29, మే 2021, శనివారం

పూరి జగన్నాథ్ ఆలయంలోని వంట గది

 పూరి జగన్నాథ్ ఆలయంలోని  వంట గది ప్రతీరోజూ అక్షరాలా లక్ష మందికి  కడుపు నింపుతుంది...ఇది ప్రపంచం లోని అతిపెద్ద బహిరంగ పాకశాల...ఇక్కడ జరిగే విశేషమైన పనులు చూడటానికి మన రెండు కళ్లు చాలవు...


ఇక్కడ ప్రతీరోజూ 15000 మట్టి కుండల్లో వంటలు వండుతారు...ఒకరోజు వాడిన కుండలను ఇంకొరోజు మళ్లీ ఉపయోగించరు...ఏరోజు కారోజు కొత్త కుండలను వాడుతారు.... 


పదార్థాలు ఒక ప్రత్యేక పద్ధతిలో వండుతారు...7కుండలను ఒకదానిపై ఒకటి ఒక వరుసలో పేర్చి తాడుతో కట్టి వాటిని పొయ్యి పై ఉంచి వండుతారు...


ప్రతీరోజూ 56 రకాల పదార్థాలు వండి జగన్నాథ స్వామికి నైవేద్యంగా అర్పిస్తారు... నైవేద్యంగా పెట్టిన ఈ అన్నీ రకాల పదార్థాలను స్వామి వారి మహా ప్రసాదంగా స్వీకరించి రోజూ మధ్యాహ్నం 2-3గంటల ప్రాంతంలో ఆలయం లోని ఆనంద బజార్ అనే ప్రాంగణంలో సందర్శకులకు,భక్తులకు వితరణ చేస్తారు...


ఒక్కరోజు కూడా కొంచం అయినా ఈ మహా ప్రసాదం ఎప్పుడూ వృథా కాదు...


కుల,మతాల కతీతంగా ప్రతీరోజూ లక్ష మందికి కడుపు నింపే ఒక్క మసీదు లేదా చర్చ్ అయినా ఉందా ప్రపంచంలో ఎక్కడైనా ...అందులోనూ ఎవరినీ మతోన్మాదులుగా మార్చకుండా...మతం మార్చకుండా...మన ఆలయాల విశిష్టత ఎంత చెప్పినా చాలదు...దేవుడిని కూడా తమ స్వార్థం కోసం మార్చుకునే గొఱ్ఱెలకు ఏం అర్థం అవుతుంది...సేవ,భక్తి, ఆధ్యాత్మికత లోని గొప్పదనం...


జై జగన్నాథ్...🙏🙏

కామెంట్‌లు లేవు: