*మనభాషలను మనమే రక్షించుకోవాలి,ప్రభుత్వాలు కూడా రక్షించడం లేదు*
*౫*
మహేశ్వరుడు తన ఢమరుకం నుండి14 శబ్దాలు చేసి చిదంబరక్షేత్రంలో స్థాణువు కాగా ఆ 14 సూత్రాల ఆధారంగా 3983 సూత్రాలను 8 అధ్యాయాలుగా *పాణిని మహర్షి* వారు రచించగా *భట్టోజీ దీక్షితులవారు* వాటి ని *సిధ్ధాన్త కౌముది* అనే పేరు తో ఒక క్రమంలో అమర్చారు. ఆ సూత్రాలను అధ్యయనం చేసేవారూ తక్కిపోయారు, అవి అధ్యయనం చేయడం వలన ఆర్థిక ప్రయోజనం లేకపోవడం తో ఈనాడు ఎవ్వరూ వాటిని అధ్యయనం చేయడం లేదు, అందరూ విడిచిపెట్టి ననూ బాధ్యత గల కొందరు వేదపండితులైన బ్రాహ్మణులు మాత్రం వాటిని గురుశిష్య పరంపరగా అధ్యయనం చేస్తూ ఉండటంతో ఇంకనూ అవి మనకు అందుబాటులో ఉన్నాయి. అదే ఈనాటి భాషలన్నిటికీ మూలాధారం. ఇదంతా అధ్యయనం చేయడం ఈనాడు ఎవరికీ సాధ్యం కావడం లేదు. కానీ అందులో మనకు అవసరమైన ముఖ్యమైన సూత్రాలను కొంచెం కొంచెంగా తెలుసుకుందాం....
*అచ్చు లు,హల్లు లు అంటే ఏమిటి?*
ఆదిరంత్యేన సహేతా ప్రత్యాహారం అనే నియమం ప్రకారం మొదటి చివరి అక్షరాలను ఉచ్చరిస్తే ఆ మధ్యలో ని వర్ణాల సముదాయం గా భావం వస్తుంది,అలా చెప్పడాన్ని ప్రత్యాహారం అంటారు. ఉదాహరణకు మాహెశ్వర సూత్రాలలో అ మొదలు చ్ వరకూ ఉండే సముదాయమును అచ్ లు/అచ్చులు అనీ, హ నుండి ల్ వరకూ గల సముదాయాన్ని హల్ లు/హల్లులు అని అంటారు.
*మాహేశ్వర సూత్రాలు*
౧. అఇఉణ్, ౨.ఋఌక్ ౩. ఏ ఓఙ్, ౪. ఐఔచ్, ౫. హయవరట్, ౬. లణ్, ౭. ఞమఙణనమ్,౮. ఝభఞ, ౯. ఘఢధశ్, ౧౦. జబగడదశ్, ౧౧. ఖఫఛఠథ చటతవ్ ౧౨. కపయ్ ౧౩.శషసర్, ౧౪.:హల్.
ఈ పదునాలుగు సూత్రము ల చివరి వర్ణములను ఇత్ సంజ్ఞలు అంటారు, అంటే అవి వెడలిపోవును అని అర్థం. ఉదాహరణకు అచ్ లు అంటే అఇఉణ్ లోని అ మొదలు ఐఔచ్ లోని చ్ కు ముందు ఉన్న ఔ వరకూ ఉన్న వర్ణ సముదాయము అని అర్థం అందులో చ్ ఉండదన్నమాట.
***** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి