ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
22, మే 2026, శుక్రవారం
మనభాషలను
*మనభాషలను మనమే రక్షించుకోవాలి,ప్రభుత్వాలు కూడా రక్షించడం లేదు*
*౫*
మహేశ్వరుడు తన ఢమరుకం నుండి14 శబ్దాలు చేసి చిదంబరక్షేత్రంలో స్థాణువు కాగా ఆ 14 సూత్రాల ఆధారంగా 3983 సూత్రాలను 8 అధ్యాయాలుగా *పాణిని మహర్షి* వారు రచించగా *భట్టోజీ దీక్షితులవారు* వాటి ని *సిధ్ధాన్త కౌముది* అనే పేరు తో ఒక క్రమంలో అమర్చారు. ఆ సూత్రాలను అధ్యయనం చేసేవారూ తక్కిపోయారు, అవి అధ్యయనం చేయడం వలన ఆర్థిక ప్రయోజనం లేకపోవడం తో ఈనాడు ఎవ్వరూ వాటిని అధ్యయనం చేయడం లేదు, అందరూ విడిచిపెట్టి ననూ బాధ్యత గల కొందరు వేదపండితులైన బ్రాహ్మణులు మాత్రం వాటిని గురుశిష్య పరంపరగా అధ్యయనం చేస్తూ ఉండటంతో ఇంకనూ అవి మనకు అందుబాటులో ఉన్నాయి. అదే ఈనాటి భాషలన్నిటికీ మూలాధారం. ఇదంతా అధ్యయనం చేయడం ఈనాడు ఎవరికీ సాధ్యం కావడం లేదు. కానీ అందులో మనకు అవసరమైన ముఖ్యమైన సూత్రాలను కొంచెం కొంచెంగా తెలుసుకుందాం....
*అచ్చు లు,హల్లు లు అంటే ఏమిటి?*
ఆదిరంత్యేన సహేతా ప్రత్యాహారం అనే నియమం ప్రకారం మొదటి చివరి అక్షరాలను ఉచ్చరిస్తే ఆ మధ్యలో ని వర్ణాల సముదాయం గా భావం వస్తుంది,అలా చెప్పడాన్ని ప్రత్యాహారం అంటారు. ఉదాహరణకు మాహెశ్వర సూత్రాలలో అ మొదలు చ్ వరకూ ఉండే సముదాయమును అచ్ లు/అచ్చులు అనీ, హ నుండి ల్ వరకూ గల సముదాయాన్ని హల్ లు/హల్లులు అని అంటారు.
*మాహేశ్వర సూత్రాలు*
౧. అఇఉణ్, ౨.ఋఌక్ ౩. ఏ ఓఙ్, ౪. ఐఔచ్, ౫. హయవరట్, ౬. లణ్, ౭. ఞమఙణనమ్,౮. ఝభఞ, ౯. ఘఢధశ్, ౧౦. జబగడదశ్, ౧౧. ఖఫఛఠథ చటతవ్ ౧౨. కపయ్ ౧౩.శషసర్, ౧౪.:హల్.
ఈ పదునాలుగు సూత్రము ల చివరి వర్ణములను ఇత్ సంజ్ఞలు అంటారు, అంటే అవి వెడలిపోవును అని అర్థం. ఉదాహరణకు అచ్ లు అంటే అఇఉణ్ లోని అ మొదలు ఐఔచ్ లోని చ్ కు ముందు ఉన్న ఔ వరకూ ఉన్న వర్ణ సముదాయము అని అర్థం అందులో చ్ ఉండదన్నమాట.
***** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
ఔషధ సేవన కాలముల
ఆయుర్వేదం నందు ఔషధ సేవన కాలముల గురించి సంపూర్ణ వివరణ -
ఆయుర్వేదం నందు ఔషధాలను సేవించు విధానమును రోగాలకు బట్టి 10 రకాలుగా వర్గీకరించబడినది. ఈ విధముగా ఔషధాలను సేవించినచో ఆయా ఔషధాలు బలంగా పనిచేసి రోగి తొందరగా కోలుకుంటాడు. మరియు ఔషధాలను సూర్యోదయానికి ముందు , సూర్యాస్తమయం తరువాత సేవించిన మంచిఫలితాలు పొందగలరు. ముఖ్యంగా ఔషధసేవన గురువారం నందు మొదలు పెట్టిన త్వరగా రోగం నుంచి విముక్తి పొందవచ్చు.
ఆయుర్వేదం వర్గీకరించిన 10 రకాల ఔషధసేవన కాలాలు -
• అనన్నౌషధ కాలము -
తినినట్టి ఆహారం పూర్తిగా జీర్ణం అయిన తరువాత ఔషధాన్ని సేవించుట . రోగి బలవంతుడుగా ఉన్నప్పుడు కఫరోగం నందు దీనిని ఉపయోగించవలెను .
• అన్నాదౌష్యధ కాలము -
ఆహారమును భుజించుటకు ముందు ఔషధమును తినినవెంటనే ఆహారమును భుజించుట . దీనిని అపానవాతం ప్రకోపించినప్పుడు ఉపయోగించవలెను .
• మధ్యోషధ కాలము -
• ఆహారం తినునప్పుడు మధ్య సమయం నందు తినునట్టి ఔషధం . దీనిని సమాన వాతం ప్రకోపించినప్పుడు ఉపయోగించవలెను .
• అంతౌషధ కాలము -
ఆహారం భుజించుతూ ఉన్న సమయంలో చివరలో ఔషధం సేవించటం . దీనిని వ్యానవాతం ప్రకోపించినప్పుడు మధ్యాహ్న భోజనం చివర సమయంలో , ఉదాన వాతం ప్రకోపం చెందినపుడు రాత్రి భోజనం యొక్క చివరలో ఔషధం సేవించవలెను .
• కబాలాంతరౌషధ కాలము -
ఆహారం భుజించునప్పుడు మొదటిముద్ద తిని వెంటనే ఔషధమును భుజించిన పిదప మరలా ఒక ముద్ద అన్నము తినునట్టి ఔషధం . దీనిని ప్రాణవాతం ప్రకోపం చెంది ఉండునప్పుడు ఉపయోగింపవలెను.
• గ్రాసగ్రాసౌషధ కాలము -
ప్రతి అన్నపు ముద్దతోను ఔషధం చేర్చి భుజించటం. దీనిని ప్రాణవాతం ప్రకోపం చెందినపుడు ఉపయొగింపవలెను.
• ముహురౌషధ కాలము -
అన్నము తిన్నను , తినకున్నను ఔషధమును అనేక పర్యాయాలు తీసుకోవడం . దీనిని విషదోషం , వాంతులు , ఎక్కిళ్లు , దప్పిక, శ్వాస , దగ్గు అను రోగములు కలవారికి ఉపయోగించవలెను .
• స్నానౌషధ కాలము -
ఆహారంతో కూడా చేర్చి తినునట్టి ఔషధము . నోటికి రుచిలేకపోవుట వంటి రోగముల యందు అనేక రకాల ఆహార పదార్ధములతో చేర్చి ఉపయోగించవలెను .
• సాముద్గౌషధ కాలము -
మొదట ఔషధమును తిని వెంటనే ఆహారంను భుజించి మరలా ఔషధమును సేవించుట . దీనిని ఆక్షేపక వాతము , ఎక్కిళ్లు , కంపవాతం అనగా పార్కిన్సన్స్ వ్యాధి నందు ఉపయోగించవలెను .
• నిశౌష్యథ కాలము -
రాత్రి పడుకునే సమయం నందు తినునట్టి ఔషధము . దీనిని మెడకొంకులకు పై భాగమున పుట్టు రోగములు నందు ఉపయోగింపవలెను . పైన చెప్పిన విధముగా 10 రకములుగా ఔషధసేవన పద్ధతులు కలవు. ఔషధంతో పాటు ఔషధసేవన కాలం కూడా రోగాన్ని తగ్గించడంలో ప్రముఖపాత్ర వహించును.
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం . ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
. కాళహస్తి వేంకటేశ్వరరావు
. అనువంశిక ఆయుర్వేద వైద్యులు
. 9885030034
మరణం ఇంత గొప్పదా..
_________________________
*_“మరణం ఇంత గొప్పదా...!!!”_*
_________________________
_[మృత్యువుకు ప్రతి ఒక్కరూ భయపడతారు. కానీ జనన మరణాలు సృష్టి నియమాలు..... విశ్వం యొక్క సమతుల్యతకు ఇవి చాలా అవసరం. మరణమే లేకుంటే ఎన్నెన్ని అనర్థాలో..! అదేంటో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ కథను తప్పకుండా చదవండి... Don't miss it..]_
.............................................
*ఒకసారి ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు క్రింద కూర్చున్న సన్యాసి వద్దకు వెళ్ళాడు. అతనిని కలిసి _"ఓ స్వామీ! నేను అమరత్వం పొందగలిగే మూలికా ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియజేయండి"_ అని అడిగాడు. అప్పుడా సన్యాసి _"ఓ రాజా ! దయచేసి మీరు ఎదురుగా ఉన్న రెండు పర్వతాలను దాటండి. అక్కడ మీకు ఒక సరస్సు కనిపిస్తుంది. దాని నీరు త్రాగండి. మీరు అమరత్వం పొందుతారు."_ అని చెప్పాడు.*
*రెండు పర్వతాలు దాటిన తర్వాత రాజుకు ఒక సరస్సు కనిపించింది. అతను నీరు తాగడానికి వెళ్ళబోతున్నప్పుడు అతనికి బాధాకరమైన మూలుగులు వినిపించాయి. అతను నీరు తాగకుండా ఆ గొంతును అనుసరించాడు. చాలా బలహీనమైన వ్యక్తి ఒకడు పడుకుని నొప్పితో బాధపడుతున్నాడు. రాజు కారణం అడగగా...*
*"నేను సరస్సులోని నీటిని తాగి అమరుడనయ్యాను. నాకు నూరేళ్లు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటి వేశాడు.గత యాభై ఏళ్లుగా నన్ను చూసుకునే వారు లేకుండా పడి వున్నాను. నా కొడుకు చనిపోయాడు. నా మనుమలు ఇప్పుడు వృద్ధులయ్యారు. నేను కూడా తినడం మరియు నీరు త్రాగటం మానేశాను. అయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను."*
*రాజు ఆలోచించాడు... _"అమరత్వం మరియు వృద్ధాప్యం యొక్క ప్రయోజనం ఏమిటి?"_ నేను అమరత్వంతో పాటు యవ్వనం పొందితే? పరిష్కారం కోసం మళ్లీ సన్యాసి దగ్గరకెళ్ళి అడిగాడు. _"నాకు అమరత్వంతో పాటు యవ్వనంకూడా లభించే మార్గం తెలపండి"_ అని...*
*సన్యాసి ఇలా అన్నాడు... "సరస్సు దాటిన తర్వాత మీకు మరొక పర్వతం కనిపిస్తుంది. దాన్ని కూడా దాటండి. అక్కడ మీకు పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపిస్తుంది, వాటిలో ఒకటి తీసుకుని తినండి. మీరు అమరత్వంతో పాటు యవ్వనం కూడా పొందుతారు."*
*రాజు బయలుదేరి మరో పర్వతాన్ని దాటాడు.అక్కడ అతనికి పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపించింది. పండ్లను తెంపి తినబోతుంటే... కొందరు గట్టిగా అరుస్తూ పోట్లాడుకోవడం వినిపించింది. ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటారని ఆలోచించాడు.*
*నలుగురు యువకులు గొంతెత్తి వాదించుకోవడం చూశాడు. అలా వాదించుకుంటూ ఈ మారు మూలలో పోట్లాడుకోవడానికి కారణం ఏమిటని రాజు వాళ్ళని అడిగాడు. వారిలో ఒకరు _"నాకు 250 ఏళ్లు, నా కుడి వైపున ఉన్న వ్యక్తికి 300 సంవత్సరాలు. అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు. రాజు సమాధానం కోసం అవతలి వ్యక్తి వైపు చూసినప్పుడు అతను చెప్పాడు..."నా కుడి వైపున మా నాన్న వున్నాడు. అతనికి 350 సంవత్సరాల వయస్సు. అతను తన ఆస్తిని నాకు ఇవ్వనప్పుడు, నేను నా కొడుకుకు ఎలా ఇస్తాను? ఆ వ్యక్తి అదే ఫిర్యాదును కలిగి వున్న 400 సంవత్సరాల వయస్సు గల అతని తండ్రిని సూచించాడు. ఆస్తి కోసం అంతులేని మా పోరాటాలను చూసి తట్టుకోలేక మా గ్రామ ప్రజలు మమ్మల్ని గ్రామం నుండి వెళ్లగొట్టారని వారందరూ రాజుతో చెప్పారు.*
_రాజు దిగ్భ్రాంతికి గురై సన్యాసి వద్దకు తిరిగి వచ్చి..._
*_"మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియచేసినందుకు ధన్యవాదాలు"_ అన్నాడు.*
*అపుడు ఆ సన్యాసి ఇలా అన్నారు...*
_*మరణం ఉంది కాబట్టే ప్రపంచంలో ప్రేమ ఉంది*_
*"మరణాన్ని నివారించే బదులు, మీరు ప్రతిరోజూ, ప్రతి క్షణం సంతోషంగా జీవించండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి. అపుడు ప్రపంచం మారుతుంది.*
*1. మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తే అది తీర్థ స్నానం (పవిత్ర స్నానం) లాగా ఉంటుంది.*
*2. ఆహారం తినేటప్పుడు జపం చేస్తే ప్రసాదం అవుతుంది.*
*3. నడిచేటప్పుడు జపిస్తే అది తీర్థయాత్ర లాగా ఉంటుంది.*
*4. ఆహారం వండేటప్పుడు జపం చేస్తే మహా ప్రసాదం అవుతుంది.*
*5. నిద్రించే ముందు జపం చేస్తే ధ్యాన నిద్ర లాగా ఉంటుంది.*
*6. పనిచేసేటప్పుడు జపిస్తే అది భక్తి అవుతుంది.*
*7.ఇంట్లో జపిస్తే ఇల్లే దేవాలయం అవుతుంది.*
🙏శివాయ గురువే నమః 🙏
చేతిలో చరవాణి
---
### *‘చేతిలో చరవాణి.. చెదిరిపోతున్న బంధాలు’*
*మొబైల్ మాయలో మనిషి మాయమవుతున్నాడు: పలకరింపు కరువైన బతుకులు*
"ప్రపంచాన్ని దగ్గర చేసిన మొబైల్, పక్కనున్న మనిషిని దూరం చేస్తోంది" అనే మాట నేటి నిష్టూర సత్యం. ఉదయం కళ్లు తెరిచింది మొదలు రాత్రి కళ్లు మూసే వరకు మొబైల్ మోజులో పడి మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. కన్నతల్లిదండ్రులతో, కడుపున పుట్టిన బిడ్డలతో, కష్టసుఖాల్లో తోడుండే మిత్రులతో మాట్లాడడానికి కూడా తీరిక లేనంత బిజీగా బతుకుతున్నారు మనుషులు.
#### *1. ‘గుడ్ మార్నింగ్’ స్టేటస్కే తప్ప.. ‘అమ్మా’ అనే తీరికేది?*
*కన్నవారి కడుపు నింపే మాటే కరువైంది*
"వంద మందికి ‘గుడ్ మార్నింగ్’ పంపే ఓపిక ఉంది, కానీ పక్క గదిలో ఉన్న అమ్మకు ‘అమ్మా, టిఫిన్ తిన్నావా?’ అని అడిగే తీరిక లేదు." ఒకప్పుడు అమ్మ చేతి గోరుముద్ద తింటూ కబుర్లు చెప్పుకునేవారు. ఇప్పుడు అదే అమ్మ పెట్టిన అన్నం తింటూ, ఫోన్లో రీల్స్ చూస్తున్నారు. "ఫోన్ చార్జింగ్ అయిపోతుందని భయం, కానీ బంధాలు డిశ్చార్జ్ అవుతున్నాయని బాధ లేదు" అని పెద్దలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
*గమనిక*: "స్క్రీన్కి దగ్గరయ్యావ్, కన్నవారికి దూరమయ్యావ్. ఇదేనా నీకు టెక్నాలజీ ఇచ్చిన వరం?"
#### *2. ‘కుటుంబం’ అనే పుస్తకం.. ‘వాట్సాప్’ గ్రూప్గా మారింది*
*ఒకే ఇంట్లో నలుగురు.. నాలుగు ప్రపంచాలు*
ఒకే భోజనం బల్ల దగ్గర నలుగురు కూర్చున్నా, నాలుగు మొబైళ్లు నాలుగు దిక్కులు చూస్తున్నాయి. నాన్న న్యూస్ చూస్తున్నాడు, అమ్మ సీరియల్ క్లిప్పింగ్, కొడుకు గేమ్, కూతురు చాటింగ్. "ఏం కూర చేశావ్?" అని అడగడం మానేశారు, "డేటా అయిపోయింది" అని బాధపడుతున్నారు. పండుగపూట సెల్ఫీ దిగి స్టేటస్ పెట్టడం వరకే బంధం. "ఇంటిల్లిపాది ఇంట్లోనే ఉన్నారు, కానీ మనసు మాత్రం మొబైల్లోనే ఉంది."
*వ్యాఖ్య*: "ఇంట్లో వైఫై ఉంది, కానీ మనసుల మధ్య కనెక్షన్ కట్ అయ్యింది. సిగ్నల్ ఫుల్, కానీ సెంటిమెంట్ నిల్!"
#### *3. ‘ఆప్తులు’ కాస్తా ‘కాంటాక్ట్ లిస్ట్’ అయ్యారు*
*పరామర్శించే మనిషి లేడు.. ‘RIP’ స్టిక్కర్ పంపే మనిషి ఉన్నాడు*
ఒకప్పుడు కష్టం అంటే కళ్లముందు మిత్రులు, బంధువులు. ఇప్పుడు కష్టం చెప్పుకుందామంటే అందరూ ‘ఆన్లైన్’లోనే, కానీ ‘అందుబాటు’లో లేరు. పుట్టినరోజుకు ‘హార్ట్’ స్టిక్కర్, చావుకు ‘RIP’ స్టిక్కర్. అంతకు మించి మానవత్వం లేదు. "వీధి చివర ఉన్న స్నేహితుడి ఇంటికి వెళ్లే తీరిక లేదు, కానీ అమెరికాలో ఉన్నవాడితో అర్ధరాత్రి దాకా వీడియో కాల్."
*సూటి మాట*: "వేయి మంది ఫాలోవర్లు ఉన్నారు, కానీ జ్వరం వస్తే నుదుట తడిగుడ్డ వేసే ఒక్కడు లేడు. ఇదేనా నీకు సోషల్ మీడియా ఇచ్చిన ‘సోషల్’ జీవితం?"
#### *4. ‘పిల్లలతో ఆట’ మానేసి.. ‘ఫోన్తో ఆట’ ఆడుతున్నారు*
*‘నాన్నా’ అని పిలిస్తే ‘బిజీ’ అనే సమాధానం*
"నాన్నా, కథ చెప్పు" అంటే "ఫోన్లో చూసుకో" అంటున్నారు. "అమ్మా, ఆడుకో" అంటే "యూట్యూబ్లో కార్టూన్ చూడు" అని మొబైల్ చేతిలో పెడుతున్నారు. పిల్లలకు మొదటి నేస్తం అమ్మానాన్న కావాలి, కానీ ఇప్పుడు మొబైల్ అయ్యింది. "ముద్దు చేయాల్సిన చేతులు, మొబైల్ స్క్రోల్ చేస్తున్నాయి. కథ చెప్పాల్సిన నోరు, రీల్స్కు కామెంట్లు పెడుతోంది."
*హెచ్చరిక*: "పిల్లలకు టైమ్ ఇవ్వకపోతే, రేపు నీకు టైమ్ ఇచ్చేవాళ్లు ఉండరు. నేడు నువ్వు మొబైల్లో మునిగితే, రేపు వాళ్లు నిన్ను వృద్ధాశ్రమంలో ముంచుతారు!"
#### *5. ‘స్క్రీన్ ఏజ్’లో ‘స్నేహం’ సైలెంట్ అయ్యింది*
*‘లైక్’ కొట్టడం కాదు.. ‘లైఫ్’లో ఉండడం నేర్చుకో*
రోజుకు 8 గంటలు మొబైల్, 8 నిమిషాలు మనిషితో మాటలు. "స్నేహితుడి ఫోటోకి లైక్ కొట్టాం, కానీ వాడి కళ్లలో కన్నీరు కనిపించడం లేదు." "స్టేటస్ చూసి సుఖంగా ఉన్నాడనుకుంటున్నాం, కానీ స్ట్రెస్లో చస్తున్నాడని తెలియడం లేదు." మొబైల్ మనల్ని కలిపిందని మురిసిపోతున్నాం, కానీ అది మన మధ్య గోడలు కడుతోంది.
*సూటి ప్రశ్న*: "డేటా అయిపోతే రీఛార్జ్ చేసుకుంటావ్, బంధం తెగిపోతే ఏం చేస్తావ్? సిమ్ కార్డు మార్చినంత ఈజీ కాదు, మనిషిని మార్చడం!"
#### *6. ‘తస్మాత్ జాగ్రత్త’.. మొబైల్ చేతిలో బానిస కావొద్దు*
*చరవాణి నీ చెప్పుచేతల్లో ఉండాలి, నువ్వు దాని చెప్పుచేతల్లో కాదు*
మొబైల్ ఒక పనిముట్టు, అంతేకానీ ప్రాణం కాదు, ప్రపంచం కాదు. "రోజులో ఒక్క గంట ‘మొబైల్ ఫాస్టింగ్’ చేయండి. ఆ గంట అమ్మతో కాఫీ తాగండి, నాన్నతో కబుర్లు చెప్పండి, పిల్లలతో ఆడుకోండి, భార్యతో నవ్వండి, స్నేహితుడిని పలకరించండి." ఆ గంటలో దొరికే ఆనందం, లక్ష రీల్స్ చూసినా రాదు.
*ముగింపు మాట*: "చరవాణి చక్కనిదే, కానీ అదే సర్వస్వం అనుకుంటే చిక్కే. బంధాలు చెడిపోయాక బాధపడితే లాభం లేదు. మనిషికి మనిషే మందు, మొబైల్ కాదు. ఇప్పటికైనా మేలుకో, లేకపోతే మనుషుల మధ్య మమత అనే పదమే మాయమైపోతుంది
