14, సెప్టెంబర్ 2024, శనివారం

మత్తకోకిల

 *మత్తకోకిల*


*తల్లిదండ్రుల సేవయందున  తన్మయత్వము నొందుమా*

*యెల్లకాలము వారి దీవెన యీప్సితంబును తీర్చుగా* 

*పిల్లలందున తల్లిదండ్రుల ప్రేమ యెప్పుడు తగ్గునా*

*కల్లకాదిది యెల్లవారికి కార్యమేదియు చేసినన్*

*చల్లనైనది వారిచూపని సాగిపొమ్మిక మిత్రమా*



*పద్య కవితా శిల్పకళానిధి* 

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి* 

*పాఠశాల సహాయకులు* *(తెలుగు)*

తెలుగు భాషలో

 *ఇప్పటి వరకు గణితంలో చూసిన గమ్మత్తును తెలుగు భాషలో చూడండి.* 


మూడింటిని #నిలువుగాను, #అడ్డంగాను చదివి చూడండి. ఎటు చదివినా అవే పదాలు వస్తున్నాయి చూడండి!


స మ త

మ జ్జి గ

త గ ము


కం చ ము

చ క్కె ర

ము ర ళి


క్షీ ర ము

ర వ్వ లు

ము లు కు


కా ను పు

ను వ్వు లు

పు లు లు


కా ర ము

ర గ డ

ము డ త


స మ త

మ ర ల

త ల పు


త మ కం

మ ర్యా ద

కం ద కం


పొ ల ము

ల లి త

ము త క


ధ న ము

న వ్య త

ము త క


వ ర స

ర వి క

స క లం


హి మ జ

మ న ము

జ ము న


క వి త

వి న ల

త ల క


కో వె ల

వె న్నె ల

ల ల న


మ న సు

న య నం

సు నం ద


ది న ము

న గ రి

ము రి కి


టో క రా

క వ్వ ము

రా ము డు


చ దు వు

దు ర ద

వు ద కం


ప్ర వే శం

వే ది క

శం క రం 

అందమైన మన మాతృభాషను ఆస్వాదిద్దాం

న్యస్తాక్షరి

 🌹🦜🙏🏽🦜🌹 

    14.09.2024

       శనివారం


నిన్నటి ప్రణాళిక .. న్యస్తాక్షరి.


అంశం .. ఈశ్వరుని ప్రార్థన

ఛందస్సు .. శార్థూలమ్ 


1 వ పాదం 02 వ అక్షరం .. మ 

2 వ పాదం 07 వ అక్షరం . య

3 వ పాదం 13 వ .. అక్షరం .. యి/ఇ 

4 వ పాదం 17 వ .. అక్షరం .   స 

......................................................


 *శార్థూలమ్..* 


మోమాటంబునువీడి వేడితినయా!

బుద్ధిన్ బ్రసాదింపుమా !


హేమంబుల్ వలదయ్య నాకు! 

పద సాహిత్యంబు జేకూర్చగా


నేమాత్రంబును జాగుజేయక సదా 

యీశా నినున్ గొల్చుచున్


నీమీదన్ కవనంబులల్లుదును 

రాణింపన్! గృపాసాగరా!!

......................................................

🦄🐓🦜🦢🐘

పి.ఎల్.నాగేశ్వరరావు 

హైదరాబాదు

లోకం తీరు : 14

 లోకం తీరు : 14

కందం||

ఊరాకారడవియనగ

నోరాయనిజపుసముద్రమోయనజెల్లున్

మారాకువేయదుమమతయు

నౌరాయేమనుదుగనిలనవనినినరులన్


భావం:--ఊరు అంటేనేమనసునజీవించునెచ్చెలులనెలవు.కానీ నేడు అట్టి ఆత్మీయనెచ్చెలులు ఊరునకరువైఅడవిగాయగుచున్నది.అసత్యమే రాజ్యమేలుట,మనుజులమధ్యమమకారములేకుండుట నేటి కాలమున మానవులనైజము వింతపోకడలతోనుండుచున్నది.ఈ బలహీనత  లనుజయింపవలయును.


దేవరకొండ:రాజోలు

శ్రీ రామ స్తుతి🙏

 🌸శ్రీ రామ స్తుతి🙏 


సీ. ఆశ్రిత వినుత ! మహాపవిత్రచరిత !

                అమరేంద్ర పూజిత కమలనేత్ర !

     సౌమిత్రి నీవెంట సౌమ్యమ్ముగ నడచె

                భాత్రుభక్తి వలన భవ్యచరిత !

     పావని సీతమ్మ పతి తోడిదే లోక

                మనినెంచి వెడలెను వనము లకును 

      జానకి నాయకా ! జగములనేలేటి

               జలజ నేత్రా ! రామ ! జయము జయము !

తే.జానకీ చిత్త సంస్థితా ! జయము జయము !

    సూర్యవంశపు చంద్రమా ! శుభము శుభము !

    నీవె దిక్కని నమ్మితి నీరజాక్ష !

    దశరథాత్మజ ! రఘురామ ! ధర్మ తేజ !


         జయలక్ష్మి పిరాట్ల

దత్తపది

 హరిః ఓం నమః.

దత్తపది : కాక., తాత., మామ., పాప.... రామాయణార్థంలో...పూరణం.


సీ ll మామ మారీచుని మాట మన్నింపక 

              దానవేంద్రుడు వంశహీనుడయ్యె 

        తమ్ముని భార్యను తా తమకమునపొంది 

               ప్రాణము గోల్పడె వానరపతి 

         కాకుత్స రాముని కామించి శూర్పణఖ 

                  నాసికా కర్ణముల్ బాసి చనియె 

          పాపచిత్తముతోడ పడతి నహల్యనుకూడి  

                   భ్రష్ఠత్వ మొందె త్రివిష్టపపతి

తే ll కామకల్మష వాసన గ్రమ్ముకొనగ

       పాప పుణ్యము లెంచరు పతితులగుచు 

       ధర్మహీనులు మసలుచు దైత్యులట్లు 

        ముందుగతి జూడజాలరు మందమతులు ll 


---- పరమహంస ----

Panchaag


 

భాగవతులు -- ఆముక్తమాల్యద

 భాగవతులు -- ఆముక్తమాల్యద 


సీ. పరమ పావనులైన పురి భాగవతులట

               భాగవతుల గాంచి పరవశించి

     యెదురుగా తామేగి మృదువచనములతో

               వినయమ్ము తోడను వినుతి చేసి 

     పాద్యంబు నిచ్చియు బహుభక్తి తోడుత

               కొబ్బరాకుల చాప కూర్మి వేసి

     అద్దానిపై ప్రీతి నతిథుల నునిచియు

               నునుపోకమట్టచే ననువు నున్న

     సరియైన దొన్నెలన్ సంసిద్ధ పరచియు

               న్నరటి యాకందున నతిథితతికి

     నన్నమ్ము పప్పును నాజ్యధారలు బహు

                వ్యంజనంబులు మధు ఫలరసాలు

     క్షీర దధులతోడ క్షీరాన్నముల తోడ

               నాహారమును బెట్టి యమిత భక్తి         

     భుజియించి నంతట భోక్తల కంతట

                 యంఘ్రిసంవాహన మాచరించి

 తే.అడిగి క్షేమంబు వినయాన విడియ మిచ్చి

     యతిథి పోయెదనన్న తా మనుసరించి

     భక్తి నొసగియు తగిన సంభావనమ్ము  

     విడువ లేకను వీడ్కోలు నిడుచు నుంద్రు.     


సరళ పద్యానుసరణ :

గోపాలుని మధుసూదనరావు

గణపతి లీలలు

 


శ్రీభారత్ వీక్షకులకు గణపతి నవరాత్రి శుభాకాంక్షలు 🌹 గణపతి లీలలు వింటూ ఉంటే ఎవరికైనా ఎంతో భక్తి పారవశ్యం కలుగుతుంది. అష్టవిధ వినాయకులు మన పురాణాలలో చాలా ప్రసిద్ధి. కొన్ని పురాతన ఆలయాల చరిత్ర తప్పక తెలుసుకోవాలి. మహారాష్ట్ర లోని భల్లాలేశ్వర్ అటువంటి వాటిలో ఒకటి. అసలు ఆ గణపతి ఆలయం ఎలా ఆవిర్భవించిందో, దాని నేపథ్యమేమిటో ఈ ఎపిసోడ్ లో చాలా చక్కగా అందించారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. అలాగే నరద గణపతి గురించి కూడా. వినాయక నవరాత్రులలో మరికొన్ని గణపతి అవతారాల గురించి తదుపరి ఎపిసోడ్ లో వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

రోగాలకూ కారణమూ మనస్సే


*అన్ని రోగాలకూ కారణమూ... "మనస్సే", విరుగుడూ... "మనస్సే"    

“జపాన్ శాస్త్ర వేత్తలు చేసిన వివిధ ప్రయో గాలలో ఆశ్చర్య కర విషయాలు 

వెలుగు చూశాయి.*


 *ఇంత కాలం మనం "గుడ్డి"గా నమ్ముతున్న అనేక ఆరోగ్య సమస్యలకు 

మూలాలు మనం తీసుకునే ఆహారం లో లేవని,"మనం జీవించే విధానం 

లోనే ఉన్నాయని"*

*మనసును హాయిగా ఉంచు కున్న వారికి ఏ రోగాలు రావని వారు తేల్చి 

చెబుతున్నారు. అమెరికాలో జరిగిన మరో సర్వేలో కూడా మనసు బాగున్నవారు 

ఎక్కువ కాలం జీవిస్తున్నారని తేల్చారు.          


మనసు కలత బారితే లేని పోని ఆలోచనలు చోటు చేసుకుని వాటి నుంచి 

బైటపడడానికి "బలహీనతలు" పెంచు కోవడం, వాటికి బానిసలై "దురలవాట్ల" 

పాలై పోవడం వంటివి చేస్తున్నారని వారు తేల్చారు. ఇటీవల కాలంలో ప్రపంచ 

వ్యాప్తంగా డాక్టర్లు కీలక రోగాలకు మందులు ఇవ్వడం తగ్గించి, "జీవన శైలి"ని 

సరి దిద్దే పనిలో పడ్డారు.*


      _అందుకే డయాబిటిక్, బిపి వంటి నిరంతర అనారోగ్యకర అంశాలకు 

డాక్టర్లు ట్రీట్‌ మెంట్ ఇచ్చే పద్ధతి మార్చు కున్నారు._

    

*ఇది వరకు తిన కూడదు*

     *అన్న అన్ని రకాల*

     *ఆహారాన్ని నిరభ్యంతరంగా*

    *తిన మంటున్నారు.*


_పొద్దుటే వాకింగ్ వెళ్ళే వారు ప్రశాంతమైన మూడ్‌లో ఉండాలని అందుకోసం 

నచ్చిన పాటలు విన మంటున్నారు._


*ఏం చేస్తే ఉత్సాహంగా అనిపిస్తుందో అది చేయ మంటున్నారు. కొందరు "వాకింగ్" ఇష్టపడితే మరి కొందరు జిమ్‌కు వెళ్ళాలను కుంటారు. ఇంకొందరు "బ్రిస్క్‌వాక్" చేయాలనుకుంటే, ఇంకొందరు "స్టెయిర్ కేస్ వాక్" చేయాలను కుంటుంటారు. 

అందుకని డాక్టర్లు పేషెంట్ల ఇష్టానికే విడిచి పెట్టి ఎంతో కొంత వ్యాయామం మాత్రం 

చేయమని సూచిస్తున్నారు.*


      ఒక్క సారిగా వీరి వైఖరి

      ఇలా మారి పోడానికి

      కారణం సరికొత్త

      అధ్యయనాలలో

      వెలుగు చూస్తున్న అంశాలే

      కారణం. 

*ఇలా వెల్లడైన అనేక పరి శోధనల ఫలితాలలో జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన, 

అధ్యయనం సరికొత్తది. దీనిలో పాల్గొన్న సైంటిస్టులు ఏం చెబు తున్నారో 

చూద్దాం.*  


*➢ "మానసిక ఒత్తిడి" వల్ల గ్యాస్ ::*

       కడుపులో గ్యాస్ సమస్యను వాయువు అంటారు.                

ఇది రావడానికి, ముదర డానికి కారణం ఆహార లోపాల వల్ల కాదట.  

"మానసిక ఒత్తిడి" వల్ల ఎక్కువ వస్తుందట !


*➢ "ఆవేశ కావేశాల" వల్లే అధిక రక్తపోటు ::*


     ఉప్పు ఎక్కువగా తినే వారి కంటే 

"ఆవేశ కావేశాలను" అదుపులో పెట్టుకోని వారిలోనే "అధిక రక్తపోటు" ఎక్కువట !


*➢ "అతి బద్ధకం" వల్ల చెడు కోలెస్టరాల్ ::*


        కొవ్వు పదార్థాలు తినేవారిలో కంటే అతిబద్ధకం వలన కొవ్వు పెరిగిన 

వారిలోనే చెడు కోలెస్టరాల్ ఎక్కువట!


*➢ "మధుమేహం" సమస్య: తీపి పదార్థాలు అధికంగా తినే వారిలో కంటే,*

       "అధిక స్వార్ధం", 

       "మొండితనం"

*ఉన్నవారి లోనే ఎక్కువట !*


*➢ "అతి విచారం" వల్ల ఆస్త్మా ::*


    ఊపిరి తిత్తులకు గాలి అందక పోవడం కంటే, 

అతివిచారం వల్లనే ఊపిరి తిత్తులలో మార్పులు వచ్చి ఆస్త్మా వస్తుందట... 


*➢ "ప్రశాంతత" లేక గుండె జబ్బులు ::*


ధమనుల్లో రక్తం ప్రసరణ లోపాల కంటే ప్రశాంతత లోపించడం వల్లనే గుండె 

కొట్టు కోవడంలో మార్పులు వస్తున్నాయట.


అందువల్ల మనిషికి గుండెజబ్బులు వస్తున్నాయట. 


*మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు "మూల కారణాలు" తరచి చూస్తే

 "ఆహార అలవాట్ల" వల్లకాదని లైఫ్‌ స్టయిల్ సంబంధ మైన వేనని తెలుస్తోంది. 

అందుకు వారు వివిధ కారణాలను చూపించారు. వారి అధ్యయనం ప్రకారం-* 


  * 50% ఆధ్యాత్మికత

      లోపంవల్ల

  * 25% మానసిక కారణాల

      వల్ల

  * 15% సామాజిక,

      స్నేహబాంధవ్యాల లోపం

      వల్ల

  * 10% శారీరక కారణాల

       వల్ల...

*రోగాలు వస్తున్నాయి. అందువల్ల "కడుపు మాడ్చుకుని" ఆరోగ్యాన్ని 

కాపాడుకోవాలని ఆరాటపడేకన్నా, "జీవన శైలి"ని మార్చుకుని ఆరోగ్యాన్ని 

కాపాడుకోవడం మేలని జపాన్ సైంటిస్టులు అంటున్నారు.* 


*వీరి సూచనల ప్రకారం మనం ఆరోగ్యంగా ఉండా లంటే* 


       - స్వార్ధం, 

       - కోపం, 

       - ద్వేషం, 

       - శత్రుత్వం, 

       - ఆవేశం, 

       - అసూయ,

       - మొండితనం, 

       - బద్ధకం, 

       - విచారం, 


*వంటి "వ్యతిరేక భావాల"ను వదిలించు కోవాలి.*


       - కారుణ్యం, 

       - త్యాగం, 

       - శాంతం, 

       - క్షమ, 

       - నిస్వార్ధం, 

       - స్నేహభావం,

       - సేవాభావం, 

       - కృతజ్ఞత, 

       - హాస్య ప్రియత్వం,

       - సంతోషం , 

       - సానుకుల దృక్పథం


పెంచుకోవాలి.”☝️


అద్భుత ఆరోగ్య సూచనలు, మిత్రమా!

నిజంగా నిజం...

15. " మహా దర్శనము

 15. " మహా దర్శనము "-- పదునైదవ భాగము --మనకు కావలసిన కథ


15. పదునైదవ భాగము -- మనకు కావలసిన కథ



        కొడుకుకు మూడో యేడు కూడా నిండింది . పెరిగిన దూడ తల్లి సన్నిధిని వదలినట్లే , వాడుకూడా తండ్రి వద్దకే ఎక్కువగా చేరుతూ వచ్చినాడు . తండ్రికీ , కొడుకుకూ ఋణానుబంధము బలముగా ఉండినది . తండ్రికి పదిమంది శిష్యులకు అధ్యాపనము , ప్రవచనములను గావించుట ఒకఎత్తైతే , కొడుకు వెంట ఉండుటే ఒక ఎత్తు . కొడుకు తల్లి సావాసము వదలకున్ననూ , ఆమెకు చెప్పి తండ్రి వద్దకు వచ్చి చేరును . ఇంతవరకూ తల్లి వెంట వెంటే తిరుగుతున్నట్టే , ఇప్పుడు తండ్రి వెంట వెంటే వెళ్ళును . తండ్రి ఇంటిలో ఉన్నపుడు , అతడు ఏమి చేస్తున్ననూ పక్కనే కొడుకు ఉండవలసినదే . చేస్తున్న పని అగ్ని పరిచర్య కావచ్చును , లేదా , శిష్యులకు అధ్యాపనము చేస్తుండుట కావచ్చును . తండ్రి తోడు మాత్రము వదలడు . 


        ఒక దినము కొడుకు తండ్రి తొడపైన కూర్చొని , ’ తండ్రీ , ఆ దినము నేను ఒకమాట అడిగినాను . సరే కానీవయ్యా , చెపుతాను అన్నారు . ఇప్పుడు అడిగేదా ? అన్నాడు . తండ్రి , ’ చూడయ్యా , యాజ్ఞవల్క్యా , ఇవి కార్తీక మాసము చివరి రోజులు . ఇంకా మార్గశిరము , పుష్యము రెండు నెలలు మనసును గట్టిగా పట్టుకో . మాఘ మాసములో చౌలము జరగనీ , ఆ తరువాత ఏమి కావలసినా అడుగు . చెపుతాను . అంతవరకూ నువ్వు నేను చెప్పే కథలను వింటూ ఉండు . " అన్నాడు . 


         కొడుకు తన మనసు తన చేతిలో ఉన్నట్లే , తాను లేగదూడలను పట్టుకొని లాగికొని తెచ్చునట్లే , మనసును పట్టి లాగి తెచ్చువాడి వలె , ’ ఊ ’ అన్నాడు . అది చూసి తండ్రికి ఆశ్చర్యము ! మంచి సంయమశీలుని వలె మనసును బిగించువాడిలా ఉన్నాడే యని . కానీ , తనకు అయిన దర్శనము వలన ఎదురుగా ఉన్నవాడు మహా పురుషుడు అని తెలుసు కాబట్టి ఆశ్చర్య పడునట్లు కూడా లేడు . ఏదైతేనేమి , తన స్థితి విచిత్రముగా ఉంది . 


       తండ్రి కొడుకును , " కథ చెప్పవలెనా ? " అని అడిగినాడు . కొడుకు ’ ఊ ’ అన్నాడు . తండ్రి చెప్పనారంభించినాడు , ’ ఒక ఊళ్ళో ఒక చెట్టు , దానిపై ఒక కాకి ఉండింది .’ 


కొడుకు , తొడపైకూర్చున్నవాడు , అలాగే తండ్రి నోటిని తన చిట్టి చేతులతో మూసి , గంభీరముగా అన్నాడు, 


         " తండ్రీ , మనవంటి వారికి కాకి కథలతో వచ్చేదేమిటి ? వద్దు " కొడుకు మాటలో సత్య నిష్ఠురత , భావపు బిగి , రెండూ ఉన్నాయి . తండ్రికి ఇంకేమి మాట్లాడుటకూ నోరు రాలేదు , " మన వంటి వారు అంటే , ఎటువంటి వారు ? " అని అడుగవలెననిపించినది , అడుగుటకే అవలేదు , కానీ మాట్లాడకుండా ఎలా ఉండుట ? యాంత్రికముగా , యంత్రము వలె , మాట్లాడినాడు , " అట్లయితే , నీకు ఎటువంటి కథ కావలెనయ్యా ? " 


        " అప్పుడు నచికేతుని కథ చెప్పినారు కదా , దాన్ని ఇంకొక సారి చెప్పండి , బండి కింద పడుకున్న వాడి కథ చెప్పండి , అటువంటి కథలైతే , చెప్పుటకూ బాగు , వినుటకూ బాగు " 


         తండ్రికి నిజమే యనిపించినది . వాడు అడుగుతున్నవన్నీ బ్రహ్మజ్ఞుల కథలు . ఈ కథలను ఇప్పటినుండే ’ బాగు ’ అంటే ఇక ముందు ఏమి గతి ? అని దిగులు కలిగింది . అయితేనేమి , త్రేతాగ్నులు చెప్పినారు కదా , వారే సర్వమునూ చూచుకొనెదరు . కాబట్టి దిగులు పడనవసరము లేదు అని ఒక మొండి ధైర్యము . 


కానిమ్ము యని తండ్రి నచికేతుని కథ చెప్పినాడు . 


        " నచికేతుడు గౌతమ వాజశ్రవసుని కొడుకు . అతని తండ్రి స్వర్గమును పొందవలెనని ఒక యాగమును చేసినాడు . దానిలో , తనవద్దనున్న సర్వమునూ దానము చేయవలసి వచ్చెను . " 


         " అలాగ తన వద్దనున్నదంతా ఎందుకు తండ్రీ , ఇచ్చేది ? .... ఊ , తప్పయిపోయింది , ఇంకా రెండు నెలలు ఏమీ మాట్లాడకూడదు , ఆ తరువాత ఏమైనా అడగవచ్చును , సరే, తర్వాత ఏమైంది , చెప్పండి " 


తండ్రి ఏదేదో ఆలోచిస్తూ , ఒక నిట్టూరుపుతో అదంతా బయటికి పారద్రోలి , ముందరి కథ చెప్పనారంభించినాడు . 


         " అలాగ దక్షిణగా సర్వమునూ ఇచ్చునపుడు , ఇంట్లో ఉన్న ముసలి యావులను దానమిచ్చినాడు . అవి ముసలివై , పళ్ళూడిపోయి , వాటికి గడ్డితినుటకు కూడా చేతకాదు . అటువంటివి . అప్పుడు , నచికేతుడు ఆలోచించినాడు , ’ మాతండ్రి తన సర్వస్వమునూ దానము ఇచ్చివేస్తున్నాడు , అట్లయిన , నన్ను కూడా ఇచ్చివేయునా ? అలాగ ఇచ్చినా అది విశేషమేమీ కాదు . కొడుకు తండ్రి ఆస్థిలో భాగమే కదా ? అలాగైతే నన్ను ఎవరికి ఇచ్చునో ? అడిగి తెలుసుకుంటాను ’ అనిపించినది . " తండ్రీ ! నన్ను ఎవరికి ఇస్తావు ? ’ అని అడిగెను . తండ్రి తన ముఖ్యమైన పనులను గురించి ఆలోచిస్తూ సమాధానము చెప్పలేదు . మరలా అడిగినాడు , మరలా సమాధానము లేదు . మరలా మరలా మూడు నాలుగు సార్లు అడిగినాడు . తండ్రికి కోపము వచ్చినది . యజ్ఞములో యజమానుడై యున్న వాడు , దీక్షితుడైన వాడు కోపము చేసుకో కూడదు అనునది కూడా మరచినాడు . నిన్ను మృత్యువుకు ఇచ్చివేస్తాను అన్నాడు . యజ్ఞశాల అంతటా నిండియున్న దేవతలు తథాస్తు అన్నారు . మృత్యు దూతలు వచ్చినారు . నచికేతునిని పిలుచుకొని పోయినారు .


         " మృత్యువంటే యముడు కదా ? ఆతడు నచికేతుని మూడు దినములు పరీక్ష చేసినాడు . నాలుగవ దినము ఆకాశవాణి, ’ మొదట ఆ బాలుడిని సత్కరించు ’ అని మ్రోగింది . యముడు సరేనని , ఆ పిల్లవాడిని పిలిచి , " పాపము , నువ్వు వచ్చి మూడు దినములు అయినది , నిన్ను ఎవరూ పట్టించుకోలేదు , యోగ క్షేమములు కూడా అడుగలేదు , తిండీ నీరూ లేక అలాగే ఉన్నావు , ఆ మూడు దినములనూ మరచిపో , ఆ మూడు దినములు కష్టపడినావు కనుక , దినమునకు ఒకటిగా , మూడు వరములను ఇచ్చెదను " అన్నాడు 


         నచికేతుడు సరేనన్నాడు . ’ ధర్మ రాజా , మా తండ్రి గారికి నాపైన చాలా ప్రేమ . వారు ఇప్పుడు నేను లేనని శోకిస్తున్నారు . యాగమును పూర్తి చేసినారో , లేదో ? కాబట్టి , వారి యాగము పూర్ణము కావలెను , వారు శోకరహితులు కావలెను , కోప రహితులు కావలెను , నువ్వు నన్ను తిరిగి మా లోకమునకు పంపించివేసిన , వారు నన్ను ముందరిలాగానే ప్రేమతో చూడవలెను.’ .ఇది నా మొదటి వరము " అన్నాడు . యమ ధర్మరాజు ’ ఈ పిల్లవాడు తనకోసమై ఏమీ అడుగలేదు . తండ్రికోసము ఈ వరమును అడిగినాడు ’ అని సంతోషపడి , ’ అటులనే యగుగాక , ఈ వరమును ఇచ్చినాను , ఇక రెండవ వరమును అడుగుము ’ అన్నాడు  


         " నచికేతుడు సరేనని , ’ ధర్మరాజా , మా తండ్రిగారు యాగమును చేసినది స్వర్గము కోసము: ఆ స్వర్గమునకు పోవు దారి వేరే ఉన్నదా ? ఉంటే అది నాకు కూడా నేర్పించు ’ అన్నాడు . ధర్మరాజు అటులనేనని అతడికి అగ్నివిద్యను చెప్పినాడు . నచికేతుడు , చెప్పుతుండగనే ఆ విద్యను నేర్చేసుకున్నాడు . యముడికి సంతోషమై , ఆ విద్య ’ నాచికేతాగ్ని ’ అనే పేరుతోనే ప్రసిద్ధమవనీ అని , హెచ్చుగా ఇంకొక వరమును తానై ఇచ్చినాడు , ’ నచికేతా , ఈ అగ్నిని దినమునకు మూడు సార్లు ఆరాధించినవాడికి కావలసిన లోకములు దొరకును ’ అన్నాడు " 


        దేవరాతుడు కథ చెప్పుచుండగానే ఆవేళకే సరిగ్గా తల్లి యాజ్ఞవల్క్యుని పిలిచింది . " యజ్ఞయ్యా , ఇక్కడికి రావయ్యా " అన్న ఆమె పిలుపు విని యాజ్ఞవల్క్యుడు ఏమి చేయవలెనని అడుగువాడి వలె తండ్రి ముఖమును చూచినాడు . తండ్రి , ’ అమ్మ పిలుస్తున్నది , వెళ్ళిరా ’ అన్నాడు.


’ కథ ? ’ 


’ ఇంకొక దినము చెపుతానులే , ’ 


        " ఆ దినము ఈ కథను ఇంకా పెద్దగా చేసి చెప్పండి . నేను వినవలెను . నేను కూడా ఒక నచికేతుని కావలెను " అంటూ కొడుకు తల్లి వద్దకు పరుగెత్తి పోయినాడు . 


         తండ్రి , దిగ్భ్రాంతుడై కూర్చున్నాడు . " ఇంకా మూడు యేళ్ళే . అప్పుడే తానొక నచికేతుడిని కావలెనను ఆశ , అబ్బా ! " అనుకున్నాడు . అలాగే , ’ ఈ సంగతినంతా బుడిలులకు చెప్పవలెను ’ అనిపించినది . ఇంకా ఏమేమో ఆలోచనలు వచ్చినాయి . " ఔను , వారొక్కరే దీనికి సమాధానమును చెప్పగలరు " అని కాళ్ళూ చేతులూ కడుగుకొని మంచి దుస్తులు ధరించినాడు . 


         వెంటనే గుర్తుకు వచ్చింది , ఈ దినము ఆచార్యులు బుడిలుల ఇంటికి వెళ్ళవలసి యుండినది . బుడిలుల కొడుకు కాత్యాయనుడు ఈ దినము సమావర్తనము చేసుకొని , స్నాతకుడై ఇంటికి వచ్చును . ఇక్కడ కొడుకును తొడపై కూర్చోబెట్టుకొని ముద్దు చేయుటలో ఆ సంగతే మరచిపోయినాడు . ’ ఇప్పుడైనా గుర్తొచ్చినది , అదే సంతోషము ’ అనుకొని , ఆత్రాత్రముగా వెళ్ళినాడు .

గుర్తుందా

 

*కొడాక్ కంపెనీ గుర్తుందా* ? *1997లో కోడాక్‌లో దాదాపు 160,000 మంది ఉద్యోగులు* ఉన్నారు.

మరియు *ప్రపంచంలోని 85% ఫోటోగ్రఫీ కొడాక్ కెమెరాలతో* జరిగింది.

గత కొన్ని సంవత్సరాలుగా *మొబైల్ కెమెరాల పెరుగుదలతో*, కొడాక్ కెమెరా కంపెనీ మార్కెట్ నుండి దూరంగా ఉంది.

*కోడాక్ కూడా పూర్తిగా దివాళా తీసింది మరియు అతని ఉద్యోగులందరినీ తొలగించారు*.


అదే సమయంలో *చాలా ప్రసిద్ధ కంపెనీలు తమను తాము* ఆపుకోవలసి వచ్చింది.


HMT (గడియారం)

ఆల్విన్ ( గడియారం )

బజాజ్ (స్కూటర్)

డైనోరా (టీవీ)

మర్ఫీ (రేడియో)

నోకియా (మొబైల్)

రాజ్‌దూత్ (బైక్)

అంబాసిడర్ (కారు)


*పైన పేర్కొన్న కంపెనీల్లో ఏదీ కూడా నాణ్యత లేనిది కాదు*.

*మరి ఈ కంపెనీలు ఎందుకు మూతపడ్డాయి* ?


*ఎందుకంటే వారు కాలానుగుణంగా తమను తాము మార్చుకోలేదు*.


ప్రస్తుత తరుణంలో నిలబడి, 

*రాబోయే 10 సంవత్సరాలలో ప్రపంచం ఎంతగా మారిపోతుందో మీరు బహుశా ఆలోచించకపోవచ్చు* ! 

మరియు *నేటి 70%-90% ఉద్యోగాలు రాబోయే 10 సంవత్సరాలలో పూర్తిగా ముగిసిపోతాయి*.

మనం నెమ్మదిగా "*నాల్గవ పారిశ్రామిక విప్లవం*" యుగంలోకి ప్రవేశిస్తున్నాము.


*నేటి ప్రసిద్ధ కంపెనీలను చూడండి*


*UBER అనేది కేవలం సాఫ్ట్‌వేర్ పేరు*.

వారికి *సొంత కార్లు లేవు*. 

అయితే *నేడు ప్రపంచంలోనే అతిపెద్ద టాక్సీ-ఫెయిర్ కంపెనీ UBER*.


*Airbnb నేడు ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ కంపెనీ*. 

కానీ తమాషా ఏమిటంటే ...

*ప్రపంచంలో వారికి ఒక్క హోటల్ కూడా లేదు*.


అదేవిధంగా, *Paytm, Ola Cab, Oyo గదులు, Tea Time* మొదలైన లెక్కలేనన్ని కంపెనీలకు ఉదాహరణలు ఇవ్వవచ్చు.


*ఈ రోజు అమెరికాలో కొత్త లాయర్లకు పని లేదు*, 

ఎందుకంటే *IBM వాట్సన్ అనే చట్టపరమైన సాఫ్ట్‌వేర్ ఏదైనా కొత్త లాయర్ కంటే మెరుగ్గా వాదించగలదు*. 

అందువల్ల, దాదాపు 90% మంది అమెరికన్లకు రాబోయే 10 సంవత్సరాలలో ఉద్యోగాలు ఉండవు. మిగిలిన 10% ఆదా అవుతుంది. వీరిలో 10% నిపుణులు ఉంటారు.


కొత్త డాక్టర్ కూడా పనికి కూర్చున్నాడు. *వాట్సన్ సాఫ్ట్‌వేర్ క్యాన్సర్ మరియు ఇతర వ్యాధులను మనుషుల కంటే 4 రెట్లు ఎక్కువ ఖచ్చితంగా గుర్తించగలదు*.


*కంప్యూటర్ ఇంటెలిజెన్స్ 2030 నాటికి మానవ మేధస్సును అధిగమిస్తుంది*.


*నేటి 90% కార్లు రాబోయే 20 ఏళ్లలో రోడ్లపై కనిపించవు*.

మిగిలిపోయిన కార్లు *విద్యుత్ లేదా హైబ్రిడ్ కార్ల ద్వారా నడుస్తాయి*.

రోడ్లు నెమ్మదిగా ఖాళీ అవుతాయి.


*గ్యాసోలిన్ వినియోగం తగ్గుతుంది*.

మరియు *చమురు ఉత్పత్తి చేసే అరబ్ దేశాలు నెమ్మదిగా దివాలా తీస్తాయి*.


మీకు కారు కావాలంటే ఉబర్ వంటి సాఫ్ట్‌వేర్ నుండి కారును అడగాలి. మరియు


మీరు కారు అడిగిన వెంటనే, *పూర్తిగా డ్రైవర్ లేని కారు వచ్చి మీ డోర్ ముందు పార్క్ చేస్తుంది*.

మీరు *ఒకే కారులో చాలా మంది వ్యక్తులతో ప్రయాణిస్తే, ఒక వ్యక్తికి కారు అద్దె, బైక్ కంటే తక్కువగా ఉంటుంది*.


*డ్రైవర్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాల సంఖ్య 99% తగ్గుతుంది*. 

మరియు దీని వలన *కారు భీమా ఆగిపోతుంది మరియు కారు భీమా కంపెనీలు మూత బడుతాయి*


*భూమిపై డ్రైవింగ్ చేయడం లాంటివి ఇక మనుగడలో ఉండవు*.

90% వాహనాలు రోడ్డు నుండి అదృశ్యమైనప్పుడు *ట్రాఫిక్ పోలీసులు మరియు పార్కింగ్ సిబ్బంది అవసరం లేదు*.


*ఒక్కసారి ఆలోచించండి*

*10 సంవత్సరాల క్రితం కూడా వీధుల్లో STD బూత్‌లు* ఉండేవి.

దేశంలో *మొబైల్ విప్లవం వచ్చిన తర్వాత ఈ ఎస్టీడీ బూత్‌లన్నీ మూతపడాల్సి వచ్చింది*.

బతికున్నవి మొబైల్ రీఛార్జ్ షాపులయ్యాయి.

*మొబైల్ రీఛార్జ్‌లో మళ్లీ ఆన్‌లైన్ విప్లవం*. ప్రజలు *ఇంట్లో కూర్చొని తమ మొబైల్‌ని ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేయడం ప్రారంభించారు*. 

మళ్లీ ఈ రీఛార్జ్ షాపులను భర్తీ చేయాల్సి వచ్చింది.

ఇప్పుడు ఇవి షాపులను కొనడానికి మరియు విక్రయించడానికి మరియు మరమ్మతు చేయడానికి మొబైల్ ఫోన్లు మాత్రమే. 


అయితే ఇది కూడా అతి త్వరలో మారుతుంది. *అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుండి నేరుగా మొబైల్ ఫోన్ అమ్మకాలు పెరుగుతున్నాయి*.


*డబ్బు నిర్వచనం కూడా మారుతోంది*

*ఒకప్పుడు నగదు ఉండేది కానీ నేటి యుగంలో అది "ప్లాస్టిక్ మనీ"గా* మారిపోయింది.

*క్రెడిట్ కార్డ్ మరియు డెబిట్ కార్డ్ రౌండ్ కొన్ని రోజుల క్రితం*.

*ఇప్పుడు అది కూడా మారి మొబైల్ వాలెట్ యుగం రాబోతోంది*

*Paytm యొక్క పెరుగుతున్న మార్కెట్, మొబైల్ డబ్బు యొక్క ఒక క్లిక్*.


*వయస్సుతో మారలేని వారిని భూమి నుండి తొలగిస్తుంది*


*కాబట్టి కాలంతో పాటు మారుతూ ఉండండి*.


గొప్ప కంటెంట్‌ని సృష్టించడం కొనసాగించండి.

*సమయంతో పాటు కదులుతూ ఉండండి*.🙏

*శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔


  🙏  *శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏


   *ఆలంచున్మెడఁగట్టి దానికినపత్య శ్రేణిఁ గల్పించి త*

   *ద్బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధంబుగావించి యా*

   *మాలర్కంబున బాంధవంబనెడి ప్రేమంగొందఱం ద్రిప్పఁగా*

   *సీలన్సీలయమర్పిన ట్లొసంగితో శ్రీకాళహస్తీశ్వరా!!!*


            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 36*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! పెండ్లామును మెడకు గట్టి, దానికి బిడ్డలను ఇచ్చి, వారి ద్వారా ఇంకంత సంబంధబాంధవ్యాలను పెంచి నా మనస్సుకు ఈ విధముగా చీల పై చీల వేసి ఈ సంసారకూపములో ఇరుక్కొనిపోయే విధముగా చేసితివా ప్రబో!*


✍️🌺🌷🌹🙏

ఏడు అద్భుతాలు*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*మన చుట్టూ ఏడు అద్భుతాలు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

1) *తల్లి* 

*మనల్ని ఈలోకానికి పరిచయం చేసిన వ్యక్తి... మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన... తల్లి మొదటి అద్భుతం.*


2) *తండ్రి* 

*మన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని తన కన్నీళ్లను దాచేస్తాడు. మన పెదవులపై చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు. దుఃఖాన్ని తాను అనుభవిస్తూ.. సంతోషాన్ని మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం.*


3) *తోడబుట్టిన వాళ్ళు* 

*మన తప్పులను వెనుకెసుకురావాడానికి... మనతో పోట్లాడడానికి... మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు...తోడబుట్టినవాళ్లు మూడో అద్భుతం.*


4) *స్నేహితులు*  


*మన భావాలను పంచుకోడానికి.. మంచిచెడు అర్థం అయ్యేలా చెప్పడానికి...ఏది ఆశించకుండా.. మనకు దొరికిన స్నేహితులు నాలుగో అద్భుతం.*


 5) *భార్య* / *భర్త* 

*ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను... ఎదిరించేలా చేస్తుంది. కలకాలం తోడు ఉంటూ...ఇన్నిరోజులు తోడు ఉన్న అన్ని బంధాలకంటే... ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది. భార్య/భర్త అర్థం చేసుకునేవారు దొరికితే ఐదో అద్భుతం మన సొంతం .*


6) *పిల్లలు* 

*మనలో స్వార్థం మొదలవుతుంది.. మన పిల్లలు బావుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది... వారి ఆలోచనలే ఎప్పుడూ చుట్టూ ఉంటాయి.. వారికోసం మాత్రమే గుండె కొట్టుకుంటూ ఉంటుంది.. వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని... తల్లి తండ్రులు అసలు ఉండరు...పిల్లలు ఆరో అద్భుతం.*


7) *మనవళ్ళు* *మనవరాళ్లు* 

*వీరికోసం ఇంకా కొన్నిరోజులు బతకాలనే ఆశపుడుతుంది.. వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరిచిన మనమే ఒక అద్భుతం. మళ్ళీ పసిపిల్లలం...అయిపోతాం. వీరు మన జీవితానికి దొరికిన.. ఏడో అద్భుతం.*


*ఇలా అద్భుతాలన్నీ మన చుట్టూ ఉంటె అక్కడెక్కడో వెళ్లి వెతుకుతుంటాం... కాసింత ప్రేమ చాలు... ఇంకెన్నో అద్భుతాలు మన సొంతం అవుతాయి. చిన్న పలకరింపు చాలు... మనల్ని ఆ అద్భుతంగా చూడడానికి. అందుకే అందరిని చిరునవ్వుతో స్వాగతించి మరో అద్భుతాన్ని సృష్టించేద్దాం ..*


🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

నేను కనుక లేకపోతే?*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

      *నేను కనుక లేకపోతే?*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*అశోక వనంలో రావణుడు... సీతమ్మ వారి మీదకోపంతో... కత్తి దూసి, ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు.... హనుమంతుడు అనుకున్నాడు 'ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని  రావణాసురుని తలను ఖండించాలి' అని.*


*కానీ మరుక్షణంలోనే మండోదరి... రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు! ఆశ్చర్య చకితుడయ్యాడు.*


*'"నేనే కనుక ఇక్కడ లేకపోతే... సీతమ్మను  రక్షించే వారెవరు... అనేది నా భ్రమ అన్నమాట" అనుకున్నాడు హనుమంతుడు!*


*బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం,  'నేను లేకపోతే ఎలా?' అని.*


*సీతామాతను రక్షించే పనిని, ప్రభువు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు.*


*అప్పుడు హనుమంతుడుకి అర్థమైంది  'ఎవరి ద్వారా ఏ కార్యాన్ని  చేయించుకోవాలో... వారి ద్వారానే ప్రభువు ఆపని చేయించుకుంటాడు' అని.*


*మరింత ముందుకు వెళితే త్రిజట ....తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందనీ, అది లంకను కాల్చివేస్తుందనీ..దాన్ని నేను చూశాను ....అనీ చెప్పింది. అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి మాత్రమే రమ్మన్నాడు, అంతేకానీ లంకను కాల్చి రమ్మని చెప్పలేదు. తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం.. అనుకున్నాడు.*


*అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను ...అని చెప్పింది.*


*హనుమంతుడు ధర్మ మీమాంసలో పడ్డాడు... తను ఇప్పుడు ఏం చేయాలి? సరే, ప్రభువు ఇచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది.... అనుకున్నాడు. హనుమంతుని చంపడానికి రావణుడి సైనికులు పరిగెత్తుకొని వస్తున్నప్పుడు... హనుమంతుడు ఏమి చేయలేదు. అలా నిలబడ్డాడు. అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి 'అన్నా! దూతను చంపటం నీతి కాదు' అన్నాడు. అప్పుడు హనుమంతునికి అర్థమైంది, తనను రక్షించే భారం ప్రభువు విభీషణుని  పై ఉంచాడు అని.*


*ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే .... విభీషణుడు ఆ మాట చెప్పగానే... రావణుడు  ఒప్పుకుని 'కోతిని చంపొద్దు. కోతులకు తోకంటే మహా ఇష్టం . తోకకు నిప్పు పెట్ట0డి' అన్నాడు. అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది త్రిజట స్వప్నం నిజం కాబోతుంది అని.*


*"ప్రభువు నాకే చెప్పి ఉంటే... నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి, ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి, ఎప్పుడు లంకను తగలబెట్టాలి! "ఆలోచనల వరంపరతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు.*


*పరమాశ్చర్యం ఏంటంటే... వాటన్నిటికే ఏర్పాట్లు... రావణుడే స్వయంగా చేయించాడు. అంటే, రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు ....తనకు"లంకను చూసి రా"అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యం ఏముంది!*


*అందుకే ప్రియ భక్తులారా! ఒకటి గుర్తుంచుకోండి. ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది. మనమంతా కేవలం నిమిత్తమాత్రులం . అందువల్ల ‘నేను లేకపోతే ఏమవుతుందో।అన్న భ్రమలో ఎప్పుడూ పడవద్దు 'నేనే గొప్పవాడి'నని గర్వపడవద్దు.*


*భగవంతుడి కోటానుకోట్ల దాసులలో అతి చిన్నవాడను అని   ఎరుక కలిగి ఉందాం.*


*జై శ్రీ రామ్।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - వర్ష ఋతువు - భాద్రపద మాసం - శుక్ల పక్షం  - ఏకాదశి - ఉత్తరాషాఢ -‌‌ స్థిర వాసరే* (14.09.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

జగన్నాధ ప్రసాదం*

            *జగన్నాధ ప్రసాదం*

                    ➖➖➖✍️


ఒకప్పుడు నారదముని వైకుంఠానికి వెళ్ళి , భక్తితో లక్ష్మీదేవిని సేవించాడు. అతని సేవకు ఎంతో ప్రసన్నురాలైన లక్ష్మీదేవి, ఏదైనా వరం కోరుకొమ్మని అంటుంది. అప్పుడు నారదముని, “అమ్మా! అలా అయితే నేను ఏ వరం కోరినా ఇస్తానని మొదట మాట ఇవ్వు” అంటాడు.


 “దేనినైనా సరే, సంతోషంగా ఫలించేలా ఇస్తాను” అని మాట ఇస్తుంది ఆమె. 


నారద మహర్షి వెంటనే తన మనసులో ఉన్న కోరికను బయట పెడతాడు, “నేను శ్రీవారి మహాప్రసాదాన్ని అపేక్షిస్తున్నాను తల్లీ” అని.


ఆ మాట వినగానే లక్ష్మీదేవి ముఖం ఆందోళనతో నిండిపోతుంది. “కుమారా! దయచేసి ఈ వరం తప్ప మరేదైనా కోరుకో, కొద్దిరోజుల క్రితం తనకు అర్పించిన మహాప్రసాదాన్ని ఎవరికీ ఇవ్వొద్దని శీమన్నారాయణుడు నన్ను ఆజ్ఞాపించారు. అందువలన నేను నీకు మహాప్రసాదాన్ని ఇవ్వలేను నాయనా! ఆయన ఆనతిని నేను అతిక్రమించలేననే విషయం నీవు గ్రహించు, ఇది తప్ప వేరే దేనిని నీవు ఆశించినా వెంటనే ఫలప్రదం చేస్తాను.” అంది.

అయితే నారదముని తన మొండి పట్టుదల వదల్లేదు. “తల్లీ ! నీవు నాకు మాట ఇచ్చావు శ్రీమన్నారాయణుడికి ప్రియ సతివైన నీకు ఇది కష్టమైనదేం కాదు, ఎలాగో ఒకలాగ నాకు మహాప్రసాదాన్ని అనుగ్రహించ వలసిందే!” అన్నాడు.


లక్ష్మిదేవికి గొప్ప చిక్కు వచ్చిపడింది, ‘ఇప్పుడు ఏం చెయ్యాలి?’ ఆమె నారదుడితో కొంత సమయం వేచి ఉండమని చెబుతుంది.


ఆ రోజు మధ్యాహ్నం ఆమె నారాయణుడికి చాలా శ్రద్ధగా , జాగ్రత్తగా భోజనం వడ్డిస్తూ ఉంది. ఎంతో అణుకువగా తన పని చేస్తున్నప్పటికీ ఆమె ఉదాసీనంగా ఉండడం శ్రీహరి గమనించాడు, ఆమె ముఖం నిరాశతో ముడుచుకుని పోయి ఉంది. ఆయన ఎంతో మృదువుగా ఆమె దుఃఖానికి హేతువేమిటని ప్రశ్నించాడు. ఆ లాలనకు కరిగిపోయిన లక్ష్మి, తనకు వచ్చిన ఇబ్బందిని గురించి గద్గదికంగాచెప్పుకుంది, నారాయణుడు ఆమెను ఓదార్చి ‘దుఃఖించకు, ఈ రోజుకు మాత్రం ఈ నియమాన్ని రద్దు చేస్తాను, నేను మిగిలించిన ప్రసాదాన్ని నీవు నారదుడికి ఇవ్వొచ్చు, అయితే నా కంట పడకుండా నీవు ఈ పని చేయాలి, నేను ప్రక్కకు తిరిగి ఉన్నప్పుడు నాకు తెలియనట్లుగా ఈ పళ్ళెం తీసుకుని వెళ్ళు’ అన్నాడు. శ్రీలక్ష్మికి పట్టరానంత ఆనందం కలిగింది. తన ప్రియమైన నాథుడు ఆదేశించినట్లుగానే చాలా నేర్పుగా ఆమె భుక్త శేషంతో కూడిన పళ్ళాన్ని ప్రక్కకు తీసేసింది.


లక్ష్మీదేవి వెంటనే మహాప్రసాదం ఉన్న పళ్ళాన్ని ఆనందంగా నారద మునికి అందించింది. 


నారదముని ఎంతో ఆత్రుతగా, వినమ్రంగా ప్రసాదాన్ని ఆరగించాడు. శ్రీమన్నారాయణుడి ప్రసాదాన్ని ఆస్వాదిస్తూ భుజించిన నారదముని, తన ఆనందోద్వేగాన్ని, ఆపుకోలేకపోయాడు. ఒక్క క్షణం కూడా హరి నామస్మరణను ఆపకుండా పారవశ్యంతో నర్తించడం మొదలు పెట్టాడు. ఆ మైమరపు తారస్థాయికి చేరి తనను తాను నియంత్రించుకో లేక వీణను పట్టుకుని, ఉన్మత్తుడిలా, ఒక లోకం నుండి మరొక లోకానికి పరిగెడుతూ, చివరికి కైలాసాన్ని చేరాడు. శివుడు అతడి పరిస్థితిని చూసి ఆశ్చర్యంతో తలమునకలయ్యాడు. విష్ణు-భక్తి తరంగాలలో ఈదులాడుతున్న నారదుడు శివుడిని గమనించలేదు. “నారదా! నిరంతరం నారాయణుడిని తలచుకుంటూ ఉండడం వలన, నీవు ఎప్పుడూ పరమానందంగానే ఉంటావు. అయితే ఇటువంటి స్థితిలో నిన్ను ఎన్నడూ చూడలేదు, ఏమయ్యింది నీకు?” నారదుడిని సమాధాన పరచడానికి ప్రయత్నిస్తూ శివుడు ప్రశ్నించాడు. 


నారదముని కాస్త స్థిమిత పడి, జరిగిన విషయాన్ని వివరంగా చెప్పాడు. “భగవంతుడి మహా ప్రసాదం స్వీకరించిన ఆనందంలో ఆ తరువాత నన్ను నేను మరచిపోయాను, పారవశ్యంలో మునిగిపోయి స్వామివారి కీర్తన, నర్తనలో మునిగిపోయాను.” ఊపిరి తిప్పుకోకుండా నారదుడు తన అనుభవాన్ని వివరిస్తుంటే, శివుడు రెండు చేతులూ జోడించి, “ఓఁ నారదా! నీవెంతటి భాగ్య వంతుడివి?! నారాయణుడి మహా ప్రసాదాన్ని రుచి చూసే అదృష్టం నీకు లభించింది, ప్రియమైన నారదా! నా కోసం కాస్త ప్రసాదం తెచ్చే ఉంటావు కదా!” అంటూ చాలా నమ్మకంగా చిరు నవ్వు నవ్వాడు.


శివుడి కోసం తను ప్రసాదం తీసుకు రానందుకు నారదుడికి విచారం కలిగింది. తలవాల్చుకుని, చేతులు జోడించి, శివుడి ఎదుట నిలబడ్డాడు, అప్పుడతడికి తన చేతి వేలి గోటికి అంటుకుని ఉన్న ప్రసాదం కాస్త కనిపించింది. వెంటనే భారం తగ్గినట్లుగా ఊపిరి వదిలి, “నిజమే! ఇదిగో, నీకు మాత్రమే సరిపోయే ‘కనిక మ్రాత’ ప్రసాదం.” తన చేతిని చాలా జాగ్రత్తగా ముందుకు చాచి “నీవు చాలా అదృష్టవంతుడివి, ఇదిగో ప్రసాదం” అంటూ తన వేలిని శివుడి నోటిలో పెట్టాడు.


ఎప్పుడైతే అల్ప పరిమాణంలో ఉన్న ప్రసాద లేశం మహాదేవుడి జిహ్వకు తాకిందో వెంటనే తీవ్రమైన ఆనందంతో అతని ఒళ్ళు గగుర్పొడిచింది. వెంటనే ఆనందోద్రేకంతో తాండవం చెయ్యడం మొదలు పెట్టాడు, అతనిలో పారవశ్యం ఎక్కువవుతూ ఉంటే, నాట్యంలో ‘వడి’ కూడా పెరిగింది. రాన్రాను ఆ నాట్యం ప్రళయ తాండవంగా మారసాగింది. సమస్త జగత్తు కంపించడం ప్రారంభమయ్యింది, అందరూ భయంతో వణికి పోయారు, “ఏం జరుగుతూ ఉంది? జగత్తు అంతం కావడానికి ఇది సమయం కాదు, అకాలంలో ఈయన ఎందుకు నర్తిస్తున్నాడు?”


శివుడు చేస్తున్న విలయ తాండవాన్ని ఆపడానికి ఎవరికీ ధైర్యం చాల లేదు. దేవతలందరూ పార్వతీ దేవి దగ్గరకు వెళ్ళి, “ఆయనను శాంత పరచమనీ, లేదంటే విశ్వం అంతరించడం తప్పదని” మొరపెట్టుకున్నారు. పార్వతీ దేవి అక్కడకు వచ్చి ఆపడానికి శక్యం కానంతటి భావావేశంలో నర్తిస్తున్న శివుడిని చూసింది. ఆమె చొరవ తీసుకోవడంతో బాహ్యస్మృతిలోకి వచ్చాడు శివుడు. “ప్రాణనాథా! ఏం జరిగింది? మీ అదుపు తప్పిన పారవశ్యానికి కారణం ఏమిటి”? అని పార్వతీ దేవి పశ్నించింది.


సమాధానంగా శివుడు, నారద ముని నుండి నారాయణుడి మహా ప్రసాదాన్ని పొందిన విషయాన్ని గురించి వివరించాడు, ఆమె దిగ్భ్రమతో “నాథా! నా కోసం కాస్త ప్రసాదాన్ని ఉంచారా?” అంటుంది. 


శివుడు సమాధానం ఇవ్వలేక పోతాడు. ఎందుకంటే అతనికి దొరికిందే అణువంత, అందులో మళ్ళీ పార్వతి కోసం ఉంచడం ఎలా సాధ్య పడుతుంది? తనకు ప్రసాద భాగ్యం లేదని తెలియగానే ఆమెకు ఆవేశం ముంచుకొచ్చింది. ఆమె ఆగ్రహ జ్వాలలు అధోలోకాల నుండి ఊర్ధ్వలోకాల వరకు పాకాయి. ముల్లోకాలలోని సమస్త ప్రాణికోటీ దహించివేస్తున్న ఆ వేడిమిని భరించలేక పోయింది. ఋషులూ, సాధు పురుషులూ, ఆమె క్రోధాగ్నిలో సమస్తము అంతం కాబోతుందని అర్థం చేసుకున్నారు. శివుడితో సహా ఎవరూ ఆమె కోపాగ్నిని చల్లార్చలేక పోయారు.


చివరికి దేవతలందరినీ వెంట బెట్టుకుని, బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళ్ళి పరిస్థితిని గురించి వివరించాడు. వెంటనే నారాయణుడు గరుడునిపై ఎక్కి కైలాసాన్ని చేరుకున్నాడు. ఆయనను చూడగానే పార్వతీదేవి ముందుకు వచ్చి గౌరవ ప్రణామాలు అర్పించింది. నారాయణుడు వాత్సల్యంతో ఆమెను ఆదరించి, “నీవు కోరినంత మహా ప్రసాదాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను, దయచేసి నీ కోపాన్ని వదిలేసి శాంతించు, లేకపోతే నీ బిడ్డలందరూ నశించి పోతారు” అని సముదాయించాడు.


అయితే పార్వతీ దేవి తన అసమ్మతిని తెలియజేస్తూ “నువ్వు నాకు మాత్రమే మహా ప్రసాదం ఇచ్చినప్పటికీ నాకు సంతృప్తి కలగదు. సమస్త ప్రాణికోటికీ నీ మహాప్రసాదం అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ప్రసాదం లభించక పోవడం వలన నేను అనుభవించిన నిరాశా, నిస్పృహలు ఇతరులు ఎవ్వరూ అనుభవించకూడదు. మనుష్యులే కాదు, కుక్కలు మొదలైన ఇతర ప్రాణులన్నీ కూడా ఈ మహాభాగ్యానికి నోచుకునేలా నీవు ఏదైనా ఏర్పాటు చేయాలి” అంటుంది.


నారాయణుడు చిరునవ్వు నవ్వి “తథాస్తు! అలాగే కానీ” అన్నాడు. “ప్రియమైన పార్వతీ, నీ కోరిక తీర్చడం కోసం నేను, నీలాచల ధామంలో అవతరిస్తాను. నా మందిరం ప్రసాద వితరణతో ప్రఖ్యాతి చెందుతుంది. నా ప్రసాదాన్ని స్వీకరించిన వాళ్ళందరూ భవసాగరం నుండి బయట పడగలుగుతారు. నా ప్రసాదాన్ని మొట్టమొదట నీకే అర్పిస్తారు, అప్పుడే అది మహాప్రసాదంగా అంగీకరించ బడుతుంది. ఈ మహాప్రసాదం గొప్పవాళ్ళు, అల్పులు, ప్రాణులు, హీనులు అనే తారతమ్యాలు లేకుండా అందరికీ వితరణ చేయబడుతుంది. నీ మందిరం నా వెనుక వైపున ఆలయ ప్రాగణం లోపలనే ఉంటుంది. మహా-ప్రసాదం విషయంలో నిన్ను పట్టించుకోక పోవడం వలన, శివుడి మందిరం కాస్త దూరంలో నా ఆలయ ప్రాగణానికి వెలుపలి వైపున ఉంటుంది.”


పార్వతీ దేవికి మాట ఇచ్చినట్లుగానే భగవంతుడు జగన్నాథుడిగా పూరీ క్ష్రేతంలో వెలిశాడు. పార్వతీ దేవి ‘విమల’ అనే పేరుతో కొలువై ఉంది. జగన్నాథుడికి అర్పించిన తర్వాత ప్రసాదం అంతా మొదట విమలా దేవికి సమర్పిస్తారు. జగన్నాథ మహా ప్రసాదాన్ని పూరీ వాసులే కాకుండా, పూరీ క్ష్రేతాన్ని దర్శించడానికి వెళ్ళిన ప్రవాసులు అందరూ కూడా భక్తితో స్వీకరించి ధన్యులవుతున్నారు.✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖