16, అక్టోబర్ 2020, శుక్రవారం

రామాయణమ్.94

 రామాయణమ్.94

...

భరతుడు తండ్రికి చేయవలసిన పితృకార్యాన్ని పూర్తిచేశాడు.అది పధ్నాల్గవరోజు దశరధుడి చితికి నిప్పంటించి. 

.

రాజ్యాభిషేకమహోత్సవము జరిపించే అధికారముగల మంత్రులంతా భరతుని సందర్శించారు.

.

ఆయన సముఖంలో నిలిచి నీ తండ్రి,మరియు నీ అన్నగారు ఇరువురూ రాజ్యము నీకు ఇచ్చివేశారు ఇక నీవు రాజ్యలక్ష్మిని చేపట్టవలసి ఉన్నది అందుకు ఏ మాత్రము ఆలస్యమైనా రాజ్యములో అరాచకము ప్రబలవచ్చును.ఇప్పటివరకూ ప్రజలు శాంతితో సహజీవనం చేస్తున్నారు.ఎవరూ ఎవరినీ పీడించడంలేదు.ఇప్పటివరకు ఏ ఉపద్రవమూలేదు.

.

నీ పట్టాభిషేకమునకు సర్వము సిద్ధం చేసినాము అని పలికి నిలిచారు వారంతా!

.

భరతుడు సగౌరవముగా వారందరికి నమస్కరించి వారు అప్పటికే తెచ్చి అక్కడ ఉంచిన అభిషేక సామాగ్రికి ప్రదక్షిణనమస్కారములు చేసి అమాత్యలతో ఇలా అన్నాడు.

.

మా వంశములో ఎల్లప్పుడూ పెద్దకుమారుడే రాజు ! అది ఉచితము అదే మా వంశాచారము.మీరీవిధముగా మాట్లాడవద్దు.

.

మా రాముడే రాజు ఆయన బదులుగా పదునాల్గు సంవత్సరాలు నేను అరణ్యవాసం చేస్తాను.

.

చతురంగబలాలు సిద్ధం చేయండి ,మహాసైన్యాన్ని సమకూర్చండి నేను నా జ్యేష్ఠసోదరుడైన రాముని అరణ్యం నుండి తీసుకు వచ్చెదను మనము ఆయననే రాజుగా అభిషేకించవలె!.

.

మనము రామునివద్దకు వెంటనే ప్రయాణము కావలె మార్గములు నిష్కంటకములు గావించండి,చక్కని రహదారులు గంగాతీరము వరకు ఏర్పాటుచేయించండి,దిగుడుబావులు తవ్వించండి .అని ఆజ్ఞాపించాడు భరతుడు.

.

అమాత్యలంతా క్షణంలో ఆ పనులన్నీ పూర్తిచేసి ఆయనకు తెలిపారు.

.

ఆయాప్రాంతములు,ప్రదేశముల స్వరూప,స్వభావములు తెలిసినవారు(topographers),సూత్రములుపట్టికొలతలు వేయువారు (surveyors),

నేలను తవ్వేవారు( earthmovers)

యంత్రాలుపయోగించేవారు,శిల్పులు (Architects)

వడ్రంగులు(Carpenters)

.కూలివారు,చెట్లునరికిమార్గముఏర్పరచేవారు,బాటవేయువారు,వేసినబాటమీద సున్నముపరచి పటిష్ఠము చేయువారు(Road builders) ,,వెదురుపనివారు,సమర్ధులైన పర్యవేక్షకులు (Supervisors) అందరూ ముందుగా బయలు దేరి వెళ్ళారు.

వారితోపాటు అపారజనసమూహము బయలుదేరింది బాటలన్నీ పౌర్ణమినాడు ఉప్పొంగిన సముద్రాలలా ఉన్నాయి.

.

భరతుడి ఉదాత్తమైన ఈ పలుకులకు జనులందరి కనులనుండి ఆనందబాష్పములు జలజలరాలినవి.

.

మనమంతా రాముని వెనక్కి తీసుకునే రావాలి!

 అదే మన ధ్యేయం,అదేమనకర్తవ్యం అన్నట్లుగా అందరూ దీక్షపూని సాగుతున్నారు

.

ఆ రాత్రిగడచి తెల్లవారుతుండగా మంగళవాయిద్యములతో కూడిన స్తోత్రము లతో భరతుని స్తుతించసాగారు వందిమాగధులు,బంగారుదండములతో కొట్టి యామదుందుభి మ్రోగించసాగారు. భరతుడు నిదురలేచి ఆ స్తోత్రపాఠాలు,ఆదుందుభిస్వనాలు ఆయన హృదయంలో తీవ్రమైన వేదనరగిలించగా వెంటనే అందరినీ వాటిని ఆపమన్నాడు ,"నేను రాజును కాను" అని వారికి చెప్పి అన్నింటినీ ఆపివేసినాడు.

.

ప్రక్కనే వున్న శత్రుఘ్ననితో చూడు కైకవలన ఎంత అపకారం జరిగిందో ఆ మహారాజు దుఃఖాలన్నీ నాకు వదిలి వెళ్ళిపోయాడు .

.

మన అందరికీ రక్షకుడైన రాముడిని ధర్మహీనురాలైన నా తల్లి స్వయముగా అడవికి పంపినది.రాజ్యము చుక్కానిలేని నావ అయినది.

.

NB.

ప్రాచీన భారతావనిలో ఎన్ని వృత్తులు పరిఢవిల్లినవో గమనించగలరు .మహర్షి ఎన్ని వృత్తులవారి గురించి చెప్పారో చూడండి.అదీ భారతదేశం అంటే!

.

జానకిరామారావు వూటుకూరు

.

కామెంట్‌లు లేవు: