23, సెప్టెంబర్ 2020, బుధవారం

రతన్ టాటా గారు చెప్పినది

 

" ఒక సారి మేము జెర్మనీ వెళ్ళాము . అది ధనిక దేశం . ఒక రోజు మేము ఒక హోటల్ కి వెళ్ళాము .

చాలా టేబుల్స్ ఖాళీగా ఉన్నాయి . ఆశర్యపోయాము అక్కడ అందరూ ఒకటో రెండో డిష్ లు తెప్పించుకుని పూర్తిగా తిని వెళ్తున్నారు . 

ఒక మూలాన టేబుల్ దగ్గర కొందరు వృద్ధులు ఒకే డిష్ తెప్పించుకుని అందరూ కలిసి పంచుకుని తింటున్నారు . 

ఇంత ధనిక దేశం లో ఇలా తింటున్నారేమిటి అనిపించింది మాకు 

మేము మా స్టేటస్ కి తగినట్టు రకరకాల డిషెస్ తెప్పించుకుని తిన్నాం . కొన్ని నచ్చలేదనో ఎక్కువయ్యయనో వదిలేశారు మా వాళ్ళు . తెప్పించుకున్న దాంట్లో మూడోవంతు వదిలేశారు మా వాళ్ళు 

మేము లేచి వెళ్లి పోతుంటే అక్కడ ఉన్న ఒక వృద్ధ మహిళ మా దగ్గరకి వచ్చి అలా వేస్ట్ చెయ్యకూడదు అంది 

మా ఫుడ్ . మా ఇష్టం అని మా వాళ్ళు కొంచెం రూడ్ గా మాట్లాడారు . అందుకు ఆ గ్రూప్ అందరికీ కోపం వచ్చింది . వెంటనే ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసింది .

పోలీసులు వచ్చారు . జరిగినది విన్నారు .50 యూరోలు ఫైన్ వేశారు మాకు . 

చెల్లించి వచ్చాము .

వాళ్ళు అన్నది 

" డబ్బులు నీవి . కానీ ఇక్కడి రిసోర్స్ నీవి కావు . అందరివీ . ఇంకొకడు తినవలసినది నువ్వు పాడు చేశావు . ఆరకంగా నువ్వు ఈ దేశ సంపాదకు నష్టం చేకూర్చావు . దేశ సంపాదకు నష్టం చేసే హక్కు నీకు లేదు "

.

మనం పెళ్ళిళ్ళలో ఎంత దుబారా చేస్తాం ? ఇది మనకు ఒక గుణ పాఠం కాదూ ?


.

-"MONEY IS YOURS BUT RESOURCES BELONG TO THE SOCIETY."

కామెంట్‌లు లేవు: