🕉️
*పురుషోత్తమ/మల/అధికమాస మహాత్మ్యము*
భారతీయ కాలగణన (పంచాంగం) ప్రకారం చంద్రమానానికి, సౌరమానానికి మధ్య గల వ్యత్యాసాన్ని సరిచేయడానికి ప్రతి 32 నెలల 16 రోజులకు ఒకసారి అధిక మాసం వస్తుంది. జ్యేష్ఠ మాసంలో ఈ అధిక మాసం సంభవించినప్పుడు దానిని అధిక జ్యేష్ఠ మాసం అంటారు. పురాణాలు, స్మృతులు, ధర్మశాస్త్ర సూత్రాల ప్రకారం దీనికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. దీనినే "పురుషోత్తమ మాసం" అని కూడా పిలుస్తారు.
చంద్రమాన సంవత్సరానికి (354 రోజులు), సౌరమాన సంవత్సరానికి (365 రోజులు) మధ్య దాదాపు 11 రోజుల వ్యత్యాసం ఉంటుంది. ఈ వ్యత్యాసం సరిగ్గా 33 మాసాలకు (దాదాపు 2 సంవత్సరాల 8 నెలల 16 రోజులకు) ఒక పూర్తి మాసంగా (30 రోజులుగా) మారుతుంది.
కాలచక్రంలో ఈ 'అధిక మాసం' ఏర్పడటానికి పట్టే కాలం 33 నెలలు. ఈ కాలగణన సూత్రానికి ప్రతీకగా కూడా వ్రత విధానంలో 33 సంఖ్యను నిర్దేశించారు.
అధిక మాసానికి అధిపతి లేకపోవడం వల్ల దీనిని అందరూ శుభకార్యాలకు వర్జ్యమని భావించి 'మల మాసం' అని పిలిచేవారు. అప్పుడు ఆ మాసం బాధపడి మహావిష్ణువును ఆశ్రయించగా, స్వామి అనుగ్రహించి, తన పేరైన "పురుషోత్తమ" నామధేయాన్ని దానికి ఇచ్చి, అన్ని మాసాల కంటే శ్రేష్ఠమైనదిగా మార్చాడని పద్మ పురాణ వచనం.
అహం చైవ యథా లోకే
పురుషోత్తమ ఇత్యుతే |
తథాయమపి లోకేషు
పురుషోత్తమ నామకః ||
మత్స సాదృశ్యమగమత్
మాసానామధిపో భవత్ |
జగత్పూజ్యో జగద్వంద్యో
మాసోఽయం చ భవిష్యతి ||
"లోకంలో నేను ఏ విధంగా 'పురుషోత్తముడు' అని పిలవబడుతున్నానో, అదే విధంగా ఈ మాసం కూడా లోకంలో 'పురుషోత్తమ మాసం' అని పిలవబడుతుంది. ఇది నా సారూప్యతను పొంది, అన్ని మాసములకు అధిపతియై, జగత్తు చేత పూజింపబడుతుంది.
మాసానాం ప్రవరో మాసః
పురుషోత్తమ సంజ్ఞకః |
అస్మిన్ మాసే కృతం పుణ్యం
కోటికోటి గుణం భవేత్ ||
( స్కాంద పురాణం)
మాసాలన్నింటిలోనూ పురుషోత్తమ మాసం అత్యంత శ్రేష్ఠమైనది. ఈ మాసంలో ఆచరించే ఏ పుణ్యకార్యమైనా (దానం, జపం, తపస్సు) కోట్లాది రెట్ల ఫలితాన్ని ఇస్తుంది.
యాదృశీ జాహ్నవీ గంగా
సరితాం ప్రవరా స్మృతా |
తాదృశః సర్వమాసానాం
ప్రవరో జ్యేష్ఠాఽధికో నృప ||
(నారద పురాణము)
నదులన్నింటిలోనూ గంగానది ఎంత శ్రేష్ఠమైనదో, చాంద్రమాన మాసాలన్నింటిలోనూ ఈ 'అధిక జ్యేష్ఠ మాసం' అంత శ్రేష్ఠమైనది." గంగలో స్నానం చేస్తే ఎలాంటి పాపాలు తొలగిపోతాయో, ఈ మాసంలో విష్ణు నామ స్మరణ చేయడం వల్ల అంతటి అంతఃశుద్ధి కలుగుతుంది.
మాసోఽయమధికో రాజన్
పురుషోత్తమ ఉచ్యతే |
అస్మిన్ కాలాచ్యుతం నత్వా
పునర్భవం న విందతి ||
ఈ అధిక మాసము సాక్షాత్తూ పురుషోత్తమ స్వరూపము. ఈ కాలంలో అచ్యుతుడైన ఆ శ్రీమహావిష్ణువును భక్తితో అర్చించి, నమస్కరించిన మానవుడు మరల జన్మ మృత్యు సంసార చక్రంలో పడకుండా మోక్షాన్ని పొందుతాడు.
గంగా సరస్వతీ రేవా
యమునా చ ప్రయాగకా |
తాసాం స్నానాచ్చ యత్పుణ్యం
తదస్మిన్ మాస సేవయా ||
(బృహన్నారదీయ పురాణం)
గంగ, సరస్వతి, నర్మద (రేవ), యమున మరియు ప్రయాగ వంటి పవిత్ర తీర్థాలలో స్నానం చేయడం వల్ల ఎలాంటి పుణ్యం లభిస్తుందో, ఈ పురుషోత్తమ మాసంలో నియమ పూర్వకంగా భగవత్ సేవ చేయడం వల్ల అంతటి పుణ్యఫలం లభిస్తుంది.
దేవదేవ జగన్నాథ
ప్రణతార్తివినాశన |
జ్యేష్ఠాఽధికే మయా దత్తం
గృహాణార్ఘ్యం నమోఽస్తుతే ||💧
అని భగవంతుడికి నిత్య అర్ఘ్యం సమర్పించడం.
వాపీకూపతటాగాది
ప్రతిష్ఠా యజ్ఞకర్మ చ |
మాంగల్యాని చ కర్మాణి
మలమాసే వివర్జయేత్ ||
(నారద స్మృతి)
బావులు, చెరువులు తవ్వించడం, దేవాలయ ప్రతిష్ఠలు, యజ్ఞ యాగాలు, వివాహము, ఉపనయనము, గృహప్రవేశము, చౌలము (పుట్టువెంట్రుకలు తీయుట) వంటి మాంగల్య (శుభ) కార్యాలను మలమాసంలో/అధిక మాసంలో విడిచిపెట్టాలి.
నిత్యాని నైమిత్తికాని
ప్రకుర్యాదధికేఽపి చ |
కామ్యాని తు న కుర్వీత
ప్రతిష్ఠాదీని కాన్యచిత్ ||
(స్మృతి కౌస్తుభం)
అధిక మాసము వచ్చినప్పటికీ నిత్య కర్మలను (సంధ్యావందనాది అనుష్ఠానాలు), నైమిత్తిక కర్మలను (గ్రహణ స్నానాలు, శ్రాద్ధాలు, తప్పనిసరి విధులు) యథావిధిగా ఆచరించాలి. కానీ, కామ్య కర్మలను (కోర్కెలు కోరుతూ చేసే యజ్ఞాలు, వ్రతాలు) మరియు దేవతా ప్రతిష్ఠలు, నూతన గృహారంభాలు వంటి వాటిని మాత్రం అస్సలు చేయకూడదు.
లౌకిక శుభకార్యాలు లేకపోవడం వల్ల మానవునికి సంసార పరమైన బాధ్యతల నుండి కొంత మానసిక విరామం దొరుకుతుంది. ఈ సమయాన్ని దైవచింతనలో, గ్రంథ పఠనంలో గడపడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
అధిక మాసంలో చేసే పూజలు కేవలం "శ్రీ పురుషోత్తమ ప్రీత్యర్థం" (భగవంతుని సంతోషం కోసం మరియు ఆత్మశుద్ధి కోసం) మాత్రమే చేస్తారు. ఇది మానవుడిని స్వార్థం నుండి నిష్కామ స్థితికి తీసుకెళ్తుంది.
జీవతో వా మృతస్యాపి
యా గతిః పురుషోత్తమే |
న సా క్రతుసహస్రేణ
లభ్యతే నృపసత్తమ ||
( నారద పురాణం)
పురుషోత్తమ మాసంలో జీవించి ఉన్నవారికి మాత్రమే కాదు, మరణించిన పితృదేవతల పేరిట చేసే పుణ్యకార్యాల వల్ల వారికి లభించే సద్గతి, వేయి యజ్ఞాలు చేసినా లభించదు. ఈ మాసంలో పితృదేవతలను తలుచుకుని దానాలు చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది.
యైర్న పూజిత ఈశానో
మాసి పురుషోత్తమే |
దరిద్రా భవంతి తే నూనం
జన్మజన్మని మానవాః ||
(పద్మ పురాణము)
ఎవరైతే ఈ పరమ పవిత్రమైన పురుషోత్తమ మాసంలో జగదీశ్వరుడైన శ్రీహరిని పూజించకుండా, దానధర్మాలు చేయకుండా కాలం గడుపుతారో, వారు జన్మజన్మలందు దరిద్రాన్ని అనుభవిస్తారు. అంటే ఈ మాసంలో చేసే కొద్దిపాటి పూజ అయినా దరిద్ర నాశనం అవుతుంది.
ఏకభక్తేన నక్తేన తథైవాయాచితేన చ |
ఉపవాసేన కర్తవ్యో మలమాసః ప్రయత్నతః ||
అధిక మాస వ్రతాన్ని ఆచరించే శక్తులు గలవారు నెల రోజులు ఉపవాసం ఉండాలి. అది సాధ్యం కాని పక్షంలో రోజుకు ఒక పూట మాత్రమే భుజించడం (ఏకభుక్తం), లేదా రాత్రి వేళ మాత్రమే భుజించడం (నక్తం), లేదా అడగకుండా లభించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం (అయాచితం) అనే నియమాల ద్వారా ఈ మాసాన్ని భక్తి శ్రద్ధలతో గడపాలి.
అధిక మాసములో
ఉపవాసము,
ఏకభుక్తము,
నక్త వ్రతము,
అయాచితము,
ధారణ పారణ వ్రతం,
విష్ణుపంచక వ్రతము,
అలవణ వ్రతము,
లక్ష ప్రదక్షిణము,
అయాచిత వ్రతము,
లక్ష వత్తుల వ్రతము,
దీప నమస్కారము,
లక్ష పుష్పార్చన,
అథఃశయనము,
మౌనవ్రతము,
ఇవన్నీ భగవత్ ప్రీతికరమైనందున
చేయవలెను.
మలమాసే గతే ప్రాప్తే
హరిముద్దిశ్య భక్తితః |
త్రయస్త్రింశదపూపానాం
దానం కుర్యాద్విధానతః ||
కాంస్యపాత్రే నిధాయైతాన్
ఫలతాంబూల సంయుతాన్ |
దద్యాద్విప్రాయ శాంతాయ
పురుషోత్తమ తుష్టయే ||
33 అపూపాలను
(అరిసెలు) పళ్ళు, వెండి,
బంగారము మొదలగు దానాలు
బ్రాహ్మణ సువాసినీలకు భోజనము
వాయనాల దానాలు
నిష్కామముగా చేసినచో విశేష
ఫలము లభించును
అధిక మాసములో 33 దేవతలను
వారి అంతర్యామి 33
భగవద్రూపాలను ఆరాధించాలి.
12 ఆదిత్యులు,
11 రుద్రులు,
8 వసువులు,
2 అశ్విని దేవతలు.
వీరిని అపూపాలలో ఆవాహన చేసి పూజించి దానము చేయాలి.
బ్రహ్మాండాన్ని దానం చేసే శక్తి
మానవునికి సాధ్యము కాదు.
పురుషోత్తమ మాసములో ఇది
సాధ్యము. 33, అరిసలను ఒక
కంచు పాత్రలో పెట్టి ఇంకొక కంచు
పాత్రను మూసిపెట్టి దానము
చేసినవారికి బ్రహ్మాండ దాన
ఫలము నిశ్చయముగా లభిస్తుంది.
కాంస్యపాత్రం సమాదాయ
తస్మిన్ పూపాన్ నిధాయ చ |
బ్రాహ్మణాయ ప్రదాతవ్యం
సర్వపాప విముక్తయే ||
సువర్ణ లేదా కంచు పాత్రను (తామ్ర/కాంస్య పాత్ర) తీసుకుని, అందులో నెయ్యితో వండిన అప్పాలను (అరిసెలను) ఉంచి, సర్వ పాపాల నుండి విముక్తి కలగడం కోసం ఉత్తముడైన బ్రాహ్మణునికి దానంగా సమర్పించాలి.
(అపూప దాన శ్లోకం)
విష్ణురూపీ సహస్రాంశుః
సర్వపాపప్రణాశనః |
అపూపాన్న ప్రదానేన
మమ పాపం వ్యపోహతు ||
సహస్ర కిరణాలు కలిగిన, సర్వ పాపాలను నాశనం చేసే విష్ణు స్వరూపుడైన ఓ పురుషోత్తమా! నేను సమర్పిస్తున్న ఈ అపూప (అరిసెల) దానం వల్ల నా పాపాలన్నీ తొలగిపోవు గాక.
అరిసెలు గుండ్రంగా ఉంటాయి. ఇది సూర్య మరియు చంద్ర బింబాలకు ప్రతీక. అధిక మాసం అనేది సూర్య, చంద్రుల గమనాల వ్యత్యాసం వల్ల (సౌర, చాంద్ర మానాల సమన్వయం) ఏర్పడేది కాబట్టి, ఈ గ్రహాల అనుగ్రహం కోసం వాటి రూపంలో ఉన్న అపూపాన్ని దానం చేస్తారు. నెయ్యిలో వేయించినప్పుడు అరిసెపై వచ్చే చిన్న చిన్న రంధ్రాలు లేదా దాని రూపం సూర్యుని సహస్ర కిరణాలకు (రశ్మి) సంకేతంగా భావిస్తారు.
*అధిక మాసం లో విశేష దానాలు*
అధిక మాసం సంపూర్ణముగా
ముగిసేంత వరకూ తాంబూల
దానం, బ్రాహ్మణ దంపతులకు
చేసినచో దౌర్భాగ్యము నశించి
సౌభాగ్య ప్రాప్తి కలుగును. ఒక నెల
ఆఖండ దీపము శాంతము
కాకుండా దీపారాధన చేయుట
వలన అంధకారము నశించి
జీవితము ప్రకాశవంతమై జ్ఞాన ప్రాప్తి
కలుగును. సువాసినీ స్త్రీలు 33
వాయన దానాలు చేయుట వలన
వంశాభివృద్ధి మరియు దీర్ఘ
సౌమంగల్యము సిద్ధించును.
ఇదేవిధముగా అనేక దానాలు
చేయవచ్చు. 33 సంఖ్య అని
చెప్పినది 33 కన్న తక్కువ
కారాదన్న అభిప్రాయముతో
చెప్పినదని తెలుసుకొనవలెను.
అధికమాసములో శ్రీమద్భాగవత
శ్రవణము చేయుటవలన
పురుషోత్తముని అనుగ్రహము
విశేషముగా లభించును.
*అధికమాసములో నిషిద్ధ కార్యములు*
అనిత్యమనిమిత్తంచ దానం మహాదానం|
ఆగ్య్నధానాధ్యరాపూర్వతీర్థయాత్రామరేక్షణం||
దేవారామతటాకాదిప్రతిష్టాం మౌంజి బంధనం |
ఆశ్రమ స్వీకృతం కామ్యపృషోత్వర్గంచ నిప్క్రమం||
రాజ్యాభిషేకం ప్రథమం చూడాకర్మ ప్రతానిచ|
అన్నప్రాశన మారంభం గృహాణాం చ ప్రవేశనం||
స్నానం వివాహం నామాతిపన్నం దేవమహోత్సవం | వ్రతారంభం సమాప్తిం చ కామ్యకర్మచ పాప్మనాం I|
ప్రాయశ్చిత్తం చ సర్వ స్యమల మాసే వర్జయేత్|| -
(బృహస్పతిః- స్ర్మతి ముక్తావళి)
మహా దానములు,
అగ్నాధానము,
యజ్ఞము,
ఉద్యానవనముల నిర్మాణము,
చెరువుల నిర్మాణము,
ఉపనయనము,
సన్యాస స్వీకారము,
జ్యోతిష్టోమాది కామ్యకర్మలు,
పసిపిల్లలను మొదటి సారి ఇంటి
నుండి బయటకు తీసుకువెళ్ళుట,
పట్టాభిషేక కార్యము,
చౌలము,
విశేష వ్రతాలు,
అన్నప్రాశనము,
గృహారంభము,
గృహప్రవేశము,
విశేష తీర్థస్నానము,
వివాహము,
నామకరణము,
ప్రాయశ్చిత్త హోమాలు,
ఈ కార్యములను అధికమాసములో
చేయకూడదు.
పురుషోత్తమస్య మాసే తు
దీపదానం కరోతి యః |
ఘృతేన వాపి తైలేన తస్య
పుణ్యమనంతకమ్ |
పురుషోత్తమ మాసంలో ఎవరైతే ఆవు నెయ్యితో గానీ, లేదా నువ్వుల నూనెతో గానీ భగవంతుని సన్నిధిలో దీప దానం (దీపారాధన చేసి సమర్పించడం) చేస్తారో, వారికి అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. వారి వంశంలోని పితృదేవతలకు కూడా సద్గతులు కలుగుతాయి.
నెల రోజుల పాటు ప్రతిరోజూ సాయంత్రం విష్ణు సన్నిధిలో లేదా తులసి కోట వద్ద అఖండ దీపం లేదా నిత్య దీపారాధన చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.
ఈమాసంలో సూర్యుడి తాపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో విష్ణువుకు జలాభిషేకం చేయడం, పురుష సూక్తం, విష్ణు సహస్రనామ స్తోత్రాలు పఠించడం వలన మనశ్శాంతిని ఇస్తుంది.
సాధ్యమైనంత వరకు నదీ స్నానం చేయడం, నెలలో కనీసం ఒక రోజైనా (ముఖ్యంగా ఏకాదశి నాడు) ఉపవాసం ఉండి పురుషోత్తముడిని పూజించడం శాస్త్ర సమ్మతం.
అధిక మాసం అనేది లౌకిక శుభకార్యాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఆధ్యాత్మిక ఎదుగుదలకు, పూర్వ జన్మ పాప పరిహారానికి, అక్షయ పుణ్య సంపాదనకు లభించిన ఒక అద్భుతమైన "అదనపు" సమయం లాంటిది. ధర్మశాస్త్రాల ప్రకారం దీనిని భక్తి శ్రద్ధలతో వినియోగించుకోవడం ఉత్తమం.
🕉️
*పురుషోత్తమ/మల/అధికమాస మహాత్మ్యము*
భారతీయ కాలగణన (పంచాంగం) ప్రకారం చంద్రమానానికి, సౌరమానానికి మధ్య గల వ్యత్యాసాన్ని సరిచేయడానికి ప్రతి 32 నెలల 16 రోజులకు ఒకసారి అధిక మాసం వస్తుంది. జ్యేష్ఠ మాసంలో ఈ అధిక మాసం సంభవించినప్పుడు దానిని అధిక జ్యేష్ఠ మాసం అంటారు. పురాణాలు, స్మృతులు, ధర్మశాస్త్ర సూత్రాల ప్రకారం దీనికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. దీనినే "పురుషోత్తమ మాసం" అని కూడా పిలుస్తారు.
చంద్రమాన సంవత్సరానికి (354 రోజులు), సౌరమాన సంవత్సరానికి (365 రోజులు) మధ్య దాదాపు 11 రోజుల వ్యత్యాసం ఉంటుంది. ఈ వ్యత్యాసం సరిగ్గా 33 మాసాలకు (దాదాపు 2 సంవత్సరాల 8 నెలల 16 రోజులకు) ఒక పూర్తి మాసంగా (30 రోజులుగా) మారుతుంది.
కాలచక్రంలో ఈ 'అధిక మాసం' ఏర్పడటానికి పట్టే కాలం 33 నెలలు. ఈ కాలగణన సూత్రానికి ప్రతీకగా కూడా వ్రత విధానంలో 33 సంఖ్యను నిర్దేశించారు.
అధిక మాసానికి అధిపతి లేకపోవడం వల్ల దీనిని అందరూ శుభకార్యాలకు వర్జ్యమని భావించి 'మల మాసం' అని పిలిచేవారు. అప్పుడు ఆ మాసం బాధపడి మహావిష్ణువును ఆశ్రయించగా, స్వామి అనుగ్రహించి, తన పేరైన "పురుషోత్తమ" నామధేయాన్ని దానికి ఇచ్చి, అన్ని మాసాల కంటే శ్రేష్ఠమైనదిగా మార్చాడని పద్మ పురాణ వచనం.
అహం చైవ యథా లోకే
పురుషోత్తమ ఇత్యుతే |
తథాయమపి లోకేషు
పురుషోత్తమ నామకః ||
మత్స సాదృశ్యమగమత్
మాసానామధిపో భవత్ |
జగత్పూజ్యో జగద్వంద్యో
మాసోఽయం చ భవిష్యతి ||
"లోకంలో నేను ఏ విధంగా 'పురుషోత్తముడు' అని పిలవబడుతున్నానో, అదే విధంగా ఈ మాసం కూడా లోకంలో 'పురుషోత్తమ మాసం' అని పిలవబడుతుంది. ఇది నా సారూప్యతను పొంది, అన్ని మాసములకు అధిపతియై, జగత్తు చేత పూజింపబడుతుంది.
మాసానాం ప్రవరో మాసః
పురుషోత్తమ సంజ్ఞకః |
అస్మిన్ మాసే కృతం పుణ్యం
కోటికోటి గుణం భవేత్ ||
( స్కాంద పురాణం)
మాసాలన్నింటిలోనూ పురుషోత్తమ మాసం అత్యంత శ్రేష్ఠమైనది. ఈ మాసంలో ఆచరించే ఏ పుణ్యకార్యమైనా (దానం, జపం, తపస్సు) కోట్లాది రెట్ల ఫలితాన్ని ఇస్తుంది.
యాదృశీ జాహ్నవీ గంగా
సరితాం ప్రవరా స్మృతా |
తాదృశః సర్వమాసానాం
ప్రవరో జ్యేష్ఠాఽధికో నృప ||
(నారద పురాణము)
నదులన్నింటిలోనూ గంగానది ఎంత శ్రేష్ఠమైనదో, చాంద్రమాన మాసాలన్నింటిలోనూ ఈ 'అధిక జ్యేష్ఠ మాసం' అంత శ్రేష్ఠమైనది." గంగలో స్నానం చేస్తే ఎలాంటి పాపాలు తొలగిపోతాయో, ఈ మాసంలో విష్ణు నామ స్మరణ చేయడం వల్ల అంతటి అంతఃశుద్ధి కలుగుతుంది.
మాసోఽయమధికో రాజన్
పురుషోత్తమ ఉచ్యతే |
అస్మిన్ కాలాచ్యుతం నత్వా
పునర్భవం న విందతి ||
ఈ అధిక మాసము సాక్షాత్తూ పురుషోత్తమ స్వరూపము. ఈ కాలంలో అచ్యుతుడైన ఆ శ్రీమహావిష్ణువును భక్తితో అర్చించి, నమస్కరించిన మానవుడు మరల జన్మ మృత్యు సంసార చక్రంలో పడకుండా మోక్షాన్ని పొందుతాడు.
గంగా సరస్వతీ రేవా
యమునా చ ప్రయాగకా |
తాసాం స్నానాచ్చ యత్పుణ్యం
తదస్మిన్ మాస సేవయా ||
(బృహన్నారదీయ పురాణం)
గంగ, సరస్వతి, నర్మద (రేవ), యమున మరియు ప్రయాగ వంటి పవిత్ర తీర్థాలలో స్నానం చేయడం వల్ల ఎలాంటి పుణ్యం లభిస్తుందో, ఈ పురుషోత్తమ మాసంలో నియమ పూర్వకంగా భగవత్ సేవ చేయడం వల్ల అంతటి పుణ్యఫలం లభిస్తుంది.
దేవదేవ జగన్నాథ
ప్రణతార్తివినాశన |
జ్యేష్ఠాఽధికే మయా దత్తం
గృహాణార్ఘ్యం నమోఽస్తుతే ||💧
అని భగవంతుడికి నిత్య అర్ఘ్యం సమర్పించడం.
వాపీకూపతటాగాది
ప్రతిష్ఠా యజ్ఞకర్మ చ |
మాంగల్యాని చ కర్మాణి
మలమాసే వివర్జయేత్ ||
(నారద స్మృతి)
బావులు, చెరువులు తవ్వించడం, దేవాలయ ప్రతిష్ఠలు, యజ్ఞ యాగాలు, వివాహము, ఉపనయనము, గృహప్రవేశము, చౌలము (పుట్టువెంట్రుకలు తీయుట) వంటి మాంగల్య (శుభ) కార్యాలను మలమాసంలో/అధిక మాసంలో విడిచిపెట్టాలి.
నిత్యాని నైమిత్తికాని
ప్రకుర్యాదధికేఽపి చ |
కామ్యాని తు న కుర్వీత
ప్రతిష్ఠాదీని కాన్యచిత్ ||
(స్మృతి కౌస్తుభం)
అధిక మాసము వచ్చినప్పటికీ నిత్య కర్మలను (సంధ్యావందనాది అనుష్ఠానాలు), నైమిత్తిక కర్మలను (గ్రహణ స్నానాలు, శ్రాద్ధాలు, తప్పనిసరి విధులు) యథావిధిగా ఆచరించాలి. కానీ, కామ్య కర్మలను (కోర్కెలు కోరుతూ చేసే యజ్ఞాలు, వ్రతాలు) మరియు దేవతా ప్రతిష్ఠలు, నూతన గృహారంభాలు వంటి వాటిని మాత్రం అస్సలు చేయకూడదు.
లౌకిక శుభకార్యాలు లేకపోవడం వల్ల మానవునికి సంసార పరమైన బాధ్యతల నుండి కొంత మానసిక విరామం దొరుకుతుంది. ఈ సమయాన్ని దైవచింతనలో, గ్రంథ పఠనంలో గడపడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
అధిక మాసంలో చేసే పూజలు కేవలం "శ్రీ పురుషోత్తమ ప్రీత్యర్థం" (భగవంతుని సంతోషం కోసం మరియు ఆత్మశుద్ధి కోసం) మాత్రమే చేస్తారు. ఇది మానవుడిని స్వార్థం నుండి నిష్కామ స్థితికి తీసుకెళ్తుంది.
జీవతో వా మృతస్యాపి
యా గతిః పురుషోత్తమే |
న సా క్రతుసహస్రేణ
లభ్యతే నృపసత్తమ ||
( నారద పురాణం)
పురుషోత్తమ మాసంలో జీవించి ఉన్నవారికి మాత్రమే కాదు, మరణించిన పితృదేవతల పేరిట చేసే పుణ్యకార్యాల వల్ల వారికి లభించే సద్గతి, వేయి యజ్ఞాలు చేసినా లభించదు. ఈ మాసంలో పితృదేవతలను తలుచుకుని దానాలు చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది.
యైర్న పూజిత ఈశానో
మాసి పురుషోత్తమే |
దరిద్రా భవంతి తే నూనం
జన్మజన్మని మానవాః ||
(పద్మ పురాణము)
ఎవరైతే ఈ పరమ పవిత్రమైన పురుషోత్తమ మాసంలో జగదీశ్వరుడైన శ్రీహరిని పూజించకుండా, దానధర్మాలు చేయకుండా కాలం గడుపుతారో, వారు జన్మజన్మలందు దరిద్రాన్ని అనుభవిస్తారు. అంటే ఈ మాసంలో చేసే కొద్దిపాటి పూజ అయినా దరిద్ర నాశనం అవుతుంది.
ఏకభక్తేన నక్తేన తథైవాయాచితేన చ |
ఉపవాసేన కర్తవ్యో మలమాసః ప్రయత్నతః ||
అధిక మాస వ్రతాన్ని ఆచరించే శక్తులు గలవారు నెల రోజులు ఉపవాసం ఉండాలి. అది సాధ్యం కాని పక్షంలో రోజుకు ఒక పూట మాత్రమే భుజించడం (ఏకభుక్తం), లేదా రాత్రి వేళ మాత్రమే భుజించడం (నక్తం), లేదా అడగకుండా లభించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం (అయాచితం) అనే నియమాల ద్వారా ఈ మాసాన్ని భక్తి శ్రద్ధలతో గడపాలి.
అధిక మాసములో
ఉపవాసము,
ఏకభుక్తము,
నక్త వ్రతము,
అయాచితము,
ధారణ పారణ వ్రతం,
విష్ణుపంచక వ్రతము,
అలవణ వ్రతము,
లక్ష ప్రదక్షిణము,
అయాచిత వ్రతము,
లక్ష వత్తుల వ్రతము,
దీప నమస్కారము,
లక్ష పుష్పార్చన,
అథఃశయనము,
మౌనవ్రతము,
ఇవన్నీ భగవత్ ప్రీతికరమైనందున
చేయవలెను.
మలమాసే గతే ప్రాప్తే
హరిముద్దిశ్య భక్తితః |
త్రయస్త్రింశదపూపానాం
దానం కుర్యాద్విధానతః ||
కాంస్యపాత్రే నిధాయైతాన్
ఫలతాంబూల సంయుతాన్ |
దద్యాద్విప్రాయ శాంతాయ
పురుషోత్తమ తుష్టయే ||
33 అపూపాలను
(అరిసెలు) పళ్ళు, వెండి,
బంగారము మొదలగు దానాలు
బ్రాహ్మణ సువాసినీలకు భోజనము
వాయనాల దానాలు
నిష్కామముగా చేసినచో విశేష
ఫలము లభించును
అధిక మాసములో 33 దేవతలను
వారి అంతర్యామి 33
భగవద్రూపాలను ఆరాధించాలి.
12 ఆదిత్యులు,
11 రుద్రులు,
8 వసువులు,
2 అశ్విని దేవతలు.
వీరిని అపూపాలలో ఆవాహన చేసి పూజించి దానము చేయాలి.
బ్రహ్మాండాన్ని దానం చేసే శక్తి
మానవునికి సాధ్యము కాదు.
పురుషోత్తమ మాసములో ఇది
సాధ్యము. 33, అరిసలను ఒక
కంచు పాత్రలో పెట్టి ఇంకొక కంచు
పాత్రను మూసిపెట్టి దానము
చేసినవారికి బ్రహ్మాండ దాన
ఫలము నిశ్చయముగా లభిస్తుంది.
కాంస్యపాత్రం సమాదాయ
తస్మిన్ పూపాన్ నిధాయ చ |
బ్రాహ్మణాయ ప్రదాతవ్యం
సర్వపాప విముక్తయే ||
సువర్ణ లేదా కంచు పాత్రను (తామ్ర/కాంస్య పాత్ర) తీసుకుని, అందులో నెయ్యితో వండిన అప్పాలను (అరిసెలను) ఉంచి, సర్వ పాపాల నుండి విముక్తి కలగడం కోసం ఉత్తముడైన బ్రాహ్మణునికి దానంగా సమర్పించాలి.
(అపూప దాన శ్లోకం)
విష్ణురూపీ సహస్రాంశుః
సర్వపాపప్రణాశనః |
అపూపాన్న ప్రదానేన
మమ పాపం వ్యపోహతు ||
సహస్ర కిరణాలు కలిగిన, సర్వ పాపాలను నాశనం చేసే విష్ణు స్వరూపుడైన ఓ పురుషోత్తమా! నేను సమర్పిస్తున్న ఈ అపూప (అరిసెల) దానం వల్ల నా పాపాలన్నీ తొలగిపోవు గాక.
అరిసెలు గుండ్రంగా ఉంటాయి. ఇది సూర్య మరియు చంద్ర బింబాలకు ప్రతీక. అధిక మాసం అనేది సూర్య, చంద్రుల గమనాల వ్యత్యాసం వల్ల (సౌర, చాంద్ర మానాల సమన్వయం) ఏర్పడేది కాబట్టి, ఈ గ్రహాల అనుగ్రహం కోసం వాటి రూపంలో ఉన్న అపూపాన్ని దానం చేస్తారు. నెయ్యిలో వేయించినప్పుడు అరిసెపై వచ్చే చిన్న చిన్న రంధ్రాలు లేదా దాని రూపం సూర్యుని సహస్ర కిరణాలకు (రశ్మి) సంకేతంగా భావిస్తారు.
*అధిక మాసం లో విశేష దానాలు*
అధిక మాసం సంపూర్ణముగా
ముగిసేంత వరకూ తాంబూల
దానం, బ్రాహ్మణ దంపతులకు
చేసినచో దౌర్భాగ్యము నశించి
సౌభాగ్య ప్రాప్తి కలుగును. ఒక నెల
ఆఖండ దీపము శాంతము
కాకుండా దీపారాధన చేయుట
వలన అంధకారము నశించి
జీవితము ప్రకాశవంతమై జ్ఞాన ప్రాప్తి
కలుగును. సువాసినీ స్త్రీలు 33
వాయన దానాలు చేయుట వలన
వంశాభివృద్ధి మరియు దీర్ఘ
సౌమంగల్యము సిద్ధించును.
ఇదేవిధముగా అనేక దానాలు
చేయవచ్చు. 33 సంఖ్య అని
చెప్పినది 33 కన్న తక్కువ
కారాదన్న అభిప్రాయముతో
చెప్పినదని తెలుసుకొనవలెను.
అధికమాసములో శ్రీమద్భాగవత
శ్రవణము చేయుటవలన
పురుషోత్తముని అనుగ్రహము
విశేషముగా లభించును.
*అధికమాసములో నిషిద్ధ కార్యములు*
అనిత్యమనిమిత్తంచ దానం మహాదానం|
ఆగ్య్నధానాధ్యరాపూర్వతీర్థయాత్రామరేక్షణం||
దేవారామతటాకాదిప్రతిష్టాం మౌంజి బంధనం |
ఆశ్రమ స్వీకృతం కామ్యపృషోత్వర్గంచ నిప్క్రమం||
రాజ్యాభిషేకం ప్రథమం చూడాకర్మ ప్రతానిచ|
అన్నప్రాశన మారంభం గృహాణాం చ ప్రవేశనం||
స్నానం వివాహం నామాతిపన్నం దేవమహోత్సవం | వ్రతారంభం సమాప్తిం చ కామ్యకర్మచ పాప్మనాం I|
ప్రాయశ్చిత్తం చ సర్వ స్యమల మాసే వర్జయేత్|| -
(బృహస్పతిః- స్ర్మతి ముక్తావళి)
మహా దానములు,
అగ్నాధానము,
యజ్ఞము,
ఉద్యానవనముల నిర్మాణము,
చెరువుల నిర్మాణము,
ఉపనయనము,
సన్యాస స్వీకారము,
జ్యోతిష్టోమాది కామ్యకర్మలు,
పసిపిల్లలను మొదటి సారి ఇంటి
నుండి బయటకు తీసుకువెళ్ళుట,
పట్టాభిషేక కార్యము,
చౌలము,
విశేష వ్రతాలు,
అన్నప్రాశనము,
గృహారంభము,
గృహప్రవేశము,
విశేష తీర్థస్నానము,
వివాహము,
నామకరణము,
ప్రాయశ్చిత్త హోమాలు,
ఈ కార్యములను అధికమాసములో
చేయకూడదు.
పురుషోత్తమస్య మాసే తు
దీపదానం కరోతి యః |
ఘృతేన వాపి తైలేన తస్య
పుణ్యమనంతకమ్ |
పురుషోత్తమ మాసంలో ఎవరైతే ఆవు నెయ్యితో గానీ, లేదా నువ్వుల నూనెతో గానీ భగవంతుని సన్నిధిలో దీప దానం (దీపారాధన చేసి సమర్పించడం) చేస్తారో, వారికి అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. వారి వంశంలోని పితృదేవతలకు కూడా సద్గతులు కలుగుతాయి.
నెల రోజుల పాటు ప్రతిరోజూ సాయంత్రం విష్ణు సన్నిధిలో లేదా తులసి కోట వద్ద అఖండ దీపం లేదా నిత్య దీపారాధన చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.
ఈమాసంలో సూర్యుడి తాపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో విష్ణువుకు జలాభిషేకం చేయడం, పురుష సూక్తం, విష్ణు సహస్రనామ స్తోత్రాలు పఠించడం వలన మనశ్శాంతిని ఇస్తుంది.
సాధ్యమైనంత వరకు నదీ స్నానం చేయడం, నెలలో కనీసం ఒక రోజైనా (ముఖ్యంగా ఏకాదశి నాడు) ఉపవాసం ఉండి పురుషోత్తముడిని పూజించడం శాస్త్ర సమ్మతం.
అధిక మాసం అనేది లౌకిక శుభకార్యాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఆధ్యాత్మిక ఎదుగుదలకు, పూర్వ జన్మ పాప పరిహారానికి, అక్షయ పుణ్య సంపాదనకు లభించిన ఒక అద్భుతమైన "అదనపు" సమయం లాంటిది. ధర్మశాస్త్రాల ప్రకారం దీనిని భక్తి శ్రద్ధలతో వినియోగించుకోవడం ఉత్తమం.
*అధికస్య అధికం ఫలం*
🔯
*అధికస్య అధికం ఫలం*
🔯
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి