28, నవంబర్ 2022, సోమవారం

దైవ స్మరణ

 *శ్రీ గురుభ్యోనమః*

 

*ఎన్ని పనులున్నప్పటికీ మీరు దైవ స్మరణను మరువకండి. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా భగవంతుని పాదములను విడువకండి. భగవంతుడు లేని కాలం, చోటు లేదు కనుక మీరు ఎప్పుడు, ఎక్కడున్నా సరే నామస్మరణ చేసుకోండి. మీరు ఎంతటి విపత్కర పరిస్థితిలలో ఉన్నాసరే ఆయనని విశ్వాసంతో, ఆర్తితో పిలవండి . ఆయనే మీకు సమాధానం ఇస్తాడు. మీ సమస్యకు ఆ పరమాత్మయే పరిష్కారం చూపిస్తాడు. 'నాకు ఎవరూ తోడు లేరని' చింతించకండి. మనమంతా ఎవరికో తోడుండడానికి రాలేదు! ఎవరిదైనా తోడు పొందడానికి వచ్చాము. భగవంతుని ఆశ్రయించండి! మీకు ఆ పరమాత్మయే తోడు నీడై ఉంటాడు. మిమ్మల్ని చీకటి నుండి వెలుగులోకి తెచ్చే భారం ఆయనదే కానీ మీ మీ కర్మలకి అనుసంధానంగానే సుమా*


*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

కామెంట్‌లు లేవు: