14, మార్చి 2023, మంగళవారం

శబరి

 శబరి గిరిజన కుటుంబంలో పుట్టిన ఒక స్త్రీ.ఈమె పంపానదీ తీరంలో మతంగ మహాముని వద్ద, ముని కన్యల మధ్య అమాయంకంగా పెరిగింది.అందువలన బోయ కులంలో పుట్టినప్పటికీ ముని చెప్పిన మాటలు శ్రద్ధగావినేది. దాని వలన అమె యోగాభ్యాసం చేసేది.మతంగ మహామునిని పరమశివుడుగా, ఆశ్రమాన్ని కైలాసంగా భావించేది.ఆశ్రమంలో అన్ని పనులు చేస్తూ సేవా మార్గంలో కాలం గడిపేది.        మతంగ మహాముని మాటల్లో శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారమని, రాక్షసులను సంహరించిన వీరుడని తెలుసుకుంది.మతంగ మహామునికి రాముడు అరణ్యవాసానికి వెళ్లిన విషయం తపశ్సక్తి ద్వారా తెలిసింది. అలా తెలుసుకున్న మతంగముని శిష్యులు, తాము స్వర్గానికి వెళుతూ శబరికి ఆ విషయం చెబుతారు. వనవాసంలో ఉన్న రాముడు ఒకానొక సందర్భంలో ఆశ్రమానికి వస్తాడని, అతని దర్శనం తర్వాత శబరి కూడా శరీరాన్ని వదలవచ్చని వివరిస్తారు.సీతా,లక్షణ సమేతుడై శ్రీరాముడు ఆశ్రమం వైపు వస్తున్నాడని తెలిసింది.అతణ్ని చూడాలని ఆశపడింది. ఆ ఆశని రాముని గురించి మతంగ మహర్షి చెప్పిన మాటలు రెట్టింపు చేశాయి. ఒక్కసారి జీవితంలో రాముణ్ని చూస్తే చాలనుకుంది. అంతకుమించి ధన్యత లేదనుకుంది. రాముని రూపురేఖలు చూసి తరించాలనుకుంది.          ఎంత కాలం ఎదురు చూసినా రాముడు రాలేదు.అలాగని శబరి ఎదురు చూడకుండా ఉండలేకపోయింది. మతంగ ముని ముసలి వాడై, స్వర్గానికి వెళుతూ రాముడు వస్తాడనీ మరలా చెపుతాడు. నీకు దర్శనభాగ్యం కలిగిందని, ఆశ్రమాన్ని అంటి పెట్టుకొనే ఉండమంటాడు. ఎప్పటికయినా రాముడు వస్తాడని శబరి నమ్మకంతో ఉంటుంది.ఆశ్రమంలో చివరికి శబరి మాత్రమే ఒంటిగా మిగిలింది. రామనామమే  సర్వం అయింది. శబరికికూడా ముసలి తనం వచ్చింది. రాముడు రాలేదు. వస్తాడనే ఆమెకు ఇంకా నమ్మకం. ఒంట్లో శక్తే కాదు, కంటిచూపూ తగ్గింది.అయినా  రాముని వస్తాడనేదానిమీద నమ్మకం తగ్గలేదు. మతంగి ముని మాట మీద గురి పోలేదు.రాముడు వస్తాడని ప్రతిరోజు వేకువ ఝామునే ఆశ్రమ పర్ణశాలను శుభ్రం చేసి, అలికి ముగ్గులు పెట్టేది. నదిలో స్నానం చేసి కడవతో నీళ్ళు తెచ్చేది. పూలు, పళ్ళూ తెచ్చేది. పూలను మాలకట్టి అలంకరించేది.ఫలహారంగా పెట్టడానికి పళ్ళను సిద్ధంగా ఉంచేది.ప్రతిరోజూ రాముడొస్తున్నట్లు ఏ రోజుకారోజే ఎంతో ఎదురు చూసేది. రోజులూ నెలలూ సంవత్సరాలూ విసుగూ విరామం లేకుండా అలా ఎదురు చూపులతోనే 13 సంవత్సరాల కాలం గడిపింది.  అందరూ అనుకునేటట్లుగా రాముడు ఆశ్రమానికి వచ్చినప్పుడు శబరి ఎంగిలి పండ్లను ఇవ్వడం వాల్మీకి రామాయణంలో లేదని తెలుస్తుంది. అడవిలో దొరికిన ఆహారంతోనే ఆమె రామలక్ష్మణులకు ఆతిథ్యం ఇస్తుందని, ఆ తరువాత రాముని అనుమతితో శబరి తన శరీరాన్ని యోగాగ్నిలో అర్పించుకుని మోక్షాన్ని పొందిందని తెలుస్తుంది.ఈ కథలో గిరిజన స్త్రీ అయిన శబరికి  వేదం తెలియనప్పటకీ, యజ్ఞయాగాదులు చేసే అధికారం ఆనాడు లేకపోయిననూ,యోగసాధన, జ్ఞానం, మోక్షం పొందడానికీ అందరూ అర్హులే అని నిరూపించే ఘట్టమే రామాయణంలోని శబరి కథ.

*స్త్రీ మూర్తిని

 🌿🌼🙏యావత్తు సృష్టిని.. ఒక్క గంటలో తయారు చేయగల్గిన దేవుడు.. *స్త్రీ మూర్తిని తయారు చేయడానికి మాత్రం వారం రోజులు కష్ట పడ్డడంట.* ఎందుకో తెలుసుకోవాలంటే మనసు పెట్టి చదవాలి 🙏🌼🌿


🌿🌼🙏మగాడితో సహా సర్వ జీవులను పుట్టించేసిన దేవుడు చివరగా ఒక స్త్రీని సృష్టించడం మొదలుపెట్టాడు. 🙏🌼🌿


🌿🌼🙏ఒక రోజూ రెండు రోజులూ కాదు. ఏకంగా వారంరోజులు తీసుకున్నాడు..స్త్రీ సృష్టికోసం. మిగిలిన పనులన్నీ మానుకుని..తన నాథుడు స్త్రీ సృష్టికోసం ఇంతగా తలమునకలైపోవడం చూసిన దేవత అడిగింది... "స్త్రీని సృష్టించడానికి ఎందుకింత సమయం తీసుకున్నారని?". 🙏🌼🌿


🌿🌼🙏అప్పుడు దేవుడు.. "ఏం చెయ్యను మరి...

ఈ స్త్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా... ఇష్టాయీష్టాలకతీతంగా ఉండాలీ..

సృష్టి. వివక్ష తగదు. మొండికేసే పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి. 🙏🌼🌿


🌿🌼🙏చిన్న చిన్న గాయాలు మొదలుకుని ముక్కలయ్యే మనసులవరకూ ఎన్నెన్ని సంఘటనలను ఈ జీవి ఎదుర్కోవాలో తెలుసా... ఆమె ఎంతమందికి ఓ ఔషధంగా పని చేయాలో తెలుసా...ఆమెకు ఆరోగ్యం బాగులేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి. 

అడిగేవారు ఉండరూ ఉండకపోవచ్చు...రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాలి. ఇన్ని రకాల పనులు చెయ్యాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి రెండు చేతులే...." అన్నాడు.🙏🌼🌿


🌿🌼🙏"ఏంటీ? ఇన్ని పనులు చేయడానికి ఆమెకు రెండు చేతులేనా?" అని ఆశ్చర్యపోతూ దేవత ఆమెను మెల్లగా తాకింది. "ఇదేంటీ ఇంత మృదువుగా ఉందే ఈమె దేహం" అని ప్రశ్నించింది. 🙏🌼🌿


🌿🌼🙏అప్పుడు దేవుడు.."ఆమె శారీరకంగా మృదువుగా మెత్తగా నాజూకుగా ఉండొచ్చు. 

కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు. 

అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు. అంతేకాదు, ఆమె అన్ని భారాలనూ తట్టుకోగలదు. 🙏🌼🌿


🌿🌼🙏ఇష్టం,  కష్టం, ప్రేమ, కోపం, తాపం, అంటూ అన్ని భావోద్వేగాలనూ ఆమె చవిచూడాలి. 

అవసరమైతే దిగమింగాలి. కోపమొస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకుండాలి. తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టుపట్టడమూ తెలుసు. 

ఇతరుల దగ్గర ఆశించేది ప్రేమానురాగాలను...." అన్నాడు.🙏🌼🌿


🌿🌼🙏"ఓహో. ఈమె ఆలోచించగలదా" అని దేవత అడిగింది. అప్పుడు దేవుడు.. "ఎందుకాలోచించదు? 

అన్ని విషయాలూ ఆలోచించడమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు..." అన్నాడు.🙏🌼🌿


🌿🌼🙏దేవత ఆమె చెక్కిళ్ళను తాకి "ఈ చెక్కిళ్ళు తడిగా ఉన్నాయేంటీ? కన్నీరు కారుస్తోందిగా....ఏంటిది? " అని అడిగింది.🙏🌼🌿


🌿🌼🙏అప్పుడు దేవుడు.. "అదా...కన్నీరది. 

ఆ కన్నీటిలో ఆనందమూ ఆవేదనా దుఃఖమూ దిగులూ ఆశ్చర్యమూ భయమూ అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులూ ఉంటాయి. 🙏🌼🌿


🌿🌼🙏ఆ కన్నీటికున్న  శక్తి అనంతం....

పైగా మరో జీవీకి ప్రాణంపోసి పది నెలలూ పొట్టలో మోసే నేర్పు ఆమెకు ఉంది" చెప్పాడు. 🙏🌼🌿


🌿🌼🙏దేవత ఆశ్చర్యపోతూ "మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే. .." అని చెప్పింది. 🙏🌼🌿


🌿🌼🙏అయితే దేవుడు.. "అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువా శక్తీ తెలిసినా..వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు. అప్పటివరకూ తెలియనట్టే ఉంటుంది..." అవసరమైనప్పుడు..*ఆ శక్తి ముందూ.. ఎవరూ నిలబడలేరు..🙏🌼🌿

అని చెప్పి భూమ్మీదకు పంపాడు స్త్రీని...!!


🌿🌼🙏ఇదంతా చదువుతుంటే.. మన జీవితంలో జరిగిన ఎన్నో ఘటనలు జ్ఞప్తికి వస్తున్నాయి కదా..🙏🌼🌿


🌿🌼🙏అందుకనే ఏమో *స్త్రీని పుడమి తల్లి తో పోల్చారు*.. 🙏🌼🌿


శ్రీమాత్రే నమః

విజయాలకి

 🙏🌺విజయాలకి భక్తి మార్గాలు🌺🙏


🌺సాధారణంగా రోజూ చేసే పూజాదికాలతోపాటు, 

గ్రహస్థితి బాగా లేదని తెలిసినపుడు, 

ఆయా గ్రహాలకు జపాలు, శాంతులు చేయించాలని చెబుతారు. 

దాని వలన ఆ గ్రహ ప్రభావం తగ్గుతుందని కూడా అంటారు. 🌺


🌺అలాగే మనం ఏదైనా ఓ పని జరగాలని కోరున్నప్పుడు 

ఆ పని సవ్యంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే వివిధ దేవతా స్తోత్రాలు పఠించాలని చెబుతున్నారు పెద్దలు. 


ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠించాలి, 

ఏ దేవతా పూజ చేయాలనే వివరాలు మీకోసం. 🌺


🌺1. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నపుడు మంచి అవకాశాలు రావాలన్నా, చేసే ప్రయత్నాలు ఫలించాలన్నా 

రోజూ సూర్యాష్టకం, ఆదిత్య హృదయం చదవాలి. సూర్యధ్యానం చేయాలి.


🌺2. ఇక వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నపుడు 

"కనకధారా స్తోత్రం" రోజు చదివితే ఆ వ్యాపారం 

అభివృద్ధి చెందుతుందట.


🌺3. ఇక మంచి విద్య రావాలన్నా, 

చదువులో ఏకాగ్రత కుదరాలన్నా రోజూ 

హయగ్రీవ స్తోత్రం" పిల్లలతో చదివించాలి. 

అలాగే "సరస్వతి ద్వాదశ నామాలు" చదువుకోమనాలి.


🌺4. కుటుంబ వ్యక్తుల మధ్య మంచి సత్సంబంధాలకు  విష్ణు సహస్రనామం, లలితా సహస్ర నామం 

పారాయణ చేయాలిట.


🌺5. పిల్లలు కలగాలని కోరుకునే దంపతులు 

"గోపాల స్తోత్రం " చదివితే మంచిదట. 

అలాగే గర్భవతిగా వున్న స్త్రీ ఈ స్తోత్రాన్ని రోజు పఠిస్తే సుఖప్రసవం అవుతుంది అంటారు పెద్దలు.


🌺6. ఇక వివాహానికి "లక్ష్మీ అష్టోత్తర పారాయణం" చెయ్యాలి. 

మంచి సంబంధం దొరికి, 

పనులన్నీ చక్కగా జరగాలని,

పెళ్లితంతు సక్రమంగా జరగాలని సంకల్పించి 

ఈ పారాయణాన్నీ రోజు చేస్తే ఆ కోరికలు తీరుతాయట.


🌺7. ఋణబాధలు ఇబ్బంది పెడుతుంటే 

రోజూ నవగ్రహ స్తోత్రం చదువుకోవాలిట. 

అలా చదివితే ఆ ఇబ్బందులలోంచి బయట పడతారుట.


🌺8. ఇవే కాక ఇక ఇతర ఏ కోరికలు సిద్ధించాలన్నా 

విష్ణు సహస్ర నామ పారాయణ చేస్తే చాలు 

ఆ కోరికలన్నీ తీరుతాయట. 🌺


🙏🏻 జై శ్రీమన్నారాయణ 🙏🏻


@everyone

గుండెకు డిజిటల్ మెడిసిన్*

 🩺🩺🩺🩺🩺🩺🩺🩺🩺🩺

ఈనాడు తమిళనాడు బ్రేకింగ్ న్యూస్


*గుండెకు డిజిటల్ మెడిసిన్*

(గుండె మార్పిడి లేకుండా గుండెను రీసైకిల్ చేయవచ్చు)


కత్తి మరియు రక్తం లేకుండా అల్ట్రా మోడ్రన్ ఇంగ్లీష్ మెడిసిన్.


*1) యాంజియోగ్రామ్ లేదు*


*2) బైపాస్ సర్జరీ లేదు*


*3) యాంజియోప్లాస్టీ లేదా స్టెంట్ లేదు*


రెండు సూపర్ ఆధునిక యంత్రాలు కనుగొనబడ్డాయి

*1)CT-700*

*2)EECP*


*1) యాంజియోగ్రామ్ లేకుండా గుండె అడ్డంకిని గుర్తించేందుకు CT-700 అనే అత్యంత ఆధునిక యంత్రం కనుగొనబడింది*..


దీనికి రెండు నిమిషాలు సరిపోతుంది.

దీని కోసం ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు


ఈ ఖర్చు కూడా తక్కువే

చెన్నైలో రెండు చోట్ల మాత్రమే ఇలా చేస్తారు.


ప్రారంభ దశలో గుండె అడ్డంకిని గుర్తించడం

మాత్రల ద్వారా నయం అయ్యే అవకాశం చాలా ఎక్కువ..


మరియు అది ఇప్పుడు

*2) EECP* అనే అధునాతన యంత్రం ద్వారా బైపాస్ సర్జరీ మరియు స్టెంట్ లేకుండా గుండెను నయం చేయవచ్చు మరియు రీసైకిల్ చేయవచ్చు.


ప్రభుత్వం ఆమోదించిన వైద్య వ్యవస్థ


నిజం తెలుసుకోవాలంటే

*శ్రీ వివేకానంద హాస్పిటల్*

చెన్నై

08925015666

08778463371

09500037040

04443192129


*DR.G. డాక్టర్స్ కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూలో వివేకానందన్*

ఇది ప్రచురించిన వార్త


దీని వల్ల లక్షలాది మంది మధుమేహం, హృద్రోగులు ప్రయోజనం పొందారు.


ఎలాంటి బ్లాక్ లేకుండా మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ దీన్ని షేర్ చేయండి.


ఒక షేర్ చాలా మంది హృద్రోగుల ప్రాణాలను కాపాడుతుంది

ధన్యవాదాలు 🙏🙏🙏


క్యాన్సర్‌ను ఓడించింది


   పైనాపిల్ వేడి నీరు

    దయచేసి ప్రచారం చేయండి!! దయచేసి ప్రచారం చేయండి!!

    ICBS జనరల్ హాస్పిటల్ ప్రొఫెసర్ డాక్టర్ గిల్బర్ట్ ఎ. ఈ బులెటిన్‌ను అందుకున్న ప్రతి ఒక్కరూ పది కాపీలను ఇతరులకు తీసుకెళ్లగలిగితే, కనీసం ఒక ప్రాణమైనా రక్షించబడుతుందని క్వాక్ నొక్కి చెప్పాడు.

    నా వంతుగా నేను కొన్ని చేశాను, మీరు కూడా చేయగలరని ఆశిస్తున్నాను..

     ధన్యవాదాలు!


    పైనాపిల్ వేడి నీరు మీ జీవితాన్ని కాపాడుతుంది

    వేడి పైనాపిల్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది.

    ఒక కప్పులో 2 నుండి 3 పైనాపిల్ ముక్కలను సన్నగా కోసి వేడి నీళ్ళు పోస్తే "ఆల్కలీన్ వాటర్" అవుతుంది, రోజూ తాగితే అందరికీ మంచిది.

    వేడి పైనాపిల్ క్యాన్సర్ నిరోధక పదార్థాలను విడుదల చేస్తుంది, సమర్థవంతమైన క్యాన్సర్ చికిత్స కోసం ఔషధం యొక్క తాజా పురోగతి.

    పైనాపిల్ యొక్క వెచ్చని పండు తిత్తులు మరియు కణితులను చంపే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది అన్ని రకాల క్యాన్సర్లను నయం చేస్తుందని నిరూపించబడింది.

    పైనాపిల్ వేడి నీరు అలెర్జీలు/అలర్జీల వల్ల శరీరంలోని అన్ని సూక్ష్మక్రిములు మరియు టాక్సిన్‌లను తొలగిస్తుంది.

    పైనాపిల్ రసం నుండి తీసుకోబడిన ఔషధం *హింసాత్మక కణాలను* మాత్రమే నాశనం చేస్తుంది మరియు ఆరోగ్యకరమైన కణాలను ప్రభావితం చేయదు.

    అలాగే పైనాపిల్ జ్యూస్‌లో ఉండే అమినో యాసిడ్‌లు మరియు పైనాపిల్ పాలీఫెనాల్స్ అధిక రక్తపోటును నియంత్రిస్తాయి, అంతర్గత రక్తనాళాలు అడ్డుపడకుండా చేస్తాయి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి మరియు రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయి.

    చదివిన తరువాత, ఇతరులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.

   


  *ఈ సందేశాన్ని కనీసం ఐదు గ్రూపులకు పంపండి*

  *కొందరు పంపరు*

  *అయితే మీరు తప్పకుండా పంపుతారని ఆశిస్తున్నాను*


ముఖ్యగమనిక:

మీరు రైలులో ప్రయాణం చేసేటప్పుడు మీకు "అత్యవసరంగా మందులు" అవసరమైతే....ఏంచేస్తారు..రైలులో అత్యవసరంగా వైద్యులు దొరుకుతారేమెాగానీ... "ప్రాణాపాయం "నుండి కాపాడే మందులు దొరకవు....

దానికొరకే ఒకవ్యక్తి నడుంబిగించాడు....

అతడే..." విజయ్ మెహెతా " ఈ వ్యక్తి మీకు కావలసిన ప్రాణాపాయ నివారణ మందులను పొందడానికి మీరు అతనికి ఫోన్ చేస్తే....తరువాత వచ్చే స్టేషన్లో వాటిని అందజేస్తారు అదీ ఎటువంటి 'ప్రత్యేక రుసుము' లేకుండా వాటిని అందజేస్తారు ఇప్పటికి భారతదేశం మెత్తంలో ప్రస్తుతానికి 400 వందల స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నది...

మీరు చేయవలసిన ఫోన్ నం.

విజయ్ మెహెతా ...09320955005

అందరికీ పంపండి..ప్రయాణికుల ప్రాణాలను కాపాడండి...


******************************

చెల్లి పేదరికం

 ఇండియా టీవీ ప్రోగ్రామ్ లో యోగి కళ్ళలో నీళ్ళు రావడమే కాదు చెల్లి పేదరికం చూసి ఒళ్ళు మరచి ఏడ్చాయి . అధికారంలో ఉన్న మిగిలిన నాయకులు తమ కుటుంబాలను కోట్లకు అధిపతులుగా చేసినప్పుడు మీ సోదరి ఇంకా ఎందుకు పేదరిక జీవితం గడుపుతోంది అని రజత్ శర్మ యోగిజీని అడిగినప్పుడు . యోగి సోదరి పని చేస్తున్న పోటో చూపించారు . స్టేజి మీద అక్క పేదరికం ఫోటో చూసి  అయిన యోగి . కొన్ని క్షణాలు యోగి ఏడుస్తునే వున్నాడు .  కానీ తనను తాను హ్యాండిల్ చేసుకుంటూ నేను యోగిని 25 కోట్ల మంది ఉత్తర ప్రదేశ్  ప్రజల తరుపున ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసానని... తన కుటుంబం గురించి ప్రమాణం చేయలేదు . ఇలా అంటుంటే యోగికి తన చెల్లి అంటే తనకు ప్రాణం , కానీ కుటుంబ పేదరికం చూసి ఏడ్చిన యోగి , ప్రభుత్వ ఖజానా నుండి ఒక్క రూపాయి ఇవ్వలేదు ఎందుకంటే యోగి చేసిన ప్రమాణస్వీకారం , నిస్వార్థ కార్య యోగం . ఒక పక్క అఖిలేష్ కుటుంబవాది మరో పక్క యోగి లాంటి నిస్వార్థ కార్మికుడు ఇద్దరిని ఎలా పోల్చగలం . UP కి నిస్వార్థ , కరుడుగట్టిన ధర్మవీరుడు యోగి లాంటి ముఖ్యమంత్రి దొరకడం నిజంగా అదృష్టం

హరిఓం

 హరిఓం   


'ఓం''...  తో   అలసట  మాయం...

శాస్త్రీయంగా  నిరూపించిన  బాలిక.......


👉    ఓం... శబ్దంతో.... 

శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలు గేళ్ల బాలిక ప్రయోగాత్మకంగా నిరూపించింది. 

👉పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్‌లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్త లను అకట్టుకుంది. 

👉కోల్‌కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ ఓంకారంపై పరిశోధన చేసింది. 


👉ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్‌డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గతాయని, తద్వారా అలసట ఉండదని అన్వేష తన ప్రయోగం ద్వారా కలకత్తా, జాదవ్‌పూర్ యూనివర్సిటీలకు చెందిన ఫిజిక్స్, ఫిజియాలజీ ప్రొఫెసర్ల సమక్షంలో నిరూపించింది. అన్వేష ప్రాజెక్ట్ విన్నూత్నంగా ఉందని, అంతే కాకుండా ఆమోదయోగ్యం కూడా ఉందని కలకత్తా యూనివర్సిటీకి చెందిన ఫిజియాలజీ విభాగం హెడ్ ఫ్రొఫెసర్ దేవశీష్ బందోపాధ్యాయ అన్నారు. 


అన్వేష అనే పేరులోనే అన్వేషణ ఉందని, బెంగాలీలో అన్వేషణ్ అంటె వెదకడమని ఆ బాలిక తెలిపింది. ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌన:పున్యం కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్‌మిటర్స్‌తోపాటు హార్మోన్ల (సెరోటినిన్, డోపమైన్) స్థాయిని పెంచుతాయి...

👉ఈ ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియ

జేసింది. 

👉అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదల అవుతుందని దీంతో అలసట అనేది ఉండదని అన్వేష తెలిపింది. 


👉గత దశాబ్దంలో సంగీతం సాధన ద్వారా శరీరానికి వ్యాయామం చేకూరి, మానసిక ప్రశాతంత కలుగుతుందని పరిశోధకులు నిరూపించినట్లు పశ్చిమ్ బెంగాల్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సెక్రెటరీ రిన వెంకట్రామన్ అన్నారు. కానీ ఓంకారం శరీరంపై నిర్దిష్ట ప్రభావం చూపుతుందని అన్వేష నిరూపించిందని ఆయన తెలిపారు. 


👉ఇప్పటివరకు ఎవరూ ఓం శబ్దంపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టలేదని స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త దీపాంకర్ దాస్ తెలిపారు. 

👉ఇటీవల రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన వర్క్‌షాప్‌నకు 165 విద్యార్థులను ఎంపిక చేశామని ఆయన అన్నారు. వర్క్‌షాప్‌లో భాగంగా అన్వేష ఉత్తరాఖండ్‌లో పర్యటించి నపుడు బగేశ్వర్ నుంచి 68 కిలోమీటర్లు దూరాన ఉన్న కేదారీనాథ్‌కు కాలినడకన రోజూ నీటిని తీసుకెళ్తున్న కొంతమంది పూజరుల్లో ఎలాంటి అలసట కనపడకపోవడంతో ఆశ్చర్యపడింది. 

👉అలాగే వాళ్లు దోవపొడువునా ఓంకారాన్ని జపిస్తూ ముందుకు సాగడం గుర్తించింది. 

👉దీంతో ఓంకారంపై తన ప్రయోగాన్ని నిర్వహించాలని భావించింది. 

👉దీనిపై పరిశోధనకు అక్కడే శ్రీకారం చుట్టింది. 

👉ఓం శబ్దం ద్వారా శరీరంలో 430 హెర్జ్‌ల పౌన:పున్యాలను వెలువడుతున్నట్లు గుర్తించి వివిధ ల్యాబొరేటరీల్లో ఐదు ప్రయోగాలను నిర్వహించింది. 


👉17 మంది యువతీ, యువకులకు ఓంకారాన్ని 30 నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్‌ డయాక్సైడ్ శాతాలను లెక్కించింది. 

👉ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, కార్బన్ డయాక్సడ్ శాతం తగ్గినట్లు అన్వేష తెలిపింది.... 


ప్రతి రోజు  ఉదయం ,  సాయంత్రం  కనీసం  11 సార్లు  దీర్ఘ  ఓంకారం  చేయండి.........  మీ  బంధు మిత్రులతో  చేయించండి ........ ఓం ,  ఓం , ఓం.....

తామస గుణం

 శ్లోకం:☝️

*యత్కర్మ కృత్వా కుర్వంశ్చ*

  *కరిష్యంశ్చైవ లజ్జతి ।*

*తజ్ఞేయం విదుషా సర్వం*

  *తామసం గుణలక్షణం ॥*

   - మనుస్మృతి 12.35


భావం: ఒక పని పట్ల మనస్సాక్షి అపరాధంగా తప్పుగా భావిస్తే, ఆ కర్మ పాపం (తామస గుణం) తో కూడినదిగా తెలుసుకోవాలి.

ఆనందపు తుంపరలు

 శ్లోకం:☝️ఆనందస్వరూప ధ్యానం

*స్ఫురన్తి సీకరా యస్మాద్-*

 *ఆనందస్యాంబరేఽవనౌ ।*

*సర్వేషాం జీవితం తస్మై*

 *బ్రహ్మానందాత్మనే నమః ॥*

 - యోగవాసిష్ఠం 1.1.3


భావం: విశ్వమంతా (నింగి - నేల) ఆనందపు తుంపరలు కురిపించే మరియు అందరికీ ప్రాణం (జీవులకు ఆధారం) అయినట్టి బ్రహ్మానంద స్వరూపుడైన పరమాత్మకు నమస్కారము.🙏

పూజలు

 *పూజలు అవసరమా???*


పూజ మన మనసును బాగు చేసుకునే సాధనమే గానీ దైవాన్ని ఆకట్టుకునే ప్రయత్నం కాదు. 

ఇరవై ఏళ్ళుగా పూజలు చేస్తున్నా ఫలం లేదని కొందరు అంటుంటారు. 

అంటే ఇరవై ఏళ్ళ అశ్రద్ధ వారిలో ఉందని అర్థం, భగవంతుని అనుగ్రహానికి క్షణకాలం స్మరణ చాలు!!...


పిల్లవాడికి జబ్బు చేస్తే ఏడుకొండల వాడిని ఒక క్షణం పాటు మొక్కుకుంటాం. 

అక్కడ దేవుని రూపంతో గాని, స్మరించే కాలంతో గానీ పని లేకుండానే కోరిక నెరవేరుతుంది. 

పిల్లవానికి జబ్బు తగ్గిన తర్వాత కృతజ్ఞత కోసం తిరుపతి వెళ్తున్నాం కానీ ముందు తిరుపతి వచ్చి మొక్కుకుంటేనే కోరిక తీరుస్తానని దేవుడు చెప్పటంలేదు!!...


క్షణంలో అనుగ్రహించే దైవానికి గంటల కొద్దీ పూజ ఎందుకు అని అనుమానం వస్తుంది!!..

ఒక రూపంపై మనసు నిలిపే శిక్షణ కోసం విగ్రహం ఎలా అవసరమైందో, మనకి ఓర్పు, సహనం, ఏకాగ్రత నేర్పేందుకు పూజ కూడా అంత అవసరమైంది. 

అంటే క్షణకాలం వచ్చి పోతున్న భగవత్ స్మరణ, ఎక్కువ సేపు నిలిపేందుకే పూజ అవసరం, పూజ మనసు బాగుచేసుకొనే సాధన...


*శ్రీ సద్గురు పీఠం కోటకదిర*

వేదాలను మించిన శాస్త్రం లేదు

 శ్లోకం:☝️

*నాస్తి వేదాత్పరం శాస్త్రం*

 *నాస్తి మాతుః పరో గురుః ।*

*నాస్తి దానాత్పరం మిత్రం*

 *ఇహ లోకే పరత్ర చ ll*

    అత్రిస్మృతిః - 148


భావం: వేదాలను మించిన శాస్త్రం లేదు. తల్లిని మించిన గురువు లేదు, దానాన్ని మించిన స్నేహితుడు లేడు; ఇహలోకంలోను పరలోకంలో కూడా!

ధ్వజస్థంభం

 ధ్వజస్థంభం పుట్టుక ;  మనం ఏదేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి. ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓకధ ఉంది.


భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు.


ఆ యాగాశ్వం అన్నిరాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహా పరాక్రమ వంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్నిబంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెల్సుకున్న ధర్మరాజు స్వయంగా యుధ్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడ్ని యుధ్ధంలో జయించడం సాధ్యంకాదనీ, మహాబలపరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారనీ, అతడ్నికపటోపాయాంతో మాత్రమే జయించాలనీ చెప్తాడు.


శ్రీకృష్ణుడు, ధర్మరాజుతోకలసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేర్తాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, "రాజా! మీ దర్శనార్ధమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఈతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసినదిగా మేముప్రార్థించగా, సింహం మానవ భాషలో' మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైనా మయూరధ్వజుని 'శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే, ఈతడ్ని వదిలేస్తాననీ చెప్పిందనీ, కనుక ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఈతడి కుమారుని కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్నిమధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు "తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, "మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటంలేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది." అని వివరిస్తాడు.


మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి "మయూరధ్వజా! నీ దానగుణం అమోఘం ! ఏదైనావరం కోరుకో! అనుగ్రహిస్తాను" అంటాడు. "పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగానుగ్రహించండి. " అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు "తథాస్తు" అని పలికి, "మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది" అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమయింది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తర్వాతే ములవిరాట్టు దర్శనం చేసుకోడం సాంప్రదాయంగా మారింది.

భగవద్గీత


* భగవద్గీత.


1. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సమ మామకా: పాణ్ణవాశ్చైవ కిమకుర్వత సంజయ॥

ఓ సంజయా! ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు యుద్ధము చేయవలెనని కాలం బలంగా కలిగిన వాళ్లు అయిన నా కుమారులు, మరియు నా తమ్ముడు పాండురాజు కుమారులు, ఏమి చేస్తున్నారు. వివరంగా చెప్ప అని ధృతరాష్ట్రుడు సంజయుని అడగడంతో గీతాశాస్త్రము ప్రారంభం


వ్యాసుల వారు భగవద్గీతను ధర్మ అనే పదంతో మొదలుపెట్టారు. ధర్మము అందరూ ఆచరించవలసినది. ధర్మాచరణము అందరికీ అత్యంత ఆవశ్యకము, ధర్మం, రక్షింపబడిన నాడు ఆ ధర్మం మనలను రక్షిస్తుంది. అందుకే ధర్మో రక్షతి రక్షితః అని ఆర్యోక్తి. గీతలో కృష్ణ ధర్మస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఉద్ఘాటించారు. ధర్మమును స్థాపించడానికి ప్రతియుగంలో నేను జన్మిస్తాను అని చెప్పారు. కాబట్టి ధర్మము మానవాళికి అత్యంత ముఖ్యమైన సంపద. అందుకే ఈ భరతభూమి ధర్మక్షేత్రమై విలసిల్లింది. అటువంటి భరతభూమిలో కురుక్షేత్రము ఉంది. కురు మహారాజు పేరిట కురువంశము వర్ధిల్లింది. ఆ కురుమహారాజు యజ్ఞం: చేయడానికి ఆ క్షేత్రమును దున్ని చదునుచేసాడు. అందుకని ఈ ప్రదేశమునకు కురుక్షేత్రము అని పేరు వచ్చింది అని చెబుతారు. క్షత్రియ కులమును సమూలంగా నిర్మూలించిన పరశురాముడు, వారి రక్తముతో ఇక్కడే తన తండ్రికి శరణము విడిచాడనీ, ఆ క్షత్రియుల రక్తం ఐదుపాయలుగా పారిందనీ, దాని పేరే శమంతక పంచకము అనీ అది ఈ కురుక్షేత్రములో ఉందని చెబుతారు. అటువంటి కురుక్షేత్రములో పాండవులు, కౌరవులు రాజ్యం కోసం యుద్ధం చేయడానికి

ఈ శ్లోకం ధృతరాష్ట్రుడు సంజయుని అడగడంతో మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు అంటే రాష్ట్రమును ధరించిన వాడు. అంటే కురు సామ్రాజ్యమునకు రాజు. ఈ కురు సామ్రాజ్యము ధృతరాష్ట్రుడు సంపాదించలేదు. అది అతని పిత్రార్జితము. తనది కాని దానిని తనని అనుకునేస్వభావము కలవాడు. ఈ గుణము మనలో చాలా మందికి ఉంది. మనం పుట్టక ముందు ఈ భూమి ఉంది. మనం పోయిన తరువాత కూడా ఈ భూమి ఉంటుంది. కాని మనం ఈ భూమి మీద బతికిన 100 సంవత్సరాల పాటు ఈ భూమి వాది అని అనుకుంటున్నాము. మనది కాని భూమి మీద విపరీతమైన మమకారము పెంచుకుంటాము. ఉన్న భూమిని కాపాడుకోడానికి, లేని నానా తంటాలు పడుతుంటాము. అనేకమైన అడ్డదార్లు తొక్కుతుంటాము. సెంటు భూమి కొరకు అయిన వారిని కూడా కడతేరేవాళ్లు ఉండటం మనం చూస్తున్నాము. అజ్ఞానము. ఈ అజ్ఞానము పోగొట్టే భగవద్గీత.


రాష్ట్రునికి సారథి, అంతరంగినుడు, జ్ఞాని సమ్మక్ జయతి

సంజయః అని అంటారు. అంటే ఇంద్రియములను మనసును జయించిన వాడు. నువ్వు, నేను

నిన్నది ఉన్నట్టు చెప్పగలిగిన ధైర్యశాలి. వ్యాసుని అనుగ్రహమును పొందినవాడు. అందుకే సంజయునికి శ్రీకృష్ణుని ముఖతా గీతను వినే మహద్భాగ్యం కలిగింది..


విశ్వరూప దర్శనమును పొందగలిగాడు.

కురుక్షేత్రము అంటే కురు రాజుల యొక్క అధీనంలో ఉన్న విశాలమైన కురుభూమి. అక్కడ ఎంతో మంది మునులు, ఋషులు తమ ఆశ్రమాలు నిర్మించుకొని తపస్తు చేసుకుంటున్నారు. పూర్వము బ్రహ్మగారు ఇంద్రుడు, అగ్ని ఇక్కడ తపసు చేసారనీ, కురు వంశ మూల పురుషుడు. అయిన కురుమహారాజు ఈ ప్రదేశములో ఎన్నో ధర్మకార్యాలు చేసాడని ప్రతీతి. ( ప్రస్తుతము ఇది పంజాబు రాష్ట్రంలో ఉంది)


ఇప్పుడు పాండవులు, కౌరవులు, వారి మిత్రపక్షరాజులు అందరూ కలిసి యుద్ధం చేయడానికి ధర్మ క్షేత్రము అయిన కురుక్షేత్రంలో సిద్ధం అయ్యారు. వారి సైన్యములు అంతా కలిపి 18 అక్షకుడీలు, ఒక అక్షౌహిణి అంటే 21,870 రథములు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రములు ,,రంతా కలిసి ఒక అక్షౌహిణి అంటారు. ఇటువంటి అక్షౌహిణీలు పాండవులు. 7, కౌరవుల పక్షాన 11 నిలిచిఉన్నాయి. మరి ఇన్ని లక్షల మంది యుద్ధం చేయాలంటే విశాలమైన భూమి కావాలి కదా. దాని కొరకు ఈ కురుభూమిని ఎన్నుకున్నారు. అప్పటివరకు |హూమ ధూమముతోనూ, వేదఘోషలతోనూ, వర్ణకుటీరములతోనూ శోభిల్లిన కురుభూమి: యుద్ధపరోషలతో, ఆయుధ విన్యాసాలతో, అస్త్ర శస్త్ర ప్రయోగాలతో, సైనికుల అరుపులతో కురుక్షేత్రంగా మారి పోయింది.


మన శరీరం కూడా ఒక కురుక్షేత్రమే అందులో మంచి ఆలోచనలు పాండవుల అయితే దుర్మార్గముతో కూడిన ఆలోచనలు కొరవ సేనలు. నాటి మధ్య జరిగే ఘర్షన కురుక్షేత్ర సంగ్రామము.


శివాలయానికి పూర్వవైభవం*

 **పురాతన శివాలయానికి పూర్వవైభవం**....

 **ఆ పరమశివుడికే దారి చూపించిన శ్రీ నృసింహ సేవా వాహిని**......

**ఎంత ధన్యులమో కదా  ఆ శివయ్యే మన సేవలకోసం ఎదురు చూడడం **.....

**మరో భక్త కన్నప్పలా సేవల్లో తరించిన శ్రీ నృసింహ సేవా వాహిని* 


చర్ల మండలo లోని శివలింగాపురం గ్రామంలో గుట్టపై కొలువై ఉన్న అతి పురాతన శివాలయంలో గత 10 సంవత్సరాల నుండి ధూప దీప నైవేద్యాలకు కూడా నోచుకోక కనీసం గుట్టపైకి వెళ్లడానికి  దారి కూడా లేదు. ముళ్ళు కంచెలతో గుట్టంతా అపరిశుభ్రంగా ఉన్నది.చర్లలోని మన నృసింహ సేవా వాహిని బృందం ద్వారా విషయాన్ని తెలుసుకున్న మన సంస్థ వ్యవస్థాపకులు డా.కృష్ణ చైతన్య స్వామి వెంటనే స్పందించి ఈ రోజు ఉదయం భక్తులు, మరియు గ్రామస్తులు సహాయ సహకారాలతో గుట్ట పరిసర ప్రాంతాలన్నీ శుభ్రపరిచి, ఆలయానికి రంగులు వేయించి,స్వామి వారికి అభిషేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగినది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇంత మహిమాన్వితమైన శ్రీ చక్ర శివాలయంలో మా నృసింహ సేవా వాహిని బృందం ఆధ్వర్యంలో సేవలందించడం

మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని, నేటి నుండి పరమశివుని వైభవం దశ దిశలా వ్యాప్తి చెందేలా  మనమందరం కృషి చేయాలనీ,ధర్మ పరిరక్షణ మనందరి భాద్యత అని అన్నారు. అలానే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఆలయంలో ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలను స్వామికి సమర్పించాలని, మున్ముందు  ఆలయం లో ఎటువంటి ఆటకం లేకుండా  సంస్థ ఆధ్వర్యంలో  సహకారం అం అందిస్తామని తెలియజేశారు. ఇంత చక్కని కార్యక్రమం చేసిన మన నృసింహ సేవా వాహిని బృందానికి భక్తులు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. అవకాశం ఉంటే మీరు ఒకసారి దర్శించి తరించండి.



**నిజంగా  ఆది దేవుడికే మార్గం చూపిన మన నృసింహ సేవావాహిని సంస్థ ఎంత ధన్యతనొందెనో కదా **


భగవద్ సేవలో....మీ


డా. కృష్ణ చైతన్య

నీతి నియమాలు

 శ్లోకం:☝️

 *శీలవతాం లోకానామహో*

*సదా భవతి జగతి హి పరీక్షా ।*

 *నియమపరాఞ్ముఖమనసాం*

*సరళం జీవనమిహ విభాతి ॥*


భావం: ఈ ప్రపంచంలో ఏ నీతి నియమాలు అనుసరించని వారి జీవితం సులభతరమైనదిగా కనిపిస్తుండగా, నీతిమంతులు మాత్రం ఎల్లప్పుడూ పరీక్షించబడుతూనే ఉంటారు!

అమ్మాయిల కోరికలు

 అమ్మాయిల ల కోరికలు ఎంత ఘోరంగా వున్నాయి అంటే .. ఒకరు కూడ మంచి family కావాలి , నా కూతురిని మంచిగా  చూసుకునే family కావాలి ఒక్కరు కూడా అలోచిస్తలేడు...

ఎప్పుడూ ఇంత అస్తి వుండాలి ఇన్ని కోట్లు వుండాలి అదే ఆలోచన తప్ప..

మంచి పేరు ఫ్యామిలీ

మంచి సంప్రదాయం గల ఫ్యామిలీ కి ఇవ్వాలి అనేది లేదు..


అమ్మాయి ఉన్న ఇంట్లో అబ్బాయి కూడా వుంటారు చాలా ఫ్యామిలీ లో వాళ్ళకి ఇంత ఘోరంగా వుంటది పరిస్థితి..


తాటి ని తన్నే వాడు వుంటే వాడి తలను తన్నే వాడు వుంటాడు..


2,3 years age Gap అనేది దారుణం మరీ..minimum 5 to 6 years Gap vundali.

ఎందుకంటే.


Same age or 1 or 2 years gap Vunte enni problems వుంటాయో ప్రాక్టికల్ గా ఆలోచిస్తే తెలుస్తుంది..


➡️ఆరోగ్య సమస్యలు 

➡️Age gap minimum లేకుంటే భార్య భర్తలు మధ్య ఎలాంటి ప్రేమ , భక్తి, గౌరవం , ఏమి వుండవు..

➡️నువ్యేంత అంటే నువ్వెంత అనే స్టేజ్ కి వస్తారు..

➡️ఒక 60 years vachaka భార్య భర్తలు ఇద్దరు ఒకేసారి మంచన పడతారు okarookaru సహాయం చేసే ఓపిక వుండదు..

➡️అమ్మాయి సాలరీ చూసి అంతా కన్న ఎక్కువ సాలరీ expect చేస్తున్నారు.

ఎంత ఘోరం అంటే అమ్మాయి లైఫ్ లాంగ్ job చేసే ఛాన్స్ లేదు.

కానీ అబ్బాయిలు మాత్రం లైఫ్ లాంగ్ job or business చేసి ఫ్యామిలి మి పోషించాలి..

అమ్మాయిల కి పెళ్లి ఐపోగానే పిల్లలు పుట్టగానే ఎలాగూ జాబ్ పిల్లల కోసం కోసం అని 80% జాబ్ మానేస్తున్నారు..


*ఇప్పుడు ఏదో జాబ్ చేస్తుందని గొప్పలకు పోయి న బిడ్డ కన్న ఎక్కడా ప్యాకేజ్ వుండాలి అనే  ఆలోచన మానుకోవాలి*


 కోరికలు ఇంత చెత్త గా వున్నాయి కాబట్టి every Month minimum 250 డైవర్స్ cases Hyderabad lo cosurts lo file అవుతున్నాయి*


ఆలోంచించి మారండి..మీకు అబ్బాయిలు వుంటారు ..మీరే ఇలాంటి కోరికలు కోరుకుంటే రేపు మీ అబ్బాయి కి మీరు వూహించని షాక్ తగిలే అవకాశం ఉంది

ఇది మరో గ్రూపులో వచ్చింది

కొద్ది మార్పులతో

భగవద్గీత

 *ఇక నుండి సెంట్రల్ సిలబస్ లో భగవద్గీత*


*కేంద్ర ప్రభుత్వం అతి పెద్ద నిర్ణయం తీసుకుంది.*

*ఇక నుండి సెంట్రల్ సిలబస్ లోని ఆరు, ఏడు తరగతులలో భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చుస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.*


*మోడీ ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఆరు,ఏడు తరగతులలో భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చనున్నారు.*


*అలాగే భగవద్గీతలోని శ్లోకాలను పదకొండు, పన్నెండవ తరగతులలో (ఇంటర్మీడియట్) సంస్కృత పుస్తకాలలో పాఠ్యాంశాలుగా చేరచనున్నట్టు కేంద్ర మంత్రి "అన్నపూర్ణాదేవి" పార్లమెంట్ లో తెలియజేయటం విశేషం.*

ఒక్క ఉత్తముడు చాలు.

 శ్లోకం:☝️

*కిం జాతైర్బహుభిః పుత్రైః*

  *శోకసంతాపకారకైః ।*

*వరమేకః కులాఽఽలంబీ*

  *యత్ర విశ్రామ్యతే కులం ॥*


భావం: తమ చెడు ప్రవర్తనతో దుఃఖాన్ని, శోకాన్ని మిగిల్చే బహు సంతానం కన్నా కుటుంబాన్ని ఉద్ధరించి వంశానికి ఆనందాన్ని కలిగించే ఒక్క ఉత్తముడు చాలు.

నూరుగురు సంతానం ఉన్నా ధృతరాష్ట్రుడికీ, గాంధారికీ శోకమే మిగిలింది.

ఒక్క భగీరథుడు గంగని భామిమీదకి దింపి మొత్తం సగరవంశాన్ని ఉద్ధరించాడు.

హిందూయిజం

 కాంగ్రెస్ మరియు హిందూయిజం


 ఆ తర్వాత కూడా హిందువులు కాంగ్రెస్‌ని అర్థం చేసుకోలేరు.


 ఆర్టికల్ 25, 28, 30 (1950)

 HRCE చట్టం (1951)

 HCB MPL (1956)

 సెక్యులరిజం (1975)

 మైనారిటీ చట్టం (1992)

 POW చట్టం (1991)

 వక్ఫ్ చట్టం (1995)

 రామ్ సేతు అఫిడవిట్ (2007)

 కాషాయ ఉగ్రవాదం (2009)


 వారు ఆర్టికల్ 25 ద్వారా మత మార్పిడిని చట్టబద్ధం చేశారు


 వారు ఆర్టికల్ 28లో హిందువుల నుండి మత విద్యను లాక్కున్నారు కానీ ఆర్టికల్ 30లో ముస్లిం మరియు క్రైస్తవులకు మత విద్యను అనుమతించారు.


 1951 హెచ్‌ఆర్‌సిఇ చట్టం ద్వారా వారు అన్ని దేవాలయాలు మరియు దేవాలయాల సొమ్మును హిందువుల నుండి లాక్కున్నారు


 వారు బహుభార్యత్వాన్ని రద్దు చేశారు


 హిందువులలో, విడాకుల చట్టం, హిందూ కోడ్ బిల్లు ప్రకారం వరకట్న చట్టం ద్వారా కుటుంబాలను నాశనం చేస్తారు కానీ ముస్లిం వ్యక్తిగత చట్టాలను తాకలేదు.  బహుభార్యాత్వాన్ని అనుమతించారు, తద్వారా వారు తమ జనాభాను పెంచుకుంటూ ఉంటారు

 ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలతో సులభంగా పెళ్లి చేసుకునేందుకు 1954లో ప్రత్యేక వివాహ చట్టం తీసుకొచ్చారు.


 1975లో వారు ఎమర్జెన్సీని విధించారు మరియు రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదాన్ని బలవంతంగా జోడించారు మరియు భారతదేశాన్ని బలవంతంగా సెక్యులర్‌గా మార్చారు.


 కానీ కాంగ్రెస్ ఇక్కడితో ఆగలేదు.  1991లో వారు మైనారిటీ కమిషన్ చట్టాన్ని తీసుకువచ్చారు మరియు సెక్యులర్ దేశంలో మెజారిటీ మైనారిటీలు ఉండకూడదు అయితే ముస్లింలను మైనారిటీలుగా ప్రకటించారు.


 వారు మైనారిటీ చట్టం ప్రకారం ముస్లింలకు స్కాలర్‌షిప్, ప్రభుత్వ ప్రయోజనం వంటి ప్రత్యేక హక్కులను ఇచ్చారు


 92లో, వారు తమ దేవాలయాలను చట్టబద్ధంగా తిరిగి తీసుకోకుండా హిందువులను ఆపారు మరియు హిందువుల నుండి 40000 దేవాలయాలను లాక్కొని ముస్లింలకు పూజా స్థలం చట్టం ద్వారా ఇచ్చారు.


 95లో కాంగ్రెస్ ఇక్కడితో ఆగలేదు, ముస్లింలకు ఏ భూమినైనా క్లెయిమ్ చేసుకునే హక్కును కల్పించి, వక్ఫ్ చట్టం ద్వారా హిందువుల భూమిని లాక్కొని ముస్లింలను భారతదేశంలో రెండవ అతిపెద్ద భూ యజమానిగా చేసింది.


 2007లో, వారు రామసేతు అఫిడవిట్‌లో శ్రీరాముని ఉనికిని తిరస్కరించారు మరియు దీనిని హిందూ దేవతగా మార్చారు.


 2009లో కాషాయ టెర్రరిజం అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా కాంగ్రెస్ హిందూ మతాన్ని ఉగ్రవాద మతంగా ప్రకటించడం హిందూ వ్యతిరేక క్రూసేడ్‌లో ఒక విపరీతమైన అంశం.


 అదే కాంగ్రెస్ తమ 136 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ ఇస్లామిక్ టెర్రరిజం అనే పదాన్ని ఉపయోగించలేదు


 కాంగ్రెస్ నెమ్మదిగా చాలా చాకచక్యంగా హిందువులను విప్పుతూనే ఉంది.


 వారు హిందూ హక్కులను ఒక్కొక్కటిగా తొలగిస్తూనే ఉన్నారు మరియు ఇప్పుడు హిందువు పూర్తిగా నగ్నంగా ఉన్నాడు మరియు తమాషా విషయం ఏమిటంటే వారికి అది కూడా తెలియదు.


 వారికి వారి గుడి లేదు, వారి మత విద్య లేదు, వారి భూమి వారికి శాశ్వతం కాదు.


 N వారు ప్రశ్నలు కూడా అడగరు.


 మసీదు మరియు చర్చి ఉచితం కానీ దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణలో ఎందుకు ఉన్నాయి?


 వారిది ప్రభుత్వ నిధులతో మదర్సా, కాన్వెంట్ స్కూల్ అయితే ప్రభుత్వ నిధులతో గురుకులం ఎందుకు కాదు?


 వారిది వక్ఫ్ చట్టం కానీ హిందూ భూ చట్టం ఎందుకు కాదు?


 వారిది ముస్లిం వ్యక్తిగత బోర్డు కానీ హిందూ వ్యక్తిగత బోర్డు ఎందుకు కాదు?


 భారతదేశం సెక్యులర్ దేశమైతే మెజారిటీ మైనారిటీ ఎందుకు ఉంది?


 పాఠశాలల్లో రామాయణ మహాభారతాన్ని ఎందుకు బోధించరు?


 హిందూ మతాన్ని నాశనం చేయడానికి ఔరంగజేబు కత్తిని ఉపయోగించాడు.

  కత్తి విఫలమైతే రాజ్యాంగం, చట్టం, బిల్లును హిందూమతాన్ని నాశనం చేసేందుకు కాంగ్రెస్ ఉపయోగించింది.


 N తర్వాత మీడియా ఉంది.


 ఎవరైనా ఈ ప్రశ్నలను అడగడానికి ప్రయత్నిస్తే, అతను/ఆమె మతపరమైన, కాషాయ ఉగ్రవాదిగా ప్రకటించబడతారు


 రాజకీయ నాయకులు ఎవరైనా ఈ తప్పులను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తే ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు


 శక్తివంతమైన రోమన్ మతం పతనానికి కేవలం 80 సంవత్సరాలు పట్టిందని గుర్తుంచుకోండి.


 రోమన్ నాగరికత పతనం గురించి ప్రతి హిందువు తప్పక చదవాలి.


 ఏ బాహ్య శక్తి వారిని ఓడించలేదు, వారు తమ సొంత పాలకుడు కాన్‌స్టాంటైన్ చేత అంతర్గతంగా ఓడిపోయారు, క్రైస్తవ మతం ద్వారా.


 హిందువులు 1950లో నెహ్రూను ఎన్నుకున్నారు

 73 ఏళ్లు గడిచిపోయాయి


 ఇంకా 7 ఏళ్లు మిగిలి ఉన్నాయి..

భారత్ మాతా కి జై..

 "ఒక్కసారి చదవండి"


మన జీతం పెరగాలి

మన ఇల్లు అద్దె పెరగాలి

మనం కొన్న భూమి ధర పెరగాలి

మనం కొన్న ఇల్లు ధర పెరగాలి

మనం కొన్న బంగారం ధర పెరగాలి

మన దుకాణం గిరాకి పెరగాలి

మన షేర్ మార్కెట్ విలువ పెరగాలి

మన అందం పెరగాలి

మన విలువ పెరగాలి

మన ఆస్తులు అంతస్తులు పెరగాలి


*****


మద్యం ధర పెరగొచ్చు

బస్ టికెట్స్ ధర పెరగొచ్చు

సినిమా టికెట్స్ ధర పెరగొచ్చు

కరెంటు బిల్లు పెరగొచ్చు

ఇంటి బిల్లు పెరగొచ్చు

నల్లా బిల్లు పెరగొచ్చు 

హోటల్ బిల్లు పెరగొచ్చు

మొబైల్ ధర పెరగొచ్చు

పిజ్జా ధర పెరగొచ్చు

బీరు ధర పెరగొచ్చు

బిర్యానీ ధర పెరగొచ్చ

బూట్ల ధర పెరగొచ్చు

స్వీట్ల ధర పెరగొచ్చు... ఇలా 

మాట్లాడుకుంటూ పొతే మహాభారతం 

రాసుకుంటూ పొతే రామాయణం....


*********


కానీ పెట్రోల్ పెరగొద్దు.....

కానీ డీజీల్ పెరగొద్దు.....

కానీ గ్యాస్ పెరగొద్దు......

ఎందుకంటే ఇవి పెంచింది మోడీ 

(అని కొందరి ఉద్దేశ్యం)...


4 సంవత్సరాల క్రితం,

₹ 2 లక్షల రూపాయల బీమా

 ₹5000 / - నుండి ₹6000 / - వరకు....

ఈ రోజు సంవత్సరానికి ₹330 / -


4 సంవత్సరాల క్రితం 

9 సబ్సిడీ ఎల్‌పిజి సిలిండర్లు 

అందుబాటులో ఉన్నాయి, 

నేడు 12 ....


4 సంవత్సరాల క్రితం వరకు - 

LED బల్బ్ ₹400, 

నేడు అది ₹60 /-


4 సంవత్సరాల క్రితం 

లాల్ చౌక్ వద్ద భారత్ 

మాతా కి జై 

మాట్లాడటం నేరం ..


ఈ రోజు అదే లాల్ చౌక్ 

మీద రామ్ దర్బార్ ఉంది.


4 సంవత్సరాల క్రితం రైల్వే స్టేషన్ 

వద్ద మెట్లు ఎక్కి

నడవవలసి వచ్చేది, 

ఈ రోజు మనం ఎస్కలేటర్ ఎక్కుతున్నాము ..


ఈ పెట్రోల్ , డీజిల్ మీద 

ఏడుపులు ఇక ఆపండి !


350 మంది ఎంపీలతో 

ఉన్న వ్యక్తి, మన ముందు

కన్నీళ్లు పెట్టుకుని మద్దతు అడుగుతున్నారు  .....దేనికి ??


ప్రపంచంలోని అన్ని రాజధానిలకు 

వెళ్లి భారతీయుల 

సహాయం కోరారు...


రోజూ 16 నుంచి 20 గంటలు 

పని చేస్తున్న మన ప్రధాని ..


గత పాలనలో ప్రధాన మంత్రుల 

ఏ  సోదరుడైనా కిరాణా దుకాణం నడుపుతున్నాడా?


ఒక విషయం తెలుసుకోండి

మోడీ ఉగ్రవాదాన్ని, నల్లధనాన్ని, అవినీతిని అంతం చేయగలిగిన విధంగా ఇక ముందు ఎవరు 

చేయరు చేయలేరు.


ప్రధాని నరేంద్రమోడీ లాంటి 

జీవితం ఉన్న వ్యక్తి 

బహిరంగ వేదిక నుండి చెప్పిన మాట ....


"#ఈ_వ్యక్తులు_నన్ను_సజీవంగా_ఉంచరు..." అని...


పరిస్థితి చాలా భయంకరముగా ఉందని ఇది స్పష్టం చేస్తుంది.


ఎందుకంటే దేశ చరిత్రలో 

తొలిసారిగా ఒకే మనిషి చాలా 

మంది శత్రువులతో ఒకేసారి పోరాడుతున్నాడు.


మన ప్రధానమంత్రికి 

మద్దతు ఇవ్వాలి…


ఎందుకంటే ఈ రాక్షసులందరు మన  ప్రధానమంత్రికి ఏదైనా సమస్య అంటగట్టడానికి చూస్తున్నారు. 


మన మన నరేంద్ర మోడీని కాపాడుకోలేక పోతే శతాబ్దాలైనా మళ్లీ ఇలాంటి ధైర్యం ఉన్న నాయకుడు పుట్టడు.


#నేను_మన_ప్రధానితో_ఉన్నాను 


మీరు కూడా ఉంటారా ?


#భారత్ మాతా కి జై..🚩🚩🚩


కాపీ పేస్ట్

నిందించడం న్యాయమా

 గంటల తరబడి క్యూలో నిలుచుని..

ఉన్నప్పటికి .. ఆ దేవుడిని దర్శించుకోలేక

ఓ భక్తుడు  దేవుడిని ఒక ప్రశ్న  వేసాడు 

డబ్బులేని భక్తులకు దూరం నుండి..

డబ్బులున్న భక్తుడికేమో దగ్గర నుండి 

దర్శనం ఎందుకయ్యా ఈ అన్యాయం ???

ఇది ఏమైనా భావ్యంగా ఉందా.?....

గట్టిగ నవ్వేస్తూ భగవంతుడు..

*! ఇలా సమాధానం ఇచ్చాడు !*

తల్లికి మించిన  దైవం లేదు అన్నాను.

మీరు ఆవిడను పూజిస్తున్నారా ???

తండ్రి మాటకు మించిన వేదం లేదు అన్నాను. పాటిస్తున్నారా ????

గురువును మరొక దైవం అన్నాను. వినిపించుకున్నారా  ????

ఇందులో ఉన్న అందులో ఉన్న అని కాదు.

నువ్వెక్కడ వెతికినా అక్కడంతా నేను ఉన్నా అన్నాను 

మీరు నమ్మారా  ???

కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయండి.

నాకు చేసినట్టే అన్నాను మరి చేస్తున్నారా  ???

నేను ఎక్కడ ఉండాలో.

నేను ఎప్పుడు దర్శనం ఇవ్వాలో.

నాకు ఎప్పుడు ఉత్సవాలు చేయాలో.

నా మొక్కులు ఎలా చెల్లించాలో..

అన్ని మీరే నిర్ణయించారు,

ఇప్పుడు నాకు ఒక వెల కట్టి అందరూ వచ్చి

చూసి వెళ్లే వస్తువులా నిలబెట్టారు,

అన్ని మీరే చేసి మళ్ళీ నేను చేశాను

అని నిందించడం న్యాయమా ..

అని ఇప్పుడు ఆలోచించడం

అందరి వంతు అయ్యింది...

భక్తుడికి మాటలు రాలేదు.

         🙏 ఓం నమో వేంకటేశాయ నమః🙏

పరివేదన చెందనవసరములేదు.

 జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆది శంకరాచార్య - వైరాగ్య డిండిమ 👍


1. మాతా నాస్తి, పితా నాస్తి, 

నాస్తి బంధు సహోదరః| 

అర్థం నాస్తి, గృహం నాస్తి, 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు.  కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


2. జన్మ దుఃఖం, జరా దుఃఖం, 

జాయా దుఃఖం పునః పునః| 

సంసార సాగరం దుఃఖం 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- ఈ జన్మ, వృద్ధాప్యము, భార్య, సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి.  కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


3. కామః  క్రోధశ్చ, లోభశ్చ 

దేహే తిష్ఠతి తస్కరాః| 

జ్ఞాన రత్నాపహారాయ 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా :-  కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు  విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


4. ఆశయా బధ్యతే జంతుః 

కర్మణా బహు చింతయా| 

ఆయుక్షీణం న జానాతి 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకు, కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో,  జీవితాలు గడుపుతుంటారు. ఆయుర్ధాయం తరిగిపోతుందన్న విషయాన్ని గమనించరు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


5. సంపదః స్వప్న సంకాశాః 

యౌవనం కుసుమోపమ్| 

విధుఛ్చచంచల ఆయుషం 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, అంటే అశాశ్వతాలు.  యౌవనం పూవుతో సమానం అంటే ఎపుడు వాడి నశిస్తుందో తెలియదు. ఆయుష్షు మెరుపుతీగవలె చంచలమైనది.  కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


6. క్షణం విత్తం, క్షణం చిత్తం, 

క్షణం జీవితమావయోః| 

యమస్య కరుణా నాస్తి 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


7. యావత్ కాలం భవేత్ కర్మ 

తావత్ తిష్ఠతి జంతవః| 

తస్మిన్ క్షీణే వినశ్యంతి 

తత్ర కా పరివేదన|| 


తా:- ప్రపంచంలో తమ కర్మబంధము ఎంతవరకు ఉంటుందో,  అంతవరకే ప్రాణులు జీవిస్తాయి. ఆ కర్మబంధం వీడిపోగానే మరణిస్తారు. జననమరణాలు జీవుని ధర్మము. దానికి బాధపడటం ఎందుకు. 


8. ఋణానుబంధ రూపేణ 

పశుపత్నిసుతాలయః| 

ఋణక్షయే క్షయం యాంతి 

తత్ర కా పరివేదన|| 


తా:- గత జన్మ ఋణానుబంధము ఉన్నంతవరకే భార్య, సంతానం, ఇల్లు, పశువులు ఉంటాయి. ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి. అందుకు వ్యథ చెందడ మెందుకు. 


9. పక్వాని తరుపర్ణాని 

పతంతి క్రమశో యథా| 

తథైవ జంతవః కాలే 

తత్ర కా పరివేదన|| 


తా:-  పండిన ఆకులు చెట్టునుండి ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు? 


10. ఏక వృక్ష సమారూఢ 

నానాజాతి విహంగమాః| 

ప్రభతే క్రమశో యాంతి 

తత్ర కా పరివేదన|| 


తా:-  చీకటి పడగానే అనేక జాతులు పక్షులు ఒకే వృక్షం ఆశ్రయించి విశ్రమిస్తాయి. తెల్లవారగానే ఆ పక్షులు అన్నీ చెట్టును విడచి తమతమ ఆహార సంపాదనకు వెళ్ళిపోతాయి. అదే విధంగాబంధువులతో కూడిన మానవుడు కాలమాసన్నమైనపుడు తన శరీరాన్ని ఇంటిని వదలి వెళ్ళిపోతాడు. అందుకు బాధపడ నవసరములేదు. 


11. ఇదం కాష్టం ఇదం కాష్టం 

నధ్యం వహతి సంగతః| 

సంయోగాశ్చ వియోగాశ్చ 

కా తత్ర పరివేదన|| 


తా - ప్రవహించే నదిలో రెండు కట్టెలు దగ్గరకు చేరతాయి. కొంతదూరం కలిసి పయనిస్తాయి తరువాత విడిపోతాయి. అదేవిధంగా మానవుడు ఈ ప్రపంచ ప్రవాహంలో కొంతకాలం సంయోగసుఖమును, మరికొంతకాలం వియోగదుఃఖమును అనుభవిస్తాడు. దానికి పరివేదన చెందనవసరములేదు.

స్థిరముగా ఉండవు

 .


          _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝  

*అభ్రచ్ఛాయా ఖలప్రీతిః* 

*సిద్ధమన్నఞ్చ యోషితః*।

*కిఞ్చిత్కాలోపభోగ్యాని* 

*యౌవనాని ధనాని చ॥*


తా𝕝𝕝 " *మేఘముల నీడ, దుర్జనులతోడి మైత్రి, వండిన అన్నం, స్త్రీలు, యౌవనం, ధనం - ఇవన్నీ స్వల్పకాల భోగ్యాలు... స్థిరముగా ఉండవు*...

దేహిమే ముక్తి శివా

 వయసైపోయిన ఒక భిక్షువు శివాలయం దగ్గర బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తూండేది...


ఒక రోజు ఓ యోగిపుంగవుడు శివదర్శనం చేసుకుని వెడుతూంటే, ఆ వృద్ధురాలు ఆయన పాదలమీద పడి " అయ్యా ! నా జీవితం అంతా ఇలానే సాగిపోతోంది, నాకేదైనా మంత్రమో, పద్యమో చెప్పండి.


బతికి ఉన్న నాలుగురోజులు మీరు చెప్పినదే మనస్సులోనే అనుకుంటూ బతుకుతాను " అని ప్రాధేయపడింది...


 ఆ యోగి అప్పుడామెకు ఇలా చెప్పాడు:~

”తవ పాదే మమ శిర: ధారయతాం ! దేహిమే ముక్తి శివా ! " అని ముమ్మారు చెప్పి వెళ్ళాడు...

ఆమె అది విని ఆనంద పడి అదే ధ్యానం చేసుకుంటూ తృప్తిగా గడుపుతోంది...

 

అలా కొన్ని ఏళ్ళు గడిచాయి. ఈమె పండు వృద్ధురాలయింది. 

అలాగే ఆ శివాలయం దగ్గర బిక్షాటన చేస్తూ గడుపుతోంది.

 

తిరిగి ఆ యోగి పుంగవుడు శివ దర్శనం చేసుకుని, ఈమెను గుర్తుపట్టి, " ఏమి అవ్వా! నేను చెప్పినది జ్ఞాపకం ఉన్నదా ? "అనడిగాడు.


 ఆమె ఆయనకు నమస్కరించి " అయ్యా ! అదీ మరువలేదు. తమరిని మరువలేదు " అన్నది...

 

”ఏదీ చెప్పిన పాఠం అప్పజెప్పు " అని నవ్వుతూ అడిగాడు.

 ఆమె తడబడుతూ తను ధ్యానిస్తున్న ఆ యోగి చెప్పినది అప్పజెప్పింది.

 

”అవ్వా ! తప్పు చదువుతున్నావు ! నేను స్వామి పాదాల మీద నీ శిరసు పెట్టమంటే, నువ్వు స్వామి శిరసు మీద నీ పాదాలు పెట్టావు ! నీ ఇన్నేళ్ళ ధ్యానం వ్యర్ధం అయ్యింది "అని కోపంతో వెళ్ళిపోయాడు...


 ఆ వృద్ధురాలు చేసిన పొరపాటు ఈ " తవ, మమ " అనే పదాలు అటూ ఇటూ చేసి చదువుతోంది.

 

ఆమె కంటిమింటికి ఏకధారగా ఏడుస్తూ, అన్నాహారాలు మాని తన ఇన్నేళ్ళ శ్రమ వ్యర్ధం అయ్యింది అని రోజుల తరబడి బాధపడసాగింది.


 ఓ  రాత్రి మన స్వామి ఆ యోగిపుంగవుని కలలో కనబడి " ఏం పని చేశావయ్యా ! నా భక్తురాలు అన్నాహారాలు లేక బాధపడుతోంది. 

నేను శ్రద్ధాభక్తులకు వశుడను కానీ, భాషకు కాదయ్యా ! ముందు ఆమె బాధపోగొట్టి, ఆమె అహారం తీసుకునేలా చెయ్యి"అని ఆయనను హెచ్చరిక చేశాడు...


 ఆ యోగి పుంగవుడు ఉలిక్కిపడి లేచి, శివాలయం దగ్గరకు పరుగుపరుగున వెళ్ళి, ఆ వృద్ధురాలి పాదముల మీద పడి “అమ్మా ! నువ్వు చేసే పూజే స్వామి కి నచ్చింది,  నన్ను క్షమించి ఆహారం స్వీకరించు" అని ఆమెను తృప్తిపరచి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు...


 కాబట్టి మనం తెలుసుకోవలసింది, స్వామి మన శ్రద్ధాభక్తులకు ప్రాధాన్యం ఇస్తాడు కానీ,భాషకు కాదని తెలుసుకోవాలి...


 మనం ఎన్నో సహస్రాలు చదువుతూ ఉంటాము. పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి. 

పూజల్లో దోషాలు వస్తుంటాయి. అవ్వన్నీ స్వామి పట్టించుకోడు. కావలసింది శ్రద్ధా, భక్తి మాత్రమే.

నిజమైన, భక్తి

 నిజమైన, పరిపూర్ణమైన భక్తి అంటే ఇది కదా అనిపించింది. 


ఎంత ఆరాధనా భావం, ఎంత ఉన్నతమైన మనసు, అన్నిటినీ మించి సనాతన భారతీయ గురుపరంపర పట్ల వారికున్న గౌరవభావం నన్ను ముగ్ధుడిని చేసాయి.


నిన్న (12.03.2023) సాయంత్రం రాజమహేంద్రవరంలోని హోటల్ షెల్టన్ లో జరిగిన డాక్టర్ కంభంపాటి స్వయంప్రకాష్ గారి జయంతి కార్యక్రమంలో పాల్గొని, రాత్రి సుమారుగా 9.30 గంటల సమయంలో కారులో విజయవాడకు తిరుగుప్రయాణమయ్యాను. 


కొవ్వూరు వంతెన దాటి, కొంతదూరం వచ్చాక, దారి ఎడమవైపునకు తిరుగుతుంది. అది చాలా పెద్ద కూడలి. అక్కడో ఫ్లైఓవర్ కూడా ఉంది. నాకు ఆ దారిమీద పూర్తి అవగాహన లేదు. అందువల్ల కచ్చితంగా అది ఏ ప్రాంతమో చెప్పలేను.  


అలా... కారు ఎడమవైపునకు మలుపు తీసుకుంటున్న సమయంలో, పెద్ద ఫొటో కనబడింది. అది కంచి స్వామివారు... జగద్గురువులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారిది. మామూలుగా అయితే, స్వామికి నమస్కారం చేసుకుని, ఆగకుండానే ప్రయాణం చేసేవాడిని. కానీ, అక్కడి సన్నివేశం నన్ను ఎంతో ఆకట్టుకోవడంతో కారు వెనక్కుతిప్పమని డ్రైవర్ కు చెప్పాను.


మీరు ఫొటోలో చూస్తున్నదే ఆ సన్నివేశం. అందులో ప్రత్యేకత ఏమిటంటే...


స్వామివారి ఫొటో కింద ఓ వ్యక్తి పూలు అమ్ముకుంటున్నాడు. అది అతడి వృత్తి. రోజూ అక్కడే పూలు అమ్ముతుంటాడు. రోజూ తాను అమ్మకానికి తెచ్చుకున్న పూలలో కొన్ని స్వామి వారి ఫొటోకి వేసి, నమస్కారం చేసుకుని, ఆ తర్వాత అమ్మకం ప్రారంభిస్తాడు. మంగళవారం, శనివారం స్వామికి ప్రత్యేకంగా అలంకారం కూడా చేస్తాడు.


నిజానికి అది అతను పెట్టుకున్న ఫొటో కాదు. స్వామివారు కొద్దికాలం క్రితం రాజమహేంద్రవరం వచ్చినప్పుడు ఓ సంస్థ ఏర్పాటుచేసిన స్వాగత ప్రకటన అది. ఆ ఫొటోకే అతడు నిత్యం పూలదండలు సమర్పిస్తాడు.


సాధారణంగా అందరూ వారి ఇష్టదైవాల ఫొటోలు పెట్టకుంటారు. కానీ, ఇతడు మాత్రం స్వామి వారి ఫొటోకే దండలు వేసి, ఆరాధిస్తున్నాడు. అతడు వ్యాపారం చేస్తున్న ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించాను. ఏ దేవుడి ఫొటో అక్కడ లేదు. కేవలం స్వామి వారి ఫొటోకే దండలు వేసి ఉన్నాయి. 


కారు దిగి, అతడిని అడిగి ఈ వివరాలు తెలుసుకున్నా. స్వామివారు చాలా గొప్పవారని, ఆయన దేవుడితో సమానమని చెప్పాడతడు అతడి యాసలో.  


నేను కొంత సొమ్ము ఇచ్చి, తీసుకోమంటే... వద్దంటే వద్దన్నాడు. నా దేవుడికి పూలు నేను వేసుకోగలను అన్నాడు. అనేకవిధాలుగా బతిమాలినా ఒప్పుకోలేదు. చివరకు ఆ సొమ్ముకు తగిన పూలు రేపటి రోజున స్వామికి సమర్పించమని చెబితే, సరేనంటూ అంగీకరించాడు. 


ఇది కదా నిజమైన, పరిపూర్ణమైన భక్తి అనిపించింది.  


ఆ పెద్ద మనసు ముందు నేనెంత చిన్నవాడినో తెలిసింది. 


ఇంతటి గొప్ప సన్నివేశాన్ని చూసిన ఆనందంలో ఆ వ్యక్తి పేరు కనుక్కోవడం మర్చిపోయాను. 


అయినా... అంతటి గొప్ప మనసుకి పేరుతో పనేముంది.


కప్ఫగంతు రామకృష్ణ గారు