16, అక్టోబర్ 2020, శుక్రవారం

*16.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

 *16.10.2020 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*నవమ స్కంధము - పదహారవ అధ్యాయము*


*పరశురాముడు క్షత్రియ సంహారము చేయుట - విశ్వామిత్రుని వంశ వృత్తాంతము*


*ఓం నమో భగవతే వాసుదేవాయ*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*16.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*దదౌ ప్రాచీం దిశం హోత్రే బ్రహ్మణే దక్షిణాం దిశమ్|*


*అధ్వర్యవే ప్రతీచీం వై ఉద్గాత్రే ఉత్తరాం దిశమ్॥7875॥*


*16.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*అన్యేభ్యోఽవాంతరదిశః కశ్యపాయ చ మధ్యతః|*


*ఆర్యావర్తముపద్రష్ట్రే సదస్యేభ్యస్తతః పరమ్॥7876॥*


పిదప భార్గవరాముడు తాను జయించిన భూమండలము యొక్క తూర్పుభాగమును హోతకును, దళిణభాగమును బ్రహ్మకును (యజ్ఞమును నిర్వహింపజేసిన గురువునకును), పశ్చిమభాగమును అధ్వర్యునకును, ఉత్తరభాగమును ఉద్గాతకును సమర్పించెను. ఇతర ఋత్విజులకు ఆగ్నేయ-నైరృతి-వాయవ్య-ఈశాన్య భాగములను దానమొనర్చెను. మధ్యభాగమును కశ్యపమహర్షికి ఇచ్చివేసెను. ఆర్యావర్తమును *ఉపద్రష్ట* అను ఋత్విజునకును, ఇంకను మిగిలియున్న భూమిని సదస్యులకును (సభలోనున్న ఇతరులకును) దానమిచ్చెను.


*అవబృథస్నానము* = యజ్ఞదీక్షానంతరము చేసెడి స్నానమును *అవబృథస్నానము* అని యందురు.


*16.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*తతశ్చావభృథస్నానవిధూతాశేషకిల్బిషః|*


*సరస్వత్యాం బ్రహ్మనద్యాం రేజే వ్యబ్భ్ర ఇవాంశుమాన్॥7877॥*


పిమ్మట పరశురాముడు పవిత్ర నదీజలములలో అవబృథస్నానమొనర్చి పాపరహితుడయ్యెను. పిదప దివ్యమైన సరస్వతీ నదీతీరమున ఆ మహాత్ముడు మేఘములులేని ఆకాశమునందు సూర్యభగవానునివలె తేజరిల్లెను.


*16.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*స్వదేహం జమదగ్నిస్తు లబ్ధ్వా సంజ్ఞానలక్షణమ్|*


*ఋషీణాం మండలే సోఽభూత్సప్తమో రామపూజితః॥7878॥*


అంతట జమదగ్ని మహర్షి సంకల్పమయ శరీరమును పొంది, పరశురాముని పూజలను అందుకొనిన పిమ్మట, సప్తర్షి మండలములో ఒకడై లోకమునకు ఆరాధ్యుడయ్యెను.


*శ్లో. కశ్యపోఽత్రిర్భరద్వాజో విశ్వామిత్రోఽథగౌతమః| జమదగ్నిర్వశిష్ఠశ్చ సప్తైతే ఋషయస్తథా॥*


కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు - అనువారు *సప్తఋషులుగా* ఖ్యాతి గాంచినవారు. నవదంపతులు తమ వివాహదీక్షానంతరము ఈ మహాత్ములను విధ్యుక్తముగా ఆరాధింతురు.


*16.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*జామదగ్న్యోఽపి భగవాన్ రామః కమలలోచనః|*


*ఆగామిన్యంతరే రాజన్ వర్తయిష్యతి వై బృహత్॥7879॥*


*16.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*ఆస్తేఽద్యాపి మహేంద్రాద్రౌ న్యస్తదండః ప్రశాంతధీః|*


*ఉపగీయమానచరితః సిద్ధగంధర్వచారణైః॥7880॥*


పరీక్షిన్మహారాజా! జమదగ్ని కుమారులలో ప్రముఖుడు, కమలలోచనుడు ఐన పరశురామ భగవానుడు రాబోవు మన్వంతరమున సావర్ణి వేదప్రవర్తకులైన, సప్తర్షులలో ఒకటై వేదములను విస్తరింపజేసి ఖ్యాతి వహించును. ఆ స్వామి ఎవ్వరినీ ఏమాత్రము దండింపక, ప్రశాంతచిత్తుడై నేటికిని మహేంద్రగిరిపై విలసిల్లుచున్నాడు. సిద్ధులు, గంధర్వులు, చారణులు మున్నగు దివ్యజాతులవారు ఆ మహానుభావుని చరితమును మధురస్వరములతో గానము చేయుచుందురు.


*16.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*ఏవం భృగుషు విశ్వాత్మా భగవాన్ హరిరీశ్వరః|*


*అవతీర్య పరం భారం భువోఽహన్ బహుశో నృపాన్॥7881॥*


విశ్వాత్ముడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, సర్వసమర్థుడు ఐన శ్రీమన్నారాయణుడు భూభారమును తొలగించుటకై భృగువంశజులలో పరశురాముడై అవతరించి, గర్వోన్మత్తులైన పెక్కుమంది రాజులను తుదముట్టించెను.


ఈ శ్లోకమున ప్రయుక్తమైన *బహుశః* అను పదమును గూర్చి వ్యాఖ్యానించుచూ *వీరరాఘవీయము* ఇట్లు తెలుపబడినది.


*బహుశ ఇత్యనేన కశ్చిదవశేషితః స్యాత్ - ఇతి సూచ్యతే తదేవోక్తం పురస్తాత్*


*శ్లో. అశ్మకాన్మూలకోజజ్ఞే యః స్త్రీభిః పరిరక్షితః| నారీకవచ ఇత్యుక్తో నక్షత్రే మూలకోఽభవత్॥*


'బహుశ - అను పదముద్వారా క్షత్రియులు ఇంకను మిగిలియున్నట్లు సూచింపబడుచున్నది. అశ్మకుని వలన కలిగినవాడు మూలకుడు. పరశురాముడు క్షత్రియ వంశములను నిర్మూలించునప్పుడు ఈ మూలకుని అంతఃపుర స్త్రీలు పరిరక్షించిరి. అందువలన ఇతనికి *నారీకవచుడు* అను పేరు ప్రసిద్ధమయ్యెను. తరువాతి క్షత్రియ వంశములకు మూలముగా నిల్చినవాడు. గావున ఇతడు మూలకుడుగా గూడ వాసికెక్కెను.


 *16.28 (ఇరువది ఐదవ శ్లోకము)*


*గాధేరభూన్మహాతేజాః సమిద్ధ ఇవ పావకః|*


*తపసా క్షాత్రముత్సృజ్య యో లేభే బ్రహ్మవర్చసమ్॥7882॥*


గాధివలన విశ్వామిత్రుడు జన్మించెను. అతడు ప్రజ్వలించుచున్న అగ్నివలె మహాతేజస్వి, ఆ మహాత్ముడు క్షాత్రధర్మమును వీడి, తీవ్రముగా తపస్సొనర్చి బ్రహ్మర్షియయ్యెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని పదహారవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235


*16.10.2020 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*నవమ స్కంధము - పదహారవ అధ్యాయము*


*పరశురాముడు క్షత్రియ సంహారము చేయుట - విశ్వామిత్రుని వంశ వృత్తాంతము*


*ఓం నమో భగవతే వాసుదేవాయ*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*16.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*దదౌ ప్రాచీం దిశం హోత్రే బ్రహ్మణే దక్షిణాం దిశమ్|*


*అధ్వర్యవే ప్రతీచీం వై ఉద్గాత్రే ఉత్తరాం దిశమ్॥7875॥*


*16.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*అన్యేభ్యోఽవాంతరదిశః కశ్యపాయ చ మధ్యతః|*


*ఆర్యావర్తముపద్రష్ట్రే సదస్యేభ్యస్తతః పరమ్॥7876॥*


పిదప భార్గవరాముడు తాను జయించిన భూమండలము యొక్క తూర్పుభాగమును హోతకును, దళిణభాగమును బ్రహ్మకును (యజ్ఞమును నిర్వహింపజేసిన గురువునకును), పశ్చిమభాగమును అధ్వర్యునకును, ఉత్తరభాగమును ఉద్గాతకును సమర్పించెను. ఇతర ఋత్విజులకు ఆగ్నేయ-నైరృతి-వాయవ్య-ఈశాన్య భాగములను దానమొనర్చెను. మధ్యభాగమును కశ్యపమహర్షికి ఇచ్చివేసెను. ఆర్యావర్తమును *ఉపద్రష్ట* అను ఋత్విజునకును, ఇంకను మిగిలియున్న భూమిని సదస్యులకును (సభలోనున్న ఇతరులకును) దానమిచ్చెను.


*అవబృథస్నానము* = యజ్ఞదీక్షానంతరము చేసెడి స్నానమును *అవబృథస్నానము* అని యందురు.


*16.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*తతశ్చావభృథస్నానవిధూతాశేషకిల్బిషః|*


*సరస్వత్యాం బ్రహ్మనద్యాం రేజే వ్యబ్భ్ర ఇవాంశుమాన్॥7877॥*


పిమ్మట పరశురాముడు పవిత్ర నదీజలములలో అవబృథస్నానమొనర్చి పాపరహితుడయ్యెను. పిదప దివ్యమైన సరస్వతీ నదీతీరమున ఆ మహాత్ముడు మేఘములులేని ఆకాశమునందు సూర్యభగవానునివలె తేజరిల్లెను.


*16.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*స్వదేహం జమదగ్నిస్తు లబ్ధ్వా సంజ్ఞానలక్షణమ్|*


*ఋషీణాం మండలే సోఽభూత్సప్తమో రామపూజితః॥7878॥*


అంతట జమదగ్ని మహర్షి సంకల్పమయ శరీరమును పొంది, పరశురాముని పూజలను అందుకొనిన పిమ్మట, సప్తర్షి మండలములో ఒకడై లోకమునకు ఆరాధ్యుడయ్యెను.


*శ్లో. కశ్యపోఽత్రిర్భరద్వాజో విశ్వామిత్రోఽథగౌతమః| జమదగ్నిర్వశిష్ఠశ్చ సప్తైతే ఋషయస్తథా॥*


కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు - అనువారు *సప్తఋషులుగా* ఖ్యాతి గాంచినవారు. నవదంపతులు తమ వివాహదీక్షానంతరము ఈ మహాత్ములను విధ్యుక్తముగా ఆరాధింతురు.


*16.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*జామదగ్న్యోఽపి భగవాన్ రామః కమలలోచనః|*


*ఆగామిన్యంతరే రాజన్ వర్తయిష్యతి వై బృహత్॥7879॥*


*16.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*ఆస్తేఽద్యాపి మహేంద్రాద్రౌ న్యస్తదండః ప్రశాంతధీః|*


*ఉపగీయమానచరితః సిద్ధగంధర్వచారణైః॥7880॥*


పరీక్షిన్మహారాజా! జమదగ్ని కుమారులలో ప్రముఖుడు, కమలలోచనుడు ఐన పరశురామ భగవానుడు రాబోవు మన్వంతరమున సావర్ణి వేదప్రవర్తకులైన, సప్తర్షులలో ఒకటై వేదములను విస్తరింపజేసి ఖ్యాతి వహించును. ఆ స్వామి ఎవ్వరినీ ఏమాత్రము దండింపక, ప్రశాంతచిత్తుడై నేటికిని మహేంద్రగిరిపై విలసిల్లుచున్నాడు. సిద్ధులు, గంధర్వులు, చారణులు మున్నగు దివ్యజాతులవారు ఆ మహానుభావుని చరితమును మధురస్వరములతో గానము చేయుచుందురు.


*16.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*ఏవం భృగుషు విశ్వాత్మా భగవాన్ హరిరీశ్వరః|*


*అవతీర్య పరం భారం భువోఽహన్ బహుశో నృపాన్॥7881॥*


విశ్వాత్ముడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, సర్వసమర్థుడు ఐన శ్రీమన్నారాయణుడు భూభారమును తొలగించుటకై భృగువంశజులలో పరశురాముడై అవతరించి, గర్వోన్మత్తులైన పెక్కుమంది రాజులను తుదముట్టించెను.


ఈ శ్లోకమున ప్రయుక్తమైన *బహుశః* అను పదమును గూర్చి వ్యాఖ్యానించుచూ *వీరరాఘవీయము* ఇట్లు తెలుపబడినది.


*బహుశ ఇత్యనేన కశ్చిదవశేషితః స్యాత్ - ఇతి సూచ్యతే తదేవోక్తం పురస్తాత్*


*శ్లో. అశ్మకాన్మూలకోజజ్ఞే యః స్త్రీభిః పరిరక్షితః| నారీకవచ ఇత్యుక్తో నక్షత్రే మూలకోఽభవత్॥*


'బహుశ - అను పదముద్వారా క్షత్రియులు ఇంకను మిగిలియున్నట్లు సూచింపబడుచున్నది. అశ్మకుని వలన కలిగినవాడు మూలకుడు. పరశురాముడు క్షత్రియ వంశములను నిర్మూలించునప్పుడు ఈ మూలకుని అంతఃపుర స్త్రీలు పరిరక్షించిరి. అందువలన ఇతనికి *నారీకవచుడు* అను పేరు ప్రసిద్ధమయ్యెను. తరువాతి క్షత్రియ వంశములకు మూలముగా నిల్చినవాడు. గావున ఇతడు మూలకుడుగా గూడ వాసికెక్కెను.


 *16.28 (ఇరువది ఐదవ శ్లోకము)*


*గాధేరభూన్మహాతేజాః సమిద్ధ ఇవ పావకః|*


*తపసా క్షాత్రముత్సృజ్య యో లేభే బ్రహ్మవర్చసమ్॥7882॥*


గాధివలన విశ్వామిత్రుడు జన్మించెను. అతడు ప్రజ్వలించుచున్న అగ్నివలె మహాతేజస్వి, ఆ మహాత్ముడు క్షాత్రధర్మమును వీడి, తీవ్రముగా తపస్సొనర్చి బ్రహ్మర్షియయ్యెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని పదహారవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: