19, జూన్ 2022, ఆదివారం

Father

 One who loves till her eyes close, is a *Mother*.

One who loves without an expression in the eyes, is a *Father*.

____________________________

*Mother* - Introduces you to the world.

*Father* - Introduces the world to you.

___________________________

*Mother* : Gives you life

*Father*   : Gives you living

__________________________

*Mother* : Makes sure you are not starving.

*Father*  : Makes sure you know the value of starving

__________________________

*Mother* : Personifies Care

*Father*: Personifies Responsibility

__________________________

*Mother* : Protects you from a fall

*Father* : Teaches you to get up from a fall.

__________________________

*Mother* : Teaches you walking.

*Father* : Teaches you walk of life

__________________________

*Mother* : Teaches from her own experiences.

*Father* : Teaches you to learn from your own experiences.

__________________________

*Mother* :  Reflects Ideology

*Father* :  Reflects Reality

___________________________

*Mother's* love is known to you since birth.

*Father's* love is known when you become a Father.

_________________________


        

Happy Father's Day🙏🏻

వృద్ధుడు కాడు.

 శ్లోకం:☝️

*న తేన వృద్ధో భవతి*

    *యేనాస్య పలితం శిరః |*

*యో వై యువాఽప్యధీయాన-*

    *స్తం దేవాః స్థవిరం విదుః ||*


భావం: తల నెరిసినవాడు వృద్ధుడు కాడు. వారు కేవలం శారీరకంగా వృద్ధులు. యువకుడైననూ ఎవరు పండితుడో వానిని దేవతలు సహితం వృద్ధయని యందురు. అంతేకదా మరి. జ్ఞాన వృద్ధులే వృద్ధులు కాని వయోవృద్ధులైనంత మాత్రాన వారు వృద్ధులు కారు!

కొంగు చాటు బాలుడు

 కొంగు చాటు బాలుడు. 

బాల్యంలో పిల్లలు తోటి పిల్లలతో ఆడుకుంటూ ఏదైనా స్పర్ధవస్తే తోటివాడు కొట్టటానికి వస్తే వెంటనే ఆ ప్రక్కనే వున్న అమ్మ కొంగుచాటున దాక్కోవటం సర్వసాధారణం.  ఒక్కసారి గతంలోకి వెళ్లి చుస్తే ఈ సంఘటన ప్రతిమనిషి జీవితంలో ఎప్పుడో ఒక్కప్పుడు జరిగివుంటుంది.  కొంగు చాటున వున్న పిల్లాడిని ఎదుర్కోవటం తోటి బలులకు ఎంతమాత్రం సాధ్యం  కాదు. వాడు తరువాత దొరికితే ఆ పిల్లవానిని అరె వీడు ఒట్టి పిరికివాడురా ఎదురు నిలువలేక వాళ్ళ అమ్మ కొంగు వెనకాల దాకుంటాడురా అని ఆటపట్టియటం సర్వ సాధారణం. ఇక విషయానికి వస్తే 

ప్రతి బ్రాహ్మడు  కూడా కొంగుచాటు పిల్లవాడే కొంగుచాటున వున్న బ్రహ్మనుడిని ఎవ్వరు ఏమిచేయలేరు. మరి వాళ్ళు ఏతల్లి కొంగుచాటు పిల్లలు అంటే సాక్షాత్తు జగన్మాత అయిన గాయిత్రి మాత కొంగుచాటు పిల్లలు. ఏ బ్రాహ్మణుడైతే నిత్యం గాయత్రి జపం దీక్షతో, శ్రద్ధతో, త్రికరణ శుద్దితో నియమానుసారం క్రమశిక్షణతో, ఆచరిస్తాడో ఆ బ్రాహ్మణని ఆ గాయత్రీ మాత సదా వెన్నంటివుండి కాపాడుతుంది.  గాయత్రి జపం చేసే బ్రాహ్మడికి  ఎట్టి పరిస్థితిలోను, ఈతిబాధలు కలుగవు, పేదరికం దరిదాపుల్లో ఉండదు, కుటుంబం సుభిక్షంగా ఉంటుంది, కుటుంబ సంబందాలు సదా ప్రేమమయంగా, సంతోషంగా  ఉంటాయి, ముఖం సదా బ్రహ్మ తేజస్సుతో విరాజిల్లుతుంది, శరీరం శోభాయమానంగా ఉంటుంది, రోగాలు దరిచేరవు. వాక్కు అమృతతుల్యంగా మారుతుంది.  వాని మాటలు వేదవాక్కుగా పనిచేస్తాయి.,  ఆచరించే కర్మలు సదా సత్కర్మలే అవుతాయి. రుణబాధలు వుండవు.  తిండికి లోటుండదు. ఆ బహ్మడు సదా పలువురితో పూజింపబడతాడు.  అందరు అతనిని ఉన్నతునిగా  చూస్తారు. ప్రతివారు అతనిని ఇష్టపడతారు. తాను ఎట్టి పరిస్థితిలోను దుష్కర్మలు చేయడు ఎందుకంటె ఆ గాయత్రీమాత సదా వాని హృదయంలో ఉండి అతని జీవితానికి దిశా నిర్దేశనం చేస్తుంది. 

గాయంతం త్రాయతే ఇతి గాయత్రి.గాయంతం అంటే గానం చేయడం,పాడడం.గాయత్రి మంత్రాన్ని నిత్యం గానం చేసే వారిని రక్షించేది గాయత్రి మాత  అని అర్దం.
గాయత్రి చంధసాం మాత.అంటే అన్ని మంత్రాలకు తల్లి గాయత్రి.అని భావం
తద్యత్ ప్రాణం త్రాయతే తస్మాద్, గాయత్రి., ప్రాణాలను రక్షించేది గాయత్రి అని అర్దం.

గాయత్రి వేదమాత.గాయత్రి మంత్రానికున్న శక్తి అపారమైనది, వర్ణించలేనిది. జ్ఞాపక శక్తిని పెంచి తీరుతుంది.24 అక్షరాల ఈ మహా మంత్రానికి 32 మంది అధిదేవతలున్నారు.ఈ మంత్రాన్ని రక్షించేవారు. శివుడు, విష్ణువు, బ్రహ్మ, నరసింహుడు, ఇంద్రుడు, సూర్యుడు..... ఇలా. ఒక్కసారి గాయత్రి మంత్రాన్ని జపిస్తే ఇంతమంది దేవతలు  మన నిత్య జీవితంలో ఏదురయ్యే కష్టాలను తొలగించుతారు.  అంతేకాదు  32 దేవతలను స్మరించిన ఫలితం వస్తుంది.

అందుకే "గాయత్రి పరమో మంత్రః"అన్నారు.అంటే గాయత్రికి మించిన మంత్రం లేదు అని.అర్ధం 

గాయత్రి మంత్రం మీద జరుగినవి,జరుగుతున్న పరిశోధనలు మరే మంత్రం మీద కాని,ఇతర మతాల్లోని ఏ అంశం మీద గాని జరగట్లేదంటే అతిశయొక్తి కాదు.గాయత్రి మంత్రాన్ని నియమంగా, పట్టుదలతో, శాస్త్రం చెప్పిన రీతిలో,సరైన స్వరంతో చేస్తే సౌరశక్తికి 1లక్ష రెట్ల శక్తి జపించేవారికి కలుగుతుందని పరిశోధకులు చెప్పారు.

ఈ మంత్రంలో ఉన్న 24 అక్షరాలు మన శరీరంలో ఉన్న 72000 నాడులను ప్రేరేపిస్తాయని,మన ముఖ భాగంలోని కదలికలతో మన శరీరంలో ఉన్న 6 చక్రాలను ప్రభావితం చేసి కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది.శోచనీయయిన విషయం ఏమిటంటే ఈ రోజు గాయత్రి మంత్రం యెక్క శక్తిగూర్చి విదేశీయులు పరిశోధనలు చేస్తుంటే మనదేశంలో పుట్టి పెరిగిన బ్రాహ్మణ్యం గాయత్రి మాతను వదలి విదేశీ వ్యామోహంలో పడి వారి ఉనికికే ముప్పు తెచుకుంటున్నారు.  కాబట్టి మిత్రమా ఈ రోజు నీకు ఆ భగవంతుండు బ్రాహ్మణ జన్మ ఇచ్చాడు అంటే అది నీవు ఎన్నోజన్మలలో చేసుకున్న మంచి ప్రారబ్ధ ఫలం.  ఈ జన్మను నిరర్ధకం చేసుకోకు. సదా నియమనిష్టలతో నీ జీవితాన్ని మలచుకొని మోక్షప్రాప్తికి కృషిచేయి. 

మన సాంప్రదాయాలను గౌరవిద్దాం మరియు ఆచరిద్దాం. పంచ కట్టుకోవటం వెనకపడిన తనం కాదు అది మిమ్ములను ఆధ్యాత్మిక మార్గంలో పయనించటానికి ఏర్పరచిన ఒక చక్కటి వస్త్రధారణ, శిఖదారణ చేయటం మూర్ఖత్వం కాదు ప్రతి బ్రాహ్మడు విధిగా శిఖ కలిగి ఉండటం ఆవశ్యకం.  శిఖ లేకుండా ఆచరించే ఏ క్రతువు కూడా ఫలితాలను ఇవ్వదు.  మన దురదృష్టం ఏమిటంటే కేవలం పితృ కర్మలను ఆచరించేటప్పుడే శిఖ ధరించటం ఆనవాయతీగా అనుకుంటున్నాము.  కానీ మిత్రమా శిఖ లేకుండా నీవు సంధ్యావందనం చేయటానికి కూడా అయోగ్యుడవే అది తెలుసుకో. పౌరోహితం చేసే బ్రాహ్మణోత్తములు ఈ విషయం ప్రతి బ్రాహ్మణుడికి తెలపాల్సిన అవసరం వున్నది.  ముందుగా వారు ఆచరించాల్సిన వీధికుడా వున్నది. . ఎలాంటి కర్మలు చేస్తే ఎలాంటి ఫలితాలు చేకూరుతాయి అన్నది మన మహర్షులు శోధించి సాధించి మనకు ఒక చక్కటి జీవన విధానాన్ని ఏర్పాటు చేశారు.  కేవలం మనం వారిని అనుసరించి,  వాటిని ఆచరించి తరించటమే మన కర్తవ్యము. కాబట్టి మిత్రమా ఇప్పుడే మేల్కొని గాయత్రి మాత అనుగ్రహాన్ని పొందే విధంగా నీ జీవన సరళిని మార్చుకొని సత్ బ్రాహ్మణుడిగా మారటానికి ఉద్యుక్తుడివి కమ్ము.  నీ గమ్యాన్ని చేరుకునే దిశలో పయనించు సదా గాయత్రి తల్లి మనకు అండగా వుంటూ రక్షిస్తుంది. 


ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః 

సదా బ్రాహ్మణోద్దారణకు పాటు పడ సంకల్పితుడు 

మీ భార్గవ శర్మ

శిఖ లేని బ్రాహ్మడు బ్రహ్మ్మడే కాదు 

 




దక్షిణావర్తి శంఖం

 దక్షిణావర్తి శంఖం యొక్క ప్రత్యేకత - 2 . 


      అంతకు ముందు పోస్టు నందు మీకు దక్షిణావర్తి శంఖం గురించి మీకు వివరించాను . ఇప్పుడు మీకు దక్షిణావర్తి శంఖం యొక్క పూజావిధానం వివరిస్తాను . 


     ఎటువంటి అవలక్షణాలు లేనటువంటి దక్షిణావర్తి శంఖమును సేకరించుకుని ముందుగానే కర్రతో చేసిన ఆసనము పైన ఒక ఎర్రని కొత్త గుడ్డని పరచి దానిపై శంఖువు యొక్క శిఖరం తూర్పు ,ఉత్తర ఈశాన్యం వైపు ఉంచాలి. ఇలా పెట్టడానికి ముందుగా కొన్నిరకాల స్నానాలు చేయించాలి . మొదట శుద్ధోదక స్నానం అనగా శుభ్రమైన నీటితో స్నానం తరువాత పంచామృత స్నానం ( తేనె , ఆవుపాలు , ఆవుపెరుగు , ఆవునెయ్యి , బెల్లం పంచామృతాలు .బెల్లం లేనప్పుడు పంచదార వాడవచ్చు .)  అటుపిమ్మట ఫలోదక స్నానం అనగా కొబ్బరి , బత్తాయి , నారింజ మొదలైన ఫలరసాలతో స్నానం చివరగా మరొక్కసారి శుద్ధోదక స్నానం చేయించాలి . 


                శుద్ధోధక స్నానం అయిన తరువాత శంఖానికి బొట్టుపెట్టి పసుపు , గంధములు మిశ్రమములు లేపనం చేసి ఆసనం పైన కూర్చుండబెట్టిన తరువాత ధూపదీపాలను సమర్పించాలి . అగరుబత్తి ధూపముతో పాటు సాంబ్రాణి ధూపము కూడా వేయవలెను . తరువాత పుష్పాలతో  అర్చిస్తూ క్రింద చెప్పబోవు మంత్రమును 1116 సార్లు ఉచ్చరించాలి . 


 మంత్రం  - 


 ఓం శ్రీo దక్షణావర్తి శంఖాయ నమః . 


       ఇక్కడ ముఖ్యముగా మరొక్క విషయాన్ని గుర్తు ఉంచుకొనవలెను . శంఖపూజ చేయుటకు మునుపు గణపతి పూజ చేయవలెను . హోమాము చేయించే ఓపిక ఉన్నవారు కనీసం 1116 సార్లు మంత్రోచ్ఛారణతో హోమము చేయించి ఆ హోమగుండము నందలి విభూధిని శంఖానికి మొత్తం లేపనం చేసి ఆ తరువాత శంఖాన్ని పూజాస్థలము నందు పెట్టుకోవాలి . నైవేద్యం ఏదైనా తియ్యని వస్తువును సమర్పించవచ్చు . ఓపిక ఉన్నవారు శ్రీమహాలక్ష్మి సహస్త్ర నామార్చన చేయించుట మంచిది . 


  దక్షిణవర్తి గృహము నందు ఉండటం వలన కలిగేడు శుభాలు  - 


 *  ఈ శంఖువు యే గృహము నందు ఉండునో ఆగృహము నందు దరిద్రం అనే మాట వినిపించదు . 


 *  గృహములో ఎక్కడ ఉంచితే అక్కడ అభివృద్ధి కనపడును . 


 *  అన్నగృహములో అన్నవృద్ధి , లాకర్లు , అలమారాలు వాటిలో ధనవృద్ధి , పూజగది యందు ఉంచిన సమస్త సంపదల వృద్ది జరుగును . 


 *  దీని యందు గంగాజలం నింపి చల్లిన బ్రహ్మహత్యాది పాపాలు నశించును . సమస్త వస్తువులు , గృహము అంతా చల్లిన అన్ని రకాల దోషాలు పోవును భూతప్రేత , పిశాచ బాధ తప్పును . 


 *  నెగిటివ్ శక్తి నశించును . 


      పైన చెప్పిన ఫలితాలు సంపూర్ణముగా సిద్ధించాలి అంటే దోషములు లేనటువంటి శంఖువు సేకరించి శాస్త్రోక్తముగా పూజ జరిపించి గృహము నందు ఉంచుకొనవలెను . 


  దోషములు గురించి వివరణ - 


   *  పగిలినది , విరిగినది , ముక్క ఊడినది పనికిరాదు . 


 *  శంఖు పైభాగములో గరుకుగరుకుగా ఉండరాదు . 


 *  మచ్చలు , లోపలికి అణిగి ఉండునట్లు గుంతలుగా ఉండరాదు . 


 *  శంఖువు యొక్క శిఖరము మరియు తోక భాగము రెండుగా చీలడం గాని విరిగిగాని ఉండరాదు . 


       శంఖువు తెలుపు రంగుతో ఉన్న సర్వశ్రేష్ఠం . అలా కానప్పుడు పసుపు చిన్న ఎరుపు రంగుల మిశ్రమముతో ఉన్న కొంత పరవాలేదు . ఈ శంఖువు పుజ చేయుటకు గురువారం పుష్యమి నక్షత్రం , ఆదివారం పుష్యమి నక్షత్రంతో ఉన్న రోజు చాలా మంచిది . ఈ సమయాన్ని "పుష్యార్క యోగము " అని అందురు . లేకున్న విజయదశమి రోజు , కార్తీక పౌర్ణమి రోజు , మకరసంక్రాంతి రోజు పూజ జరిపించుటకు ఉత్తమమైన దినములు .  


       పైన చెప్పిన సమయములు దగ్గరలో లేకున్న రేవతి , విశాఖ , పుష్యమి , శ్రవణం , రోహిణి నక్షత్రాలు బుధ , గురు , శుక్రవారాలలో కలిసినవి సంభవిస్తే ఆ సమయాలలో పూజ  చెయవలెను . ఆయా గ్రహాల సహస్రనామాలతో పూజ చేయుట చాలా మంచిది . 


                        సమాప్తం   


            మరిన్ని అతి సులభ యోగాల కొరకు నా గ్రంథాలను చదవగలరు.


     గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

సర్టిఫికేట్

 *సీనియర్ సిటిజన్స్ కోసం :*

 *మాడిపోయిన బల్బ్ లు*                                                                                                                                  

                  *****

       ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఒక వ్యక్తి అప్పటివరకు తాను నివసించిన అధికారిక నివాసం నుంచి ఒక కాలనీ లోని తన స్వంత ఇంటిలోకి మారాడు. తాను పెద్ద ఉద్యోగస్టుడినని అహంభావం మెండుగా ఉన్నవాడు. ప్రతిరోజూ ఆ కాలనీ లో ఉన్న పార్క్ లో సాయంత్రపు నడకకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు కనీసం వారివంక చూసేవాడు కూడా కాదు. వారంతా తన స్థాయికి తగినవారు కాదనే భావన అతడికి మెండుగా ఉంది. 


     ఒకరోజు అతడు పార్క్ లోని బెంచ్ పై కూర్చుని ఉండగా మరో వృద్ధుడు వ్యక్తి వచ్చి పక్కన కూర్చుని సంభాషణ ప్రారంభించాడు. ఈ వ్యక్తి మాత్రం ఎదుటివ్యక్తి చెప్పే మాటలను ఏమాత్రం విలువ ఇవ్వకుండా తాను నిర్వర్తించిన ఉద్యోగం, హోదా గురించి, తన గొప్పతనం మాత్రమే చెప్పేవాడు. తన వంటి ఉన్నత స్థాయి వ్యక్తి గతిలేక స్వంత ఇల్లు ఉన్నందుకు ఈ కాలనీ ఉంటున్నట్లు చెప్పుకున్నాడు. కొన్ని రోజుల పాటు ఇలా కొనసాగింది. ఆ ముసలాయన మాత్రం ఓపిగ్గా వినేవాడు. ఒక రోజు ఆ వృద్ధుడు నోరు విప్పాడు.

  

     “చూడు నాయనా! విద్యుత్ బల్బు లు వెలుగుతున్నంత వరకే వాటికి విలువ, అవి మాడిపోయిన తరువాత అన్నీ ఒకటే. వాటి రూపం, అవి అందించిన వెలుగులు అన్నీ మరుగున పడిపోతాయి. నేను ఈ కాలనీలో  ఐదు సంవత్సరాల నుండి నివస్తున్నాను, నేను రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా సేవలు అందించానని ఎవ్వరికీ చెప్పలేదు ఇప్పటిదాకా. 

                                                                                                            అంతే .. ఆ అహంభావి మొహంలో రంగులు మారాయి.


     ఆ పెద్ద మనిషి కొనసాగించాడు. "నీకు కుడి పక్కన దూరంగా కూర్చుని ఉన్న ఆ వర్మ గారు భారత రైల్వే లో జనరల్ మేనేజర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఎదురుగా నిలబడి నవ్వుతూ మాట్లాడుతున్న సింగ్ గారు ఆర్మీలో మేజర్ జనరల్ గా ఉద్యోగ విరమణ చేశారు. ఆ మూలగా తెల్లటి బట్టల్లో ఉన్న మెహ్రా గారు ఇస్రో ఛైర్మన్ గా సేవలు అందించారు. ఈ విషయం ఆయన ఎవరితోనూ చెప్పుకోలేదు. నాకు తెలిసిన విషయం నీకు చెబుతున్నాను" 

"మాడిపోయిన బల్బ్ లు అన్నీ ఒకే కోవకు చెందినవని ముందే చెప్పాను కదా. జీరో, 10, 20, 40, 60,100 వాట్ల ఏ బల్బ్ అయినా అవి వెలుగుతున్నంత వరకే వాటి విలువ. ఫ్యూజ్ పోయి మాడిపోయిన తరువాత వాటి కి చెందిన వాట్, అవి విరజిమ్మిన వెలుగులకు విలువ ఉండదు. అవి మామూలు బల్బ్, ట్యూబు లైట్, లెడ్, సి. ఎఫ్. ఎల్., హలోజెన్, డెకోరేటివ్ బల్బ్.. ఏది  అయినా ఒకటే. 


     అందుకే నీతో సహా మనమందరము మాడిపోయిన బల్బ్ లమే. 

ఉదయిస్తున్న సూర్యుడు, అస్తమిస్తున్న సూర్యుడు ఒకేలా అందంగా ఉంటారు. అయితే ఉదయిస్తున్న సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తారు, పూజలు చేస్తారు. అస్తమిస్తున్న సూర్యుడికి చేయరు కదా! ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి. 


       మనం చేస్తున్న, ఉద్యోగం, హోదా శాశ్వతం కాదని తెలుసుకోవాలి. వాటి కి విలువ ఇచ్చి అవే జీవితం అనుకుంటే.. ఏదో ఒక రోజు అవి మనలను వదలి పోతాయనే వాస్తవాన్ని గుర్తించాలి. 

చదరంగం ఆటలో రాజు, మంత్రి.. వాటి విలువలు ఆ బోర్డు పై ఉన్నంత వరకే.. ఆట ముగిసిన తరువాత అన్నింటినీ ఒకే డబ్బా లో వేసి మూత పెడతాము. 


     ఈ రోజు నేను సంతోషంగా ఉన్నానని భావించు, ముందు ముందు కూడా సంతోషంగా ఉండాలని ఆశించు..

 

     మన జీవితంలో ఎన్ని సర్టిఫికట్లు పొందినా.. చివరికి అందరూ సాధించే సర్టిఫికెట్ ఒకటే.. 

అదే డెత్ సర్టిఫికేట్. 


  (ఎంత గొప్ప సందేశమో కదా!)