27, ఫిబ్రవరి 2021, శనివారం

మాసానాం మార్గశీర్షోహం..

 మాసానాం మార్గశీర్షోహం.... కాలము ప్రకృతి పరంగా నడచుట. యిది జీవ చైతన్యలక్షణమునకు  సంబంధమైనది. దీనికి భూమి కారణం. భూచలనమునకు రాహు కేతు మాగ్నెట్ లక్షణం. రాహుకేతు శక్తి లక్షణము పార్వతీ పరమేశ్వర తత్వం. క్షీర సాగరమధనం మాఘ మాసంలో జరుపబడిన మూలంగా మాఘమాసము సృష్టికి జీవజాలమునకు పూర్ణ లక్షణము. ప్రకృతికి సంబంధించిన దంతయు సముద్రమధనం నుండే ఆవిర్భవించి సకల కళలు అనగా షోడశ కళల రూపము మరియు దానిని నాలుగు సంఖ్యతో విశ్లేషణ అనగా 16xనాలుగు 64 కళల పూర్ణమైన లలితమ్మగా రూపుదాల్చింది. చతుషష్ట్యపరాధ్యై చతుషష్టి కళామయి. యివి అన్ని మాఘా నక్షత్ర కేతు తత్వమని మహా మాఘియని సంభోధన. మాఘమాసము నకే మహా మాఘియని వేరే మాసమునకు మహా సంబోధన లేదు. యిది కేతు తత్వం సింహరాశి ప్రారంభంలో కలదు. దీని కేతు తత్వం సింహ వాహినీ యైన అమ్మ సంబంధం. కేతు తత్వం అమ్మ యని రాహు తత్వం శతభిషం శివ తత్వ సంబంధమని దీని ని సమ సప్తకమే జ్యోతి ఉష శాస్త్ర కళత్ర స్థాన ఫలము తెలుపు స్త్రీ పురుష తత్వం తెలియును. సృష్టి కి సంబంధించిన సమస్తం యీ మాసము నుండే ప్రారంభం. సప్తమి శక్తి రూపమైన సూర్యజయంతి ప్రారంభం లయకారకత్వమైన శివరాత్రితో  లయమని తెలియుచున్నది. గ్రహచలనమే సృష్టి మానవ గమనము సృష్టికి మూలం. మఘలో పుట్టి పుబ్బ లో పోవుట యనగా కేతువు నుండి జీవశక్తి మనుగడ ప్రారంభమై పుబ్బానక్షత్రముతో శుక్రునితో పరిపూర్ణమై 120 పూర్తి గ్రహ దశలు సంచరించు కకాలముతో అనగా 120 సంవత్సరములు పూర్తిగా జీవించి ముక్తిని పొందుట. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

కామెంట్‌లు లేవు: