20, జులై 2022, బుధవారం

ముఖ్యమైన విషయాలు

 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻


🌹 *ముఖ్యమైన విషయాలు*.🌹


*పూజ:-*

పూర్వ జన్మ వాసనలను నశింపచేసేది, జన్మ మృత్యువులను లేకుండా చేసేది, సంపూర్ణ ఫలాన్నిచ్చేది.


*అర్చన:-*

అభీష్ట ఫలాన్నిచ్చేది, చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది.


*జపం:-*

అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది. పర దేవతను సాక్షాత్కరింప చేసేది జపం, ఇది జీవుణ్ణి దేవుణ్ణి చేస్తుంది.


*స్తోత్రం:-*

నెమ్మది నెమ్మదిగా మనస్సుకి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.


*ధ్యానం:-*

ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది.


*దీక్ష:-*

దివ్య భావాలను కల్గించేది, పాపాలను కడిగివేసేది, సంసార బంధాల నుండి విముక్తిని కల్గించేది దీక్ష.


*అభిషేకం:-*

అభిషేకం చేస్తే చేయిస్తే సకల శుభాలు కలుగుతాయి, అభిషేకం అహంకారాన్ని పోగొట్టి పరతత్వాన్ని అందిస్తుంది.


*మంత్రం:-*

తత్త్వం గురించి మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం, అఖండ శక్తిని ఇస్తుంది.


*ఆసనం:-*

ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్త సిద్ధిని లేదా నవ సిద్ధులను కల్గించేది ఆసనం.


*తర్పణం:-*

పరివారంతో కూడిన పర తత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.


*గంధం:-* 

గంధంలో పరదేవత కొలువై ఉన్నారు. *”మేము కూడా మీ పూజలో ఉండేలా వరం ఇవ్వు తల్లీ” అని దేవతలంతా అమ్మవారిని కోరారు. అప్పుడు అమ్మవారు “మీరు గంధంలో కొలువై ఉందురుగాక” అని వరం ఇచ్చారు. అప్పటినుండి గంధానికి పూజలో ఉన్నత స్థానం లభించింది.*


*అక్షతలు:-*

కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి. పసుపు, కుంకుమ, నూకలు (విరిగిన బియ్యం) లేని మంచి బియ్యం కలిపి చేయాలి.


*పుష్పం:-*

పుణ్యాన్ని వృద్ధి చేసి, పాపాన్ని పోగొట్టేది మంచి బుద్ధిని ఇచ్చేది. *అలాగే ముండ్లు కలిగిన పువ్వులు వాడితే కష్టాలు వస్తాయి.* *మంచి సువాసన కలిగిన పువ్వులు వాడితే శుభం కలుగుతుంది.* *(ఈమధ్య పుష్పాలను చించి రేకలను విడదీసి వాడుతున్నారు. అలా చేయవద్దు. కాగా తొడిమలను తప్పకుండా తుంచి వేశాకే పుష్పాలను పూజలో వినియోగించాలి.*


*ధూపం:-*

చెడు వాసనల వల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది. పరమానందాన్ని ప్రసాదించేది. ధూపం ద్వారా చాలా మంచి జరుగుతుంది. *భూత, ప్రేత, పిశాచాలు పారిపోతాయి.*


*దీపం:-*

సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది. అహంకారం లేకుండా చేసేది. పర తత్త్వాన్ని ప్రకాశింప చేసేది. ఈ దీపం జ్ఞానానికి సంకేతం. పూజ గదిలో దీపం వెలిగిస్తే ఇంట్లో ఉన్న దుష్ట ప్రభావం దగ్గరికి రాదు. “అగ్ని” శివుడి కుమారుడైన కుమారస్వామికి ప్రతీక.


*నైవేద్యం:-*

మధుర పదార్థాలను నివేదన చేయుటయే నైవేద్యం.


*ప్రసాదం:-*

భగవంతుడికి నివేదించిన నైవేద్యమే ప్రసాదం. ప్రకాశానందాలనిచ్చేది, సామరస్యాన్ని కల్గించేది, పరతత్త్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం. ప్రసాదం భగవదనుగ్రహ సంకేతం. అత్యంత పవిత్రమైన పదార్థం. *ఏ రూపంలోని ప్రసాదాన్నైనా “ప్రసాదం” అని మాత్రమే వ్యవహరించాలి. ఇటీవల అందరూ ‘పులిహోర’, ‘కొబ్బరి’ అని అనడానికి అలవాటు పడ్డారు. అలా అనకూడదు. “పులిహోర ప్రసాదం”, “కొబ్బరి ప్రసాదం” అనవచ్చు.*


*వందనం:-* అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం. చేతులు జోడించి కూడా వందనం చేయవచ్చు. సాష్టాంగ ప్రణామం అంటే వక్షస్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, కరములు, కర్ణాలు, నేలకు తాకించి చేసేది వందనం. ఈ సాష్టాంగ ప్రణామం పురుషులు మాత్రమే చేయాలి ఇది స్త్రీలు చేయరాదు. స్త్రీలు మోకాళ్ళపై భగవంతుడికి వందనం చేయొచ్చు.


*ఉద్వాసన:-*

దేవతలను, ఆవరణ దేవతలను పూజించి, పూజను ముగించడాన్ని ఉద్వాసనమని అంటారు. చివర్లో ప్రార్థన, దోష క్షమాపణ చెప్పి తీర్థ, ప్రసాదాలు స్వీకరించి స్వస్తి చెప్పి ఉద్వాసన చేయవలసి ఉంటుంది.......


సేకరణ...🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻


కామెంట్‌లు లేవు: