1, సెప్టెంబర్ 2024, ఆదివారం

తెలుగు భాష

 


తెలుగు భాష 


కొంత కాలం తరువాత మరుగున పడి పోకుండా


అభివృద్ధికి చర్యలు 



1.. అందరూ తెలుగు భాషని గౌరవంగా చూసుకోవాలి.

2.. ప్రతి ఇంటిలోనూ తెలుగులో మాట్లాడుకోవాలి

3.అది అలవాటుగా ఉండాలి

4.. ఆ దిశగా కార్యచరణాలు చేపట్టాలి

5.. మన తెలుగు భాష అంటే ఎందుకు అంత చులకన?

6.. మన తెలుగు భాషని మనమే వాడుక భాషగా వాడకపోతే 

వేరే ప్రాతం వాళ్ళ ఎందుకు ఆసక్తి చూపుతారు.

7.. ముందుగా రెండు రాష్ట్రాల ప్రజలు మేమంతా తెలుగు వాళ్ళము అన్న దృఢమైన ఆత్మ విశ్వాసం కలిగి ఉండాలి.


మన తెలుగు భాషని కాపాడు కోవడం అనేది మరియు మన భావి తరాలకు అందించడం మన అందరి బాధ్యత అని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలి.



8.. మనమంతా ముందుగా భారతీయులం మరియు హిందువులం

అన్న దృఢమైన ఆత్మ విశ్వాసం కలిగి ఉండాలి.

9.. ఈ దిశగా ప్రోత్సహించడానికి తగు చర్యలు ఒక ప్రణాళిక ప్రకారం తీసుకొని ముందుకు సాగాలి.

10.. అన్ని రంగాలలోనూ తెలుగుని వ్యవాహారిక భాషగా దైనందిన జీవితంలో ఉపయోగించేలా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అని గ్రహించాలి.


11.అప్పుడే మన తెలుగు జాతి సాంస్కృతి మరియు సంప్రదాయాలును రక్షించు కొన్న వాళ్ళం అవుతాం.


12.. ఈ దిశగా ఈ సహస్ర శోభ ప్రపంచ తెలుగు మహాసభలును వేదికగా చేసుకొని పాటు పడాలి. 

13.ఇది మన అందరికి ఒక సువర్ణ అవకాశం అని నేను భావిస్తున్నాను.

14.. జరిగి పోయిన దాని గురించి బాధ పడి ప్రయోజనం ఉండదు 

15.. ఇప్పుడు జరగాల్సిందాని గురించి ఆలోచించాలి.

16.ముఖ్యంగా ప్రభుత్వం కూడా రెండు రాష్ట్రాల లోనూ, అధికారికంగా తన వంతు చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి, ఉదహారనికి అన్ని బడుల లోనూ తెలుగు భాష ని బోధించే లాగ, దుకాణాల పేరు తెలుగులో తప్పని సరిగా ఉండాలి, మొదలైనవి.



ఐకమత్యంమే మహాబలం అన్న మాటని మనం అందరం దృఢంగా పాటించాలి


అప్పుడే ఈ కార్యసిద్ధిని సాధించి తీరాలి అని శపథం చేసి నెరవేర్చే విధంగా అందరూ ముందుకు వచ్చి తగు చేయూత నివ్వాలి.


ఇక నుంచి అయినా కొంత మంది నా కేందుకులే అన్న ఆలోచన నుంచి బయటకు వచ్చి తీరాలి.


ఈ కార్యక్రమంలో మీరు ఏ విధంగా పాల్గొన గలరు, 

ఆలోచించండి.




ఇది నా అభిప్రాయం అండి

పసుపు గణపతి*

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

        *పసుపు గణపతి*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*పసుపు గణపతిని* *ముందుగా ఎందుకు పూజిస్తాం?* 


*సమస్త కార్యములు నిర్విఘ్నంగా జరుగుటకు ముందుగా "విఘ్నేశ్వరుని" పూజించాలి.*


*ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు "పసుపు" విఘేశ్వర పూజ చేయాలి.*


*దానికో కథ వుంది....*


*పూర్వం "త్రిపురాసురులు" అనే రాక్షసులు వుండే వారు. వారు బ్రహ్మచే అనేక వరాలు పొంది లోకాలన్నిటినీ బాధించసాగారు.*


*ఆకాశంలో "మూడు" నగరాలను నిర్మించుకొని దేవతలను, లోకాలనూ బాధించసాగారు. వీళ్ళ బాధలు భరించలేక దేవతలు, ప్రజలు..."శివుణ్ణి" ప్రార్థించారు.*


*అపుడు శివుడు రక్షిస్తానని అభయమిచ్చాడు.*


*"శివుడు" ఆలోచించి ఒక ఉపాయాన్ని చెప్పాడు. నందిని ఆ మూడు నగరాలను తన కొమ్ములతో యెత్తి పట్టుకోమన్నాడు.*


*అప్పుడు శివుడు... నంది కొమ్ముల పై యెత్తిన మూడు నగరాలతో సహా త్రిపురాసులను సంహరించాడు.*


*ఆ సమయంలో "నంది" "కొమ్ము" ఒకటి తెగి పడిపోయింది. అదే పసుపుకొమ్ము. దానితో నందికి చాలా దు:ఖం కలిగింది. "గణపతి" అప్పుడు ఆ కొమ్ము ఎక్కడ పడిందో వెదికి తెచ్చాడట.*


*కొమ్ము దొరికినందుకు నందికి చాలా ఆనందం కలిగింది.*


*అది చూచిన శివుడు "నందీ...నీ పసుపు కొమ్ము పడిన చోటున మొలిచిన...."పసుపు కొమ్ముల" తోనే చూర్ణించగా వచ్చిన "పసుపు"తో "పసుపు గణపతి"ని చేసి....యే పూజకైనా మొదట పూజింప వలసినదే" అన్నాడట...*


*ఆ పసుపు కొమ్ములతో చూర్ణించిన "పసుపు"తోనే తయారుచేసిన పసుపు గణపతికి పూజ మొదలైందట!*


*అందుకే ఆయన "ఆది దేవుడు, "ప్రథమ పూజ్యుడు" అయ్యారు.*


*వినాయకుడి పూజలో మనకు అతి ముఖ్యమైనది మనం మనస్సును పెట్టి స్వామి ఎదురుగా కూర్చొని ధ్యానం చేయడం.*

*వినాయకునకు కుదురుగా కూర్చునే వాళ్ళంటే మహా ఇష్టం! ఎందుకంటే…*


*ఆయన స్థిరంగా కూర్చుంటాడు. అందుకే పూజలో స్వామిని ఉద్దేశించి "స్థిరో భవ, వరదో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం కురు." అని చదువుతారు. అందుకే "గజాననుని" ముందు, రోజూ కూర్చునే ప్రయత్నం చేద్దాం .*


*మనం చేసే ప్రతి పనిని శ్రద్ధగా చేయడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి, ప్రతి విషయం త్వరగా అర్ధం అవడానికి ఇది బాగా ఉపకరిస్తుంది.*


*”పిలిస్తే పలికే దైవం "గణనాధుడు."*


*గం గం గణేశాయ నమః।*

*ఓం నమః శివాయ॥*


*శుభమస్తు. అవిఘ్నమస్తు.*

*శుభోదయం. శుభదినం.*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

మహా_దర్శనము_రెండవ_తరంగము_2

 #మహా_దర్శనము_రెండవ_తరంగము_2

సీమంతము 

కన్నడ మూలము : శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి 

తెలుగు సేత : భాస్కర జనార్దన శర్మ 

మధ్యాహ్నమై జాము గడుస్తూ ఉంది . మూడో జాము అని సూర్యుడు తన ప్రచండ కిరణాలను ఉపసంహరించుకుంటున్నాడు . పొద్దుటి నుంచీ మబ్బులు ముసిరి , సంక్రమణమా అన్నట్లున్న దినము ఇప్పుడు కొంచముసేపటి నుండీ తేటపడింది . అయినా చుట్టూ దిగంతాల వైపు మేఘాల ఆక్రమణ బలంగా ఉంది . మేఘాలు మాయావుల వలె సూర్యునితో దొంగాట లాడుతున్నాయి . 

దేవరాతునికి  ఆలోచనల్లో అంతా నిన్నటి రాత్రి చూసిన దృశ్యమే ! మాధ్యాహ్నిక కర్మల నన్నిటినీ ముగించి భోజనము పూర్తి గావించుకుని వచ్చాడు . చిన్న చౌకపు శల్య నొకదానిని భుజంపై వేసుకుని , మడి పంచతోనే ప్రాంగణపు పక్కన నీడలో  పచారు చేస్తున్నాడు . చల్లగా చలి మొదలైంది . ధావళిని ఎందుకు కప్పుకోరాదు అనిపిస్తున్నది . తాంబూలము నోటిలో కరగుతున్నది . అన్యమనస్కంగా తాంబూలాన్ని నములుతున్నాడు . " ఇంకేమి , ఆలంబి వస్తుంది , ఆమెతో పుట్టబోయే పిల్లవాడి సంగతులు మాట్లాడవలెను . ఇప్పుడు ప్రస్తుతానికి గర్భిణిగా తాను చేయవలసినదేమి ? ముందు ముందు తల్లియై చేయవలసినదేమి ? అంతటినీ చెప్పాలి . " అని ఆలోచిస్తున్నాడు . అరకన్ను మూసుకుని చేస్తున్న ఆ ఆలోచనలో శిష్యుడొక్కడు వచ్చి నిలుచున్నదానిని ఆచార్యుడు గమనించలేదు . ఇంకాసేపవుతుండగా , "  ఆచార్యులకు ఈ సమయము విడుపేనా " అంటూ భార్గవుడు దగ్గరికి వచ్చాడు . 

దేవరాతునికి భార్గవుడు అప్పుడప్పుడు అలాగ వచ్చి పలకరించుట కొత్తేమీ కాదు . అయితే ఈ దినము అతనికి ఆ రాక కావాలనిపించ లేదు . అట్లాగని , వచ్చినవాడిని ఆహ్వానించకుండా ఉండటము అవుతుందా ?  వెంటనే ఆ వైపుకు తిరిగినాడు . ముఖము ఎప్పటివలెనే మందహాస ప్రసన్నమైంది . అయినా అతనికి నోటినుండీ ఏమాటా రాలేదు . బహుశః రాబోవు శిశువు ఆలోచన బలంగా ఉండుటను సూచిస్తున్నది. వచ్చిన వాణ్ణి ఊరికే కళ్ళప్పగించి చూస్తున్నాడు . 

భార్గవుడు మరలా అడిగాడు , " ఏమిటో , ఆచార్యులు ఏదో లోకంలో ఉన్నట్టుంది , నోటి నుండీ మాటలే రావడము లేదు ? " 

దేవరాతుడు నవ్వాడు . " ఔను , భార్గవులు వచ్చినపుడు రండి అని ఉపచారము చేయకుండా ఉంటే ,, నేను ఎదురుగ్గా ఉన్నా లేనట్లే కదా ! నిజం చెప్పాలంటే , మీ భవ్యమైన ఆకారము , దానికి తగినట్లు ఉట్టిపడుతున్న మీ ఠీవి , దానితో పాటు మీరు వచ్చిన వైఖరి , అవన్నీ చూసి మనసు అదరిపోయింది . మాట బెదరిపోయినట్టు ఎక్కడికో పారిపోయింది . దాన్ని పట్టి తెచ్చుటకు దాని వెంటనే మనసు పోయింది . బుద్ధి అక్కడ కొంచము , ఇక్కడ కొంచము అయిపోయింది . అదంతా సరే , రండి , దయచేయండి . ఇక్కడే కూర్చుందామా ? లేక నడిమింటికి వెళదామా ? " 

" నేను గుర్రపు బండిలో వచ్చినాడను . ఆ బండి దడదడ శబ్దము విని మీరు వాకిలి వద్దకు వస్తారు అనుకున్నా. వాకిలి వద్దకు రాలేదేమా , ఏదో విశేషముంటుంది అనుకొని లోపలికి వచ్చినాను . మీ శిష్యుడొకడు నన్ను చూసి మీకు చెప్పాలని లోపలికి పరుగెత్తి వచ్చినాడు . ఇదిగో వాడు ఇక్కడే నిలుచున్నాడు . మీరు వాణ్ణి చూసినట్లు లేదు . ఇదంతా చూసి నేను , మీరిక్కడే ఉన్నారా లేక లోకాంతరములలో సంయమమై ఉన్నారో అని అడిగినాను , తప్పులేదు కదా ? " 

" భార్గవులు ఏమి చేసినా తప్పుకాదు . అలాంటప్పుడు తప్పెలా వెదికేది ? రండి వెళదాము " అని దేవరాతుడు అక్కడే నిలుచున్న శిష్యునికి కళ్లతోనే ఏదో సూచించి , భార్గవుడిని పిలుచుకొని నడిమింటికి వెళ్ళినాడు . 

నడిమింటిలో  కృష్ణాజినములతో శోభిస్తున్న వేత్రాసనములు  ( వెదురు బద్దలతో చేసిన ఆసనములు ) . వాటిలో ఇద్దరూ కూర్చున్నారు . భార్గవుడు  విజయపు మందహాసమును చిందిస్తూ , " ఆచార్యులవారు నేనిప్పుడు వచ్చినది ఎందుకో చెప్పగలరా ? " అని అడిగాడు . 

ఆచార్యులు అదే రీతిలోనే , అయితే వినయాన్ని వీడని నవ్వు నవ్వుతూ , " మీరు చెబితే తెలుసుకుంటాను , నిజానికి నేనే రావాలనుకున్నాను. అంతలో మీరే వచ్చినారు . మొదట మీరు చెప్పాలనుకున్నది చెప్పండి , తర్వాత నేను చెప్పాల్సినది చెపుతాను . " అన్నాడు

భార్గవుడు చెప్పదొడగినాడు , " ఈ పొద్దున్నే అన్ని కర్మలనూ ముగించుకుని ఎప్పటివలె రాజ భవంతికి వెళ్ళినాను . అక్కడి కార్యాలన్నీ అయిన పిదప , మహారాజా వారు ఏకాంతములో ఏదో లోకాభిరామాయణము మాట్లాడుతూ కూర్చున్నారు . నేనపుడు సమయము చూసి వారికి ఎరుక పరచినాను , ’ మన ఆచార్యుల ఇంట సీమంతము జరగవలసియున్నది , రాజ భవంతి నుండీ , తమరి గౌరవానికీ , వారి గౌరవానికి తగినట్లు ఏదైనా చేసిన బాగుండును . " అన్నాను . వారు , ’ మాకు తెలియనే లేదే ? ’ అని ఆశ్చర్యపడినారు . " ఆచార్యుల స్వభావము తమ సన్నిధానమునకు పరిచితము కానిదేమి కాదు . వారు నిత్య తృప్తులు . ఏమి కావలెనన్ననూ , ఉన్నదాంట్లోనే జరగనీ , కావాలన్న దేవుడే ఇచ్చి అన్నీ జరిపించనీ అంటారు . కాని మాకు అలాగుండుటకు సాధ్యము కాదు. " అన్నాను . వెంటనే మహారాజుగారు , ’ నూరు నిష్కములు , పది మూటలు బియ్యము , దానికి తగిన సంభారములు  అన్నీ పంపించవలెను అని అనుమతి నిచ్చినారు . అవన్నీ ఈ దినమో రేపో వస్తాయి . వచ్చినపుడు , ’ ఇవన్నీ మాకెందుకు ? " అని ఎక్కడ వెనుకకు తిరిగి పంపిస్తారో , అటుల చేయవద్దని చెప్పడానికే వచ్చినాను . మీకు సమ్మతమే కదా ? నేను చేసినదాంట్లో తప్పేమీ లేదు కదా ? " 

ఆచార్యులు నవ్వేసినారు . " ఇప్పుడిది సరే పోయింది . నేను సీమంతాన్ని ఆడంబరంగా చేయాలా లేక , వైదిక కర్మ కదా , దాన్ని నిరాడంబరంగా చేయాలా అని ఆలోచిస్తున్నాను . ఇక ఇప్పుడు రాజ సహాయము సమకూరినందు వల్ల ఆడంబరముగానే చేయవలెనన్నట్లే కదా ? సరే లెండి , అలాగే చేద్దాము . " అన్నాడు . 

భార్గవుడు మరలా అన్నాడు , " మీరు ఒక ఆశ్రమమును కట్టుకొని యుంటే ఆ మాటే వేరు . అప్పుడు నేను మీ ఆశ్రమవాసులంతా చేరి అయినంత సులభముగా నెరవేర్చుకోండి అని చెప్పేవాడిని . కానీ మీరు ఇలా రాజధాని లోనే అగ్రహారీకులు గా ఉంటూ ఏదో పేదవాడి వలె మీకు తగినట్లు మీరు ఆ ఉత్సవాన్ని ఆచరిస్తే , మేమంతా తల దించుకోవలసి వస్తుంది . రాజ భవనపు వైభవముతో కాకున్నా , తమ అంతస్తుకు తగ్గట్టు గౌరవముగా  అయినా కావద్దా ? వైదీక కర్మ , లోకాడంబరమెందుకు  అంటారేమో ? మనుష్యుడు ఉత్సవ ప్రియుడు . వాడు ఏపని చేసినా డోలు వాయించినట్టు పదిమందికీ తెలియవలెను . వేదములోనే చెప్పలేదా , ’ బృహద్వదేమ విదథే సువీరాః ’ --సరైన సంతానము కోసము గట్టిగా మంత్రము చెప్పి యజ్ఞము చేయవలెను అని ? కాబట్టి , నేను చెప్పినట్లే చేయండి . " 

ఆచార్యులు భార్గవుని మాట ఒప్పుకున్నట్లు ముఖ ముద్రతోనే సూచిస్తూ , " రాజ పురోహితులు శ్రీ భార్గవ భట్టు గారు ఆదేశిస్తుండగా , నేను కాదనుటకు అగునా ? అయితే , సీమంతములో మేము చేయవలసిన క్రియలన్నీ అప్పుడే సాంగముగా జరిగినాయి . అందుకే , సీమంతము కేవలము ఔపచారికమే కదా , చేయాలా వద్దా అని ఆలోచించు చుండినది . అందువలననే మీరు వచ్చినపుడు అన్యమనస్కముగా ఉండినది . " అన్నాడు . 

" అలాగంటే ? " 

ఆ వేళకు శిష్యుడు వచ్చి , ఒక మేజాను తీసుకొని వచ్చి , దాని పైన మడి ధావళులను  ఒక చెంబు గోరు వెచ్చని నీటిని తెచ్చి పెట్టినాడు .ఆచార్యుడు , ’ మొదట ఈ పని కానివ్వండి , పిమ్మట అంతా చెబుతాను " అని వారిని తొందర పెట్టారు . భార్గవుడు అక్కడే బచ్చలిలో కాళ్ళు చేతులు కడుక్కుని , మడి ధావళి నొకదాన్ని కట్టుకొని , ఇంకో దాన్ని కప్పుకుని , ఆ వేళకు వచ్చిన ఫలహారాన్ని స్వీకరించినాడు . ఆచార్యునికి కూడా రాజ పురోహితుని బలవంతము పైన అటుకుల పులిహోర ఫలహారమైనది . ఇద్దరూ వేడి పాలను సేవించినారు . మరలా మాటలు మొదలయ్యాయి . 

ఆచార్యుడు కిందటి రాత్రి జరిగినదంతా చెప్పినాడు . " చూడండి , భార్గవా , నేను నాకన్నా ప్రబలుడైన పుత్రుడిని పొందవలెను అని హోమ హవనములను చేసినది నిజమే , కానీ నిన్న దర్శనమైనట్లు , పుట్టబోవు వాడు బ్రహ్మజ్ఞానియైతే ఏమి గతి ? యజ్ఞవల్క్య అని ప్రసిద్ధి పొందిన మా వంశము ఏమవుతుంది ? నాకిదే యోచన అయిపోయింది " అన్నాడు . 

" వదిలేయండి  , దీనికింత యోచన యెందుకు ? మిథిలా నగరములో ఉన్నారు . విద్య ఉన్నదంతా కురు , పాంచాల , కాశీ ప్రదేశములయితే , ఆ విద్యకు గౌరవమున్నది మన జనక మహారాజుల వారి వద్ద . ’ యథా రాజా తథా ప్రజాః ’ మీరు కర్మ విద్యలో పొందిన పేరును మీ కుమారుడు బ్రహ్మవిద్యలో పొందితే మీకు ఇష్ట సిద్ధి యైనట్లే కదా ? " 

" అలాగని నాకున్న జ్ఞానమంతా మట్టిపాలు కావలెనా ? నేను సంపాదించినదంతా వ్యర్థము కావలెనా ? " 

" ఆ మాటెలా వచ్చింది ? బ్రహ్మవాదులు , అన్ని విద్యలకూ మూలస్థానము మన బ్రహ్మవిద్య అనేకదా చెప్పుకుంటారు ? ఒకవేళ మీ పుత్రుడు కర్మ విద్యను వదిలేస్తేనో  అంటున్నారు  , ఉపనయన సమయములో మహా యజ్ఞముల నన్నిటినీ చేస్తానని వాడిచేత ప్రమాణము చేయించండి . అవన్నీ చేసేటప్పటికి ఏమవుతుందో చూద్దాము . " 

దేవరాతుడికి అది సమ్మతమైనది . " అలాగే చేయవలెను , ఇక వేరే దారి లేదు ’ అని నోటినుంచీ మాట కూడా వచ్చింది . 

" ఆచార్యా , ఏదో జీవము వచ్చి ప్రవేశించినది , ఇంకేమిలే అని సీమంతాన్ని వదలివేయకండి . సీమంతమును చేయండి . గర్భిణికి  పాపిడి తీసి , వీణానాద పూర్వకముగా మంత్రమును ఉచ్చరిస్తే , ఆ నాదము తరంగ తరంగములుగా గర్భిణి యొక్క గర్భాన్ని చేరి , అక్కడున్న పిండమునకు చేతనము కలిగి , వైదీకమవుతుంది . ఆ పిండము శిశువై బయటికి వచ్చిన తర్వాత ఆ శిశువు బుద్ధి వైదీక మార్గములోనే నడుచును . మీరిక యోచించవలదు . " 

ఆచార్యుడు తాను కిందటి రాత్రి చూసినది మరువలేదు , కానీ శాస్త్ర సమ్మతముగా పలుకుతున్న రాజ పురోహితుని మాటను తిరస్కరించలేక , " నిజము , నిజము , అట్లే కావలెను . సంస్కారములను వదలిన వారుంటారా ? సీమంతము చేసే తీరవలెను ," అన్నాడు . 

ఇంకొంత సేపు భార్గవుడు అలాగే అదీ ఇదీ మాట్లాడి  , బయలుదేరి వెళ్ళిపోయినాడు .

జీవితమంటే

 *ఇంతేకదా మనిషి జీవితమంటే..!*  


*#లతామంగేష్కర్_గారి_ఆఖరి_మాటలు...*


*లోకంలో మరణాన్ని మించిన సత్యం మరేది లేదు.* 


*అత్యంత విలువైన బ్రాండెడ్‌ కార్లు నా ఇంటి గేరేజ్‌లో ఉన్నాయి. నేను చక్రాల కుర్చీలో తిరుగుతున్నాను.*


*విలువైన వస్త్రాలు, విలువైన అలంకార సాధనాలు, విలువైన రకరకాల పాద రక్షలు అమూల్యమైన వస్తువులన్నీ నా ఇంట్లో పడి వున్నాయి. కాని ఆస్పత్రిలో వారు ఇచ్చిన చిన్న గౌన్ వేసుకుని వున్నాను.* 


*నా బ్యాంకు అక్కౌంట్ లో డబ్బు చాలానే వుంది. కాని నాకు ఏదీ ఉపయోగం లేదు ఇప్పుడు.*


*నా ఇల్లు ఒక రాజభవనంలా వుంది. కాని నేను ఆస్పత్రిలో ఒక చిన్న బెడ్‌ మీద వున్నాను.* 


*ప్రపంచంలో వున్న ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నింటికి ప్రయాణం చేసేదాన్ని. ఆస్పత్రిలో ఆ టెస్టుకి ఈ టెస్టుకీ లేబ్‌లకు మారి మారీ వెళుతున్నాను.* 


*ఆనాడు నిత్యం శిరోజాలంకరణలవారు వచ్చి శిరోజాలు అలంకరించేవారు. ఈనాడు నాకు శిరసు పై శిరోజాలే లేవు.*


*ప్రసిద్ధి చెందిన హోటల్స్ లోని ఆహారం తింటూ వుండేదానిని. కాని ఈనాడు పగలు రెండు మాత్రలు, రాత్రి ఒక చిటికెడు ఉప్పు ...*


*ప్రత్యేక జెట్ విమానాల్లో ప్రపంచం అంతా తిరిగేదాన్ని. కాని నేడు ఆస్పత్రి వరండా దాకా వెళ్ళడానికి ఇద్దరు అటెండర్‌లు సాయం చేస్తున్నారు.* 


*ఏ సంపదా, వసతులు ఏవీ నాకు సహాయ పడలేదు. ఏ విధమైన ఓదార్పునివ్వ లేదు కాని కొంతమంది ఆత్మీయుల ఆత్మీయత, ఆప్యాయత, వారి ప్రార్ధనలు…. నాకు జీవం పోస్తున్నాయి.*


*ఇంతేనండి ఈ జీవితం…*

*ఎవరికీ సహాయం చేయలేని ధనం, పదవి వున్న వారికే విలువ ఇవ్వకండి. మంచి మనసు వున్న వారికి విలువనిచ్చి ,స్నేహం, ఆప్యాయత, ప్రేమను చూపించండి..!*


🙏*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

విశ్వ చేతనము

 *వ్యాస వాఙ్మయము - విశ్వ చేతనము*


మహాభారతము- అనుశాసన పర్వము- దానధర్మ ఉపపర్వము...


మార్కండేయ - నారదర్షి సంవాదము;


*మా -* సజ్జనులతో సంభాషణము వలన ప్రయోజనము ఏమిటి?

*నా -* ధర్మాచారముల పట్ల శ్రద్ధ


*మా -* కలియుగానికి ఉన్న మఱియొక పేరేమిటి?

*నా -* నాలుగవ యుగము పేరు నందికము


*మా -* నియమ రహితంగా చేసే దానఫలము ఎవరికి అందుతుంది?

*నా -* అసుర, రాక్షస, ప్రేత, భూతములకు


*మా -* కన్యాపూజ ఎందుకు చేయాలి?

*నా -* కన్యలలో లక్ష్మీదేవి నిత్య నివాసినిగా ఉంటుంది కనుక...


*మా -* పతివ్రత గొప్పదనము ఏమిటి?

*నా -* గృహలక్ష్మి, గృహపుష్టి, గృహ ప్రతిష్ఠలకు ఆధారము పతివ్రతయే


*మా -* మనిషి శరీరంలో ఉన్న ఐదు తీర్థాలు ఏమిటి?

*నా -* దేవతీర్థము, ఋషితీర్థము, పితృతీర్థము, బ్రహ్మతీర్థము, విష్ణుతీర్థము


*మా -* ఆ తీర్థాల స్థానాలు ఎక్కడ?

*నా -* వ్రేళ్ళ చివరన దేవతీర్థము,

  చిటికెన వేలు ఉంగరపువ్రేలు మధ్యన ఋషితీర్థము,

  బొటనవ్రేలు ౘూపుడువ్రేలు నడుమ పితృతీర్థము,

  బొటనవ్రేలి చివరన బ్రహ్మతీర్థము, 

  అరచేతి మధ్యన విష్ణుతీర్థము.


న్యాయ్యేన మార్గేణ స్వస్తి ప్రజాభ్యః...

क्रीडावार्ताः

 सन्भाषण संस्कृतम्

(वार्तावाहिनी)


अद्यतन संस्कृतवार्ताः श्रावयितुं भवतां पुरतः उपस्थितः अस्ति डाक्टर् राजेन्द्रप्रसादः


ह्यः आरभ्य तॆलङ्गाणा राज्ये  अत्यंतं महती वृष्टिहि पतंती अस्ति, अपिच भाविनिदिनेषु  अतिवृष्टिहि भविष्यति इति तॆलङ्गाणा वातावरणशाखा जनान् उद्दिश्य सूचनाः दत्तवती आसीत्,  


सातत्यवर्ष कारणेन तॆलङ्गाणा राज्ये स्थिताः नद्यः, सरांसि, कूपाः,  गर्ताः च वर्षजलेन पूरिताः आसन्। सर्वाणि नगराणि  जलमयानि जातानि च 


अतिवृष्टिकारणेन तॆलङ्गाणा राजधान्यां,  भाग्यनगरे वीथयः, सङ्कुचितमार्गाः, प्रधानमार्गाः, निम्नस्थलानिच, सर्वाणि अपि जलमयानि जातानि, पादचाराः, वाहनचालकाः, लोकयानचालकाः, कार् यान चालकाः द्विचक्र वाहन चालकाः, त्रिचक्र वाहन चालकाः, चतुश्चक्र वाहन चालकाः च नाना विधानि कष्टानि अनुभवन्तः संति।


प्रभुत्वस्य अधिकारिणः  मत्स्यकार ग्रहीतॄन् आदिष्टवन्तः,  यत् मत्स्यान्  ग्रहीतुं नद्यां मा प्रविशंतु इति।


अद्य वेदान्तवर्थिनी संस्कृतकलाशालायां संस्कृतभाषा पूर्वविद्यार्धि-सम्मेलनं प्रातः नव वादनतः सायं पञ्चवादन पर्यन्तं भवति इति, संस्कृतभाषा प्राचार्यः श्री उपेन्द्रमहोदयः सम्भाषण संस्कृतं वार्तावाहिन्याः सञ्चालकं राजेन्द्रप्रसादं प्रति असूचयत्, 


अस्मिन् कार्यक्रमे भागं ग्रहीतुं भारतस्य राजधानीदेहलीतः अहम् आगतः अस्मि इति डाक्टर् उपेन्द्रमहोदयः असूचयत्, अयं महोदयः देहली राज्ये,  उद्योगं कुर्वन्, तॆलङ्गाणा राज्ये संस्कृतभाषा विश्वविद्यालयस्य निर्माणं भवतु, तदर्थं तॆलङगाणा प्रजाः, छात्राः संस्कृतभाषा अभिमानिनः, गुरवः च प्रयत्नं कुर्वन्तु इति,  तॆलङ्गाणा जनान् छात्रान् च, उद्दिश्य  बहुवारम् उद्बोधितवान् आसीत्, 


परिगि, विकाराबाद् जिल्लायां, शासनसभ्यस्य, केन्द्र कार्यालये,  स्थानिकनायकैः सह  शासनसभ्यः डाक्टर्, टि राम्मोहन् रॆड्डि वर्यः,  षड् विंशति, योग्येभ्यः जनेभ्यः कळ्याणलक्ष्मी षादीमुबारक् वित्तपत्राणि वितीर्णवान्, निर्धनकुटुम्ब, महिळानां  विवाहाय, कळ्याणाय, मङ्गळसूत्रं क्रेतुं, विवाहकर्माणि च आचरितुं , कर्तुं, कारयितुं च   कळ्याणलक्ष्मी षादीमुबारक् पथकद्वयं अत्यन्तम् उपकुर्वत् अस्ति इति अभिवर्णितवान्,


सातत्यम् अतिवृष्टिः जायमाना अस्ति इति कारणेन सर्वत्र प्रजाः अप्रमत्तेन भवेयुः इति, व्यवसाय सहकारसङ्घस्य निर्देशकः नीलवर्धन् रॆड्डि, एकस्मिन् प्रकटने असूचयत्, 


शनिवासरे गिरिजन आर्थिक संक्षेम सहकार संस्थायाः अध्यक्षरूपेण चितं, बॆल्ला नायक महोदयं कांग्रॆस् दलीयस्य मुख्यनायकाः  वेणुगोपालः, चिट्टॆं प्रणीत् कुमारः तदितराः अभिनंदितवन्तः, अभ्यनन्दन् च 


पूर्वं सकलविधमानवाः संस्कृतेन वदंति स्म इति,  सामान्यप्रजाः सकलविधप्रजाः संस्कृतमाध्यमेन एव सकलविधानि शास्त्राणि संस्कृतभाषा गुरवः पाठितवन्तः इति, अतः एव पूर्वं  रामः कृष्णः , वाल्मीकिः, वेदव्यासः  इत्यादि विश्वप्रसिद्धाः नायकाः कवयः प्रादुर्भूताः अभवन् इति वैद्यः - राजेन्द्रप्रसादः संस्कृतभाषा तरगत्याम् छात्रान् असूचयत्, 


प्रमाणानि अपि दर्शितवान्, 


पुनः संस्कृतभाषां जनभाषां कुर्मः इति छात्रान् उद्दिश्य उद्बोधितवान्।


क्रीडावार्ताः, 


तॆलङ्गाणा राज्ये अति वर्षाणाम् कारणेन  क्रिकॆट् क्रीडायाः अधिकारिणः प्रभुत्वक्रीडाङ्गणेषु क्रिकॆट् क्रीडाः व्याक्षिप्तं कृतवन्तः, 


टॆस्ट् क्रिकॆट् चरित्रायां प्रप्रथमवारं बङ्ग्लादेशस्य हस्ते पाकिस्तान् क्रिकॆट् गणः पराजितः अभवत्, द्वितीयदिने अपि अधिकान् अङ्कान् साधयितुम् पाकिस्तान् क्रिकॆट् गणः अशक्तः  अभवत्, 


इति संस्कृतवार्ताः

वैद्यः राजेन्द्रप्रसादः

फोन् पे नॆं ९८४९६४१८९२

తిలకము ఎందుకు

 



*తిలకము లేదా బొట్టు ఎందుకు ధరించాలి?* 

*తిలకము ధరించుట ఆచారమా? శాస్త్రీయమా... ?*


*మానవ శరీరము లో 7200 నాడులు వున్నవని స్వర శాస్త్ర మంజరి, కుండలిని ఉపనిషత్, యోగోపనిషత్, దర్శనోపనిషత్ వంటి అనేక శాస్త్రములు చెబుతున్నాయి. అందులో ముఖ్యమైనవి "ఇడ" నాడి (ఎడమ నాసాగ్రములో) మరియు "పింగళ" నాడి (కుడి నాసాగ్రము లో). వీటినే చంద్ర, సూర్య నాడులు అంటారు. రెండు కనుబొమ్మలకు మధ్య నుదుటి భాగములో "ఇడ" మరియు "పింగళ" అను రెండు నాడులు కలిసి "సుషుమ్" నాడిగా పరివర్తనము చెందుతుంది.ఈ రెండు నాడుల ఉద్దీపనమును "కుండలినీ" అని పేరు. ఈ స్థలములో తిలకము ధరించడం వలన కుండలినీ శక్తి జాగృతం అవుతుంది. ఈ శక్తి నాడుల ద్వారా మానవ శరీరమందలి అన్ని భాగములకు ప్రాణ శక్తిని అందిస్తుంది.*


*సైన్స్ ప్రకారము మెదడులో గల భాగములలో ఎడమ భాగమునకు కుడి నాసాగ్రము (పింగళ నాడి) తోను, కుడి భాగమునకు ఎడమ నాసాగ్రము (ఇడ నాడి) తోను సంబంధము కలదు. మెడికల్ టర్మ్ లో చెప్పాలంటే సింపతటిక్, పరాసింపతటిక్ అండ్ సెంట్రల్ నెర్వస్ సిస్టమ్. కావున ఇడ-పింగళ నాడుల మధ్య తిలకము ధరించడం వలన మెదడులోని ప్రతీ కణమునకు కలుపబడిన నాడుల వల్ల శరీరములోని అన్ని భాగములకు ప్రాణ శక్తి అందించబడుతుంది.అందుకే నుదుట తిలకధారణం చేయాలి. అంతేకాకుండ లలాటానికి సూర్య కిరణాలు తాకకూడదు. అందుచేత కూడా లలాటంలో తిలకం ధరించాలి...*


https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

ధ్వజస్తంభాలు

 *జై శ్రీరామ్* 🙏🏻🙏🙏🏼


#ఈ చిత్రం వృత్తాంతం  ఎంత మందికి తెలుసు?

దేవాలయాల ముందు ధ్వజస్తంభాలు ఎందుకు ఉంటాయో తెలుసా?


#చిత్ర కథ :


అశ్వమేధ యాగం సంధర్బంగా తామ్రధ్వజునితో పోరాడుతున్న అర్జునుడి కథాసారం నుండి ఒక దృశ్యం.....


మణిపుర పాలకుడు, మయూర ధ్వజుడు. వీరు మహా పరాక్రమవంతుడు, గొప్ప దానశీలి. . మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు.


మయూర ధ్వజుడు  పాండవుల యాగాశ్వమును బంధిస్తాడు. ఆగ్రహించిన పాండు కుమారులు   అర్జునుడు భీముడు సహదేవుడు  మయూర ధ్వజనితో యుద్ధానికి దిగుతారు.తనతో యుద్ధం చేసిన నకుల సహదేవ భీమార్జునుల్ని మయూరధ్వజుడు  ఓడిస్తాడు. పట్టు వదలని పాండు కుమారులు  ఆగ్రహోదగృలై ఉంటారు 


తన తమ్ముళ్ళు ఓడిపోయిన విషయం తెలిసిన ధర్మరాజు స్వయంగా మణిపురం వైపు బయలుదేరతాడు. అది గ్రహించిన కృష్ణుడు ధర్మరాజును వారిస్తాడు. మయూరధ్వజుణ్ణి జయించేందుకు ఒక కపటోపాయాన్ని చెబుతాడు. 


 పన్నాగం ప్రకారం   శ్రీకృష్ణుడు, ధర్మరాజులిద్దరూ వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరుకుంటారు.. అతిథులను  చూసిన మయూరధ్వజుడు వారికి ఆహ్వానం పలికి ,  దానం ఇవ్వదలచి,  ఏమి కావాలో కోరుకో మంటాడు.


అందుకు శ్రీకృష్ణుడు కల్పించుకుంటూ  " మహారాజా! మేము తమరి దర్శనార్ధమై బయలుదేరి వస్తుంటే.... అరణ్య మార్గంలో   ఒక మృగరాజు దురదృష్టవశాత్తు

ఇతడి కుమారుడిపై  దాడి  చేసింది.  ఈ హఠాత్పరిణామానికి  మేము మిక్కిలి చింతిస్తూ.... అన్యం పుణ్యం ఎరుగని  బాలుడిని విడిచిపెట్టవలసిందని మృగరాజును ప్రార్థించాము. అప్పుడా మృగరాజు  విచిత్రంగా మానవ భాషలో  మాట్లాడుతూ.... " ఈ బాలుడు  మీకు దక్కాలంటే  మణిపుర రాజ్యాధిపతి మయూరధ్వజుని శరీరంలో సగభాగం నాకు ఆహారంగా  ఇప్పించండి " అని కోరుకుంది . దానకర్ణులైన  ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరమున సగభాగం దానమిచ్చిన  యెడల  ఆ పసి బాలుడిని .... భవిష్యత్తు ఉన్న బాలుడిని కాపాడుకున్న వారిని అవుతాము... " అని హృద్యంగా  చెప్పుకుపోయాడు .


ఆ మాటలు విని మయూరధ్వజుడు  ఏ మాత్రం వెనక ముందు ఆలోచించనివాడై  తన శరీరాన్ని బాలుడి ప్రాణాల్ని రక్షించడం  కోసం   దానం ఇచ్చేందుకు ఒప్పుకుంటాడు.


అప్పుడు శ్రీకృష్ణుడు... " తమరి భార్యాపుత్రులే మీ శరీరాన్ని  స్వయంగా కోసి ఇవ్వాల్సింది " అనే నియమాన్ని కూడా విధిస్తాడు. అందుకు కూడా మయూరి ధ్వజుడు వెనకడుగు వేయకుండా, అతిథిదేవోభవ  అని గౌరవిస్తూ,  తన శరీరాన్ని తన భార్య సుతులే స్వయంగా ఖండించేందుకు తగిన ఏర్పాట్లు చేయించి, భార్యాసుతుల్ని రప్పించి , త్యాగానికి సిద్ధమై కూర్చుంటాడు . మయూరధ్వజుడి  భార్య పిల్లలు  గుండె నిబ్బరం చేసుకుని ఆదేశించిన కార్యానికి  కుడి దిశ  నుండి సిద్ధమవుతారు.


 దానధర్మాలో గొప్పవాడైన ధర్మరాజు, మయూరధ్వజుని దాన గుణానికి   నివ్వెర పోతాడు.

ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు రావటం  ధర్మరాజు గమనిస్తాడు . అందుకు వెంటనే స్పందిస్తూ....

"తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు " అంటాడు

అందుకు మయూరధ్వజుడు  కూడా వెంటనే స్పందిస్తూ  .....

" మహత్మా ! తమరు పొరబడుతున్నారు.  నేను చింతిస్తూ బాధపడుతూ  వేదన చెందుతూ  నా శరీరాన్ని  మీకు దానంగా ఇవ్వడం లేదు . నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది. ఆ భాగ్యం నాకు కలుగలేదు కదా అని ఎడమ నేత్రం మిగుల బాధపడుతున్నది " అంటూ వివరిస్తాడు.


 అది విని కృష్ణుడు, ధర్మరాజు,  మిక్కిలి ఆశ్చర్యపోతారు. మయూరధ్వజుని దానశీలతకు 

ఉప్పొంగి పోతారు. వెంటనే తమ నిజరూపాన్ని ప్రదర్శిస్తారు.

" నీ దానశీలతకు మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో " అంటూ మయూరిధ్వజుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు.

 మహానుభావుల నిజరూపాలు చూసి  మయూరధ్వజుడు వుక్కిరిబిక్కిరవుతూ 

 "పరమాత్మా! నా ఈ శరీరం అశాశ్వతమైనది.. కార్యక్రమం లో ఈ శరీరం  నశించినా,   నా ఆత్మ పరోపకారార్ధం ఉపయోగపడేలా.... నిత్యం మీ ముందుండేలా....దీవించండి" అని హస్తాలతో  ముకులళిత కోరుకుంటాడు . అందుకు శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తూ  ....


" మయూరధ్వజా!  తథాస్తు! నేటి నుండే భూలోకంలో  ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజ స్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ చీరంజీవియై....నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. 

పరోపకారార్థం నీవు ప్రకాశిస్తావు....

ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మసఫలం అవుతుంది.  నీ శిరస్సున వుంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపుతుంది..... " అంటూ అనుగ్రహిస్తాడు.


అందుకే ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజ స్తంభాలు విధిగా ప్రతిష్టించడం ఆచారమయింది. కాగా ఇంతటి గొప్ప దానశీలి త్యాగమూర్తి అయిన మయూరధ్వజుని పేరుతో నెలకొల్పిన ధ్వజస్థంభాల నీడ కూడా తమ ఇళ్ళపై పడకూడదని చెప్పటం ఆ మహనీయుని పట్ల మన ప్రజలు చేసే అపచారం, ఇదొక మూఢ నమ్మకం.


#వివరణ : దాన గుణానికి జరిగిన  ఉద్దేశపూర్వక పరీక్ష ఈ వృత్తాంతం ! యాగశ్వాన్ని బంధించడం నుండి, అర్జునుడు భీముడు నకులుడు సహదేవుడు ఓడిపోవడం నుండి, జరిగిన సంఘటనలన్నీ మయూరధ్వజుని దాన గుణాన్ని నిరూపించడం కోసం  ఒక వ్యూహంగా కొనసాగినది.


 *అరుణాచల శివ* 🌹

పంచాంగం 01.09.2024 Sunday.

 ఈ రోజు పంచాంగం 01.09.2024 Sunday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం గ్రీష్మ ఋతు శ్రావణ మాస కృష్ణ పక్ష  చతర్దశి తిధి భాను వాసర: ఆశ్రేష నక్షత్రం పరిఘ యోగ: భద్ర తదుపరి శకుని కరణం. ఇది ఈరోజు పంచాంగం.


చతుర్దశి రా. తె 05:21 వరకు.

ఆశ్రేష రాత్రి 09:50 వరకు.


సూర్యోదయం : 06:06

సూర్యాస్తమయం : 06:26


వర్జ్యం : పగలు 09:38 నుండి  11:22 వరకు.


దుర్ముహూర్తం : సాయంత్రం 04:47 నుండి 05:37 వరకు.


అమృతఘడియలు : రాత్రి 08:05 నుండి 09:50 వరకు.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.



శుభోదయ:, నమస్కార:

తెలంగాణకు రెడ్ అలర్ట్*

 *🔊తెలంగాణకు రెడ్ అలర్ట్*


*🔶జారీచేసిన వాతావరణ శాఖ*


*🔷మరో 2 రోజులు భారీ వర్షాలు*


*🔶కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్*


*🔷అప్రమత్తంగా ఉండాలని ఆదేశం*


*🔶హైదరాబాద్ లో ఎల్లుండి స్కూళ్లకు సెలవు*


*🍥దిశ, హైదరాబాద్ బ్యూరో: తెలంగాణకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 48 గంటలు పాటు తెలంగాణలోని 9 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ముఖ్యంగా *భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది*. కాగా ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ సాయంత్రం వాయు గుండంగా మారింది. అది ఇవాళ అర్థరాత్రి కలింగపట్నం దగ్గర తీరం దాటనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో తీరం వెంబడి 45-65 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. *హైదరాబాద్ నగరంలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ రెడ్ ఎలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యగా సోమవారం హైద్రాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు ఆయన తెలిపారు.*

_సెప్టెంబరు 1, 2024_* 🌝

 ॐ 卐 ॐ 

🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏

 🌞 *_సెప్టెంబరు 1, 2024_* 🌝

*శ్రీ క్రోధి నామ సంవత్సరం*

*దక్షిణాయణం*

*వర్ష ఋతువు*

*శ్రావణ మాసం*

*కృష్ణ పక్షం*

🔔తిథి: *చతుర్దశి*

మర్నాడు తె4.52

🔯వారం: *భానువాసరే*

(ఆదివారం)

⭐నక్షత్రం: *ఆశ్రేష* రా10.45

✳️యోగం: *పరిఘము* రా7.53

🖐️కరణం: *భద్ర* సా4.25

*శకుని* తె4.52

😈వర్జ్యం: *ఉ10.53-12.35.*

💀దుర్ముహూర్తము: *సా4.33-5.23*

🥛అమృతకాలం: *రా9.03-10.45.*

👽రాహుకాలం: *సా4.30-4.00*

👺యమగండం: *మ12.00-1.30.*

🌞సూర్యరాశి: *సింహం*

🌝చంద్రరాశి: *కర్కాటకం*

🌄సూర్యోదయం: *5.48*

🌅సూర్యాస్తమయం: *6.15*

🔱 *మాస శివరాత్రి* 🔱

  లోకాః సమస్తాః* *సుఖినోభవంతు*

  *సర్వే జనాః సుఖినోభవంతు*

 ఇరగవరపు రాధాకృష్ణ🙏

నిద్రించకూడదు

 ఉత్తర , పడమర దిక్కులకు తల ఉంచి నిద్రించకూడదు అన్నవిషయానికి సంపూర్ణ వివరణ -


        రాత్రి సమయంలో పడుకునేప్పుడు శిరస్సు తూర్పుదిశగా ఉంచవలెను అనియు మరియు దక్షిణ దిశకు ఒక మాదిరిగా కొంచం మంచిది అని పెద్దవారు చెప్తారు అదేవిధంగా మనపురాణాలలో కూడా వ్రాయబడి ఉన్నది. తూర్పుదిశకు శిరస్సు ఉంచి శయనించువాడు ఆరోగ్యవంతుడు అనియు మార్కండేయ పురాణమున చెప్పబడి ఉంది. దీనికి సంబంధించిన కొన్ని విషయాలను సంపూర్ణంగా వివరిస్తాను.


            భూమి ఒక పెద్ద అయస్కాంతం . మాములు అయస్కాంతం చుట్టూ అయస్కాంతక్షేత్రం ఎలా ఉండునో భూమికి కూడా చుట్టూ అయస్కాంతక్షేత్రం 66,000 మైళ్ళ వరకు వ్యాపించి ఉండును. ఈ విశ్వం అండాండం అనియు మనశరీరంను పిండాండం అని జ్ఞానులు పిలుస్తారు . విశ్వములోని అన్నింటి ప్రభావం , శక్తి మన శరీరంలో కూడా ఉన్నది. అందుకనే ఈ రెండింటి మధ్య "లయ" తప్పకుండా కాపాడగలుగు శక్తి ఉన్న చాలా మానసిక రుగ్మతులకు ఔషధం దొరుకును .


            ఉత్తరదిక్కుకు ఆకర్షణ ( అయస్కాంత) శక్తి ఉన్నది. దిక్సూచిని ఏ దిక్కుకి తిప్పినను దాని ముల్లు ఉత్తరదిక్కుకు తిరుగును. ఈ ఆకర్షణ శక్తి మానవుని శిరస్సు మూలకంగా శరీరంపైన తన ప్రభావమును చూపించును. అయస్కాంతపు ఉత్తర ధ్రువమునకు రోగనిరోధక శక్తి అనగా క్రిమిరోగాల వంటి వానిని నాశనం చేసి కాపాడగల శక్తి ఉన్నదని దక్షిణధ్రువమునకు శక్తిని ప్రసాదించగల గుణమున్నది మన పురాణాలలో ఉన్నది. మానవుని శరీరం ఒక విద్యుచ్ఛక్తి కేంద్రం . శరీరముకు కావలసినంత విద్యుత్తు మాత్రమే శరీరంలో ఎల్లప్పుడూ ఉండును. శరీరం తనకి కావలసిన ఎలెక్ట్రిసిటీని ఎల్లప్పుడూ ఉత్పన్నం చేసుకొనుచూ బయటకి విసర్జించుచూ ఉండును.


         వాత్సాయన మహర్షి ప్రకారం శరీరం నందలి 24 కేంద్రాలలో ఈ పని జరుగును. ఈ 24 కేంద్రాలలో బ్రహ్మాండం అతిముఖ్యమైన కేంద్రం . బ్రహ్మాండం అనగా శిరస్సు నందలి పైభాగం . దీనినే పుణికి అని బ్రహ్మకపాలం అని అందురు. ఇది శరీరంలో విద్యుచ్చక్తి ఉత్పత్తికి మరియు బయటకి విసర్జనకు రెండింటికి కేంద్రమై ఉన్నది. మానవ శరీరంలో ఉత్పత్తి అయిన విద్యుత్ వెంట్రుకల చివరనుంచి చేతి గోళ్ల చివర నుంచి చర్మరంధ్రాల ద్వారా అత్యంత సూక్ష్మంగా బయటకి విసర్జించబడును.


       దాదాపు 1300 గ్రాముల బరువుగల మనవుని మెదడు దాదాపు 20 వాట్స్ విద్యుత్ శక్తిని వెలువరించును. మానవ హృదయము నుండి వెలువడు విద్యుత్ శక్తిని " వెక్టార్ " ద్వారా కొలుస్తారు. ఈ విద్యుత్ శక్తిని ఊపిరిని తమ ఆధీనంలో ఉంచగలుగుట ద్వారా ఆయుర్వృద్దిని పొందవచ్చును. యోగులు ఈవిధంగా ఉచ్చ్వాస , నిచ్చ్వాసాలను తమ అదుపులో ఉంచి జీవశక్తిని దాని పరిమాణాన్ని ప్రభావితం చేయగలిగేవారు.


            శిరస్సును ఉత్తరదిక్కుకు ఉంచి నిద్రించిన ఉత్తరదిక్కు నందు ఉన్న ఆకర్షణశక్తి వలన శరీరం నందలి విద్యుత్ శక్తి కొంత కోల్పోవును . ప్రతిదినం ఇట్లు జరుగుచుండడం వలన క్రమేణా శరీరం తన శక్తిని వర్ఛస్సును కోల్పోవును . విద్యుత్ కిరణములు మన పాదముల నుండి ప్రవహించి శిరస్సు నుండి వెలువడును. విద్యుత్ శక్తి ప్రవహించుచోట చల్లదనమును , వెలువడుచోట ఉష్ణం కలుగునని శాస్త్రవేత్తలు నిర్ధారించెను . కావున శిరస్సు నుండి విద్యుత్ శక్తి వెలువడుటచే శిరస్సు అత్యుష్ణమ్ చెంది తలభారం , బాధ , అలసట , నిస్సారం మొదలగునవి కలుగును. కొన్ని శరీరభాగాలు తమ క్రియను కోల్పోయి పక్షవాతం , తిమ్మిరి , నడుమునొప్పి మొదలగు వాతవ్యాధులు కలుగును. నరముల సంబంధ వ్యాధులు జనియించుటకు వీలు కలుగును. కావున దక్షిణదిశకు శిరము ఉంచి శయనించిన యెడల విద్యుత్ శక్తి పాదముల గుండా వెలువడుట వలన నష్టమేమి సంభవించదు. పార్థివ విద్యుత్ దక్షిణము నుండి ఉత్తరమునకు ప్రవహించును.


        ఇదేవిధముగా పడమట దిక్కు కూడా . ఇక్కడ సూర్యుడు అస్తమించుట చేత అతని ఆకర్షణశక్తి , మనుష్యుని నందలి విద్యుత్ శక్తిని ఆకర్షించును. సూర్యుడు ప్రపంచానికి కన్నువంటి వాడు. సర్వప్రాణులకు ఆధారభూతము , జగత్తును పోషించువాడు . సూర్యుని నుండి ప్రసరించు కిరణములు మనుష్యుని పై మంచి ప్రభావం చూపి దానితో శరీరం నందలి విద్యుత్ ని తన అధీనంలో ఉంచుకొనును. అందువలనే ఉత్తర దిశకు తల ఉంచి నిదురించిన ఎటువంటి పరిణామాలు కలుగునొ అటువంటి పరిణామాలే పడమర దిక్కుకి తల ఉంచి నిదురించిన కలుగును.


             సమాప్తం  


  

      మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


    గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

పంచ మాధవ క్షేత్రాలు

 *పంచ మాధవ క్షేత్రాలు.....*


*పుణ్య భూమి అయిన మన భరత ఖండంలో దేవతలరాజైన ఇంద్రుడి చేత నిర్మంచబడిన ప్రసిద్ధ మాధవ క్షేత్రాలే.. ఈ పంచ మాధవ క్షేత్రాలు.. ఇవే...*


*1) బిందు మాధవ ఆలయం - వారణాసి*

*2) వేణీ మాధవ ఆలయం - ప్రయాగ*

*3) కుంతీ మాధవ ఆలయం - పిఠాపురం*

*4) సేతు మాధవ ఆలయం - రామేశ్వరం*

*5) సుందర మాధవ ఆలయం - తిరువనంతపురం.*


*ఈ క్షేత్రాల స్థాపన వెనుక వున్న ప్రసిద్ధ పురాణ గాథ ఏమిటంటే...*


*బ్రహ్మ కుమారుడైన ప్రజాపతి త్వష్టకు విశ్వరూపుడనే కుమారుడు జన్మించాడు. విశ్వరూపుడికి మూడు తలలు ఉండేవి మరియు ఇతడు మహాబలశాలి. ఒకరోజు ఇంద్రుడు సభ తీర్చి ఉండగా దేవతల గురువు అయిన బృహస్పతి అక్కడకు వస్తాడు. అందరి వద్ద పూజలు అందుకొంటున్న ఇంద్రుడు తన గురువు వస్తే లేచి గౌరవించకుండా ఉదాసీనంగా ఉంటాడు. ఆ విధంగా అగౌరవించబడ్డ బృహస్పతి ఖిన్నుడై తన గృహానికి వెళ్తాడు. ఆ తరువాత ఇంద్రుడు తాను చేసిన తప్పును గ్రహించి బృహస్పతి ఇంటికి బయలుదేరుతాడు. ఇంద్రుడు తన ఇంటికి వస్తున్నాడని గ్రహించి బృహస్పతి ఇంద్రునికి కనిపించకుండా అంతర్థానమౌతాడు. ఇంద్రునికి బృహస్పతి అనుగ్రహం తప్పిందని అసురులకు తెలిసి, అసురులు శుక్రాచార్యుల అనుగ్రహంతో యుద్ధం ప్రకటించి ఇంద్రాదులను ఓడించి స్వర్గం నుండి తరుముతారు. అప్పుడు ఇంద్రుడు ఏమి చేయాలో తోచక బ్రహ్మ వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతం చెబుతాడు.*


*అప్పుడు బ్రహ్మ విషయాన్ని గ్రహించి ఇంద్రునితో వారికి గురువు అవసరం ఉందని చెప్పి, త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుని వద్దకు వెళ్ళి గురువుగా ఉండమని అర్థించమని చెబుతాడు. విశ్వరూపుడు చాల పిన్నవయస్సులో ఎన్నో యాగాలు చేసి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాడు. ఇంద్రుడు బ్రహ్మ సూచన ప్రకారం విశ్వరూపుని వద్దకు వెళ్ళి గురుస్థానాన్ని తీసుకోవలసిందిగా, తమకు స్వర్గం లభించే మార్గం ప్రసాదించి, ఆ స్వర్గ సుఖాలు ఆనందించమని కోరుతాడు. విశ్వరూపునికి మూడు ముఖాలు ఉంటాయి. ఆయన ఒక ముఖంతో హవిస్సు ఇచ్చినప్పుడు అన్నం తింటాడు. మరో ముఖంతో సురాపానం చేస్తాడు. మూడో ముఖంతో సోమరసం త్రాగుతాడు.*


*యజ్ఞాలలో విశ్వరూపుడు మొదట తనకు తరతమ భేదం ఉండదని, బ్రహ్మజ్ఞానం కలవాడినని, తాను తన జీవనం పొలంలో పడిపోయిన ఒడ్లు ఏరుకొని జీవనం చేస్తుంటానని అంటాడు. "నేను మీ కోరిక మన్నించి నేను గురుత్వం వహించి మీకు పౌరోహిత్యం చేస్తే, మీ కోరికల కొరకు నేను యజ్ఞాలు చేస్తే నా బ్రహ్మ తేజస్సు తగ్గిపోతుంది" అని అనగా, ఇంద్రాదులు, విశ్వరూపుని మరింత వేడుకోగా వారి కోరిక మన్నించి గురుత్వం వహిస్తాడు. తరువాత అసురుల సామర్థ్యాన్ని అంచనా వేసి, ఇంద్రుడికి నారాయణ కవచం ఉపదేశం చేశారు విశ్వరూపుడు.*


*నారాయణ కవచం విశేషం చెబుతూ ఒకప్పుడు కౌశికుడు అనే బ్రాహ్మణుడు నారాయణ కవచాన్ని అనునిత్యం పఠిస్తూ ఒక ఎడారిలో ప్రాణాలు విడిచి పెట్టేశాడు. నారాయణ కవచం తేజస్సు అస్థికలను పాతేసింది. ఆ విధంగా ప్రాణాలు విడిచిన కౌశికుడు అస్థిపంజరం ఎడారిలో పడి ఉండిపోయింది. ఒకరోజు చిత్రవధుడు అనే గంధర్వుడు భార్యలతో కలిసి ఆకాశమార్గంలో విమానంలో ఆ మార్గం గుండా వెళ్తుండగా విమానం అక్కడి వరకు వచ్చి కౌశికుడి అస్థికలు ఉన్న ప్రదేశం వద్ద ఆగిఫొయింది. విమానం క్రింద పడిపోయింది. అప్పుడు గంధర్వుడు భార్యలతో బయట పడిపోయాడు.*


*అప్పుడు వాలకీయుడు అనే మహర్షి అక్కడకు వచ్చి చిత్రవధుడికి కౌశికుడి వృత్తాంతం తెలిపి నారాయణ కవచం ప్రభావం వల్ల విమానం ఆగిపోయిందని, ఆ అస్థికలను సరస్వతీ నదిలో నిమర్జనం చేసి ఆచమానం చేస్తే విమానం కదులుతుందని తెలిపి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆ మహర్షి. చిత్రవధుడు వాలకీయుడు చెప్పినట్లు చేస్తే విమానం ముందుకు కదిలిందని విశ్వరూపుడు నారాయణ కవచ మహత్యాన్ని తెలుపుతూ ఇంద్రునికి నారాయణ కవచాన్ని ఉపదేశిస్తాడు. నారాయణ కవచ ప్రభావంతో ఇంద్రుడు అసురులపైకి దండెత్తి అమరావతిని స్వాధీనం చేసుకొన్నాడు. ఇంద్రుడు విశ్వరూపుడితో అమరావతిలొ ఉన్న భాగ్యాలు ఆనందించమని చెబితే విశ్వరూపుడు.. గురువులకు శిష్యులే ధనం అని చెబుతాడు. విశ్వరూపుడు యజ్ఞాలలొ హవిస్సులు తీసుకొని అని ఇంద్రాదులకు ఇస్తుండేవాడు.*


*విశ్వరూపుడు తల్లి రచన రాక్షస వంశానికి చెందినది. అందుచేత అసురులు విశ్వరూపుని వద్దకు వెళ్ళి అసురులకు మేనమామ అయిన విశ్వరూపుడిని, యజ్ఞాలలొ హవిస్సులను ఇంద్రుడికి తెలియకుండ తమకు ఇవ్వమని కోరుతారు. బ్రహ్మ జ్ఞానం కలిగి తరతమ భేదాలు లేని విశ్వరూపుడు రాక్షసులు కోరిన విధంగా ఆ హవిస్సులలొ కొంత భాగం రాక్షసులకు ఇస్తుండేవాడు. కొద్దిరోజుల తరువాత ఇంద్రుడికి ఆ విషయం తెలుస్తుంది. అప్పుడు ఇంద్రుడు యుక్తాయుక్త విచక్షణ విడిచి తన వద్దనున్న చంద్రహాసంతో విశ్వరూపుని మూడు శిరస్సులను నరికి వేస్తాడు. సురాపానం చేసే శిరస్సు ఆడాపిచుకగా మారి పోయింది, సోమపానం చేసే శిరస్సు కౌజు పక్షిగా మారిపోయింది. అన్నం తినే శిరస్సు తిత్తిరి పిట్టగా మారిపోయింది. ఆ మూడు పక్షులు విశ్వరూపుడు చేసిన బ్రహ్మహత్యాపాతకాన్ని సూచిస్తాయి. ఈ మూడు పక్షులు ఒక ఏడాది కాలం అరుస్తూ ఇంద్రుడి చెవ్వుల్లొ రొదగా ఉండేవి.*


*వాటి బాధ భరించలేక బ్రహ్మహత్యాపాతకాన్ని నివారించు కోవడం కోసం ఇంద్రుడు తన పాపాన్ని నాలుగు భాగాలుగా చేసి భూమికి, స్త్రీలకు, నీటికి, వృక్షాలకు తలో పావు భాగం పంచుతాడు. బ్రహ్మహత్యాపాతకం పాపం తీసుకొన్నందుకు ఆ నాలుగు జాతులకు నాలుగు వరాలు ఇచ్చాడు.*


*భూమికి వరంగా ఇక్కడైన గోతులు తీస్తే ఆ గోతులు తమంతతాము పూడుకొనేటట్లుగా, వృక్షాలకు ఎవరైన మొదలు ఉంచి కొమ్మలు, ఆకులు నరికివేస్తే ఆ వృక్షము లేదా మొక్క తమంతట తాము పెరిగేటట్లుగా, నీటికేమో ప్రక్షాళన గుణాన్ని, స్త్రీలకేమో కామభోగాల యందు కొద్దిపాళ్ళు ఎక్కువ సుఖాన్ని ప్రసాదించాడు. బ్రహ్మహత్యపాతకం క్రింద వారు అనుభవించే బాధలు భూమి కొన్నిచోట్ల పంటలు లేకుండా ఉండడం (ఊసర క్షేత్రాలు), నీరు నురుగుతో ఉండడం, వృక్షాలు జిగురు, స్త్రీలకు ఋతుస్రావం.*


*ఈలోపున.. కుమారుని మరణ వార్త విన్న త్వష్ట ఇంద్రుడి పైన పగ తీర్చుకోవడానికి ఓ మహా యాగన్ని నిర్వహించాడు. ఆ యాగం నుండి జన్మించిన వాడే "వృత్తాసురుడు". తన అన్నను చంపిన ఇంద్రుడిని ఎలాగైనా చంపడమే వృత్తాసురుని లక్ష్యం. ప్రతీ రోజు మూడు అడుగుల పెరుగుతూ సంధ్యా కాలములో కాలిన మబ్బులా ఉన్నాడు. కాలిన రాగి లాంటి శిఖలూ మీసములూ, మధ్యాన్న సూర్యుని ప్రకాశము గలవాడై ప్రకాశించే శూలముతో నాట్యం చేస్తూ గర్జిస్తూ ఉన్నాడు. ఆకాశాన్నే తాగుతున్నట్లు నోరు తెరిచి నాలుకతో నక్షత్రాలను నాకేస్తూ, నోటితో లోకాలను మింగేస్తూ, దన్ష్ట్రలో లోకాలు లోపలకు పోయేట్లు ఆవాలిస్తూ ఉండగా దేవతలందరూ భయపడి అన్ని దిక్కులకూ పారిపోయారు.*


*అన్ని లోకాలకూ ఆవరించాడు కాబట్టి అతని పేరు వృత్తుడు. ఇతను మహా భయంకరుడు. దేవతలు అతన్ని చంపడానికి వచ్చి కొడుతున్నారు. దేవతలు ప్రయోగించే దివ్యాయుధాలను కూడా మింగేస్తున్నాడు వృత్తాసురుడు. దేవతల ఆయుధాలూ తేజస్సు బలమూ కూడా మింగేసాడు వృత్తాసురుడు. అప్పుడు.. ఇంద్రుడు నారాయణున్ని శరణువేడగా, నీవు ధధీచి మహర్షి వద్దకు వెళ్ళి అతని శరీరాన్ని కోరు. ధధీచి శరీరం అంతా నారాయణ కవచమే ఉంది. నారాయణ కవచమే నారాయణ కవచాన్ని ఎదుర్కోగలదు. అని చెప్పి ఆ దేవతలందరూ చూస్తుండగానే శ్రీమన్నారాయణుడు అంతర్ధానమయ్యాడు. పరమాత్మ చెప్పినట్లు దేవతలందరూ ధధీచి వద్దకు వెళ్ళి ధధీచి శరీరాన్ని అడిగితే వారి మాటలు అంగీకరించి తన మనసునీ ఆత్మనూ పరమాత్మ యందు నిలిపి యోగ ధారణతో శరీరాన్ని విడిచిపెట్టాడు.*


*అప్పుడు అతని ఎముకలతో విశ్వకర్మ వజ్రాయుధాన్ని సిద్ధం చేసి అందులో పరమాత్మ తేజస్సు కూడా నిక్షిప్తం చేసాడు అదే వజ్రాయుధం. వజ్రాయుధాన్ని తీసుకుని ఐరావతం మీద తనతో యుద్ధానికి వచ్చిన తన సోదరున్ని చంపిన ఇంద్రున్ని చూచి వృత్తాసురుడు ఉండ బట్టలేక. ప్రళయకాలాగ్ని లాగ భయంకరమైన శూలాన్ని ఇంద్రుని మీద వేయగా ఆ శులాన్ని వజ్రాయుధముతో ఖండించి శూలము విసిరి వృత్తాసురుడి యొక్క ఒక బాహువుని ఖండించాడు. ఒక చేయి పోయిన రెండవ చేతితో ఒక పరిఘను తీసుకుని ఇంద్రుని దవడ మీద కొట్టాడు. ఆ దెబ్బకు ఇంద్రుడు వజ్రాయుధాన్ని జరవిడిచాడు. ఆయుధము లేని ఇంద్రున్ని వృత్తాసురుడు కొట్టలేదు.*


*ఇంద్రుని స్థితి చూసి అందరూ హాహాకారాలు చేసారు. ధర్మం తెలిసిన ఇంద్రుడు వజ్రాయుధాన్ని తిరిగి తీసుకోలేదు. ఆయుధము తీసుకో.. అని వృత్తాసురుడు చెప్పాడు. వజ్రాయుధము తీసుకుని వృత్తాసురుడి ఇంకో బాహువునూ ఇంద్రుడు ఖండించాడు. అయినా వృత్తాసురుడు రెండు పాదాలతో పర్వతాలనూ భూమినీ దేవతలనూ అల్లకల్లోలం చేస్తూ నోరు బాగా తెరిచి వాహనముతో కూడి ఉన్న ఇంద్రున్ని మింగేసాడు. నారయణ కవచ ప్రభావము వలన ఇంద్రుడు కడుపులోకి వెళ్ళి తన వజ్రాయుధముతో వృత్తాసురుని కడుపు చీల్చి బయటకు వచ్చి వృత్తాసురుని శిరస్సును ఖండించాడు. వృత్తాసురుడు అసురుడైనా పుట్టుకతో బ్రాహ్మణుడు.. అందువల్ల బ్రహ్మహత్యా పాతకం నుండి తప్పించుకోవడానికి ఇంద్రుడు ఈ భూమి పైన ఐదు వైష్ణవాలయాలను నిర్మించాడు.. అవే ‘పంచ మాధవ క్షేత్రాలు’ గా ప్రసిద్ధి చెందాయి...*


    *🔱|| ఓం నమః శివాయ ||🔱*

🌹🪷🌹 🙏🕉️🙏 🌹🪷🌹

దేవాలయాలు - పూజలు 28*

 *దేవాలయాలు - పూజలు 28*


సభ్యులకు నమస్కారములు 


*స్వస్తి*

ప్రాతః సంధ్యా కాలం నుండి దైవ ఆరాధనా, నివేదనా కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలతో బాటు ఆశీర్వచనాలు కూడా అందించిన అర్చక స్వాములు, స్వామి వారు విశ్రమించు వేళ, ఆ దినము తాను నిర్వహించిన కార్యక్రమాలలో ఏవైనా లోటు పాట్లు జరిగి ఉంటే క్షమించమని వేడుకొనుట సంప్రదాయము. 

*ఉపచారాపదేశేన కృతాన హర హర్మయా, అపచారాన్ ఇమాన్ సర్వాన్ క్షమస్య పురుషోత్తమ!*.

అర్థం :- స్వామీ, నీకు ఉపచారము మరియు పూజలు చేసే కోరికతో ప్రతి రోజూ నేను తెలిసియో, తెల్వకో చేసిన అపరాధములను మన్నించి క్షమించ గలవు. గృహాలలో అవుతే  పూజల ముగింపు సందర్భంగా  యాజ్ఞీకులవారు  దిగువ శ్లోకం  పఠిస్తారు.

*శ్లో! మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం సురేశ్వర  యాత్పూజితం మయాదేవా పరిపూర్ణం తదస్తుతే*. 


అర్చక స్వాములు  ప్రతినిత్యం *దాసస్య దాసోహం, భృత్యస్య భృత్యోహం* అను భావనతో భగవంతుని ఆశ్రయించి పూజలు నిర్వహిస్తారు కాబట్టి అర్చక స్వాములు భగవత్ కృపకు పాత్రులవుతారు.  తమిళ సంప్రదాయంలో కూడా ఒక వాక్యమున్నది *ఏత్తువార్ తమ్ మన తుళ్ళాన్*

  అర్థం:- స్తోత్రము, పరిచర్యలు  చేయువారి యొక్క మనస్సులలో నుండువాడు అంటే భగవంతుడు, భగవంతుడు కరుణిస్తాడు. స్వస్తి మంత్రమునకు ముందు అర్చక స్వాముల వారు  భగవంతునికి  వినయ విధేయతలతో, ప్రణామపూర్వకంగా శిరస్సు వంచి  తన పరిచయమిస్తాడు. తన నామ ధేయం పలుకుతూ.... *త్వద్ భృత్య భృత్య పరిచారిక భ్రుత్యభృత్య భృత్యస్య భృత్య ఇతి స్మర లోకనాయకా*.


పూజలు ముగిసినవి, ఇక సెలవు అని అర్చక స్వాముల వారు దేవాలయం తలుపులు మూయడానికి  ముందు భగవత్ ఆజ్ఞ పొందుతాడు, ఆ తదుపరి తలుపులు మూస్తాడు. 

స్వస్తి మంత్రం 

*ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు,   సర్వేషాం మంగళం భవతు,  సర్వే సంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాని పశ్యంతు  మా కశ్చిత్ దుఃఖ వాగ్భవేత్, లోకాఃసమస్తాః సుఖినోభవంతు,  సర్వే జనాః సుఖినోభవంతు, సమస్త సన్మంగళాని భవంతు, ఓం శాంతిః శాంతిః శాంతిః*.


ప్రాతః  సంధ్యా మరియు సాయం సంధ్యా సమయాన  నిర్వహింపబడు దేవాలయ పూజలు స్వస్తి మంత్రంతో సంపూర్ణం. 


*ధర్మాత్ తస్మా ద్దర్మో పరోభవేత్*. శుక్ర నీతి వాక్యము. 

అర్థము :-  ధర్మము ఆచరించని వారికి ఏలాగు సుఖం మరియు శాంతి లభించదు. కనుక, కనీసం తన సుఖం, శాంతి మరియు క్షేమం కొరకైనా ప్రతి మనుజుడు  హైందవ సంప్రదాయం బోధించిన ధర్మం ఆచరించాలి. *ప్రతి దినం గృహాలలో మరియు దేవాలయాలలో తప్పనిసరిగా భగవంతుడిని ఆరాధించాలి*.


*మరియొక విషయము*

సాక్షాత్ శంకర భగవానుని స్వరూపమైన ఆది శంకరాచార్యుల వారి సందేశము జ్ఞాపక ముంచుకుందాము. 

*అవినయమపనయ విష్ణో దమయ మనః, శమయ  విషయమృగతృష్ణామ్, భూతదయాం విస్తారయ, తారయ సంసారసాగరతః*.

అర్థం:- ఈశ్వరా! నాలోని *అవినయాన్ని తొలగించు*, నా మనస్సును ఒక చోట నిలిచేటట్లు చూడు. ప్రాపంచిక విషయాలనెడి ఎండమావుల మీద ఆశను తొలగించు, 

 *భూత దయను* *పరోపకార బుద్ధి* పెంపొందించుము, 

ఈ సంసార సాగరాన్ని దాటించుమయ్యా.


ధన్యవాదములు.

*(సశేషం)*

శ్రీనాథరచనాచమత్కృతులు

 శ్రీనాథరచనాచమత్కృతులు!!


శా. అంగోద్వర్తన వేళ నీవు దరహాసాంకూరముల్ లోచనా

       పాంగ ప్రాంతమునం దిగుర్ప నొక సయ్యాటంబు గల్పించి నా

       యంగుళ్యాభరణంబు బుచ్చుకొనవా! ఆ యుంగరంబిప్పుడే

       సింగారింపని చేత బావకునకున్ జేయన్ హవిర్దానమున్


– ఈ పద్యంలోని సొగసు శ్రీనాథుని కవిత్వంలో ప్రత్యేకతా తెలియాలంటే, మూలంలో యీ సన్నివేశం ఎలా ఉందో చూడాలి. కాశీఖండం స్కంధ పురాణంలో ఒక భాగం. మూలంలో యజ్ఞదత్తుడు రుసరుసలాడుతూ ఇంటికి వస్తూనే, “దీక్షితాయని కుత్రాస్తి ధూర్తే గుణనిధి స్సుతః” అంటాడు. మొదలుపెట్టడంతోనే “ఓ ధూర్తురాలా!” అని తిడతాడు.


“అథ తిష్ఠతు కిం తేన క్వ సా మమ శుభోర్మికా

అంగోద్వర్తన కాలే యా త్వయా మేంగులీ హృతా

సా త్వం రత్నమయీం శీఘ్రం తామానీయ ప్రయచ్ఛమే”

అని అంటాడు.


 “ఎక్కడ నీ కొడుకు? అయినా వాడి సంగతి ఎందుకులే. శుభకరమైన నా ఉంగరం ఎక్కడ? అంగోద్వర్తన వేళ నువ్వు తీసుకున్న ఆ రత్నపుటుంగరాన్ని వెంటనే తెచ్చి నాకివ్వు” అని గద్దిస్తాడన్న మాట. సంస్కృతంలో యజ్ఞదత్తుడు, భార్య తననుండి ఉంగరం కాజేసిన సందర్భం మాత్రం చెప్పి ఊరుకున్నాడు, “అంగోద్వర్తన కాలే” అని. 

అంగోద్వర్తనం అంటే ఒంటికి నలుగుపెట్టడం. కానీ మన శ్రీనాథునికి అంతటితో ఆపేస్తే తృప్తి ఎక్కడిది! ఆ సరసమైన సన్నివేశాన్ని తాను ఊహించి, పాఠకులకి చూపిస్తే కాని అతనికి మనసొప్పదు! ఇదే సన్నివేశంలో శ్రీనాథుని యజ్ఞదత్తుడు, తనకున్న ఆవేశాన్నంతటినీ వెంటనే వెళ్ళగక్కడు. భార్యతో వ్యంగ్యంగా మొదలుపెడతాడు. ఇంటికి వచ్చి, “సోమిదమ్మ! ఏమి చేయుచున్నావు? ఇటు రమ్మ! నీ కొడుకెక్కడం బోయె? బోవగా కేమి? విను మిట్లనియె”, అని పై పద్యం చెపుతాడు. ఎక్కడా తిట్టుపదం లేదు. కానీ పలికే తీరులో ఒలికే వ్యంగ్యమంతా సహృదయులైన పాఠకులు ఊహించుకోవలసిందే! 


“దరహాసాంకూరముల్ లోచనాపాంగ ప్రాంతమునం దిగుర్ప, ఒక సయ్యాటంబు గల్పించి, నా అంగుళ్యాభరణంబు పుచ్చుకొనవా!” అని అనిపించాడు. ఇదీ యీ పద్యంలోని ఆయువుపట్టు! దరహాస అంకూరముల్ – చిరునవ్వుల చిగురులు. లోచన అపాంగ ప్రాంతము – కంటి తుదలు, ఇగురుచు – చిగురించు.


ఒక్కసారి ఆ సన్నివేశాన్ని ఊహించండి. సోమయాజులుగారి ఒంటికి సోమిదేవమ్మగారు నలుగు పెడుతున్నారు. అలా పెడుతూ పెడుతూ, చిరునవ్వు మొలకలు తన కడకంట చిగురింపజేస్తూ, అతన్ని మురిపిస్తూ, ఒక సయ్యాట కల్పించి, అలా అలా, ఆ చేతినున్న ఉంగరాన్ని లాఘవంగా లాగేశారు సోమిదమ్మగారు! ఎంత సొగసైన సన్నివేశమో! ఇలాంటి సన్నివేశ చిత్రణ అంటే శ్రీనాథునికి ప్రాణం. పురాణాన్ని కవిత్వంగా మలిచే విద్య యిది. “సయ్యాటంబు” అన్న పదంలో “య్యా” అక్షరం యతిస్థానంలో ఉంది. సంస్కృతంలో లాగా తెలుగులో యతి విరామం కాదు. అంటే, యతిస్థానంలో కొత్త పదం మొదలవ్వాలని లేదు. కాని పద్యం చదివేటప్పుడు యతి అక్షరం మీద కొంచెం ఊనిక యివ్వడం ఆనవాయితీ. “సయ్యాటంబు” అన్న పదాన్ని అలా, కాస్త సాగదీసి పలికినప్పుడు, ఆ గొంతులో మరింత వెటకారం ధ్వనిస్తుంది. సంస్కృత దీక్షితులవారు ఉంగరాన్ని ఎందుకు అడుగుతున్నారో చెప్పలేదు. అంటే అప్పటికే అతనికి ఉంగరం సంగతి తెలిసిపోయిందన్న విషయం సోమిదమ్మగారికి తెలిసిపోతుంది. మన తెలుగు దీక్షితులవారు మరి కాస్త గడసరి. ఆ విషయం వెంటనే తన భార్యకు తెలియకుండా ఉండాలని, తాను ఉంగరాన్ని ఎందుకు అడుగుతున్నారో కారణం చెపుతున్నారు. ఆ ఉంగరం తొడగని చేతితో అగ్నిహోత్రం చెయ్యరట. పద్యమంతా సమాసాలతో ధారగా సాగి, చివరికి వచ్చేటప్పటికి, “పావకునకున్ చేయన్ హవిర్దానమున్” అని, ముక్కా ముక్కా తెగిపోతోంది. అతను పుల్ల విరిచినట్టు, ఖరాఖండీగా మాట్లాడడం ఇందులో ధ్వనిస్తుంది. ఈ ‘ధ్వనించ’డాలన్నీ పద్యాన్ని ‘సరిగ్గా’ చదవగలిగే వాళ్ళు చదివినప్పుడు మాత్రమే బోధపడే విషయాలు. మాటల్లో వ్రాసి చెప్పడం కష్టం!

కడకంటి చూపుల్లో చిరునవ్వులు చిగురించడం అనేది శ్రీనాథునికి బాగా యిష్టమైన ఒక సున్నిత శృంగారలీల.🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

మాసశివరాత్రి

 *రేపు క్రోధి నామ సంవత్సర శ్రావణ మాసశివరాత్రి, ఆదివారం మహాపర్వ దినం*

 ప్రతీ మాసం వలెనే రేపు కూడా మన కల్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీ అభీష్ట గణపతి దేవాలయం లో మధ్యాహ్నం3 గంటల నుండి మొదలై మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాద్యర్చనలు నిర్వహించబడును. ఆసక్తి గల‌భక్తులు ప్రత్యక్షంగాగానీ,పరోక్షంగా గానీ ఈ కార్యక్రమం లో పాల్గొనవచ్చు.  ఈ మహాకార్యక్రమంలో గోత్రనామాలు చెప్పించుకునేఆసక్తిగలవారు మాకు వాట్సాప్ ద్వారా వివరాలు తెలుపగలరు. మా వాట్సాప్ నంబర్ 9492050200, అభీష్ట గణపతి ఆలయ ట్రస్ట్, కాతేరు శివారు, వేంకట నగరం, రాజమహేంద్రవరం

ఆదిభట్ల నారాయణ దాసు

 🙏ఆదిభట్ల నారాయణ దాసు గారు 🙏

ఆదిభట్ల నారాయణ దాసు గారి గురించి చాలామందికి పూర్తిగా తెలియదు. కేవలం హరికథా పితామహుడుగానే తెలుసు. ఆయన గొప్ప తత్త్వవేత్త. ఒక్కమాటలో చెప్పాలంటే భాస్కర రాయలు వారు వ్రాసిన లలితా సహస్ర నామ భాష్యాన్ని అచ్చ తెలుగులో వ్రాసిన మహానుభావులు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ప్రయత్నం చేస్తాను 

ఆదిభట్ల నారాయణదాసు గారు ఆగష్టు 31, 1864 సంవత్సరంలో జన్మించారు - జనవరి 2, 1945 శివైక్యం చెందారు. హరికథా కళాకారుడు, సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియని సృజించి "హరికథా పితామహ" అనే బిరుదంతో ప్రఖ్యాతిగాంచారు. సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు

తెలుగు, సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఆంగ్లం, అరబ్బీ, పారశీకం భాషలలో ఆయన ప్రావీణ్యం సంపాదించాడు. అష్టావధానాలు చేసేవాడు. అచ్చతెలుగులోను, సంస్కృతంలోను, సంస్కృతభూయిష్టమైన తెలుగులోను కూడా వివిధ విషయాలపై శతాధిక గ్రంథాలు రచించిన మహా పండితుడు.


అంతకు ముందు తెలుగులో ఉమర్ ఖయ్యామ్ రుబాయితులను వ్రాసినవారు ఎక్కువగా ఎడ్వర్డ్ ఫిడ్జిరాల్డ్ రచించిన ఆంగ్ల రచననే మూలంగా తీసుకొన్నారు. అలా చేయడం వలన మూలగ్రంథాలలోని విషయం సరిగా చూపడం కుదరలేదని తలచాడు ఆదిభట్ల నారాయణదాసు. ఈ విషయం ఋజువు చేయడానికి ఆయన పారశీక భాష లోని మూల గ్రంథం కవితలనూ, ఫిడ్జిరాల్డ్ ఆంగ్లానువాదాన్నీ కూడా అచ్చ తెలుగులోకీ, సంస్కృతంలోకీ వేరు వేరు ఛందస్సులలో అనువదించాడు. 1932లో వెలువడిన ఈ రచన పాండిత్యానికి పరాకాష్ఠగా ఆనాటి సాహితీకారులచే మన్నింపబడింది.


మరొక గొప్ప రచన - 1922లో ప్రచురితమైన నవరస తరంగిణి - ఇందులో సంస్కృత మహాకవి, నాటక కర్త కాళిదాసు రచనలనుండి, ఆంగ్లభాషలో ప్రసిద్ధ నాటక రచయిత షేక్స్‌పియర్ రచనలనుండి నవరసాలను వర్ణించే ఖండికలను తెలుగులోకి అనువదించి చూపాడు.


కాని ఆయన రచనలలో ఉద్గ్రంథంగా చెప్పబడేది జగజ్యోతి అనే తాత్విక రచన. వివిధ భారతీయ తాత్వికుల సిద్ధాంతాలను, దృక్పథాలనూ ఈ గ్రంథంలో వివరించాడు. నాస్తిక వాదాలు కూడా విస్తృతంగా చర్చింపబడ్డాయి.


నారాయణదాసు సంస్కృత రచనలలో ముఖ్యమైనవి - మూడు హరికథల కూర్పు హరికథామృతం, స్వతంత్ర రచన తారకం, రెండు శతకాలు రామచంద్ర శతకం, కాశీ శతకం.


దశవిధ రాగ నవతి కుసుమ మంజరి అనే పాటలో మంజరీ వృత్తంలో 90 రాగాలు కూర్చాడు. అంతవరకూ ఎవరూ సాహసించని ఈ ప్రక్రియ సంగీతంలోనూ, కవితలోనూ నారాయణదాసుకు ఉన్న ప్రతిభకు తార్కాణం. ఋక్‌సంగ్రహం అనే బృహత్తర కావ్యంలో ఈయన ఋగ్వేదములోని 300 పైచిలుకు ఋక్కులకు సంగీతాన్ని సమకూర్చి, వాటిని వీణమీద వాయించడం విద్యార్థులకు నేర్పాడు. ఆ ఋక్కులను తెలుగులో గీతాలుగా అనువదించాడు.


నారాయణదాసు సంగీత ప్రతిభ ఆయన సాహితీ ప్రకర్షకు సమస్థాయిలో పరిమళించింది. ఆనాటి సంగీత విద్వాంసులు ఆయనను లయబ్రహ్మ అనీ, పంచముఖి పరమేశ్వర అనీ సన్మానించారు. ఒకేమారు ఐదు తాళాలకు అనుగుణంగా పాడడం ఆయన ప్రత్యేకత. ఈ పంచముఖి ప్రదర్శనలో నారాయణదాసు రెండు చేతులు, రెండు కాళ్ళు, తలలతో ఐదు తాళాలకూ దరువు చూపేవాడు. అప్పుడు ఆయనకు ఐదుగురు వివిధ వాద్యకారులు సహకరించేవారు. సంగీత సాహిత్య స్వర బ్రహ్మ అని ఆయనకు బిరుదు ప్రసాదించారు.


ఆనంద గజపతి నారాయణ దాసును తన ఆస్థాన విద్వాంసునిగా నియమించాడు. ఒకసారి సభలో ఆయన దాసును ఏదో రాగం పాడమని అడిగాడట. కానీ ఆయన నేను పాడను అని సభలో నుండి వెళ్ళిపోయాడట. రాజు గారు కూడా దానికి ఏమి కోపం తెచ్చుకోలేదు. ఐతే తరువాత ఆయన వ్యాయామశాలలో వ్యాయామం చేస్తున్నప్పుడు, ఎందుకో ఆ రాగం గుర్తుకు వచ్చి, పాడడం మొదలుపెట్టారట. నిమిషాలు గడుస్తున్నాయి, గంటలు గడుస్తున్నాయి. చుట్టూరా జనాలు ఉన్నారు. కానీ ఇవేవీ పట్టించుకొనే స్థితిలో లేడు నారాయణ దాసు. చివరికి పాడడం అయినతరువాత చూసుకుంటే ఒంటి మీద కేవలం గోచీ తప్ప ఏది లేదట. ఆ రాగం విన్న ప్రజలంతా ఆనందంతో ఇంటికి వెళ్ళిపొయారు. వెళ్ళిపోయిన ఆ జనంలో, ఆనంద గజపతి రాజు కూడా ఉన్నాడట…!


ఆదిభట్ల నారాయణ దాసు రచనలు :-


 తల్లి విన్కి (లలితా సహస్ర నామాలకు అచ్చతెలుగు పద్యాలు)

 నారాయణ దర్శనము 

జగజ్జ్యోతి - ప్రథమ సంపుటము

 జగజ్జ్యోతి - ద్వితీయ సంపుటము

 కచ్ఛపీశ్రుతులు

 జానకీ శపథం

నవరసతరంగిణి (షేక్స్పియర్ కవిత్వమందలి సొగసులు)

బాటసారి (గూఢార్థ కావ్యం)

 తారకం

 సావిత్రీ చరితము

 పాండురంగ బృందావన సంకీర్తనలు

 ఋక్సంగ్రహః - మొక్కుబడి

ప్రహ్లాదచరిత్రము

 మన్కిమిన్కు (ఆయుర్వేదం) కుదురు

నూఱుగంటి 

పంచశతి - శతకాలు

                          సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ