30, జూన్ 2021, బుధవారం

సాష్టాంగ నమస్కారము

 ❤️అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారము అని అంటాం.

సాష్టాంగ నమస్కారము అంటే ఎనిమిది అంగాలతో నమస్కారము చేయడం.


💕ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః...


💕అష్టాంగాలు అంటే...


"ఉరసా" అంటే తొడలు,

"శిరసా" అంటే తల,

"దృష్ట్యా" అనగా కళ్ళు,

"మనసా" అనగా హృదయం,

"వచసా" అనగా నోరు,

"పద్భ్యాం" అనగా పాదములు,

"కరాభ్యాం" అనగా చేతులు,

"కర్ణాభ్యాం" అంటే చెవులు.


ఇలా "8 అంగములతో కూడిన నమస్కారం" చేయాలి.


💕మనిషి సహజంగా ఈ ఎనిమిది అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని దేవునికి నమస్కరించి ఆయా అంగములు నేలకు తగిలించాలి.


💕ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికీ ధ్వజ స్తంభానికీ మధ్యలో కాకుండా 

ధ్వజ స్తంభం వెనుక వుండి చేయాలి.


1) ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి.


2) శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి.


3) దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.


4) మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మన:స్పూర్తిగా చేయాలి.


5) వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం.. అంటే.. నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని స్మరించాలి.


అంటే  "ఓం శ్రీ వేంకటేశాయ నమః”(ఇలా ఆయా దేవుళ్లను స్మరించుకోవాలి) అని అంటూ నమస్కారం చేయాలి.

*ప్రతీరోజూ రోజుకు నాలుగైదు ఆధ్యాత్మిక / వ్యక్తిత్వవికాస సంబంధమైన  విషయాలను తెలుసుకోగోరే జిజ్ఞాసువులు లింకు ద్వారా సత్సంగ సమూహములో చేరండి. మీ బంధుమిత్రులకూ, అన్ని What’s app, Facebook, Telegram గ్రూపులకూ forward చేయండి:-*

https://t.me/joinchat/TIg_72gwkenxfdct

~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి

6) పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.


7) కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.


8) కర్ణాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చెవులను కూడా నేలకు తగులించాలి.


స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్లు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని శాస్త్రం చెబుతుంది.


పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి. దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి.


నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టంగ నమస్కారం చేసేవాళ్లు పొందుతారని శాస్త్రవచనం.

~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి

కామెంట్‌లు లేవు: