22, ఏప్రిల్ 2021, గురువారం

ఆచార్య సద్బోధన*

 *ఆచార్య సద్బోధన*


భగవంతుడు మనకు వివేకాన్ని, ఆచరణకు సన్మార్గ విలువలను ఇచ్చాడు. భగవంతునితో సంబంధం పెంచుకోవా్డానికి ఈ రెండూ ఆవశ్యకాలే.


పరమాత్మునితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం వలన మనిషిలో సమతుల్యత ఏర్పడుతుంది. ఆ సంబంధం అతడిని శక్తిమంతుడిని గావిస్తుంది. 


జీవితంలో అమూల్యమైన అనుభవం మనం పరమాత్ముడిని ఆశ్రయించినప్పుడే కలుగుతుంది. అప్పుడే జీవితానికి స్వాంతన, భద్రత కలుగుతాయి.


పరమాత్ముడి ఆలోచనలు, అన్వేషణ ద్వారా కనుగొనాలి. ఆ సంబంధాన్ని కనుగొన్నప్పుడే ఈ ప్రపంచంలో మన స్థానాన్ని స్వీకరించి వివేకంతో దానికి పరిపూర్ణత చేకూర్చినవారమవుతాం.


*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: