16, అక్టోబర్ 2020, శుక్రవారం

గోత్రము

 srinidhi: 

*గోత్రము , ప్రవర , వివాహ నిబంధనలు:*


గోత్రమంటే నిజానికి ’ గోశాల’ అని అర్థము. సనాతన కాలంలో ఒకే వంశానికి చెందిన వారంతా వారి వారి గోవులను ఒకేచోట ఉంచి కాపాడుకొనేవారు. ఆ ప్రదేశాన్ని ’ గోత్రము ’ అని పిలిచేవారు. కాల క్రమేణా ఆ పదానికి అర్థంమారి, ఒక వంశమువారి పూర్వీకులు పరంపరగా సంభవించిన మూలపురుషుడి ( ఋషి యొక్క) పేరునే వారి గోత్రముగా పిలవడము మొదలైంది.


ఒక గోత్రము వారంతా ఒకే వంశానికి చెందిన వారు అని అందరూ అనుకుంటారు. కానీ నాకు వ్యక్తిగతం గా తెలిసి ఒకే గోత్రపు వారు వివిధ వంశాలలో ఉన్నారు. అంతే కాదు, వివిధ వర్ణాలలో కూడా ఉన్నారు. ఇవి బ్రాహ్మణ గోత్రాలు , ఇవి క్షత్రియ గోత్రాలు , ఇవి వైశ్య గోత్రాలు ..... ఇలా ఉన్నప్పటి కీ , కొన్ని గోత్రాలు పరిపాటిగా అన్ని వంశాలలోనూ ఉన్నాయి. ఇలా గోత్రాలు అన్ని వర్ణాలలోనూ కలసి ఉండటానికి కింద రాసినది చదివితే కొంతవరకు బోధ పడవచ్చు...


సనాతనంగా వచ్చిన గోత్రాల మూల ఋషుల వివరాలు పరిశీలిస్తే, ఆ ఋషులు అచ్చంగా ఎనిమిది మందే ! విశ్వామిత్ర, జమదగ్ని, భారద్వాజ, గౌతమ, అత్రి, వశిష్ట, కశ్యప మరియు అగస్త్య ఋషుల పేర్లమీద ఆ యా గోత్రాలు ఏర్పడ్డాయి. తరువాతి కాలంలోలక్షల కొలది లెక్కలేనన్ని గోత్రాలు పుట్టుకొచ్చాయి. ఒక్కొక్క ఋషి పేరుతోనూ , ఇతర ఋషుల సంబంధాలతో , అనేక కలయికలు కలిగి , గోత్రాలు ఏర్పడ్డాయి. ఆ గోత్రజుల సంతానానికి , అదే గోత్రము. నాది పలానా ఋషి యొక్క గోత్రము అని చెప్పితే దానర్థం, పరంపరగా వచ్చిన ఆ ఋషి సంతానంలో ఎక్కడా వంశం ఆగిపోకుండా అఖండంగా వచ్చిన మగ సంతానంలో ఒకణ్ణి అని చెప్పడం అన్నమాట. ఆడపిల్లలు పుట్టితే, పెళ్ళయ్యాక, భర్త గోత్రమే వారి గోత్రమవుతుంది. సగోత్రులు అంటే, అబ్బాయి, అమ్మాయి ఒకేగోత్రము వారైతే, వారు ఒకే ఇంటివారు అయి, అన్నా చెళ్ళెళ్ళవుతారు కాబట్టి వివాహమాడరాదు.


కులము, గోత్రము తరువాత, వెంటనే వచ్చే మాట ’ ప్రవర ’. దీన్నే ’ ఆర్షేయ ’ అని కూడా అంటారు. దానర్థం, ప్రార్థిస్తూ ఆవాహన చేయడం. వ్యవహారికంగా ప్రవర అంటే , అగ్నిహోత్రమ్ చేసి, యజ్ఞము కాని, హోమము కానీ చేసే కర్త, తమ వంశములోని ప్రసిద్ధులైనవారి పేర్లను ఉటంకిస్తూ, ’ వారు చేసినట్టి హవనమే నేనూ చేస్తున్నాను, ’ అని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ చేసే ఆవాహన. ( అగ్ని స్తుతి ) సాధారణంగా అత్యంత ప్రసిద్ధులైన తన వంశములోని ముగ్గురి / లేదా ఐదుగురి / లేదా ఏడుగురి పేర్లను చెప్పాలి. సాధారణంగా ఆ ముగ్గురూ, తన గోత్రపు మూల ఋషికంటే సనాతనులై ఉంటారు. ఇది ఒక విధంగా తనని తాను పరిచయం చేసుకోవడానికి కూడా చెపుతారు. ఉపనయనము అయిన వటువు కొత్తగా వేదము, శాస్త్రాలు నేర్పించే గురువు వద్దకు వెళ్ళి మొదట ఈ ప్రవర చెప్పాలి. ఎవరైనా గురు తుల్యులు, గురువుగారి గురువుగారు, లేదా పెద్దవారిని మొదటి సారి కలిసినప్పుడు తప్పనిసరిగా ఈ ప్రవర చెప్పాలి. ప్రవర చెప్పడానికి ప్రత్యేకమైన పద్దతి ఉంది. అది కింద ఇచ్చాను.


గౌతముడు , మరియు ఆపస్తంబుడి ప్రకారము , సగోత్రీయుల మధ్య వివాహాలు కుదరవు....చేసుకోకూడదు... ఎందుకంటే , ఒకే గోత్రములో పుట్టినవారు ఒకే ఇంటీ వారవుతారు. కాబట్టి వారు అన్నా చెల్లెళ్ళో , అక్కా తమ్ముళ్ళో, తంరీ కూతుళ్ళొ , తల్లీ కొడుకుల వరస కలవారొ అవుతారు...సగోత్రీకులంటే ఎవరు ? నిర్ణయ సింధువు ప్రకారము ,

ఏ రెండు కుటుంబాలకు గానీ " ప్రవర " పూర్తిగా కలిస్తే వారు సగోత్రీకులు అవుతారు. ప్రవర అంటే , కింద చెప్పినట్లు ,

|| చతుస్సాగర పర్యంతమ్ గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు

ఇతి ఏకార్షేయ / త్రయార్షేయ / పంచార్షేయ / సప్తార్షేయ ప్రవరాన్విత

---- సగోత్రః , ----- సూత్రః, ----- శాఖాధ్యాయీ

..శర్మన్ అహం భో అభివాదయే ||


పైని ప్రవరలో , మన గోత్రము పేరు , గోత్ర ఋషుల పేర్లూ చెపుతాము. ప్రతి ఒక్కరూ , తమ గోత్రము ఏమిటో , తమ వంశ ఋషులు ఎవరో తెలుసుకొని ఉండాలి. కొన్ని వంశాలకు ఒకే ఋషి , మరి కొన్ని వంశాలకు ముగ్గురు ఋషులూ , కొన్నింటికి ఐదుగురు , మరి కొన్నింటికి ఏడుగురూ ఉంటారు. ఇంకా ఖాళీలలో , సూత్రః అని ఉన్న చోట తాము అనుసరించే సూత్రము ఏదో చెప్పాలి ( ఆపస్తంబ , బౌధాయన , కాత్యాయన ....ఇలా.. ) శాఖ అన్నచోట , తమ వంశపారంపర్యంగా అనుసరించే , అధ్యయనం చేసే వేదశాఖ పేరు చెప్పాలి ( యజు , రిక్ , సామ ... ఇలా ) శర్మన్ లేదా శర్మా అన్న చోట, బ్రాహ్మణులైతే తమపేరు చెప్పి శర్మా అని , క్షత్రియులైతే , వర్మా అని , వైశ్యులైతే గుప్తా అని చెప్పాలి.

బౌధాయనుల ప్రకారమైతే , సమాన గోత్రము లేక ' సగోత్రము ' అని నిర్ణయించడానికి కింది కొలమానము ఉపయోగించాలి.

మొదట , ఇద్దరి గోత్రమూ ఒకటే కావాలి. తర్వాత ,

* ఎవరికైతే ఒకడే ఋషి ఉంటాడో , అదే ఋషి ప్రవరలో గల కన్య తో వివాహము తగదు.

* ఎవరికైతే ముగ్గురు ఋషులు ఉంటారో , ఆ ముగ్గురిలో ఏ ఇద్దరైనా ప్రవరలో గల కన్యతో వివాహము తగదు.

* ఎవరికైతే ఐదుగురు ఋషులు ఉంటారో , ఆ ఐదుగురిలో ఏ ముగ్గురైనా ప్రవరలో గల కన్యతో వివాహము తగదు.

* ఎవరికైతే ఏడుగురు ఋషులు ఉంటారో , ఆ ఏడుగురిలో ఏ ఐదుగురైనా ప్రవరలో గల కన్యతో వివాహము తగదు.

ఇదీ , సగోత్రము అవునా కాదా అని నిర్ణయించే పద్దతి. అంతటితో అయిపోలేదు... అవి కాక, ఇంకొన్ని కూడా చూడాలి..

మాతృ గోత్రాన్ని వర్జించాలి. అంటే , తల్లి పుట్టింటి గోత్రాన్ని కూడా పరిగణించి , ఆ ప్రకారముగా సగోత్రమైతే వివాహమాడరాదు.

ఏఎ గోత్రాలకు యే యే ప్రవరలు అన్నది చాలా పెద్ద చిట్టానే ఉన్నది... ఇక్కడ రాయడము వీలు పడదు.

ఇక నిబంధనల సడలింపులు

ఈ విషయములో సడలింపులు అంటు ఏవీ లేవు.

గోత్రము తెలియనిచో , తనని తాను ఎవరికో ఒకరికి ఇచ్చుకొని , వారి గోత్ర ప్రవరుడు కావాలి. తెలిసినచో , ఈ పద్దతి తగదు.

తెలిసి కానీ తెలియక కానీ సగోత్రీకులతో వివాహము జరిగి సంసారం చేస్తే , ప్రాయశ్చిత్తం చేసుకొని , ఆ కన్యని తల్లిలా ఆదరించాలి.

తెలిసి చేస్తే , గురు తల్ప వ్రతం చేసి , శుధ్ధుడై , ఆ భార్యని తల్లి లా ఆదరించాలి. ఆమెకు తానే ఆఖరి కొడుకు.


తెలియక చేస్తే , మూడు చాంద్రాయణ వ్రతాలు చెయ్యాలి.( చాంద్రాయణం అనగా , ఒక నెలలోని శుక్ల పక్షం లో మొదటి రోజు ఒక ముద్ద మాత్రమే అన్నం తినాలి. రెండో రోజు రెండు ముద్దలు , మూడో రోజు మూడు, ఇలా పౌర్ణమికి పదిహేను ముద్దలు మాత్రమే తినాలి. తర్వాత, కృష్ణ పక్షం లో ఒక్కో ముద్ద తగ్గిస్తూ తినాలి. అమావాశ్య కు పూర్తి ఉపవాసం ఉండాలి... ఇలా ఒక నెల చెస్తే అది ఒక చాంద్రాయణం. ) ఈ ప్రాయశ్చిత్తం తాను శుధ్ధుడవటానికి మాత్రమే... ఇది ఒక వెసులుబాటు కాదు.

[16/10, 8:04 pm] srinidhi: #మర్మమైన_ఆలయం_మహానంది.

ఎవరైనా సిద్ధమా????ఒక సోదరుడు అడిగాడు ఈ పోస్ట్,ఎవరైనా సరే ఛాలెంజ్ గా ప్రయత్నించవచ్చు,

ఎంతమంది స్నానం చేసినా స్వచ్ఛత గుణాన్ని కొల్పోని చెరువు(కోనేరు)!!!

నీళ్లు ఎక్కడనుండి వస్తున్నాయో ఇప్పటివరకు ఎవరూ కనుక్కోలేక పోయారు!ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకోవచ్చు నాస్తికులు....


#నంద్యాల్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా నడిబొడ్డున, మహానంది అనే పవిత్ర గ్రామం ఉంది,ఇక్కడ శివుడు తన వాహనమైన నంది (పవిత్రమైన ఎద్దు) తో ఆయా రూపాల్లో ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించే భక్తులను ఆశీర్వదిస్తాడు.

 

మహానందికి ప్రాచీన యుగాల చరిత్ర ఉంది మరియు శివుని లింగ రూపాన్ని మహానంది వద్ద #నందిశ్వర అని పిలుస్తారు. దట్టమైన నల్లమల అడవుల మధ్యలో ఉంటుంది, ఈ ప్రదేశం వెనుక చాలా బయటపడని మరియు దాచిన #రహస్యాలు ఉన్నాయి. ఈ స్థలాన్ని చోళులు, పల్లవులు మరియు విజయనగర రాజులు అభివృద్ధి చేశారు. కానీ "ఈ దేవాలయాలను ఎవరు నిర్మించారు" అనే ప్రశ్నకు ఎవరూ ఖచ్చితంగా సమాధానం చెప్పలేరు.  


ఈ పవిత్ర ఆలయాన్ని నిర్మించిన వ్యక్తిని ఇప్పటివరకూ ఎవరూ గుర్తించలేదని చరిత్రలో ఏ ఆధారం కూడా ఇప్పటివరకూ దొరకలేదు.ఈ లింగం చరిత్ర కూడా మంత్రముగ్దులను చేస్తుంది.ఈ ప్రదేశం యొక్క ఆసక్తికరమైన అంశం #ఆలయం_లోపల_చెరువు(కోనేరు)

పరిసరాల్లో నీటి కొరత సాధారణం.  

ఏ సీజన్ అయినా, ఈ చెరువులోని(కొనేటిలోని) నీటి ప్రవాహం ఎప్పుడూ ఒకే ప్రవాహంతోనే ఉంటుంది మరియు చెరువు(కోనేరు)యొక్క నీటి మట్టం ప్రతి రోజు కూడా అదే విధంగా ఉంటుంది.  


ప్రధాన(కోనేటి) చెరువులోని నీరు లోతైన రహస్యం, నీరు #ఎక్కడ_నుండి_వస్తున్నదో ఎవరికీ కనుగొనబడలేదు.ప్రధాన ఆలయం యొక్క లోపలినుండి నీరు వస్తోందని,ఐనా దానికి ఆధారాలు లేవని చెప్పాలి. ప్రతిరోజూ ఎంతమంది భక్తులు స్నానం చేసినా నీరు ఎప్పుడూ స్వచ్చం గా ఉంటుంది. నీరు ఎల్లప్పుడూ చక్కగా మరియు శుభ్రంగా ఉంటుంది.  


నీటిలో ఔషధ విలువలు ఉన్నాయి కనుక ప్రజలు వ్యాధుల నుండి బయటపడటానికి ఈ నీటిని తాగుతారు.ఈ ప్రధాన చెరువుకు(కోనేటి కి) నీటి ప్రవాహం మరియు నీటి ఉష్ణోగ్రత ప్రజలను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది మరియు రహస్యాన్ని తెలుసుకొనే అవకాశం ఇస్తుంది.

ఇప్పటికీ నిజం పరిష్కరించబడలేదు, 

కాని చెరువు యొక్క అందం వివరించలేనిది.

 నీటి ప్రవాహం తెలియదు మరియు ఈ ఆలయం సందర్శించడానికి ఇది ఒక పవిత్రమైన కారణమని నమ్ముతారు.


పరశురామ్ పరశురామ్

[16/10, 8:04 pm] srinidhi: *🌹. దసరా నవరాత్రుల లో అమ్మవారి అవతారాలు, అమ్మకు పెట్టవలసిన నైవేద్యాలు, శ్లోకాలు…. 🌹*


ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రులలో రోజుకొక దుర్గా రూపమును ఉపాసించ వలెను.


*🌻. నవదుర్గలు :*


ప్రథమా శైలపుత్రీచ| ద్వితీయా బ్రహ్మచారిణీ|తృతీయా చంద్రఘంటేతి| కూష్మాండేతి చతుర్థికీ|పంచమా స్కందమాతేతి| షష్ఠా కాత్యాయనేతిచ|సప్తమా కాళరాత్రీచ| అష్టమాచేతి భైరవీ|నవమా సర్వసిద్ధిశ్చాత్| నవదుర్గా ప్రకీర్తితా||

నవరాత్రులలో ఈ తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజించాలి.


*🌻. నవదుర్గా ధ్యాన శ్లోకములు 🌻*


*🌷. శైలపుత్రీ : (బాలా త్రిపుర సుందరి)*

నైవేద్యం : కట్టు పొంగలి


శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం| వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||


*🌷. బ్రహ్మ చారిణి ( గాయత్రి ):*

నైవేద్యం : పులిహోర


శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ | దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||


*🌷. చంద్రఘంట ( అన్నపూర్ణ )*

 నైవేద్యం : కొబ్బరి అన్నము


శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా| ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||


*🌷. కూష్మాండ ( కామాక్షి )*

నైవేద్యం : చిల్లులులేని అల్లం గారెలు


శ్లో|| సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ| దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||


*🌷. స్కందమాత ( లలిత )*

నైవేద్యం : పెరుగు అన్నం


శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా| శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||


*🌷. కాత్యాయని(లక్ష్మి)*

నైవేద్యం : రవ్వ కేసరి


శ్లో|| చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా | కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||


*🌷. కాళరాత్రి ( సరస్వతి )*

నైవేద్యం : కూరగాయలతో వండిన అన్నాన్ని


శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||


*🌷. మహాగౌరి( దుర్గ )*

నైవేద్యం : చక్కెర పొంగలి (గుఢాన్నం)


శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః| మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||


*🌷. సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని ) ( రాజ రాజేశ్వరి )* 

నైవేద్యం : పాయసాన్నం


శ్లో|| సిద్ధ గంధర్వ యక్షాద్యైరసురైరమరైరపి | సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||


*🌷. దుర్గా ధ్యాన శ్లోకము :*


శ్లో|| ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాంశంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీంధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ॥

🌹 🌹 🌹 🌹 🌹

సేకరణ

కామెంట్‌లు లేవు: