22, నవంబర్ 2020, ఆదివారం

సంధ్య

  "సంధ్య" అంటే సంధికాలం అని అర్థం. రాత్రికి సూర్యోదయానికి మధ్య ఉన్న సంధికాలాన్ని "ప్రాత సంధ్య" అంటారు. ఉదయానికి మధ్యాహ్నిక కాలానికి గల సంధికాలాన్ని "మధ్యాహ్నిక సంధ్య" అంటారు. అలాగే సాయంకాలానికి, రాత్రికి మధ్య గల సంధికాలాన్ని "సాయం సంధ్య" అంటారు. ఈ మూడు సంధికాలాలను కలిపి "త్రికాల సంధ్యలు" అంటారు పెద్దలు, పండితులు. మనము ప్రతీ రోజూ ఈ మూడు సంధికాలాలను చూస్తూ ఉంటాము. ప్రక్రుతిలో మార్పులు గూడా ఈ సంధికాలాల్లోనే జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటికి విశిష్టత ఏర్పడింది. ఈ మార్పులు శుభములు కావచ్చును కాకపోవచ్చును. సాధారణంగా అందరూ శుభములే కోరుకుంటారు. కాలగతి మాత్రం పంచభూతములు, అష్టదిక్పాలకులు, నవగ్రహలు వారి వారి అధి దేవతలు మొదలగు వారి అధీనంలో ఉంటాయి. ఈ ప్రక్రుతి శక్తులు అన్నీ బాహ్యేంద్రియాలకు గోచారం గానీ ఒక పరబ్రహ్మ తత్వం అధీనంలో ఉంటాయి. వీరందరూ శుభులయినప్పుడు మనకు తప్పకుండా శుభమే జరుగుతుంది. మనకూ, మన వారందరికీ శుభం జరగాలని ప్రార్ధించడాన్నే "సంధ్యావందనం" అంటారు.

          ఈ సంధ్యావందనం స్త్రీలు, పురుషులు అందరూ చేయవచ్చును. కాబట్టి ఈ సంధ్యావందనం నిత్యమూ చేసేవారిని బ్రాహ్మణులు అనవచ్చును. "బ్రాహ్మణులు" అంటే కేవలం ఒక కులం కాదు. అది గుణ ప్రధానమైన జాతి. అటువంటి బ్రాహ్మణులు ను సమాజం గౌరవిస్తుంది. సమస్త వేదాలను మనకు అందించిన వేదవ్యాసమహర్షి, బ్రాహ్మణ కులంలో జవ్మించాడా? ద్రోణాచార్యుడు, కుంభసంభవుడు అతనిది ఏ కులము అని చెప్పగలము? అందువలన కేవలం జన్మతః ఎవరూ అసలయిన బ్రాహ్మణులు కావడం లేదు. బ్రహ్మ జ్ఞాన సంపాదనకై తహతహలాడే ప్రతీ మానవుడూ బ్రాహ్మణుడే. కుల, మత, లింగ బేధములను ఆపాదించడం మంచిది కాదని వేదం చెబుతుంది. "ఉపనయనం" అనే ఒక ప్రక్రియ ఉన్నది. బ్రహ్మ జ్ఞానాని సంపాదించుకోవడానికి మన భౌతిక (బాహ్య) నేత్రాలు సరిపోవు. జ్ఞాన (అంతరంగ) నేత్రాలు కావాలి. అట్టి జ్ఞాన నేత్రాలు ప్రసాదించేదే ఉపనయన ప్రక్రియ. జన్మ కారకుడు, వీర్యప్రదాత అయిన తండ్రి తో గాయత్రీ మంత్రమును ఉపదేశం ఇప్పిస్తారు పండితులు. ఈ విధంగా జ్ఞాన నేత్రాలు పొందిన వారిని "ద్విజుడు" అంటారు. అంటే రెండు జన్మలు ఎత్తిన వాడని అర్థం. ప్రతీ మానవుడు జన్యుపరంగా ఒకేసారి జన్మిస్తాడు. జ్ఞాన సముపార్జన కొరకు రెండో జన్మ ఎత్తి ద్విజుడు అవుతాడు. ఓం శ్రీ మాత్రే నమహ.. సేకరణ        🍀🍁🍀🍁🍀🍁🍀🍁

కామెంట్‌లు లేవు: