31, మే 2021, సోమవారం

నిజాయితీగల ప్రభుత్వాన్ని

 ప్రబీర్ బసు IAS అధికారి గారి పోస్ట్,


మొట్టమొదట, నేను ఎప్పుడూ 'రాజకీయ' సమస్యలపై వ్రాయను.  నేను వ్రాసేది కేవలం 'జాతీయ' సమస్యలపై మాత్రమే. ఉదాహరణకు, రాహుల్ గాంధీ తన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండాలా వద్దా అనే దానిపై నాకు అభిప్రాయం లేదు, నాకు కుతూహలం కూడా లేదు.  అదేవిధంగా, కాంగ్రెస్ కంటే బిజెపి మంచి పార్టీయా కాదా అన్నది లాంటి విషయాలపై నాకేమాత్రం ఆసక్తి ఉండదు.  


ఐఎఎస్‌లో 36 సంవత్సరాల సర్వీసు తరువాత కూడా నాకు ఒక్క ఎమ్మెల్యే, ఎంపి లేదా రాజకీయాల్లో పాల్గొన్న ఎవరైనా సన్నిహితులుగా లేదా పరిచాయస్తుడిగా ఎవరూ లేరు. 

కాబట్టి, గెలిచిన ఏ పార్టీ అయినా సరే నా దేశానికి మంచి చేస్తూ నిజాయితీగల ప్రభుత్వాన్ని నడుపుతున్నంతవరకు ఏ పార్టీ గెలుస్తుందో, ఓడిపోతుందో అన్నది నేను పట్టించుకోను.


ఇప్పుడు, ఇన్నేళ్ల తరువాత నేను గౌరవనీయులైన శ్రీ నరేంద్ర దామోదర్ మోడీకి అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నాను అనేది వివరిస్తాను:


 1. నా IAS అధికారిక సర్వీసు సేవ ప్రారంభమైనప్పటి నుండి నేను గమనించింది ఏంటంటే "ప్లానింగ్ కమిషన్" అనేది ఎటువంటి ఉపయోగకరమైన ప్రయోజనాలకు గానీ దేశానికి గానీ ఏవిధంగానూ ఉపయోగపడటం లేదని నేను గ్రహించాను. నేను దానిని రద్దు చేయాలనుకున్నాను. కానీ ఆశ్చర్యకరంగా…... 

ఆ పని మన ప్రధాని మోడీ చేశారు.


 2. మా పన్ను వ్యవస్థ (Tax structure) ఏమాత్రం పనికిరాని, అక్కరకు రానిదని నేను ఎప్పుడూ భావిస్తూ వచ్చాను.  నన్ను బీహార్‌లో కమర్షియల్ టాక్స్ కమిషనర్‌గా నియమించినప్పుడు, దీని ప్రక్షాళన, సరిదిద్దాల్సిన అవసరం ఎంతగానో నాకు అర్థమైంది.  కొంత హేతుబద్ధీకరణ కోసం నేను స్వంతంగా సరిదిద్దడానికి ప్రయత్నించాను. కానీ అది కేవలం స్థానిక విధి విధానాలకు మాత్రమే పరిమితమై ఉండింది. వ్యాట్ system వచ్చినప్పుడు నేను  చాలా సంతోషించాను. కానీ జీఎస్టీ పన్ను విధానం అమలూజ్ దానివల్ల దేశానికి, ఆర్ధిక వ్యవస్ధకు జరిగే మేలు, పన్ను ఎగవేతదారుల కట్టడి నాకు స్వయానా తెలుసు కాబట్టి నేను దాని గొప్పదనం గ్రహించగలిగాను. ఆశ్చర్యకరంగా ఈ పని కూడా మోడీ గారే చేశారు. 


 3. మన దేశ భాగమైన జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని, నెహ్రూ నిర్ణయాన్ని నేను చిన్నతనం నుంచి కూడా ఎప్పటికీ జీర్ణించుకోలేకపోయాను. తరువాత నేను పెద్దయ్యాక ఈ ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో పెద్ద ఎత్తున జరిగిన అవినీతి కథలు విన్నాను, అలాగే కాశ్మీరీ బ్రాహ్మణులపై ఈ నేతల ద్వారా జమ్మూ & కాశ్మీర్ లో జరిగిన దారుణ హింస.  జమ్మూ & కాశ్మీర్ ల్లో కోట్లాది రూపాయలు వేర్పాటు నేతల, ఖంగ్రెస్ నాయకుల, వారి తొత్తుల పాలయ్యాయి అనే విషయం IAS అధికారిగా నాకు ఈ నిజానిజాలన్నీ తెలుసు. కాబట్టి మోడీ గారు ఈ ప్రత్యేక హోదాను తొలగించినప్పుడు మరియు మా MEA సంస్థలు ఈ రగడ పై పాకిస్తాన్ మరియు చైనాల నోళ్లు మూసివేయడంలో ఎంత అత్యుత్తమమైన పని చేసిందో అనే వివరాలు తెలిసి నేను చాలా సంతోషించాను. అలాగే మొదటిసారిగా ఈ మనిషి మాటల మనిషి కాదు చేతల మనిషనీ, దమ్మున్న నాయకుడని నేను గ్రహించాను.


 4. పాకిస్తాన్ ఉగ్రతీవ్రవాదులను సరిహద్దులు దాటించి పంపించి, మన సైనిక జవాన్లను చంపిన ప్రతిసారీ అందరిలాగే నేను కూడా చాలా కోపంగా ఉండేవాణ్ణి. ఎందుకు మనం చాతగాని దద్దమ్మల్లా ఊరకుండిపోతున్నాం అని రగిలిపోతూ ఉండేవాణ్ణి. దాదాపు 70 ఏళ్ళ తరువాత మొదటిసారిగా కేవలం మోడీ అనే ఈ ప్రధాని  మాత్రమే ఆ పుందాకోర్ బాస్టర్డ్లకు యూరి (Uri) మరియు బాలకోట్ మిషన్ ల పరంగా ధీటైన జవాబిస్తూ మరచిపోలేని ఒక గుణపాఠం నేర్పించారు అలాగే కాశ్మీర్లోని సొరంగాల నుండి తరలి వస్తున్న ఈ తీవ్రవాద ముష్కర ఎలుకలను చంపడం కొనసాగించారు. కేవలం మోడీ యే ఈ చర్యలకు కారణమని నేను తెలుసుకుని చాలా సంతోషించాను. 


 5. నేను బెంగాల్ వాడిగా అనుభవించాను కాబట్టి ఘంటాపథంగా చెప్పగలను. చిన్నతనంలో బెంగాల్ విభజన మరియు అటుపై ఏర్పడిన తూర్పు పాకిస్తాన్‌లో ప్రజలపై మైనారిటీలపై జరిగిన దారుణ దాడుల వల్ల నేను, నా కుటుంబం మానసికంగా, శారీరకంగా చాలా కష్టాలు అనుభవించాం అలాగే  ఆర్థికంగా చాలా నష్టపోయాం. విభజన సమయాన్నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, మరియు ' ముక్కలై మిగిలున్న అసలైన భారత్' లోని కొన్ని భాగాలలో ముస్లిమేతరులు అప్పటికి ఇప్పటికీ కూడా చాలా దాయనీయమైన బతుకులు గడుపుతూండటం నన్ను చాలా కలచివేసింది. మన ప్రధాని సిఎఎ ను (CAA) తీసుకువచ్చారు మరియు భారతదేశం వారినందరిని భారతీయ కుటుంబంలోకి తిరిగి తీసుకువెళుతుందనే ప్రేమపూర్వక హామీని ఇచ్చింది. చివరికి ఒకే ఒక వ్యక్తి, కేవలం శ్రీ నరేంద్ర మోడీ మన భారత ప్రజల బాధలను, కష్టాలను అర్థం చేసుకున్నారు అలాగే దానికి వెసులుబాటును కూడా తీసుకు వచ్చారు. 


 6. మన రక్షణ విభాగ సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధ పరికరాలు, ఆయుధాలను అప్‌గ్రేడ్ చేయడంలో వరుస ప్రభుత్వాల వైఫల్యాలు చూసి చాలా నిరుత్సాహంగా ఉంటూ ఆందోళన పడుతూ ఉండేవాణ్ణి. మన ప్రధాని మోదీ గారే రక్షణ శాఖ ని పునరుద్దరిస్తూ ఫాస్ట్ ట్రాక్‌లో పెట్టటం జరిగింది. 

అంతే కాదు, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా ల వద్ద మన సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, సొరంగాలు - మౌలిక సదుపాయాల రూప కల్పనపై ఆయన దృష్టి పెట్టటమే కాదు రక్షణ వ్యవస్థని బలీయం చేసి చూపారు. అంతకుముందు లా కాకుండా నేను ఇప్పుడు ఈ దేశంలో చాలా సురక్షితంగా ఉన్నానని మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను, భావించగలుగుతున్నాను.  


 7. అమర్జిత్ అని నా మిత్రుడు మన ప్రధాని ప్రధాని గారి చేత చేయబడిన గ్రామీణాభివృద్ధి పనుల గురించి నాకు వివరించి చెప్పారు. అమర్జిత్ గురించి మనం తెలుసుకోవాలి ఎందుకంటే అతను గ్రామీణాభివృద్ధి కార్యదర్శి మరియు ఇప్పుడు పిఎంఓలో సలహాదారు.


 8. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మహిళలు నీళ్ల కోసం మైళ్ళ తరబడి నడవడం సిగ్గుచేటుగా ఎప్పుడూ భావించేవాణ్ణి.  ఈ సమస్యను పరిష్కరించడానికి వాటర్ మిషన్ ప్రవేశపెట్టబడింది మరియు ఫలితాలు దేశమంతటా గ్రామీణుల మొహాల్లో ప్రతిబింబిస్తూ చూపిస్తున్నాయి.


 9. చాలా న్యూస్ ఛానెల్స్ మరియు న్యూస్ పేపర్లు ప్రధాని మోడీ గారికి వ్యతిరేకంగా నిరంతరం విరుచుకుపడుతూనే ఉండటం మనం చూస్తూనే ఉన్నాం.... కానీ అతను ఏమాత్రం స్పందించడు.  షాహిన్‌బాగ్‌లో నిరసనకారులు రోడ్లను అడ్డుకున్నప్పుడు, రైతుల ఆందోళనలో ఎంతో సహనం ప్రదర్శించడం ఆయనలోని ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. 


 10. ఆయనకు సహాయం చేయడానికి వివిధ గవర్నమెంట్ విభాగాల్లో, శాఖల్లో ఆయన ఎంచుకున్న అధికారులు, డాక్టర్ పి.కె. మిశ్రా, భాస్కర్ ఖుల్బే, పికె సిన్హా, పిఎంఓ లో అమర్జిత్ సిన్హా, క్యాబినెట్ కార్యదర్శిగా రాజీవ్ గువాబా, తన నీటి మిషన్ కోసం భరత్ లాల్, RBI గవర్నర్‌గా శక్తి కాంత్ దాస్, మరియు అనేక ఇతర కీలక పదవుల్లోని అధికారులు వారి సమగ్రత, తేజస్సు మరియు పంపిణీ సామర్థ్యానికి పేరు గాంచారు, అలాంటివారినే ఆయన నియమించుకున్నారు. ఇది అతని నైపుణ్యాన్ని, తీక్షణ బుద్దిని సూచిస్తోంది. 


 11. అతను తన మంత్రివర్గంలో అత్యుత్తమ మాజీ పౌర అధికారులను మంత్రులుగా ఎన్నుకున్నాడు. నా స్నేహితుడు ఆర్ కె సింగ్ పవర్ మరియు ఎంఎన్‌ఆర్‌ఇ (ప్రభుత్వ శాఖ) కి స్వతంత్ర బాధ్యత వహిస్తున్నారు.  ఆయన సహకారం అందరికీ కనిపిస్తుంది. వి జైశంకర్, తెలివైన కెరీర్ దౌత్యవేత్త మన విదేశాంగ మంత్రి. మరో కెరీర్ దౌత్యవేత్తను పౌర విమానయాన మంత్రిగా చేశారు.  కాబట్టి, అతను ప్రభుత్వాన్ని నడపడానికి ఉత్తమ ప్రతిభను ఎన్నుకోవడం లోనే నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 


 12. మన ప్రధాని గాల్వాన్ వద్ద చైనీస్ సైనికుల గూబలు గుయ్ మనేలా ఇచ్చిన చప్పుడుకి 1962 లో మన అవమానానికి తగిన ప్రతీకారం తీర్చుకున్నారు.  చైనా సైనికులు ఇప్పుడు భారత సైన్యాన్ని ఎదుర్కోవటానికి చాలా భయపడుతున్నారు. చైనా అధినేత క్సింగ్ వారి ఆర్మీ జనరల్‌ను మార్చినప్పుడు వారికి భారతదేశం చేతిలో జరిగిన తీవ్ర అవమానానికి మరింత రుజువు వచ్చి చేకూరింది.


 13. శ్రీ మోడీ నినాదం "నేను తినను, ఎవరిని తిననివ్వను" (न खाऊंगा न खाने दूँगा) అనే నినాదం ఇప్పుడు అందరి కళ్ళకు కనబడుతోంది. 1965 లో లాల్ బహదూర్ శాస్త్రిజీ, అటుపై వాజపేయి మమ్మల్ని విడిచిపెట్టిన తరువాత మళ్లీ నిజాయితీ, నిబద్ధత గల ప్రధానిని పొందడం కోసం మేము పౌర సేవకులగా దశాబ్దాలుగా ఎదురు చూశాము. మోడీ రాకతో మా ఎదురుచూపులకు అర్ధం దొరికింది. 


ఇప్పుడు నాకు చెప్పండి. నా దేశం కోసం నేను ఇన్నేళ్ళుగా కలలుగన్న ప్రతీది, ప్రతి ఒక్కటీ మన ఈ ప్రధాని చేత చేయబడుతుంటే, నేను ఇప్పుడు అతనిని ఇష్టపడి, నా మద్దతు ఇవ్వడంలో నే చేసిన నా తప్పు ఏమిటి?  


గత 20 సంవత్సరాలుగా మనము దిగుమతి చేసుకున్న పప్పుధాన్యాలు మాత్రమే తింటున్నాము. ఈ విషయం మనకు తెలిసింది ఎప్పుడూ ???? 🤔🤔🤔


మోడీ జీ 2 సంవత్సరాల క్రితం ఈ దిగుమతిని కట్ చేసి దేశీయ పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచుతూ తీసుకున్న నిర్ణయం కారణంగా మనకు తెలిసి వచ్చింది. ఇప్పుడు కరోనా కారణంగా పూర్తిగా ఆగిపోయింది .. 


అందుకే ఇప్పుడు రుడాలి, వ్యవసాయ ఉద్యమం అనేది ఒక పెద్ద సాకు.

2005 లో, మన్మోహన్ ప్రభుత్వం చేసుకున్న రహస్య ఒప్పందం ప్రకారం భారతదేశంలో పండిన పప్పుధాన్యాలను సబ్సిడీ చేయడం మానేసింది.


అటుపై రెండేళ్ల తరువాత, కెనడా, ఆస్ట్రేలియా మరియు నెదర్లాండ్స్ నుండి పప్పుధాన్యాలను దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వపు కొత్త ఒప్పందం కుదుర్చుకుంది.


2005 లో, కెనడా ఒక పెద్ద పప్పుధాన్యాలు పండించే అతి పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించింది, ఇందులో చాలా మంది పంజాబీ సిక్కులను రైతులుగా, పనివంతులుగా ఉంచారు… .ఈ సంస్థల్లో మొదట మేనేజర్లు గురుద్వారా నుంచి వారిని మార్చి తరువాత ఖలిస్తానీలు నిర్వాహకులుగా పెరిగారు.


దీనిద్వారా 2007 కల్లా కెనడాలో పప్పుధాన్యాల ఉత్పత్తి చాలా పెరిగిపోయి ఆఖరికి దీనిని "పసుపు విప్లవం" అని పిలిచే స్థాయికి చేరుకుంది. ఎందుకంటే వారి కస్టమర్లు మరి భారతదేశ పంజాబీ మండీల ఏజెంట్లు .. వీరిలో కొందరేమో కాంగ్రెస్ పంజాబీ కుటుంబాలు, మహారాజా పాటియాలా కుటుంబం మరియు బాదల్ కుటుంబం కూడా ఉన్నాయి.


నేడు, మోడీ తీసుకు వచ్చిన కొత్త వ్యవసాయ విధానపు చట్టం అనేది పాపం ఈ బ్రోకర్లందరి ఆదాయాన్ని భూమిపై చేసిన సర్జికల్ స్ట్రైక్ లాగా వీరందరినీ, వారి దోపిడీని నిరోధించింది.


మరి ఆలోచించండి, ఇప్పుడు భారతదేశం వారి మార్కెట్ కాకపోతే, కెనడా మరియు ఇతర దేశాలు వారి పొలాలపై [వారి వారి దేశాలలో .. పెట్టిన పెట్టుబడి డబ్బు .. ]

ఇది వృధా కావడమే కాకుండా నిరుద్యోగం మరియు భారతదేశంలో ఇంత భారీ మార్కెట్ వారి చేతుల్లోనుంచి చూస్తూ చూస్తూనే ఎలా జారిపోయింది.


ఈ మొత్తం పప్పుధాన్యాల, మండీ మార్కెట్ కుంభకోణంలో కాంగ్రెస్ అతిపెద్ద బ్రోకర్.

ఇలాగే మనం ఇదివరకే చూసాం…..

చైనాలో వాణిజ్యం, తయారీ కోసం సిడబ్ల్యుసి విపి మరియు సిసిపి విపి చైనాలో ఒక ఒప్పందంపై సంతకం చేసినట్లు మనం చూశాము.  


భారతీయ ఆర్థిక వ్యవస్థ, శ్రమ, ఉపాధి, వ్యాపారం అనే పెట్టుబడి లేని ఖర్చుతో భారత జాతీయ సంపదను దోచుకుంటూ ఖాంగ్రాస్ మరియు దాని చెంచాలు కొల్లగొట్టాలి. 


నరేగా అంటే, గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ act అనే పథకం కింద పేదలకు ఎంగిలి మెతుకులు విసిరారు.

(https://www.nrega.nic.in/netnrega/mgnrega_new/Nrega_home.aspx)


మోడీ వారి మోసాలలో ఒక్కోదాన్ని బహిర్గతం చేస్తున్నారు. వారి అక్రమ ఆదాయానికి ప్రతి తలుపు మూసివేస్తు గండి కొడుతున్నారు.  

ఇక్కడ రైతు చట్టం నిరోధక పేరు మీద జరుగుతున్న దుర్మార్గం అంతా కేవలం దాని గురించి మాత్రమే.


అందుకే కెనడా కూడా తమ పార్లమెంటులో మన ఈ రైతు చట్టం బిల్లుపై చర్చలు జరుపుతుంది మరియు అక్కడి ఖలీస్తానీ గ్రామస్తులను భారతదేశానికి పంపిస్తామని బిజెపిని, భారత దేశాన్ని తీవ్రంగా బెదిరిస్తోంది.  

ఖలీస్తానీ అనేదే కాంగ్రెస్ యొక్క సృష్టి మరియు మనందరికీ తెలుసు పాకిస్తాన్ ఖాలిస్తాన్ పై చూపే ఆ వక్ర అభిమానం.


ఈ సందేశాన్ని భారతదేశంలోని ప్రతి పౌరుడికి అందించే ప్రయత్నం చేయండి.


ఎందుకంటే నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను

🙏🙏🙏


మేరా భారత్ మహాన్

జై భారత్, జై హింద్

కామెంట్‌లు లేవు: