8, ఫిబ్రవరి 2023, బుధవారం

**శ్రీ లలితా దేవి జయంతి*

 **శ్రీ లలితా దేవి జయంతి*


*లలిత దేవి జయంతి యొక్క ప్రాముఖ్యత*


ప్రతి సంవత్సరం , మాఘ మాసం పూర్ణిమలో లలిత జయంతి ఉపవాసం పాటిస్తారు.  లలితాదేవికి భక్తి ఆరాధన చేసేవాడు , శాంతి , శ్రేయస్సు మరియు మోక్షం వైపు అడుగులు వేస్తాడు. వీటితో పాటు , ఈ ఉపవాసం అన్ని రకాల సిద్ధిలను సాధించడంలో సహాయపడుతుంది. ఈ రోజున కొన్ని ప్రదేశాలలో చాలా గొప్ప ఉత్సవాలు నిర్వహిస్తారు. దేవాలయాలలో , భక్తులు శ్రీ లలితదేవి ఆశీర్వాదం పొందడానికి క్యూలలో వేచి ఉంటారు. లలితాదేవితో పాటు , స్కందమాత మరియు శంకరుల లను గౌరవించే సంప్రదాయం కూడా ఈ రోజునే అనుసరించబడింది.  లలితా మాతను రాజేశ్వరి , షోడాషి , త్రిపుర సుందరి పేర్లతో పిలుస్తారు. లలితాదేవి పార్వతి అవతారం కాబట్టి , ఆమెను తాంత్రిక పార్వతి అని కూడా పిలుస్తారు.    


ఆదిశక్తి రూపాలైన త్రిపురాత్రయంలో శ్రీలలితా త్రిపురసుందరి రెండో స్వరూపం. ఆమె శ్రీచక్రానికి అధిష్ఠాన దేవత , పంచదశాక్షరీ మంత్రాధిదేవత. భండాసురుణ్ణి వధించడానికి మాఘ పౌర్ణమినాడు శ్రీ లలితా దేవి ఆవిర్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి.


‘మఘము’ అంటే యజ్ఞం. యజ్ఞ , యాగాలూ , పవిత్రమైన దైవ కార్యాలు చేయడానికి అత్యున్నతమైనదిగా మాఘ మాసాన్ని పెద్దలు ప్రస్తుతించారు. అలాంటి మాఘ మాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి. దీన్నే *‘మహా మాఘి’* అని కూడా అంటారు. ఈ రోజున చేసే సముద్ర , నదీ స్నానాలు , పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయన్నది శాస్త్రవచనం. *లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత.* లలితా దేవి ఆవిర్భావ గాథ దేవీ పురాణంలో ప్రస్తావితమై ఉంది. భండాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు అతని తపో నిష్టకు మెచ్చి , ప్రత్యక్షమయ్యాడు. ఎవరైనా తనతో యుద్ధం చేస్తే... ఆ ప్రత్యర్థి బలంలో సగం తనకు రావాలనీ , శత్రువులు ప్రయోగించే అస్త్రాల వల్ల తనకు ఎలాంటి హానీ కలగకూడదనీ భండాసురుడు వరం కోరుకున్నాడు. శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు. వర గర్వంతో విజృంభించిన భండాసురుడు తన సోదరులతో కలిసి మూడు లోకాలనూ పీడించడం మొదలుపెట్టాడు. అతను పెట్టే బాధలను భరించలేక... నారదుని సూచన మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతను ఆరాధించారు. మహా యాగం చేశారు. ఆ హోమ గుండం నుంచి శ్రీ లలితాదేవిగా అమ్మవారు ఆవిర్భవించి , శ్రీచక్రాన్ని అధిష్ఠించి , భండాసురుణ్ణి సంహరించింది.


ఆమె రౌద్ర రూపాన్ని శాంతింపజేయడానికి దేవతలు , మునులు ప్రార్థిస్తూ పలికిన నామాలే *‘శ్రీ లలితా సహస్రనామం’గా* ప్రాచుర్యం పొందాయి. కామేశ్వరుణ్ణి లలితాదేవి పరిణయమాడింది. సకల సృష్టినీ నిర్వహించేది వారేనని పురాణాలు పేర్కొంటున్నాయి. 


సర్వశక్తులకూ మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు. అందుకే... అమ్మవారిని ఏ రూపంలో పూజించినా *‘లలితా సహస్రనామా’* న్ని పఠిస్తారు. అరుణ వర్ణంలో ప్రకాశిస్తూ , పాశాన్నీ , అంకుశాన్నీ , పుష్పబాణాలనూ , ధనస్సునూ నాలుగు చేతుల్లో ధరించి ఆమె దర్శనమిస్తుంది. శ్రీ లలితా దేవిని భయాన్ని పోగొట్టి , శాంతిని ప్రసాదించే తల్లిగా  కొలుస్తారు. దేవతల ప్రార్థనతో తన రౌద్ర రూపాన్ని ఉపసంహరించుకున్న ఆమెను ఆరాధించి , లలితాసహస్రనామ పారాయణ చేస్తే... కరుణాపూరితమై దృష్టిని భక్తులపై ప్రసరిస్తుందనీ , కళల్లో ప్రావీణ్యాన్నీ , కుటుంబ సౌఖ్యాన్నీ , ప్రశాంతతనూ ,  సంపదనూ ప్రసాదిస్తుందనీ భక్తుల నమ్మిక. ప్రత్యేకించి , శ్రీ లలితాదేవి జన్మదినమైన మాఘ పౌర్ణమి రోజున... పవిత్ర స్నానాలు చేసి , లలితా సహస్రనామ పఠనంతో అమ్మవారిని అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుందనీ , అలాగే *‘ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం...’* అంటూ ప్రారంభమయ్యే *‘శ్రీలలితా పంచ రత్న స్తోత్ర’* పారాయణ కూడా విశేష ఫలప్రదమనీ పెద్దల మాట.


సర్వశక్తులకూ మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు. అందుకే... అమ్మవారిని ఏ రూపంలో పూజించినా *‘లలితా సహస్రనామా’* న్ని పఠిస్తారు.


మాఘ మాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి. దీన్నే *‘మహా మాఘి’* అని కూడా అంటారు. ఈ రోజున చేసే సముద్ర , నదీ స్నానాలు , పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయన్నది శాస్త్రవచనం. లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత.

కామెంట్‌లు లేవు: