15, జులై 2020, బుధవారం

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిఆలయం

ఆలయం దర్శనం ఉదయం 9:30 నుండి 12:30  వరకు మరియు మధ్యాహ్నం 2:30  నుండి సాయంత్రం 7:30 వరకు 

రాష్ట్రంలోనే అత్యంత పురాతన లక్ష్మీనరసింహ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందిన విశిష్ట ఆలయం అంతర్వేది. ఆంధ్ర తూర్పు గోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందిన అంతర్వేది... అందమైన బంగాళాఖాతం ఒడ్డున గోదావరి నదీశాఖయైన వశిష్టానది సంగమ స్థానంలో అలరారుతోంది. భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్న అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి విశేషాలు.

కృత యుగం లోని మాట ఒకసారి నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులు సత్రయాగం చేస్తున్న సమయంలో సూత మహాముని ద్వారా పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకొనుచూ ఒకరోజు అంతర్వేది గురించి సూత మహామునిని అడుగగా ఆ మహాముని అంతర్వేది నిగురించి బ్రహ్మ, నారదుల మధ్యజరిగిన సంవాదాన్ని శౌనకాది మహర్షులకు చెప్పుతాడు.

ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ రుద్రయాగం చేయాలని నిశ్చయించి, యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకొంటాడు. వేదికగా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది (అంతర్‌, వేదిక) అనే పేరు వచ్చింది అని చెబుతారు. వశిష్టుడు ఇక్కడ యాగం చేసినందు మూలంగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధిగాంచినది.

 రక్తవలోచనుని కథ..:
ఒకానొక సమయంలో రక్తావలో చనుడు (హిరణ్యాక్షుని కుమారుడు) అనే రాక్షసుడు వశిష్ఠ గోదావరి నది ఒడ్డున వేలాది సంవత్సరాలు తపస్సు చేసి, శివుని నుంచి ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ప్రకారం, రక్తావలోచనుని శరీరం నుండి పడిన రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువుల నుండి తనంత పరాక్రమవంతులైన రక్తావలోచనులు ఉద్భ వించాలని కోరుకొంటాడు. ఈ వరగర్వంతో లోక కంట కుడై రక్తావలోచనుడు యజ్ఞయాదులు చేసే బ్రాహ్మణు లను, గోవులను హింసించేవాడు. ఇది ఇలా ఉండగా ఒక సారి విశ్వామిత్రుడుకి, వశిష్ఠుడుకి జరిగిన సమరంలో విశ్వామిత్రుని ఆజ్ఙ పై ఈ రక్తావలోచనుడు వచ్చి భీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు కుమారులను సంహరి స్తాడు.

వశిష్ఠ మహర్షి శ్రీమహావిష్ణువును ప్రార్థించగా మహా విష్ణువు లక్ష్మీ సమేతుడై, గరుడవాహనం పై నరహరి రూపుడై రక్తావలోచనుని సంహరించడానికి వస్తాడు. నరహరి సుదర్శనమును ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా భీభ త్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, తన మాయాశక్తిని ఉపయోగించి, రక్తావలోచనుని శరీరం నుం డి పారిన రక్తం అంతా నేలపై పడకుండా రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శనచక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రక్తావలోచనుని సంహారం తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామిగా వెలిశాడు. ఈ రక్తకుల్యలోనే శ్రీమహావిష్ణువు అసురులను సంహరించిన తన చక్రాయుధమును శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్యలో పవిత్రస్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి అని చెబుతారు.

- ఆలయ విశేషాలు:
మొదటి ఆలయము శిధిలపరిస్థితిలో ఉన్నపుడు ఆలయ జీర్ణోర్ధరణకు పాటు పడిన వారిలో ముఖ్యులు శ్రీకొపనాతి కృష్టమ్మ. ఈయన పెద్దాపురపు జమిందారుల కుటుంబీకుడు. ప్రస్తుతపు ఆలయ నిర్మాణం ఈయన విరాళాలు, కృషి ద్వారానే జరిగి నది. ఆలయ ప్రధాన ముఖద్వారము నకు ముందు ఈయన శిలా విగ్ర హము కలదు. ఈ ఆలయ ము చక్కని నిర్మాణశైలితో కానవచ్చును. దేవాల యము రెండు అం తస్తులుగా నిర్మించారు. దేవాలయ ప్రాకారముగా వరండా (నడవా) మాదిరి నిర్మించి మధ్యమధ్య కొన్ని దేవతా విగ్రహాలను ఏర్పాటు చేసినారు. ప్రాకారము సైతము రెండు అంతస్తుల నిర్మాణముగా ఉండి యాత్రికులు పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకొనుటకు ప్రకృతి తిలకించుటకు అనువుగా నిర్మించినారు. ఆలయమునకు దూరముగా వశిష్టానదికి దగ్గరగా విశాలమైన కాళీస్థలమునందు కళ్యాణమండపము నిర్మించినారు. ఈవిధంగా కొన్ని వేలమంది స్వామివారి కళ్యాణము తిలకించే ఏర్పాటు చేసి నారు. ఈ ఆలయం క్రీ.శ.300 కు పూర్వం నిర్మింప బడినదని అక్కడి కొన్ని విగ్రహలు చెపుతున్నాయి.

- వశిష్టాశ్రమము:
అంతర్వేది దేవాలయమునకు కొంచెం దూరంగా సముద్రతీరమునకు దగ్గరగా ఈ వశిష్టాశ్రమ ము కలదు. మొదట తగిన పోషకులు లేకుండుటచే ఆశ్ర మ సముదాయమున సరియైన సౌకర్యాలు లేకుండెను. తదుపరి దాతల సహకారములు, దేవస్థాన సహాయము లతో ఇక్కడ అందమైన ఆశ్రమము నిర్మించబడినది. ఈ ఆశ్రమము వికసించిన కమలము మాదిరిగా నాలుగు అం తస్తులుగా నిర్మించినారు. చుట్టూ సరోవరము మధ్య కలు వపూవు ఆకారమున ఈ ఆశ్రమము అత్యంత అద్భుతమైన కట్టడము. దీనికి సమీపముగా ద్యానమందిరం, పఠనా శాల, యోగశాల, విశ్రాంతి మందిరం మొదలగునవి కల వు. యాత్రికుల విశ్రాంతి కొరకు నిర్మించిన పర్ణశాలల వంటి అందమైన కట్టడములు కలవు.

- దీప స్తంభం:
దేవాలయానికి దక్షిణంగా సముద్రతీరానికి దగ్గరగా దీప స్తంభం (లైట్‌ హౌస్‌) కలదు. దీనిని బ్రిటిష్‌ పాలకుల కాలంలో కట్టినట్టుగా చెపుతారు. దీని చుట్టూ అందమైన తోటలు, పచ్చక పెంచబడుతున్నది. కేవలం భక్తులు, యాత్రికులే కాక ఇక్కడికి పిక్నిక్‌, వనభోజనాలు వంటి వాటి కోసం వచ్చే సందర్శకుల, విధ్యార్ధులతో ఈ ప్రాంతం కళ కళలాడుతూ ఉంటుంది. లైట్‌ హౌస్‌ పైకివళ్ళి చూసేందుకు ఇక్కడ అనుమతి కలదు. మూడురూపాయల నామమాత్ర రుసుము టికెట్‌ కొరకు వసూలు చేస్తారు. దీని పనుండి చూస్తే లక్ష్మీనరసింహస్వామి దేవాలయము, వశిష్టాశ్రమము, మిగిలిన దేవాలయములు, దూరదూరం గా కల పల్లెకారుల ఇళ్ళ సముదాయాలు, తీర్రపాంతము వెంబడి కల సర్వితో టలు అత్యద్భుతంగా కానవస్తాయి.

- అశ్వరూ డాంభిక (గుర్రా లక్క) ఆలయము...
నరసింహస్వామి సోదరిగా భావించే అశ్వరూడాంభిక ఆలయం ప్రధాన దేవాల యమునకు ఒక కిలోమీ టరు దూరములో కలదు. స్థల పురాణ రెండవ కధనం ప్రకారం రక్తావలోచనుడు వరగర్వంతో పాపాలు చేస్తున్నపు డు నరహరిఆతన్ని సంహరించేందు కు వస్తాడు. నరహరి సుదర్శనమును ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా భీభత్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, పార్వతి అంశతో ఒక మాయాశక్తిని సృష్టిస్తాడు. రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా ఆ మాయాశక్తి అశ్వరూపంలో తన నాలుకను విశ్వవ్యాపితం చేసి పడిన రక్తబిందువులను పడినట్లుగా పీల్చేస్తూ రక్తవలోచనుని మరణంలో శ్రీమహావిష్ణువుకు సహాయం చేస్తుంది. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామి గానూ మాయాశక్తి అశ్వరూడాంభిక గానూ వెలిశారు.

- అన్న చెళ్ళెళ్ళ గట్టు:
సముద్రములో వశిష్ట నది కలిసే చోటును అన్న చెళ్ళెళ్ళ గట్టు అంటారు. ఇక్కడ సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుకమేట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో ఒకవైపు స్వచ్చంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్ర ఆటు పోటులలో కూడా ఇలాగే ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

సర్వేజనా సుఖినోభవంతు 
 ధర్మశాస్త సేవాసమితి విజయవాడ 7799797799

note: copied from a whatsapp post. 

కామెంట్‌లు లేవు: