11, ఆగస్టు 2021, బుధవారం

కుండ మట్టి - జీవన్ముక్తి

 కుండ మట్టి - జీవన్ముక్తి


మనిషి ఏం చేసినా శాంతి, సుఖం, భద్రత కోసమే చేస్తూంటాడు. అవి వస్తువుల్లోనూ, పరిస్థితుల్లోనూ, మనుషుల్లోనూ, సంఘటనల్లోనూ ఉందనుకుంటాడు. తన స్వరూపమే శాంతి, సుఖం, భద్రత అని తెలుసుకోలేక, బాహ్యంగా పరుగులు తీస్తూంటాడు. కస్తూరి మృగం తనలో సువాసన పెట్టుకుని బయట ఎక్కడో ఉందని, వెతికి, వెతికి అలసి సొలసి చనిపోతుందిట. సరిగ్గా మనిషి కూడా అలానే చేస్తాడు. తనే ఆనంద స్వరూపం అని గ్రహించడు.


కుండకు ఎవరో చెప్పారు. నీ గురించి నువ్వు తెలుసుకో! స్వరూపంగా నువ్వెవరో తెలుసుకో! స్వరూపతః నువ్వు మట్టివి. మట్టిని తెలుసుకుంటే, వెంపర్లాట, ఆరాటం పోయి జీవన్ముక్తి పొందుతావు అని చెప్పారు. వెంటనే కుండ మూటాముల్లే సర్దుకుని స్వరూపంగా మట్టిని చూద్దామని చార్ ధామ్ యాత్రకు బయలు దేరింది. యాత్ర అంతా పూర్తి అయింది కాని స్వరూపంగా మట్టి మాత్రం కనపించలేదు. యజ్ఞ యాగాదులు చేసింది మట్టి జాడే తెలియలేదు. ధ్యానం చెయ్యాలన్నారెవరో! ధ్యానం లోనూ మట్టి కనపడలేదు. కుండ మట్టిని వెతకాలి. ఎలా? మట్టి ఎక్కడ ఉంది? కుండ లోపల ఉందా? కుండ బయట ఉందా? కుండ మధ్యలో ఉందా? అసలు కుండకు మట్టికి దూరం ఎంత? కుండ అంతటా మట్టే. మట్టి తప్ప కుండే లేదు. కుండకు మట్టికి దూరం ఏమిటి? అవి రెండు వస్తువులైతే కదా! మట్టినే కుండ అంటున్నాం. కుండగా పరిమితత్వం, అల్పత్వం, అశాశ్వతత్త్వం ఉన్నాయి. అదే మట్టిగా అపరిమితత్త్వం, అనల్పత్వం, శాశ్వతత్త్వం. అదే జీవన్ముక్తి. ఇప్పుడు కుండ ఏం చేయాలి? అంతటా వెతకాలా? పూజలు చేయాలా? ధ్యానం చేయాలా? నేనే మట్టిని అని తెలుసుకుంటే చాలు. కుండ తయారుకాక ముందూ మట్టే, కుండగానూ మట్టే, కుండ పగిలినా మట్టే. మట్టిగా దానిలో ఏ మార్పూ లేదు. దానికి పుట్టుకా లేదు, మరణం లేదు. అదే కుండయితే మరణం, పుట్టుక తప్పవు.

తెలుగు ప్రాముఖ్యత

 ఎవరి మాతృభాష తెలుగో, ఎవరు తెలుగును ప్రేమిస్తారో, మరియు తెలుగు గురించి కొంత తెలుసుకోవాలనుకుంటున్నారో, వారి కోసం తెలుగు భాష యొక్క ఆసక్తికరమైన వాస్తవాలు


1) క్రీస్తుపూర్వం 400 నుండి తెలుగు భాష ఉనికిలో ఉంది. 


2. 2012 లో తెలుగును అంతర్జాతీయ ఆల్ఫాబెట్ అసోసియేషన్ ప్రపంచంలోని 2 వ ఉత్తమ స్క్రిప్ట్‌గా ఎన్నుకుంది, కొరియన్ ర్యాంక్ నంబర్ 1.


3. తెలుగు భాష మాట్లాడటం మీ శరీరంలో సుమారు 72000 న్యూరాన్‌లను సక్రియం చేస్తుంది, సైన్స్ నిరూపించిన ప్రపంచంలోని ఏ భాషకైనా ఇది అత్యధికం.


4. శ్రీలంకకు చెందిన ఒక జాతి శ్రీలంక జిప్సీ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడతారు.


5. మయన్మార్‌లో చాలా తెలుగు కమ్యూనిటీలు ఉన్నాయి గూగుల్ శోధన చేయండి.


6. 16 వ శతాబ్దంలో ఇటాలియన్ ఎక్స్‌ప్లోరర్ నికోలో డి కాంటి, తెలుగు భాషలోని పదాలు ఇటాలియన్‌లోని మాదిరిగానే అచ్చులతో ముగుస్తుందని కనుగొన్నారు, అందుకే దీనిని “ది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్” అని పిలుస్తారు.


7. భారతదేశంలో స్థానికంగా మాట్లాడేవారి సంఖ్య (75 మిలియన్ల మంది) తో తెలుగు 3 వ స్థానంలో ఉంది మరియు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మాట్లాడే భాషల ఎథ్నోలాగ్ జాబితాలో 15 వ స్థానంలో ఉంది.


8. "మూడు లింగాల దేశం", త్రిలింగ దేశం అని పిలువబడే ప్రాంతంలో పలికే భాషే తెలుగు అని నానుడిలో ఉంది. ఒక హిందూ పురాణం ప్రకారం, శివుడు మూడు పర్వతాలపై తన లింగస్వరూపాన్ని నిలిపాడని అంటారు. అవియే నిజాం లోని కాళేశ్వరం, రాయలసీమలోని శ్రీశైలం మరియు కోస్త ప్రదేశములో లోని భీమేశ్వరం;


9. తెలుగు భాషలో మాత్రమే, ప్రతి పదం అచ్చు శబ్దంతో ముగుస్తుంది. తూర్పున ఉన్న దేశాలు, రాష్ట్రాలలో ఏ భాషకు ఈ ప్రాముఖ్యత లేదు


10. తెలుగు భాషలో మాత్రమే అత్యధిక సంఖ్యలో జాతీయాలు, సామెతలు ఉన్నాయి.


11. తెలుగు భాషను తెనుగు లేదా తెలుంగు లేదా తెనుంగు అని కూడా పిలుస్తారు.


12. రవీంద్రనాథ్ ఠాగూర్ అన్ని భారతీయ భాషలలో తెలుగు మధురమైనదని పేర్కొన్నారు.


13. సుమారు 200 సంవత్సరాల క్రితం తెలుగు మాట్లాడే ప్రజలను సుమారు 400 మందిని మారిషస్ ప్లాంటేషన్ వర్కర్లుగా తీసుకువెళ్లారు, ఇప్పుడు ఆ దేశపు ప్రధానమంత్రి వారి వారసులతో ఒకరు.


14. మొదటి నుండి చివరి వరకు చదివినప్పుడు రామాయణం, మరియు చివరి నుండి మొదటికి చదివినప్పుడు మహాభారతపు అర్ధం వచ్చే కచికలతో (పాలిండ్రోమ్) ఉన్న 40 శ్లోకాలు తెలుగులో తప్ప ఏ భాషలోనూ లేవు 


15. శ్రీ కృష్ణదేవరాయ శ్రీకాకుళంలోని, శ్రీకాకుళాంధ్ర మహా విష్ణుదేవుని సందర్శించి తన గ్రంధం ఆముక్త మాల్యదను అచటనే రచించి, శ్రీవారికి అంకితం ఇచ్చి నివాళులర్పించారు. ఆంద్ర మహా విష్ణువు రాయల వారికి స్వప్నంలో కనబడి, దేశ భాష లందు తెలుగు లెస్స అని తెలిపి , రాయల వారిని సామ్రాజ్యంలో తెలుగుని అధికార భాషగా ప్రకటించమని ఆదేశించారని చరిత్రలో తెలుపబడినది 


16. ఒకే ఒక అక్షరంతో వ్రాయబడు పద్యములు ఏకాక్షర పద్యములు తెలుగు భాషలో తప్ప మరియు ఏ భాషలోనూ లేవు 


17. ప్రపంచంలో ఉన్న అన్ని మతాల పెద్దలందరూ, మన ఋషులూ తెలుగు భాష సృష్టికర్తల నుండి గొప్ప వరం అని ఉద్ఘాటించారు


కాబట్టి , ప్రపంచంలోనున్న తెలుగు వారందరూ, తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత గ్రహించి, తెలుగును ప్రోత్సహించి, తెలుగు వ్యక్తిగా పుట్టినందుకు గర్వపడండి

MADE IN CHINA"*

 😀😀😀😀😀😀😀


A Chinese man came to Kerala. He took a taxi at Kochi airport.


On his way, by seeing a bus, he told the taxi driver, that in Kerala buses run very slow. In China buses run very fast.


After sometime, he came near a railway bridge and saw a train passing over the bridge. Then the Chinese man told the driver, that the trains also run very slow here. In China trains run very fast.


Throughout the journey he complained to the driver disparaging Kerala. However, the taxi driver kept mum throughout . 


When the Chinese man reached his destination, he asked the driver what is the meter reading and taxi fare thereon.


The taxi driver replied it is Rs.10,000/-


The Chinese was shell shocked after hearing the taxi fare. He shouted "are you kidding? in your country buses run slow, trains run slow, everything is slow. How come the meter alone runs fast?"


To this the taxibro replied calmly,


Sir,  


*"THE METER IS MADE IN CHINA"*


😜😂😜😂😀😀😀

రామాయణం -3 వ భాగం

 *రామాయణం -3 వ భాగం [RAMAYANAM - BALA KANDA]*

*బాలకాండ :*


రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు.............

పూర్వకాలంలొ కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యోజనముల పొడువు, 3 యోజనముల వెడల్పు ఉండేది( యోజనం అంటె = 9 మైళ్ళు ). ఆ నగరం మధ్యలొ రాజ ప్రాసాదంలొ దశరథ మహారాజు నివాసముండేవారు. ఆ నగరంలొ రహదారులన్నీ విశాలంగా, ఎప్పుడూ సుగంధ ధూపాలతొ ఉండేవి. ధాన్యం, చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి ఆ రాజ్యంలొ. ఏ ఇంట్లోనుకుడా అనవసరంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరంలొ అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు, అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే, ఎవడికి ఉన్నదానితొ వాడు తృప్తిగా ఉండేవాళ్ళు, అందరూ దానం చేసేవాళ్ళు, సత్యమే పలికేవాళ్ళు, అందరూ ఐశ్వర్యవంతులే, ఆవులు, గుర్రాలు, ఏనుగులతొ ఆ నగరం శోభిల్లేది. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలొ పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణములు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైనవాడు ఆ అయోధ్య నగరంలొ లేడు.


దశరథ మహారాజుకి 8 ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు, వాళ్ళు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు. వశిష్ఠుడు, వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చె ఋత్విక్కులు. ఇతరమైన బ్రాహ్మణులూ, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు, పని చెయ్యడం తెలిసినవాళ్లు, ఇంద్రియములను నిగ్రహించినవాళ్లు, శ్రీమంతులు, శాస్త్రము తెలిసిన వాళ్ళు, సావధాన చిత్తం కలిగినవాళ్ళు. ఆ కోసల దేశంలొ పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు.

ఇన్ని ఉన్నా ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది. వంశోద్దారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది. ఆయనకి అప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకి అశ్వమేథ యాగం చెయ్యాలనే ఆలోచన వచ్చి, వెంటనే సుమంత్రుడిని పిలిచి, ఋత్విక్కులైన వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితులని పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేథ యాగానికి కావాల్సిన సంభారములన్నీ తెప్పించి, సరయు నదికి ఉత్తర తీరంలొ యాగమంటపం నిర్మించారు.

దశరథ మహారాజు దక్షిణ నాయకుడు, ఆయనకి 300 కి పైగా భార్యలున్నారు. కాని పత్నులు మాత్రం కౌసల్య, సుమిత్ర, కైకేయి. తను యాగం మొదలపెడుతున్నాడు కాబట్టి, తన పత్నులని దీక్ష స్వీకరించమన్నాడు. అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతొ సుమంత్రుడు ఇలా అన్నాడు...........


సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం | 

ఋషీణాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి ||


పూర్వకాలంలొ ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు............ఇక్ష్వాకువంశములొ జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేథ యాగం చేస్తాడు. ఆ యాగం వల్ల ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు. కాని అశ్వమేథ యాగంతొ పాటు పుత్రకామేష్టి యాగం కూడా చెయ్యాలి. ఈ రెండు యాగాలని చెయ్యగలిగినవాడు రుష్యశృంగుడు. ఆయన ఆ యాగాలని చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతొ అన్నాడు.ఆ రుష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశంలొ ఉన్నాడు, కాబట్టి మీరు వెళ్లి ఆయనని తీసుకొని రండి అన్నాడు.


అప్పుడు దశరథ మహారాజు, నాకు ఆ రుష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు అంటె, సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు.............పూర్వకాలంలొ విభణ్డక మహర్షి చాలాకాలం తపస్సు చేసి స్నానం చెయ్యడానికి ఒక సరస్సు దెగ్గరికి వెళ్ళగా, అక్కడ అలా వెళుతున్న ఊర్వశిని చేసేసరికి ఆయన రేతస్థానము నుంచి కదిలిన వీర్యం సరోవరంలొ పడింది. ఆ వీర్యాన్ని ఒక జింక తాగి, గర్భం దాల్చి, శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి రుష్యశృంగుడు అని పేరు పెట్టారు. ఆ విభణ్డక మహర్షి, రుష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు అన్నీ చెప్పాడు. కాని ఆ రుష్యశృంగుడికి లోకం తెలీకుండా పెంచాడు, ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ-పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలీకుండా పెంచాడు. అంటె విషయసుఖాల వైపు వెళ్ళకుండా పెంచాడు. ఎప్పుడూ ఆ ఆశ్రమంలోనే, తండ్రి పక్కనే ఉండేవాడు. ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలొ వర్షాలు పడడం మానేశాయి. దేశంలొ క్షామం వచ్చింది. రుష్యశృంగుడు కాని మన దేశంలొ అడుగుపెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు.


వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే, రుష్యశృంగుడిని తీసుకురావడం మావల్ల కాదు, ఏమి కోరికలు లేని వాడు, మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు. ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు..... ఇంద్రియార్థైః అభిమతైః నరచిత్త ప్రమాథిభి |. రుష్యశృంగుడికి కుడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి. వాటికి ఇప్పటిదాకా రుచి తగలక, విషయసుఖాల వైపుకి రాలేదు. కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేశ్యలని పంపిస్తే, విభణ్డకుడు లేని సమయంలో వీళ్ళు ఆ రుష్యశృంగుడి మనస్సుని ఆకర్షించి, ప్రలోభపెడతారు. అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు, అని మంత్రులు సలహా ఇచ్చారు.


ఆ వేశ్యలకి విభణ్డకుడి మీద ఉన్న భయం వలన, వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం, నాట్యం చెయ్యడం మొదలుపెట్టారు. ఒకరోజు విభణ్డకుడు లేని సమయంలో గానం విన్న రుష్యశృంగుడు, ఆ గానం వస్తున్న వైపు వెళ్ళాడు. అక్కడున్న ఆ వేశ్యలని చూసి, వాళ్ళు పురుషులే అనుకొని, మహాపురుషులార! మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు. అందరూ విభణ్డకుడి ఆశ్రమానికి వెళ్లారు. తరువాత ఆ వేశ్యలు ఆశ్రమంనుంచి వెళ్ళిపోతూ ఆ రుష్యశృంగుడిని గట్టిగ కౌగలించుకుని వెళ్ళిపోయారు. మరునాడు ఆ రుష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి, ఆ వేశ్యలని చూడాలనిపించి, వాళ్ళ దెగ్గరికి వెళ్ళాడు. ఈసారి వాళ్ళు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు. సరే అని అందరూ బయలుదేరారు. ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే..........


తత్ర చ ఆనీయమానే తు విప్రే తస్మిన్ మహాత్మని |

వవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయన్ తదా ||


ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు రుష్యశృంగుడికి నమస్కారం చేసి, ప్రార్ధించి, అంతఃపురానికి తీసుకెళ్ళి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జెరిపించారు.

కాబట్టి దశరథ మహారాజు ఆ రుష్యశృంగుడిని పిలవడానికి, అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు. అక్కడ 8 రోజులున్నాక, వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితొ ఇలా అన్నాడు...మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది, కనుక నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపిస్తావా, అని అడిగాడు. రోమపాదుడు ఆనందంగా పంపించాడు. దశరథుడు చాలా సంతోషించి, వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాడు.

ప్రశ్న పత్రం సంఖ్య: 18

 

ప్రశ్న పత్రం సంఖ్య: 18                 కూర్పు:(సేకరణ ) సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింది  ప్రశ్నలకు జవాబులు తెలుపండి   

1.ప్రహల్లాదుడు కొడుకు ఎవరు

2.కృతయుగంలో వేదాలను దొంగలించినది ఎవరు

3.బలిచక్రవర్తిని దానం అడిగిన విష్ణుమూర్తి అవతారం ఎవరు

4.రాక్షసుల గురువు ఎవరు

5.ఇంద్రుడి రాజధాని ఏది

6.ఇంద్రుడి ఆయుధం పేరు

7.దేవతల గురువు ఎవరు

8.వజ్రాయుధం ఎవరి వెన్నెముకతో తయారయింది

9.కశ్యప ప్రజాపతి భార్యల పేర్లు ఏమి

10.సూర్యుడి రథసారథి ఎవరు

11.ఆదిశేషుడు కర్కోటకుడు తల్లి ఎవరు

12.వినత కుమారులు ఎవరు

13.హిరణ్యకశిపుని భార్యలు ఎవరు

14.హిరణ్యకశిపుడి తల్లి ఎవరు

15.కృతయుగంలో భూదేవిని పాతాళంలో దాచి నది ఎవరు

16.వాలి మెడలోని దండ పేరు ఏమి

17.యమధర్మరాజు వెంట పడిభర్త ప్రాణాలు దక్కించుకున్నది ఎవరు

18.యుగాల పేర్లు ఏమి

19.విష్ణువు ద్వారపాలకులు జయ విజయలకు శాపం పెట్టినది ఎవరు

20. ద్రౌపది వస్త్రాపహరణం లో ధర్మం మాట్లాడినది ఎవరు?