🌸సూక్తి
మహావీరుడైన అర్జునుడు భారత యుద్ధంలో సైంధవుణ్ణి చంపుతానని గొప్ప ప్రతిజ్ఞ చేసినాడు సైంధవుని చంపటం అంటే మామూలు మాట కాదు (ప్రొద్దుగుంకినట్టు చెయ్యాలిఆయన శిరస్సు భూమి మీద పడకూడదు ఆ శిరస్సును బాణాలతో కొట్టి వాళ్ళ తండ్రి ఒడిలో పడేటట్టు చేయాలి) అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని శిబిరమునకు వచ్చి అర్జునా ఒక్కరోజులోసైంధవుని చంపుట సాధ్యమయ్యే పనేనా గొప్ప ప్రతిజ్ఞ చేసినావుఅని సరే నీవు హాయిగా విశ్రమించు అని చెప్పి తన శిబిరమునకు పోయి ప్రతిజ్ఞ ఎలా నెరవేర్చాలి అని ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు శ్రీకృష్ణ భక్తుడైన
అర్జునుడు హాయిగా భగవంతుని మీద భారం వేసి ఆందోళన లేకుండా ఉన్నాడు అలాగే మనం కూడా కష్టాలు వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా ప్రయత్నం చేస్తూ మనం భగవంతుని ప్రార్థిస్తూ నీవే దిక్కు స్వామి అని ఆయన మీద భారం వేస్తే ఆయనేతప్పక మనలను కాపాడుతాడు
స్వయముగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అనన్యా శ్చిన్తయన్తోమాం శ్లోకంలో నా మీద భారవేస్తే వారి యోగక్షేమాలునేనే చూసుకుంటాను అని అంటాడుకదా
జయలక్ష్మి
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి