22, నవంబర్ 2020, ఆదివారం

వ్యవసాయేతర’ రిజిస్ట్రేషన్లు వాయిదా

 వ్యవసాయేతర’ రిజిస్ట్రేషన్లు వాయిదా

23న రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావు


కోర్టు నుంచి స్పష్టత వచ్చే దాకా అంతే?


మరో మూడునాలుగు రోజుల సమయం పట్టే చాన్స్‌


కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన సర్కారు


‘ధరణి’ని సమగ్రంగా రూపొందించామని వెల్లడి


మూడు చట్టాల్లో సవరణలతో ధరణికి చట్టబద్ధత


పకడ్బందీగా పోర్టల్‌కు రూపకల్పన


వివరాలను దాచి పెట్టుకునేలా ‘ప్రైవసీ’ ఆప్షన్‌


ప్రజల ఆస్తులకు పూర్తిస్థాయిలో భద్రత


నిజమైన హక్కుదారులను రికార్డుల్లోకి ఎక్కించాలనేదే ప్రభుత్వ 


ఉద్దేశం. ఎవరి కులం వివరాలను సేకరించలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వంటి సామాజిక వర్గాన్ని మాత్రమే 


అడిగాం. ఆధార్‌ నంబర్లను కూడా స్వచ్ఛందం చేశాం.


రాష్ట్ర సర్కారు అఫిడవిట్‌


: ధరణి పోర్టల్‌ ద్వారా ఈ నెల 23 నుంచి ప్రభుత్వం ప్రారంభించాలనుకున్న వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు వాయిదా పడ్డాయి. రిజిస్ట్రేషన్లకు మరో మూడు నాలుగు రోజుల సమయం పట్టే అవకాశాలున్నాయి. ‘ధరణి’ పోర్టల్‌పై హైకోర్టులో కేసు కొనసాగుతుండడంతో రిజిస్ట్రేషన్లను ఇప్పుడే ప్రారంభించకూడదని సర్కారు నిర్ణయించింది. హైకోర్టు నుంచి స్పష్టత వచ్చాకే ఈ ప్రక్రియ ముం దుకు సాగనుంది. సెప్టెంబరు 8 నుంచి రాష్ట్రంలోని అన్ని రకాల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను చేపట్టాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే... ధరణి పోర్టల్‌ అక్టోబరు 29 నుంచి అందుబాటులోకి రావడంతో నవంబరు 2 నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ఈ నెల 23 నుంచి ప్రారంభిస్తామని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వీటిని ప్రారంభిస్తారని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.


అయితే రిజిస్ట్రేషన్ల విషయంలో అనుసరించాల్సిన పద్ధతులపై హైకోర్టులో ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. ఈ అంశాన్ని ఈ నెల 23న హైకోర్టు మరోసారి విచారించనుంది. దీంతో.. హైకోర్టు నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వస్తే తప్ప రిజిస్ట్రేషన్లను ప్రారంభించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో.. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ కోర్టుకు సమగ్ర వివరాలతో అఫిడవిట్‌ సమర్పించారు. ప్రజలకు వ్యవసాయేతర ఆస్తులపై హక్కులు కల్పించి, పాస్‌బుక్‌లను జారీ చేయడానికే ధరణి వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించామని స్పష్టం చేశారు. ఈ పోర్టల్‌ను చాలా పకడ్బందీగా రూపొందించామని, ప్రజా ఆస్తులకు పూర్తి భద్రత కల్పించనున్నామని తెలిపారు. మూడు చట్టాలను (పంచాయతీరాజ్‌, మునిసిపల్‌, జీహెచ్‌ఎంసీ) సవరించి, కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చామని పేర్కొన్నారు. నిజమైన హక్కుదారులను రికార్డుల్లోకి ఎక్కించాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని.. ఎవరి కులం వివరాలను సేకరించలేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వంటి సామాజిక వర్గాన్ని మాత్రమే అడిగామని వివరించారు. ఆధార్‌ కార్డులను కూడా స్వచ్ఛందం చేశామని చెప్పారు. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ఒకే లావాదేవీ కింద జరిగేలా ధరణి పోర్టల్‌ను తీర్చిదిద్దామన్నారు. ఆధార్‌, ఫోన్‌ నంబరు వంటి వివరాలు ఉంటే.. ఒకరికి బదులు మరొకరు ఆస్తుల క్రయవిక్రయాలు చేయలేరని వివరించారు.

కామెంట్‌లు లేవు: