16, అక్టోబర్ 2020, శుక్రవారం

తెలుసుకోండీ

 తెలుసుకోండీ... 16102020

తెలియజేయండీ....


అమ్మవారికి ఏ తిథి రోజున ఏ అబిషేకం , ఏ నైవేద్యం పెట్టాలి....!!


పాడ్యమి రోజు - ఆవు నేయి తో అభిషేకం చేస్తే సకల రోగలు నివారణ అవుతాయి.

విదియ రోజు - చక్కర తో అభిషేకమ చేస్తే దీర్గాయువు కలుగుతుంది.

తదియ రోజు - ఆవు పాలు తో అభిషేకం చేస్తే ఎలాంటి అకాల మృత్యు దోషాలు తొలిగిపోతాయి ,

చవితి రోజున - పిండివంటలు నైవేద్యం పెట్టడం వలన సకల విద్యలు లబిస్తాయి.

పంచమి రోజు - అరటి పళ్ళు నైవేద్యం పెట్టడం వలన మేధస్సు , బుద్ది శక్తి పెరుగుతుంది.

షష్టి రోజున - తేనే తో అమ్మవారిని అభిషేకించి , బ్రహ్మనునికి దానం ఇవటం వలన కాంతి పెరుగుతుంది, యషస్సు పెరుగుతుంది.

అష్టమి రోజున - బెల్లం నీటి తో అభిషేకించి, మంచి బెల్లం ఎవరికయినా దానం ఇవటం వలన అష్ట కష్టాలు అంటారు కదా అలాంటివి అనీ తీరిపొతయి అంటారు.

నవమి రోజున - పేలాలు నైవేద్యం పెట్టడం వలన సకల సౌభాగ్యలు కలుగుతాయి.

దశమి రోజున - నల్ల నువ్వులు తో చేసిన పదార్ధాలు నైవేద్యం పెట్టడం వలన సకల రోగలు పోతాయి అని , దీర్గాయుషు పెరుగుతుంది.


వారాలలో ఏ నైవేద్యం....


ఆదివారం రోజు - పాలు

సోమవారం - పాయసం

మంగళవారం - అరటిపళ్ళు

బుధవారం - వెన్న

గురువారం - పటికబెల్లం

శుక్రవారం - తీపి పదార్ధాలు

శనివారం - ఆవు నేయి


అమ్మవారికి ఇష్టమయిన అన్నం

పులగం - అన్నం + పెసరపప్పు

పాయసన్నం

పెరుగు అన్నం

బెల్లం అన్నం


నైవేద్యం పెట్టకుండా మనం తింటే అది దొంగతనం చేసి తినట్టు , అందుకని దేవునికి నివేదన చేయకుండా తినకూడదు.


అమ్మవారిని పూజ ఎలా చేయాలి....!!


ఆచమనం ముందు చేయాలి , కాల స్మరణ చేయాలి (సంకల్పం ) , అబిషేకం చేయాలి , మామిడి రసం(చూత పళ్ళు ) తో అబిషేకం చేయటం వలన సరస్వతి ఆఇంటి ని విడిచి వెళ్ళదు, అ ఇంట్లో వుండే వారికీ సరస్వతి కటాక్షం ఉంటుంది. ఆవు నేయి తో అబిషేకం చేయటం వలన సకల రోగాలు పోతాయి , పెరుగు తో అబిషేకం వలన సంపదలు కలుగుతాయి అమ్మవారికి చాల ప్రీతిగా ఉంటారు , సకల రోగాలు పోతాయి, తేనే తో అబిషేకం చేయటం వలన యశస్సు పెరుగుతుంది, మేదస్సు పెరుగుతుంది , ఆవు పాల తో అబిషేకం చేయటం వలన సకల దోషాలు పోయి , సకల శుభాలు కలుగుతాయి , గంధం తో అబిషేకం చేయటం వలన మనలో తామస గుణం పోతుంది , పసుపు తో అబిషేకం చేయటం వలన సౌభగ్యమ్ పెరుగుతుంది.


అమ్మవారిని 108 పువ్వులు తో పూజ చేయడం విశేషం . కమలాలు, జాజిపువులు , లేత బిల్వాలు - సకల సంపదలు కలుగుతాయి , దాడిమి పువ్వులు ( దానిమ్మ చెట్టుకు పూసే పువ్వులు అంటే కాయకి ముందు వచ్చే పువ్వులు కాకుండా దానిమ్మ పువ్వు చెట్లు చిన్న చిన్న గులాబిలా ఉంటాయి వేరు ఉంటాయి ) వాటితో , మల్లెలు కూడా అమ్మవారికి ఇష్టం.

 ....మిగతా రేపు.....

    సర్వం శ్రీపరమేశ్వరార్పణమస్తు.

కామెంట్‌లు లేవు: