28, జనవరి 2023, శనివారం

స్వ ధర్మో నిధనం శ్రేయః

 నేను మతం మారి మీకు సేవ చేస్తాను.....

ఒకసారి పరమాచార్య వారు తమినాడు లోని కరంబకుడి నుండి పట్టుకొట్టయ్ అనే గ్రామానికి మకాం మారుస్తున్నారు. ఆయన కోసం కరంబకుడి నివాసి అయిన ఒక ముస్లిం వృద్దుడు వెనక పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అది మంచి ఎండా కాలం. రొప్పుతూ వస్తున్న వృద్దున్ని చూసి స్వామి ఆగారు.వృద్దుడు పండ్లు, పూలు స్వామి కి సమర్పించి నమస్కరించి నిలుచున్నాడు.

స్వామి "మీరు నన్ను కరం బకుడి లో చూచారుగా. మరల ఇంత రొప్పుతూ ఎందుకు వచ్చారు."

ముస్లిం వృద్దుడు " నేను మిమ్మల్ని కరంబకుడి లో చూసాను. అయినా మిమ్మల్ని చూడకుండా ఉండలేననిపించి మరల వచ్చాను. మా మతం లో అల్లా కు రూపం లేదు ఉంటే మీలా ఉంటాడు. అని నా అభిప్రాయం అందుకే మిమ్మల్ని చూడాలనిపించింది. మీ మతం లోకి మారి మీరు కోరిన సేవ చేస్తాను. నన్ను మీ మతం లోకి చేర్చుకొని మీ సేవా భాగ్యం కలిగించండి. "కన్నీళ్లతో గద్గద స్వరంతో.

స్వామి కరుణ వర్షించే కళ్ళతో చూస్తూ "మీకు నన్ను చూడాలనిపించి నప్పుడు నన్ను తలుచుకోండి. మీ ఆలోచనలలోకి నేను వస్తాను. అప్పుడు నేను మీ దగ్గర ఉన్నట్లే. దానికోసం మతం మారకూడదు." అని అనునయంగా చెప్పి స్వామి ముందుకు సాగారు.స్వామి కనుమరుగయ్యే వరకు కన్నీళ్లతో స్వామి నే చూస్తూ వృద్దుడు ఆగిపోయాడు.

**** మతం మానవుడు ఏర్పరుచుకున్న

కొన్ని కట్టుబాట్లు సంప్రదాయాల, విశ్వాసాల హద్దు.స్వామి వారు ఎవరి హద్దులలో వారుండి గమ్యాన్ని చేరవలేనని విశ్వసిస్తారు . "స్వ ధర్మో నిధనం శ్రేయః "అనే గీతాచార్యుని అభిప్రాయమే స్వామి వారి అభిప్రాయం.

కామెంట్‌లు లేవు: