22, మే 2024, బుధవారం

మానవజన్మ సార్ధకత

 *ఈ మానవజన్మ సార్ధకతకు ధర్మాన్ని ఆచరించండి* 


ప్రపంచంలో మనిషిగా పుట్టడం చాలా అరుదు.. ఇలాంటి అరుదైన మానవజన్మ మనకు లభించింది.. ఈ జన్మలో విశ్వాసం లేదు, ధర్మాచరణం లేదు అని చెబితే ఈ మానవ జన్మకు అర్థం లేదు..                                                        

  అయితే ఈ పుణ్య భారతంలో ఇంతటి పుణ్య జన్మ తీసుకున్నాం అని అంటున్నాం కదా,మరి దాన్ని సాకారం చేసుకోవాలిఅంటే..?! అదీ మనిషి స్వభావాన్ని బట్టి ఉంటుంది. నిత్య ధర్మాచరణ చేసేవారి సాంగత్యంలో ఉంటే వారి స్వభావం అతడికి వస్తుంది..అదే అతను వివిధ దుర్మార్గపు పనులెజ్ చేసే వారి సాంగత్యంలో ఉంటే దుర్మార్గుల సాంగత్యం, దుర్మార్గుల స్వభావమే అతడికి వస్తుంది.ఈ పుణ్య భారతంలో పుడితేనే, ఈ సనాతన ధర్మ వంశంలో పుడితేనే అర్థం ఉంటుంది.. లేకుంటే ముందు చెప్పినట్లుగా జంతువులతో మనం సమానం అవుతాం. .అలా ఉండకూడదు.. ఈ జన్మకు సార్థకత కలగాలి.. ఈ ధర్మాన్ని పాటించే విషయంలో గొప్పవారు ఎప్పటికీ మనకు ఆదర్శం.వారు చూపించింన మార్గాన్నే తప్పక పాటించండి..


 -- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ* 

 *మహాస్వామి వారు*

కామెంట్‌లు లేవు: