22, నవంబర్ 2020, ఆదివారం

వత్తిని బట్టి ఫలితం

 🌹🥀💐🌸🌷🌺🌾


*దీపారాధనలో వినియోగించే వత్తిని బట్టి ఫలితం ఉంటుందా?*


దీపారాధనకు శుద్ధమైన వత్తిని ఎంచుకోవాలి. పత్తితో చేసిన వత్తులు సర్వశ్రేష్టమైనవి.


అన్నివేళల్లోనూ పత్తివత్తులను ఎవరైనా వెలిగించవచ్చు తామరతూడులతో వత్తులు చేసి వెలిగిస్తే అఖండభాగ్యం లభిస్తుంది పితృదోషాలు తొలగుతాయి. 


అరటివత్తులతో వెలిగిస్తే ఉత్తమ సంతతి. 


జిల్లేడు వత్తులతో వెలిగిస్తే అపారసంపద కలిగి దుష్టశక్తుల పీడ తొలగుతుంది.


నూతన వస్త్ర పీఠికను కుంకుమనీళ్లలో తడిపి, ఆరబెట్టి దీపారాధన చేస్తే కుజ, శుక్రదోషాలు పోతాయి.


పసుపురంగు వస్త్రంతో వత్తిచేసి వెలిగిస్తే దేవీ కటాక్షం సిద్ధిస్తుంది. 


కుంకుమరంగు వస్త్రంతో చేసిన వత్తితో వెలిగిస్తే సంతానప్రాప్తి కలుగుతుంది. 


ఎర్రరంగు వస్త్రాన్ని గంధపునీటిలో తడిపి, ఆరబెట్టి దీపారాధన చేస్తే చక్కటి సంతానం కలుగుతుంది.


పన్నీరుతో తడిపిన నేతివత్తులతో వెలిగిస్తే కీర్తివంతులవుతారు.


తామరనారతో దీపారాధన చేస్తే గ్రహదోషాలు పోతాయి.


దీపారాధనలో రెండు వత్తులు వాడడం మంచిది. ఒకటి అడ్డవత్తి, రెండోది నిలువు వత్తి అయితే ఉత్తమం.


లేకపోయినా రెండు నిలువు వత్తులను

వెలిగించవచ్చు.


3.ఉత్తమ సంతానం కలుగుతుంది


5.పంచభూతాలకు సంకేతం


7. ఏడుజన్మల పాపాలు తొలగిపోతాయి


8.అప్లైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి


10. సర్వాంతర్యామికి సంకేతం.


27.నక్షత్రారాధన ఫలితమిస్తుంది సర్వారిష్టాలు తొలగుతాయి


360 సంవత్సరమంతా దీపారాధన చేసిన ఫలం లభిస్తుంది.

🌹🌾🌺🌷🌸💐🥀


*ఒకసారి వెలిగించిన వత్తిని మళ్లీ వెలిగించవచ్చా*


నేడు వెలిగించిన వత్తిని తీసివేసి రేపటినాడు కొత్త వత్తితో దీపారాధన చేయాలి.


ఒకరోజునే వెలిగించిన మూడు వత్తుల్లో ఒక వత్తి శాంతించి మిగిలిన వత్తులు వెలుగుతున్నప్పుడు వాటి సాయంతో కొండెక్కిన వత్తిని వెలిగించవచ్చు. 


అన్ని వత్తులూ ఒకేసారి శాంతించినప్పుడు కూడా అప్పటికప్పుడే అయితే మరోసారి వెలిగించుకోవచ్చు.


 ఒకసారి చేసిన దీపారాధనలోని వత్తులు ఆనాటికి మాత్రమే పరిమితం అని గుర్తించాలి.


                  *భక్తి*

                 M.s.s.k.

                

కామెంట్‌లు లేవు: