపోయాను..


ఆశ్రమం ప్రహరీ గోడ తలుపు తీసే ఉంది..లోపలికి వెళ్ళాను..స్వామివారు ధ్యానం చేసుకునే గది (ప్రస్తుతం ఆ గదినే శ్రీ స్వామివారి సమాధి మందిరం గా వ్యవహరిస్తున్నాము..) తలుపులు మూసి ఉన్నాయి..బావి వద్దకు వెళ్లి నీళ్ళు తోడుకొని..కాళ్ళూ చేతులు కడుక్కుని..వరండా లో కూర్చున్నాను..


పది నిముషాల తరువాత..శ్రీ స్వామివారు తలుపు తీసుకొని బైటకు వచ్చి.."నేను ధ్యానం లో ఉంటే..నాకోసం చూడకుండా నువ్వు తెచ్చిన డబ్బాను వంటగది లో పెట్టి పొమ్మని పోయినసారి నీకు చెప్పివున్నాను కదా..మళ్లీ నాకోసం ఎదురు చూడటం ఎందుకు?.." అన్నారు..


"మీరు వచ్చేదాకా వుండి, మీకు అందజేసి రమ్మని మా అమ్మ చెప్పింది..అందుకని.." అంటూ నసిగాను..


"అమ్మకు చాదస్తం ప్రసాదూ..నేను సరిగా ఆహారం తీసుకోవటం లేదని బెంగ..నా ధ్యాస ధ్యానం మీదే కానీ..అన్నం మీద కాదు కదా..ఆమాటే అమ్మకు చాలాసార్లు చెప్పాను..సరే..ఆమె తాపత్రయం ఆమెది.." అన్నారు.."ఈ పది రోజులూ నువ్వే వస్తావా..? " అన్నారు..అవును అన్నట్లు గా తలవూపాను..వంటగది లోకి వెళ్లి నా చేతిలో ఉన్న అన్నం డబ్బా ను అక్కడ ఉన్న బల్ల మీద పెట్టి.."వెళ్ళొస్తాను స్వామీ.." అన్నాను.."మళ్లీ వస్తావుగా.." అన్నారు..మళ్లీ రావడమేమిటి అనుకోని..రేపటి సంగతి గుర్తు చేస్తున్నారేమో అని నాకు నేనే భావించుకొని..సరే అన్నట్లుగా తలవూపి..తిరిగి నడుచుకుంటూ ఇంటికి వచ్చాను..


ఆరోజు మధ్యాహ్నం మూడు గంటల వేళ, శ్రీ స్వామివారి ఆశ్రమాన్ని నిర్మించిన శ్రీ మీరాశెట్టి గారు, స్వామివారి ప్రధమ శిష్యుడు శ్రీ చెక్కా కేశవులు గారు ఇద్దరూ మొగలిచెర్ల కు వచ్చారు..నాన్నగారు (పవని శ్రీధరరావు గారు ) నన్ను పిలిచి.."ఈరోజు మన పనివాడు ముసలయ్య పనిలోకి రాలేదు..మేము ముగ్గురమూ స్వామివారి వద్దకు వెళ్ళాలి..నువ్వు మన గూడుబండికి ఎద్దులు కట్టేసి..మమ్మల్ని  స్వామివారి ఆశ్రమానికి తీసుకెళ్లి, తిరిగి మన ఇంటికి చేరుస్తావా?.." అన్నారు..


"మళ్లీ వస్తావుగా.." అని స్వామివారు పొద్దున అడిగిన మాట గుర్తుకొచ్చింది..గబ గబా ఇంట్లోకి వెళ్లి, అమ్మతో ఉదయం స్వామివారితో జరిగిన సంభాషణ అంతా చెప్పాను.."మహానుభావుడు..ఆయనకు అన్నీ ముందే తెలుసు.." అన్నది అమ్మ..


ఎద్దులబండి తోలడం తెలిసున్న విద్యే కనుక ..పది నిమిషాల్లో బండి సిద్ధం చేసాను..నాన్నగారి తోపాటు మిగిలిన ఇద్దరినీ బండి ఎక్కించుకొని..శ్రీ స్వామివారి ఆశ్రమానికి వెళ్ళాను..బండి దిగి ముగ్గురూ లోపలికి వెళ్లారు..బండిని ఒక ప్రక్కగా నిలిపి నేనూ లోపలికి వెళ్ళాను..


స్వామివారి సమాధి ముచ్చట తరువాయి భాగం రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

సంభాషణ

 🚩నాస్తికునికి, ఆస్తికునికి మద్య సంభాషణ:


1. నేను జాతకాలు నమ్మను.

జ) అవును, అది మీ జాతకంలోనే ఉంది.


2.నేను దేవుడిని నమ్మను.

జ) తప్పేముంది? రావణుడు, కంసుడు వంటివారు కూడా నమ్మలేదు.


3.నాకు దేవుడిని చూపించగలరా?

జ) ఆయన మిమ్మల్ని చూట్టానికి ఇష్టపడాలికదా.


4.ప్రసాదాలు సమర్పిస్తారు. మరి దేవుడు స్వీకరిస్తే ప్రసాదాల్లో ఒక్క మెతుకు కూడా తగ్గదేమి?

జ) మీరు పుస్తకం చదువుతారు. అందులో ఒక్క అక్షరమన్నా మాయం కాదేం.


5.మనుషులను దేవుడే పుట్టిస్తే మరి అంతా సమానంగా లేరేం?

జ) అదేంటి. అందరూ తొమ్మిదినెలలు గర్భంలో ఉండి నగ్నంగానే పుట్టి కెవ్వుమనే ఏడుస్తారుగా?


6.దేవుళ్లకు, రాక్షసులకు పిల్లలున్నారుగా. మరి వాళ్ల పిల్లల పిల్లలు ఎవరూ లేరా?

జ) ఉన్నారుగా. మనమంతా వారి వంశాలలోని వారిమే.


7.దేవుడు సర్వాంతర్యామికదా. మరి గుడిలో విగ్రహం ఎందుకు?

జ) అన్నింటా , అందరిలోనూ దేవుని చూసే సామర్థ్యం నీకు లేదు కాబట్టి.


8.దేవుడిని తలచుకోకపోతే జరగదా?

జ) ఎందుకు జరగదు? మృగాలు క్రిమికీటకాల కీ జరగటం లేదా ? 


🙏🌹Om Namaha Shivaya🌹🙏

కాళీ గ్లాసు

కాళీ గ్లాసు 

మనం రోజు చూస్తున్న ఒక సాధారణ విషయం. ఈ రోజుల్లో చాల పలచటి ప్లాస్టిక్ గ్లాసులు తయారు చేస్తున్నారు. వాటిని ఏదయినా విందులో వాడేటప్పుడు టేబులు మీద పెట్టి నీళ్లు పోస్తుంటే కాళీ గ్లాసులు గాలికి అటు ఇటు కదులుతూ కొంచం పెద్ద గాలి వస్తే టేబులు మీదినించి కింద అక్కడక్కడ పడుతూ వాటిలో నీళ్లు పోసే వారికి విసుకు కలిగిస్తాయి. అందుకే నీళ్లు పోసేవారు ఇంకొకడిని ఆ గ్లాసులు పట్టుకోమని చెప్పి వాటిలో నీళ్లు నింపటం నిత్యం మనం చూస్తూవున్న విషయం . 

అదే కొంత బరువు కలిగిన రాగి గ్లాసో లేక ఇత్తడి, కంచు లేక స్టీలు గ్లాసు అనుకోండి వాటిని టేబులు మీద పెట్టినవి పెట్టినచోట ఉండి వాటిలో నీరు నింపటం చాల సులువుగా అవుతుంది. 

ఇక విషయానికి వస్తే ప్రతి మనిషి ఒక కాళీ గ్లాసు లాంటి వారే దానిలొ నీరు నింపటం అంటే గురువుగారు చేసే జ్ఞాన బోధ. నింపటం అన్న మాట. ఎప్పుడైతే కాళీ గ్లాసు స్థిరంగా ఉండి  ఉంటే దానిలో నీరు నింపటం ఎలా అయితే సులువు అవుతుందో అదే విధంగా సాధకుని మనస్సు స్థిరంగా ఎటువంటి వత్తిడులకు లోనుకాకుంటే ఆ సాధకునికి గురువుగారు చేసే జ్ఞాన బోధ చక్కగా వంట పట్టి జ్ఞానిగా మారుతాడు. అదే ప్లాస్టిక్కు గ్లాసులాంటి చంచల మనస్సు కలవారికి జ్ఞానబోధ చేయుట బహు కష్టం. కాబట్టి ప్రతి వారు ఒక రాగి గ్లాసులాగా స్థిరంగా ఉంటే వారికి గురువులు చేసే తత్వ బోధ సులువుగా అర్ధమౌతుంది. కాబట్టి మనమందరం స్థిర మనస్కులుగా ఉంటే మనలో జ్ఞానం సులువుగా వికసిస్తుంది. 

ఓం తత్సత్.  

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ భార్గవ శర్మ.

కేతువు వలన కలిగే దోషాలు

 కేతువు వలన కలిగే దోషాలు - శాంతి మార్గాలు


కేతువు పార్ధివ నామ సంవత్సరం ఫాల్గుణమాసం శుక్ల పౌర్ణమి అభిజిత్ నక్షత్రంలో బుధవారం జన్మించాడు. కేతువు బూడిద వర్ణంలో రెండు భుజములతో ఉంటాడు. కేతువు వాహనం గ్రద్ద. బ్రహ్మదేవుడికి తాను సృష్టించి జనం అపారంగా పెరగడంతో వారిని తగ్గించడానికి మృత్యువు అనే కన్యను సృష్టించాడు. మానవులకు మరణం ఇచ్చే బాధ్యతను అప్పగించాడు. తనకు మరణం ఇచ్చినందుకు ఆ కన్య దుఃఖించింది. ఆమె కన్నీటి నుంచి అనేక వ్యాదులు ఉద్భవించాయి. అప్పుడు తెల్లని పొగ రూపంలో ఒక పురుషుడు జన్మించాడు. కీలక నామ సంవత్సరం మార్గశిర కృష్ణ అమావాస్య నాడు మంగళ వారం మూలా నక్షత్రంలో కేతువు జననం జరిగింది.


కేతువు రాశి చక్రంలో అపసవ్యదిశలో పయనిస్తుంటాడు. అంటే మేషం నుంచి మీనానికి.. ఇలా పయనిస్తుంటాడు. రాశిలో ఒకటిన్నర సంవత్సరకాలం ఉంటాడు. సూర్యుడిని ప్రదిక్షిణం చేయడానికి 18 సంవత్సరాల సమయం పడుతుంది. రాహువు కేతువులు ఎప్పుడూ ఒకరికి ఒకరు రాశిచక్రం లోని 7వ స్థానంలో సంచరిస్తుంటారు. కేతు మహర్దశాకాలం 7 సంవత్సరాలు. కేతువు ముక్తి కారకుడు. అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. ఈ మూడు నక్షత్రాలలో వారికి జన్మించిన ఆరంభ దశ కేతు దశ.


కారకత్వం

కేతువు మోక్షవిజ్ఞాన కారకుడు చపలత్వము, జ్ఞానహీనత, శత్రు బాధలు, దూర ప్రదేశాలు, దేశాలు తిరుగుట, ఉన్మాదము, దృష్టమాంద్యము, కర్రదెబ్బలు, క్షుద్రము మంత్ర ప్రయోగములు మొదలగునవి కలిగినచో కేతువు బలహీనుడని గుర్తించాలి. వేదాంతం, తపస్సు, మోక్షం, మంత్ర శాస్త్రం, భక్తి, నదీస్నానం, మౌన వ్రతం, పుణ్యక్షేత్ర దర్శనం, మోసం, పరుల సొమ్ముతో సుఖించుట, దత్తత మొదలైన వాటిని సూచిస్తాడు.


వ్యాధుల వ్యాప్తి...

కేతువు మృత్యు కారకుడు, భయాన్ని కలిగిస్తాడు, వ్యాధులను కలిగిస్తాడు. రక్తపోటు, అలర్జీ, మతి స్థిమితం లేక పోవుట మొదలైన వ్యాధులకు కారకుడవుతాడు. అజీర్ణం, స్పోటకం, రక్తపోటు, చెముడు, నత్తి, దురదలు, గ్యాస్, అసిడిటీ, వైద్యం, జ్వరం, వ్రణామలను సూచిస్తాడు కేతువు ఏ గ్రహముతో కలిసిన ఆ అవయవమునందు బాధలు కలిగిస్తాడు. రోగ నిర్దారణ సాగదు కనుక చికిత్స జరుగడంలో సమస్యలు సృష్టిస్తాడు.


కేతువు ధ్యానం

లాంగూలయుక్తం భయదంజనానం కృష్ణాంబు భృత్సన్నిభ మేకవీరమ్|

కృష్ణాంబరం శక్తి త్రిశూల హస్తం కేతుం భజేమానస పంకజే హమ్ ||

ఫలాశపుష్ప సంకాశం తారకా గ్రహ మస్తకం |

రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ||

 

కేతు మంత్రము

ఓం హ్రీం క్రూం క్రూరరూపిణే కౌతలే ఐం సాః స్వాహా ||

 

14 9 16

15 13 11

10 17 11

కేతుయంత్రం

సోమవారం రాత్రి చంద్రహోరలో అనగా రాత్రి 8-9 గంటల మధ్యలో ఈ యంత్రం ధరించాలి. ప్రతి రోజు ఉదయమే స్నానం చేసి శుచిగా కేతుధ్యానం 39 పర్యాయాలు చేయాలి. మంత్రజపం 108 మార్లు జపించి, పైన తెలిపిన ప్రకారము యంత్రాన్ని పూజించి ధరించాలి. 10 సోమవారాలు ఉలవలు దానం ఇవ్వాలి.


పరిహారం

కేతుగ్రహ పరిహార పూజా కోసం కంచు ప్రతిమ మంచిది.

అధి దేవత - బ్రహ్మ

నైవేధ్యం - చిత్రాన్నం

కుడుములు - ఉలవ గుగ్గిళ్ళు

ప్రీతికరమైన తిథి - చైత్ర శుద్ధ చవితి

గ్రహస్థితిని పొందిన వారం - బుధవారం

ధరించవలసిన రత్నజ్ఞం - వైడూర్యం

ధరించవలసిన మాల - రుద్రాక్ష మాల

ధరించవలసిన రుద్రాక్ష - నవముఖి రుద్రాక్ష

ఆచరించవలసిన దీక్ష - గణేశ దీక్ష

మండపం - జెండా ఆకారం

ఆచరించ వలసిన వ్రతం - పుత్ర గణపతి వ్రతం

పారాయణం చేయవలసినది - శ్రీ గణేశ పురాణం

కేతు అష్టోత్తర శతనామావళి - గణేశ శతనామావళి

దక్షిణగా ఇవ్వాల్సిన జంతువు - మేక

చేయవలసిన పూజ - విగ్నేశ్వర పూజ, సూర్యారాధన

దానం చేయవలసిన ఆహార పదార్ధాలు - ఖర్జూరం, ఉలవలు.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

రాహు దోషం

 రాహు దోషం - నివారణోపాయలు


   అన్ని గ్రహాలు రవి వలన అస్తంగతులైతే.. రవి చంద్రులను కూడా నిస్తేజులుగా చేయగల చండ ప్రచండుడు రాహువు. అందుకే ఈయన స్తోత్రంలో "చంద్రాదిత్య విమర్ధనం" అని మర్దించే శక్తీ రాహువుకు గలదని చెప్పబడింది. ప్రాణ శక్తీ కారకుడైన సూర్యుని, మనః శక్తీకి కారకుడైన చంద్రుని మర్ధించే శక్తి ఉంది. అందుకే రాహు మహా దశః బాగు లేనివారు పడే పాట్లు వర్ణనాతీతం.


పురాణా శాస్త్రాల ప్రకారం దక్షుని కూతురు సింహికకు కస్యపునికి రాహువు జన్మించాడు. పైటినసగోత్రజుడు పార్ధవా నామ సంవత్సర భద్రా పద పౌర్ణమి  పూర్వభద్రా నక్షత్రామందు జన్మించాడు. మ్లేచ్చ స్వభావం కలిగినవాడు. సూర్యునికి నైరుతి దిశలో శూర్పకార మండలంలో సింహవాహునుడై, కరాళ వక్త్రంతో ఉప విష్ణుడై వుంటాడు.


కొత్త దాన్ని ఆవిష్కరించే స్వభావం రాహువుది. శరీరంలోకి ఫారిన్ మీటర్కానీ, మనుషులకు ఫారిన్ ప్రయాణం కానీ, వ్యక్తులతో పరిచయాలు గానీ, అలవాట్లతో అనుభూతులు కానీ కల్గించేవాడు రాహువు. ఈ గ్రహం గారడీ చేయించే శక్తి కలవాడు. అబద్ధాలు, అల్లకల్లోలాలు, కొత్త అలవాట్లు. కొత్త వేష భాషలు కలిగించడంలో సిద్దహస్త్తుడు. గ్రీకు పురాణ గాధల్లో డ్రాగన్ అనే రాకాసి బల్లి వంటి జంతువు తలగా రాహువును, తోకగా కేతువును ప్రతీకలుగ చిత్రీకరించారు. శని గ్రహం వలే రాహువు కర్మ గ్రహం. పూర్వ జన్మ కర్మల్ని అతి విడ్డురంగా అనుభవింప చేయగలడు. దుర్మార్గ స్వభావం కలవారు. అందలం ఎక్కడానికి సహస కార్యక్రమాలు చేపట్టి వారికీ చేయూత ఇవ్వడానికి రాహువు బాగా సహకరిస్తాడు.


అంతేకాదు రాహు మహా దశలో ఖచ్చితంగా పితృ కర్మలు చేయిస్తాడు. కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి రాహు దశఃకానీ, అంతర్ దశః కానీ జరుగుతున్నపుడు తండ్రి, తాత, తల్లి, అమ్మమ్మలో ఒకరికి ఆయువు తీరుతుంది. రాహువుకు యోగాలు కల్గించడం ఉన్నా, అనుభవంలో అవయోగాలు ఎక్కువుగా కల్గిస్తాడు."రాహు మహా దశః పట్టిందిరా అనేది వాడుక. అల్పుల అందలం ఎక్కుట వల్ల ఏర్పడిందే. ఫారిన్ భాషలు, ఫారిన్ వస్తువులు ఫారిన్ జబ్బులు తెప్పించడంలో రాహువుదే ఆగ్రాతాంబూలం


రాహువు వల్ల ఏర్పడే పరిణామాలు

రాహువు వల్ల పలు పరిణామాలు ఏర్పడతాయి. రాజ్యాధికారం కల్పించుటలో , పదవిచ్యుతుని చేయుటలో రాహువు కారకుడు. వర్ణాంతర వివాహాలు చేసుకోనటలో కూడా ప్రభావం కలవాడు. కుట్రలు, పన్నాగాలు, ఎత్తు గడలు, కులద్రోయుట వంటి నీచ గుణాలు కలిగిస్తాడు. సాంప్రదాయాల సంస్కరణకు, మతబ్రస్థత్వాం పట్టిస్తాడు. తక్కువ స్థితిగల స్త్రీ సాంగత్యానికి పురిగొల్పుతాడు. సంకుచిత ఆలోచనలు కల్గిస్తాడు. వ్యసనపరులుగా, పోకిరిలుగా మార్చి దుష్ట్ట స్నేహాలను కల్గిస్తాడు. నైరుతి దిశలో కలిగే లాభ నష్టాలకు కారకుడు. పీడ కలలు, భయందోళనలు కలిగిస్తాడు. రహస్య స్టావరాల పనులు, రహస్య మంతనాలకు ప్రేరేపిస్తాడు. వన దుర్గ దేవి ఆరాధనతో రాహువు ప్రీతీ చెందుతాడు. ఉర్దూ, పర్షియన్ వంటి విదేశీ భాషలు నేర్చుకోవడానికి కారకుడు అవుతాడు.


రాహువు కలిగించే బాధలు

రాహువు అనేక బాధలు కలిగిస్తాడు. కుటుంబంలో కల్లోలాలు సృష్టిస్తాడు. స్వంత బుద్ధి లోపించి ఇతరుల చెడు సలహాలను పాటించుట, ముర్ఖునిగా ప్రవర్తించుట, అధికార దుర్వినియోగం చేసి అల్లరి పలగుట, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ వస్తువుల వల్ల నష్టాలు, పొలిసు గూడచారి సంస్థల వల్ల బాధ కలుగును. కుటుంబంలో పెద్దవారికీ ఆకస్మిక మరణాలు, పిల్లలు తప్పిపోవుట లేదా ఎత్తుకు పోవుట, కోర్టు వ్యవహారాల్లో చిక్కుకుపోవుట, మిలటరీ సంబంధ, బిల్డింగ్  కాంట్రాక్టు సంబంధ నష్టాలు, పాములు, తేల్లు, గేదెలు, విష జంతువుల వల్ల బాధలు కలిగిస్తాడు. విష గ్యాసులు, ఆమ్లాలు, వాతావరణ కాలుష్యం వల్ల ప్రమాదాలు, న్యూన్యత భావం, ఎక్కడికో పారి పోదామనే మానసిక ప్రవర్తన, జైలు వరకు తీసుకొని వెళ్ళుట చేయిస్తాడు.


చంద్రునితో కలిస్తే  గొప్ప బుద్ధి చాంచల్యం గానీ పిచ్చి కానీ కల్గించవచ్చును. కుజుని తో కలిసి చెడిపోతే ఆకస్మిక ప్రమాదాలు, దెబ్బ లాటలు, గాయాలు కల్గిస్తాడు. రవితో కలిస్తే తప్పకుండా తండ్రితో సత్సంబంధాలు దెబ్బ తీస్తాడు. శని రాహువుల కలయిక త్రీవ్రమైన పరిస్తితిలకు దారి తీయవచ్చును. గురునితో కలిస్తే సద్భావన ఉన్నా, తప్పని పరిస్థితిలలో తప్పులు చేయిస్తాడు. ఎంత రహస్యంగా పనులు చేసినా బహిర్గాతం చేసి పరువు తీయిస్తాడు. రాహువు ఎంత యోగం కల్గించినా, ఎంతో కొంత అప్రదిష్ట చేయకుండా ఉండలేడు.


రాహువు కలిగించే అనారోగ్యాలు

రాహువు వాయుతత్వ కారకుడు కావడం వల్ల మనవ శరీరంలోని సమస్త వాయు  సంబంద రోగాలను కల్గిస్తాడు. నొప్పి ఎక్కడుందో అక్కడ రాహువు ఉంటాడు. కడుపు, నాభి, మర్మాంగాల నొప్పులకు ప్రతీక. ఉచ్చ్వాస నిశ్వాసల్లోని గమన సిలత్వాన్ని కంట్రోలు చేసే శక్తీ రాహువుది. ఉరఃపంజర సంబంధ రోగాలను కలిగిస్తాడు. శుక్ర రాహువుల కలయికతో చర్మ సౌంధర్యాన్ని దెబ్బ తీస్తాడు. సమస్తమైన అంటు వ్యాధులకు రాహువు అధిపతి. టైఫాయిడ్, మలేరియా, మసూచి, ఇన్ ఫ్లూ,అనేక రకాల వైరస్ జ్వరాలకు రాహువు పెట్టింది పేరు. కన్య రాశిలో వుంటే అన్ని రకాల పురుగులను కడుపులో పెంచుతాడు. శరీరంలోని రోగనిరోధక శక్తిని తగ్గించి.. బ్యాక్టిరియాను ఆహ్వానించడంలో రాహువు మొదటి వాడు. రాహువు స్టితి బట్టి పక్షవాతం, కీళ్ళవాతం, నడుము నొప్పి కలుగుతాయి


రాహు గ్రహ నివారణోపాయలు


మానవుని ఇంత ప్రభావం చూపే రాహు గ్రహ నివారణోపాయలు ఇప్పుడు తెలుసుకుందాం. రాహువుకు అధిదేవత పృద్వీ అని కొందరు, గౌ గోవులని కొందరు చెబుతారు. ప్రత్యదిదేవత సర్పములు, అధిప్రత్యది దేవతా సహితంగా పునశ్చరణ చేసి దార పోయుట వలన నివారణ కలుగును. రాహువుకు అధిష్టాన దేవత దుర్గా దేవి సప్తాసతి పారాయణం కానీ మంత్రం జపం కానీ, కవచం కానీ పునఃశ్చరణ చేయుట వలన నివారణ పొందవచ్చును. చిన్నమాస్తాదేవిని విధి విధానంగా పూజించడం వల్ల రాహు గ్రహం దుష్పరిమనాలను నివారించవచ్చును.


రాహు గ్రహ దోష నివారణకు శనివారం నాడు ప్రారంభించి వరుసగా 18 రోజుల పాటు పారుతున్న నీటిలోకి రోజుకోక కొబ్బరికాయ దార పోయుట వల్ల నివారణ కలుగును. పడుకొనే ముందు గదిలో నెమలి పించాన్ని కనపడేటట్లు పెట్టి, తెల్ల వారు జామున లేవగానే చూచుట వల్ల రాహు గ్రహ పీడ నివారణ కలుగును


రాహు దోషం తొలగాలంటే దీపారాధన కూడా చేయాలి. రాహు యంత్రాన్ని పుష్పాలతో అర్చించాలి. నల్ల దుస్తులు ధరించాలి. ఇంకా మినపప్పును దానం చేసి వేప నూనెతో దీపారాధన చేయడం ద్వారా రాహు దోషం తొలగిపోతుందని శాస్త్రం చెబుతోంది.  రాహు భగవానునికి ఏదైనా ఒకరోజు అభిషేకం చేయించాలి. నలుపు వస్త్రాలు, గోమేధికం, బ్లూ లోటస్‌తో పూజ చేయించాలి. రాహు స్తుతి చేసి గరికతో యాగం నిర్వహించి.. మినపప్పు, మినపప్పు పొడి, అన్నం అగ్నికి ఆహుతి ఇవ్వండి. తర్వాత దీపారాధన చేయాలి.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

కఠోపనిషత్‌ వివరణ

 *🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 138 🌹*

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 

📚. ప్రసాద్ భరద్వాజ


*🌻.   ఆత్మను తెలుసుకొను విధము - 68 🌻*


పృథ్వి పంచకంలో

భూమిలో భూమి - మృత్యువు కదా!


గు: భూమిలో భూమి - మృత్యవు

శి: మృత్యు దేవత అండీ !


భూమిలో జలము - బ్రహ్మ... బ్రహ్మము

బ్రహ్మము అంటే చతుర్ముఖ బ్రహ్మ గారు. సృష్టి చేసేటటువంటి బ్రహ్మ గారు.


భూమిలో అగ్ని - విష్ణువు,

విష్ణువు - ఈయన పోషక కర్త, స్థితి కర్త.

భూమిలో వాయువు - ఇంద్రుడు,

ఇంద్రుడు - ఈయన ఇంద్రియాధిష్ఠాన దేవత.

భూమిలో ఆకాశము - అగ్ని, అగ్ని!


        ఇట్లా మొట్టమొదట ప్రాథమికంగా చిట్టచివరి భూపంచకంలో, పృథ్వి పంచకంలో, పృథ్వీ తత్వ పంచకంలో వీళ్ళు ఏర్పడ్డారు. ఇదే ఆఖరుగా ఏర్పడ్డారు. ఇది... అదే ఆకాశ పంచకానికి వచ్చామనుకోండి....

అది జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము

జ్ఞాతకేమో గురుమూర్తి,

మనస్సుకేమో చంద్రుడు, చంద్రుడు!

బుద్ధికి బృహస్పతి, బృహస్పతి!

చిత్తమునకు క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞుడు!

అహంకారమునకు రుద్రుడు.


ఈ రకంగా ఇంద్రియాదిష్ఠాన దేవతలంతా ఏర్పడ్డారు. ఆ చివర ఆకాశ పంచకము. ఈ చివర పృథ్వి పంచకము. మధ్యలో జలపంచకము. జల పంచకము, అగ్ని పంచకము, వాయు పంచకము. అంతే కదా! జల పంచకములో ఎవరు ఏర్పడ్డారు?


జలములో ఆకాశము - సదాశివుడు,

జలములో వాయువు - ఈశ్వరుడు, ఈశ్వరుడు!

జలములో అగ్ని - రుద్రుడు,

జలములో జలము - విష్ణువు,

జలములో పృథ్వి - బ్రహ్మ.


అది చూడండి. మరలా క్రింద చెప్పిన పేర్లే, అటు ఇటుగా మారినాయి. వాటి వాటి యొక్క స్థితి భేదాన్ని అనుసరించి, ఆకాశము, జలము, అగ్ని, వాయువు, పృథ్వి ఆ తత్త్వముల యొక్క సంయోజనీయత ద్వారా. అయితే, మూలముగా ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో, అంటే, పృథ్విలో పృథ్వి, జలములో జలము, అగ్నిలో అగ్ని, వాయువులో వాయువు, ఆకాశంలో ఆకాశము. ఇవి చాలా బలవత్తరమైనటువంటివి. ఎందుకంటే వాటిలో అర్థభాగములు ఉన్నాయి కాబట్టి.


 అర్థభాగమేమో అపంచీకృతంగా ఉంది. అర్థభాగమేమో పంచీకృతమయ్యింది. అందువల్లనే ఆ పంచకమంతా కూడా దానిలోకి ఆకర్షించబడుతుంది. పృథ్వీ తత్వం చేత ఆవరించబడుతున్నటువంటి శరీరమే నేననే వారందరూ మృత్యుదేవత ముఖములో పడక తప్పదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

ఎందుకీ దుఃఖం?

 *దైవాంశ  అయిన    ఆత్మ,    ప్రాణ, మనసు మన దేహములో వున్నా ! మానవునికి ఎందుకీ దుఃఖం?*

🕉️🌞🌏🌙🌟🚩


పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మ,  ప్రాణ, మనసు మనదేహములో ఉన్నప్పటికీ కూడా మానవులు దుఃఖానికి గురికావడం ఏమిటి—? అని మనం చర్చించు కుందాం.



1.)    ఆత్మ అనునది బ్రహ్మపురిలో సుప్తావస్థలో ఉంటుంది.  అంటే మన  మెదడులో థర్డ్ వెంట్రికల్ లో నిక్షిప్తమై వుండి ఈ దేహ సామ్రాజ్యాన్ని  ఏలడం కోసం ‘ప్రాణ,”   “మనసు” ని కిందికి దింపి తను యధాస్థానములో కూర్చొని స్వయంప్రకాశమై ఉంటు అన్నింటికి  ద్రష్ట అయి కూర్చున్నది. రాబడినటువంటి



2 ) ” ప్రాణ” (PRANA):—    ప్రాణకు అనుచరగణమైన పంచ ప్రాణాలు

1. ప్రాణ,

2.అపాన,

3.వ్యాన,

4.ఉదాన,

5. సమాన వాయువులు , వీటితో పాటు ఉపవాయువులు 1.నాగదత్త, 

2.కూర్మ,

3. కృకర,

4.దేవదత్త,

5. ధనంజయల తో కలసి ఈ దేహసంరక్షణలో  ఇవి తోడ్పడుతూ తమ తమ విధులను నిర్వహిస్తాయి. దేహములో  వుండబడిన కోటానుకోట్ల జీవకణాలకు కావలసిన  గాలి,  నీరు,   ఆహారాన్ని  రక్తం ద్వారా అందిస్తుంది.———



*  ప్రాణ బ్రెయిన్  రీజన్ లో  “ఫోర్త్ వెంట్రికల్” లో   వుండి రెస్పరేటరీ systam   ద్వారా అన్నింటిని ఆక్టివ్ చేస్తూ తమలో ఉష్ణం తగ్గకుండా  98 డిగ్రీల సెంటిగ్రేడ్ హీట్ గా ఉంచుతూ తన విధి నిర్వహణలో   ఎలాంటి అలసట  ఎరుగక     జాగ్రత్, సుషుప్తా అవస్ఠలల్లో కూడా పని చేస్తూ సజీవంగా వుండునట్లు తన విధిని నిర్వహిస్తుంది. దేహము ఈ రకముగా నిలవడానికి కారణం  ఈ ప్రాణయే ! దీనినే   “క్రియాశక్తి” అంటారు.



3.)  మూడవ శక్తి అయినటువంటి మనసు (ఇచ్ఛాశక్తి)  ఈ దేహాన్ని కంట్రోల్ చేస్తూ తన  ఇష్టారాజ్యంగా అజ్ఞానముతో తమోగుణ స్థితిలో చేయరాని  కర్మలు చేస్తూ,దాని ఫలితాలను , జీవాత్మకు అంటగడుతూ  అనేక జన్మలకు నెలవవుతుంది.  బంధానికి మోక్షానికి కారణభూత మవుతుంది (మన ఏవ మనుష్యానామ్…)



4.)  అన్ని జన్మలలోను మానవ జన్మయే ఉత్తమోత్తమమైనది. జన్మలు తన కర్మానుసారాన్ని బట్టి మారుతుంటాయి. అసలు జన్మలు మూడు రకములు.



దేవ జన్మ, 2. మానవ జన్మ 3.జంతు జన్మ.

ఇందులో కర్మల ఫలితాలను బట్టి జన్మ లెత్తుతుంటారు. కర్మలు ఆ జీవునితోపాటుగా కలిసి ప్రయాణిస్తాయి. అదే శరీరమనే బంధనము. ఈ బంధనము తోనే మనిషి ఈ లోకములోకి వస్తున్నాడు.



5.)  ఈ దుఃఖానికి   నిలయ మైనటువంటి  శరీరాన్ని ధరించడం వల్ల ఈ దుఃఖబాధలు అనుభవించాల్సివస్తుంది.



6.)  జన్మ జన్మాన్తరాలలో మనము చేసుకున్న కర్మలవల్ల, ఆ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడం కోసం జన్మ అనేది     ఎత్తవలసి  వస్తుంది. అంటే   శరీరాన్ని ధరించాల్సి వస్తుంది.



7.)   మనం చేసే కర్మలు కొన్ని మంచివి కొన్ని చెడ్డవి ఉంటాయి. ఈ జన్మలోనే కాకుండా వెనుకటి జన్మలలో కూడా కర్మలు చేసి వుంటాము. ఆ కర్మలే శరీరానికి బంధనాలు అవుతాయి. అంటే మనము చేసే శుభాశుభ కర్మల యొక్క సంస్కారముతో బంధింపబడి ఉన్నదన్నమాట.



8.)  పూర్వ   కర్మల ఫలితానుసారంగా  వచ్చిన ఈ శరీరముతో మళ్ళీ మళ్ళీ చేయకూడని కర్మలు చేస్తూ ఈ శరీరాన్ని ఇంకా బంధించు కుంటున్నాము. మనలో ఉన్న స్థూల మనసుతో బాహ్యవిషయాల యందు ప్రలోభపడి , స్థాయికి మించిన కోరికలతో అనేక కర్మలు చేస్తూ ఆ కర్మ ఫలాన్ని అనుభవించ టానికి అనేక జన్మలు పొందుతూ—చస్తూ    జనన    మరణాలనే చక్రములో  తిరుగుతుంది.



9.)  అందుకే జన్మ అనేది ఎందుకు కలుగుతుంది అనే ప్రశ్నకు మనము చేయు కర్మల ఫలితాలే.  ఈ జన్మలో  కూడా ఇంకా ఇంకా కర్మలు చేస్తూ మనను మనమే బంధించు కుంటున్నాము. ఈ కర్మ శృంఖలాలా నుండి విముక్తి పొందాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ   శరీరమనేది   కర్మఫల స్వరూపమే.



10.)  మనసు ఈలాంటి కర్మ చేయడానికి కారణం మనసులో పుట్టు తృష్ణ (కోరిక)  వల్లనే . తృష్ణ చేత  ప్రేరేపించబడి ఏ వస్తువు అయిన నాది,  అధికారము నాదే అని, ఇది నాకోసమే అని,  ఉన్నాదల్లా నాకే అని,  అంతా నేనే నని, అంతా నాకోసమేనని, అహంకారము పుడుతుంది. దీనికి కారణం అవివేకమే, విచారణాశక్తి లేకపోవడమే.ఈ వివేకశక్తి లేని వారికి “అంతర్ దృష్టి ” ఉండదు.



11.)  అవివేకము అనేది అజ్ఞానము వల్ల కలుగుతుంది, అజ్ఞానము వల్ల దుఃఖము కలుగుతుంది.    ఒకదానికొకటి సంభంధం కలిగివున్నాయి. ఎలాగంటే,  చెట్టు బీజాన్ని ఉత్పత్తి చేస్తుంది —- ఆ బీజమే మళ్ళీ చెట్టును ఉత్పత్తి చేస్తుంది. అట్లాగే అజ్ఞానము దుఃఖానికి కారణమైతే —- ఆ దుఃఖమే అజ్ఞానానికి కారణమౌతుంది. ఆ విధంగానే ఈనాడు మనము చేస్తున్న కర్మలన్ని పూర్వజన్మ సంస్కారం యొక్క  ఫలితాలే  గదా !



12.)  ఈ విధమైన  కార్యాకారణ ప్రవాహం నడుస్తూనే ఉంటుంది. దీనికి మూలమేమిటి అవిద్యాత్మక మైన (బ్రహ్మవిద్య లేక)  అజ్ఞానము.  ఈ అజ్ఞాన స్థితిలో దుఃఖము కలగటం అనేది తప్పనిసరి. కాబట్టి దుఃఖము అజ్ఞానము అనే రెండు ఒకదానినొకటి కారణాలుగా వున్నాయి. అజ్ఞానము వున్న చోట దుఃఖము తప్పదు.



13.)  అజ్ఞానమనగా ఆ పరాత్పరుని నుంచి వచ్చిన ఆ మూడు శక్తులను ఏకము చేయక పోవడమే ప్రథమ అజ్ఞానము. విడదీసి పంపడమే దుఃఖానికి కారణం. దానివల్ల కర్మఫలితాలు  అనుభవిస్తు జీవితములో గందరగోళ   పరిస్థితులు   ఏర్పడి. అస్తవ్యస్త మైన జీవనముతో  సుడిగుండములో చిక్కుకున్న నావ లాగా పరిస్థితి ఏర్పడింది.



14.) నిన్ను నీవు తెలుసుకునే ప్రయత్నము చేయక గత జన్మల లాగానే ఈ జన్మలో అశ్రద్ధ చేస్తే ఇంకా ఈ శరీర బంధనము లో ఇరుక్కోని ,” పునరఫి జననం,” “పునరఫి  మరణం” పొందుతున్నాము.



15.)   వచ్చినవి దైవీశక్తులు అయినప్పటికి  , వాటిని  దైవీ శక్తులుగా గమనించక, తేలిక భావముతో, తృణప్రాయముగ ఎంచి , వాటి బాగోగులు చూడక, సరయిన విధానములో జీవనము గడపక , తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం  కూడా ఈ దుఃఖానికి ఒక కారణం.



ఉదా:- పది లక్షలు వెచ్చించి ఒక కారును తీసుకొని దానిని సరి అయిన విధానములో నడుపక మందు మత్తులకు బానిసయై ఆ  వాహనాన్ని లోయలో పడేసినచో కంపెనీ వారిది తప్పగునా—? లేక డ్రైవరు నిర్లక్షమా –?  మనము బట్టల కొట్టులో తెల్లటి వస్త్రము తెచ్చుకొని ధరించి దానిపై పడు మురికిని తొలగించుకోకపోవడం మన పొరపాటా–? లేదా కంపనీ పొర పాటా–?   దీని బాధ్యత ఎవరిది—?



16.)  అదేవిధంగా పవిత్రమైన దైవీ  శక్తులను అపవిత్రంగా తయారు చేసుకొని చిందర వందర జీవితము గడుపుతున్న  ఈ మానవుని నిర్లక్ష్యమే కాదా ! దాని వల్ల జీవితాలు వ్యర్ధమై పోతున్నాయనేది నిర్వివాదాంశము కాదా !



17.)  జీవాత్మ , పరమాత్మలో ఐఖ్యము చెందితే తప్ప దుఃఖ నివృత్తి   అనేది   అసంభవము జీవాత్మ పరమాత్మ ఐక్యతకు మూలము ఈ   సాధనయే.(బ్రహ్మవిద్యయే)



18.) భగవంతునిలో ఈ జీవాత్మని ఐక్యము చేసి మోక్షము ఇప్పించ గలిగే ఈ సాధనకు ఎంతో ప్రాముఖ్యత వున్నది. దానిని విజ్ఞులయిన మీరు తేలిక భావముతో చూడగూడదు . దాని యెడల నిర్లక్ష్యము వహించ కూడదు. నీ కర్మలు నీవు ఇక్కడే కాల్చుకోవచ్చని  భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ  నొక్కి ఒక్కాణించారు “ప్రయత్నా ద్యత మానస్తు, యోగి సంశుద్ధ కిల్భష:” అనే శ్లోకం ద్వారా ప్రజానికానికి ఒక  గొప్ప సందేశాన్ని అందించారు. 


🕉️🌞🌏🌙🌟🚩

నవగ్రహ దోషాలు

 🌹🍃🌹🍃🌹🍃🌹🍃

🍃🌹🍃🌹🍃🌹🍃🌹





*🌹నవగ్రహ దోషాలు పోగొట్టే ధ్యాన శ్లోకాలు🌹*




విద్య, ఉద్యోగం, పెళ్లి, సంతానం, ఇల్లు సమస్య ఏదైనా దానికి సత్వరం చక్కని పరిష్కారం దొరకాలంటే మీరు నవగ్రహాలను శరణు వేడ వలసినదే. దానికి చక్కని మార్గం నవగ్రహ జపం. ఇది సాధారణంగా స్వయంగా చేసుకోవాలి. కానీ దానికి గట్టినమ్మకం, సంకల్పం కావాలి. సంఖ్య ఎక్కువ ఉంటుంది కనుక చాలా మంది పూర్తి చేయలేరు. అటువంటి వారు బ్రాహ్మణులను పెట్టుకుని జపం చేయించుకోవాలి. బ్రహ్మణులను పెట్టుకుని జపం చేయించుకుంటే వారు వేద ప్రోక్తమైన మంత్రాలను జపం చేస్తారు. స్వయంగా కూడా చేయవచ్చు. స్వయంగా చేసే వారు " నవగ్రహ శ్లోకాలను" జపం చేయాలి.


ఈ నవగ్రహ శ్లోకాలు మీ కష్టాలను/ ఈతిబాధలను తొలగించి, కోరిన కోరికలను తీర్చడంలో అద్భుతంగా పనిచేస్తాయి. దారిద్ర్య దుఃఖ బాధలు, శారీరక మానసిక రోగ రుగ్మతలు తొలగుతాయి. సర్వ కార్య విజయాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాది లాభాలు, మనోవాంఛలు తీరును. ప్రతీ గ్రహము ఒక్కో ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది. అలాగే మీ జాతక చక్ర రీత్యా ఒక్కో ఫలితాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది.


నవగ్రహ శ్లోకాలు:


నవ గ్రహ శ్లోకం :

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ

గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః


రవి: 6000 సార్లు

జపాకుసుమ సంకాశం, కాస్యపేయం మహాద్యుతిం,

తమోరిం సర్వ పాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం.


చంద్ర: 10,000 సార్లు

దధి శంఖ తుషారాభం, క్షీరో దార్ణవ సంభవం,

నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం.


కుజ: 7,000 సార్లు

ధరణీ గర్భ సంభూతం, విద్యుత్ కాంతి సమప్రభం,

కుమారం శక్తి హస్తం, తం మంగళం ప్రణమామ్యహం.


బుధ: 17,000 సార్లు

ప్రియంగు కలికా శ్యామం, రూపేణా ప్రతిమం బుధం,

సౌమ్యం సత్వ గుణేపేతం, తం బుధం ప్రణమామ్యహం.


గురు: 16,000 సార్లు

దేవానాంచ ఋషీణాంచ, గురుం కాంచన సన్నిభం,

బుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం.


శుక్ర: 20,000 సార్లు

హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం,

సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం ప్రణమామ్యహం.


శని: 19,000 సార్లు

నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం,

ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం.


రాహు: 18,000 సార్లు

అర్థకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్ధనం,

సింహికా గర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహం.


కేతు: 7,000 సార్లు

ఫలాశ పుష్ప సంకాశం, తారకా గ్రహ మస్తకం,

రౌద్రం రౌద్రాత్మకం ఘోరం, తం కేతుం ప్రణమామ్యహం.


ఈ నవగ్రహ శ్లోకాలు ఎవరైనా పఠించవచ్చు. పైన గ్రహ శ్లోకాలు వాటి ప్రక్కనే చేయవలసిన జపసంఖ్య చెప్పడం జరిగింది. ఒక్కో సారి పరిస్ఠితుల తీవ్రతను బట్టి 2,3 లేక 4 గ్రహాలకు కూడా జపాలు చేసుకోవలసి రావచ్చు. ఆ జపసంఖ్యను పూర్తిచేయడానికి చాలాసమయం పడుతుంది కనుక ఒకేరోజులో పూర్తిచేయవలసిన అవసరం లేదు. కొన్ని రోజులు ( ఉదా: 3 లేదా 5 లేదా 9 లేదా 11 లేదా 21 లేదా 41) నియమం పెట్టుకుని రోజుకి కొంత పూర్తి చేసుకుని, ఆ గ్రహానికి ఇష్టమైన ధాన్యం ఇష్టమైన వారంలో దానం చేయడం ద్వారా ఆశించిన ఫలితాలను పొందవచ్చు. నవ గ్రహాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నవ గ్రహాలను ప్రార్ధించడం ద్వారా ధర్మ బద్ధమైన మీ కోరిక ఎంతటిదైనా ఖచ్చితంగా తీరుతుంది. ముందుగా మీకున్న సమస్య ఏమిటో, దాన్ని తీర్చగలిగే శక్తి ఏ గ్రహానికుందో తెలుసుకోవటానికి అనుభవజ్ఞులైన జోతీష్యులను సంప్రదించి వారి సలహాపై జపం ప్రారంభించాలి.

ఈ 41 రోజులు దీక్షపూని, సాత్విక ఆహారాన్ని భుజిస్తూ, మితంగా మాట్లాడుతూ ఉండాలి. ఉదయాన్నే చేసే జపం సంఖ్యానియమం కలిగి ఉండాలి. అంటే రోజుకు వెయ్యి చేస్తాననో, రెండు వేలు అనో నియమం పెట్టుకోవాలి. అది ఎట్టి పరిస్థితులలోనూ ఆపకుండా సంఖ్య పూర్తి అయ్యే వరకూ రోజూ చెయ్యాలి. అలాగే మిగతా సమయంలో ( పనులు చేసుకుంటున్నప్పుడు ) కుడా వీలయినన్ని సార్లు ఆ శ్లోకాన్ని చదువుతూ ఉండాలి. కానీ ఉదయం పూజా స్థలంలో కూర్చుని చదివే సంఖ్య మాత్రమే లెక్కకు వస్తుంది.🙏🏻

నవగ్రహాల

 🌹🕉️🌹🕉️🌹🕉️🌹

🕉️🌹🕉️🌹🕉️🌹🕉️




*🕉️🌹నవగ్రహాల తల్లిదండ్రులు & భార్యలు పేర్లు🌹🕉️*




01. *రవి[సూర్యుని]* *తల్లిదండ్రులు అతిది - కశ్యపులు. భార్యలు ఉష,- ఛాయ*

.

02. *చంద్రుని - తల్లిదండ్రులు అనసూయ - అత్రి మహర్షి - భార్య రోహిణి*

.

03. *కుజుని- తల్లిదండ్రులు - భూమి, భరద్వాజుడు - భార్యశక్తి దేవి*


04. *బుధుని - తల్లిదండ్రులు - తార, చంద్రుడు - భార్య జ్ఞాన శక్తి దేవి*


05. *గురుని - తల్లిదండ్రులు - తార, అంగీరసుడు - భార్య తారాదేవి*


06. *శుక్రుని - తల్లిదండ్రులు - ఉష,భ్రుగు - భార్య సుకీర్తి దేవి*


07. *శని - తల్లిదండ్రులు - ఛాయ, రవి - భార్య జ్యేష్ట దేవి*


08. *రాహువు - తల్లిదండ్రులు - సింహిక, కశ్యపుడు - భార్య కరాళి దేవి*


09 *కేతువు - తల్లిదండ్రులు - సింహిక, కశ్యపుడు - భార్య చిత్రా దేవి*


*నవగ్రహస్తోత్రాన్ని ప్రతిరోజూపఠించడంవలన గ్రహదోషాలుతొలగిపోతాయి*


🌝 *రవి*

జపాకుసుమ సంకాశం! కాశ్యపేయం మహాద్యుతిమ్!!

తమో‌రిం సర్వపాపఘ్నం!

ప్రణతోస్మి దివాకరం !!


🌜 *చంద్ర* 

దధి శంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవం

నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం


🔴 *కుజ*

-- ధరణీ గర్భ సంభూతం, విద్యుత్కాంతి సమప్రభం

కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం


💚 *బుధ*-- 

ప్రియంగు కళికాశ్యామం, రూపేణా ప్రతిమం బుధం

సౌమ్యం సత్వగుణోపేతం, తం బుధం ప్రణమామ్యహం


💛 *గురు*

- దేవానాంచ ఋషీనాంచ, గురుం కాంచన సన్నిభం

బుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం


⚪ *శుక్ర*

-- హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం

సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం, తం ప్రణమామ్యహం


⚫ *శని*

- నీలాంజన సమాభాసం, రవి పుత్రం యమాగ్రజమ్

ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం


🐍 *రాహు* - అర్ధకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్దనం

సింహికాగర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహమ్


🐍 *కేతు*

ఫలాశ పుష్ప సంకాశం, తారకాగ్రహ మస్తకమ్

రౌద్రం రౌద్రాత్మకం, ఘోరం తం కేతు ప్రణమామ్యహమ్.

లోకాసమస్తా సుఖినోభవంతు సమస్త సన్మంగళానిభవంతు🌹