8, ఆగస్టు 2021, ఆదివారం

కేనోపనిషత్తు

 కేనోపనిషత్తు సారాంశము


ప్రశ్న:- కేనేషితం పతతి ప్రేషితం మనః


మనస్సు, ప్రాణం, వాక్కు, కన్ను,చెవుల వెనుక ఉన్న దేవత ఎవరు?


జవాబు:


1. శ్రోతస్య శ్రోత్రం (చెవితో చూద్దాం) ఆత్మ వేరు, చెవి వేరు. ఆత్మ చెవి అంతటా వ్యాపించి ఉంది.


ఆత్మ ఉండటం వల్లే చెవిని చెవి అనగలుగుతున్నాము. అంటే చెవితో వినగలుగుతున్నాము.


ఇదే సూత్రం మనస్సు, ప్రాణం, వాక్కు, కన్ను, చెవులకు వర్తిస్తుంది.


2. న తత్ర చక్షుర్గచ్ఛతి న వాగ్గచ్ఛతి నో మనః మనస్సు, ప్రాణం, వాక్కు, కన్ను, చెవుల ద్వారా ఆత్మను తెలుసుకోలేము. 3. యద్వాచానభ్యుదితం యేన వాగభ్యుద్యతే


మనస్సు, ప్రాణం, వాక్కు, కన్ను, చెవుల ద్వారా ఆత్మను తెలుసుకోలేము. కాని మనస్సు, ప్రాణం, వాక్కు కన్ను, చెవులు ఆత్మ వల్లనే పని చేస్తున్నాయి. 4. అన్యదేవ తద్విదితాదథో అవిదితాదధి


ఆత్మ తెలిసిన వస్తువు కాదు, తెలియని వస్తువు కాదు.


దీని అర్థం- ఎ) ఆత్మ తెలియబడే వస్తువు (ఆబ్జెక్టు) దు - ప్రమేయం కాదు. బి) ఆత్మ తెలుసుకునే నేను - ప్రమాతా అయిన నేను.


సి) ఆత్మ ప్రమాతృత్వం లేకపోయినా ఉంటుంది. అది శుద్ధ చైతన్యం. 5. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే -


ఆత్మ ఆబ్జెక్టు కాదు కాబట్టి, సగుణ రూపంలో కొలిచే దేవుడు ఆత్మ కాదు. సాక్షి చైతన్యమైన నేనే ఆత్మను.


ఆత్మ అనుభవం


ఆత్మ అనుభవం పొందలేము.కేనోపనిషత్తు


ఆత్మ అనుభవం పొందనవసరం లేదు.


ఎందుకంటే అది నువ్వే. ఎవ్వర్ ది ఎక్స్ పీరియన్సర్, నెవ్వర్ ది ఎక్స్ పీరియడ్. అనుభవించే నువ్వే ఎప్పటికీ, అనుభవించబడే వస్తువు కాదు ఎన్నటికీ. యచ్చక్షుషా న పశ్యతి యేన చక్షూంషి పశ్యతి ఆత్మను కన్నుతో చూడలేము కాని కళ్ళు ఆత్మ వల్లే పనిచేస్తున్నాయి ప్రతిబోధ విదితం మతం


ఆత్మ అనుభవం పొందలేము కాని ప్రతి అనుభవమూ ఆత్మ వల్లే పొందుతున్నాము.


ఆత్మజ్ఞానం


ఆత్మ అంటే అనుభవించబడే వస్తువు కాదు. ఆత్మ అంటే అనుభవించే నేనే. నేను అంటే సాక్షి చైతన్యాన్ని, ఆత్మజ్ఞానం పొందటం అంటే వృత్తిలో మార్పు.


ఆత్మ అనుభవం కోసం ప్రయత్నించకూడదు. ఆత్మ వల్లే అన్నీ అనుభవిస్తున్నాము. ఆ ఆత్మను నేనే అని పదునైన బుద్ధితో అర్థం చేసుకోవటమే ఆత్మజ్ఞానం,


ఆత్మజ్ఞానం పొందిన విద్యార్థి స్పందన


1. నాకు బ్రహ్మ తెలుసు అనను 2. నాకు బ్రహ్మ తెలియదు అనను అంటే- బ్రహ్మను ఆబ్జెక్టుగా చూస్తే తెలియదని నాకు తెలుసు. బ్రహ్మను సబ్జెక్టుగా తెలుసుకోవాలని నాకు తెలుసు. బ్రహ్మ ఎవరికి తెలియదో, వారికి తెలుసు.


3. నాకు తెలుసు


దీన్నే ఉపనిషత్తు మళ్ళీ చెపుతుంది.


140


4. నాకు తెలియదు


బ్రహ్మ ఎవరికి తెలుసో, వారికి తెలియదు.కేనోపనిషత్తు


తెలిసిన వారికి తెలియదు.


తెలియని వారికి తెలుసు. అంటే బ్రహ్మను ఆబ్జెక్టుగా


చూసేవారికి తెలియదు. బ్రహ్మను సబ్జెక్టుగా తెలుసుకునేవారికి తెలుసు.


యక్షుని కథ వల్ల వచ్చిన 6 సందేశాలు 1. బ్రహ్మ అస్తి- యక్షుడు కనబడ్డాడు. ఉపాసనలు 1. విద్యుత్ ఉపాసన


2. బ్రహ్మణః దుర్విఘ్నేయం- వాయువు, అగ్ని తెలుసుకోలేకపోయారు. అంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేము.


3. జ్ఞానయోగ్యతా అపేక్షః- గర్వం ఉండకూడదు. శ్రద్ధ, భక్తి,శరణాగతి కావాలి. ఇంద్రుడు శరణు వేడాడు.


4. గురు అపేక్ష:- గురువు ద్వారానే నేర్చుకోవాలి. ఉమాదేవి గురువుగా వచ్చింది. 5. బ్రహ్మవిద్యాస్తుతిః - బ్రహ్మ విద్య పొందిన ఈ ముగ్గురు దేవతలూ ఖ్యాతిని పొందారు.


6. ఉపాసనవిధి అంగత్వం - ఈ కథకు అనుగుణంగా కొన్ని ఉపాసనలు చెప్పబడ్డాయి.


2. నిమేష ఉపాసన అధి దైవ ఉపాసనలు 3. వృత్తి ఉపాసన 4. బ్రహ్మ మహిమ ఉపాసన గుణ విశిష్ట ఉపాసన యక్షుని లక్షణాలు - క్షణికత్వం, మనోహరత్వం, ప్రకాశరూపత్వం. మెరుపుకూ, కనురెప్పలు ఆర్పటానికీ, వృత్తికీ ఈ మూడు లక్షణాలు ఉన్నాయి. మనస్సు బాహ్యవస్తువును ప్రకాశింపజేస్తుంది. చైతన్యం, వృత్తిని ప్రకాశింపజేస్తుంది. మనస్సు అంతర్గతంగా ఉన్న సాక్షిని ప్రకటింపచేస్తుంది. వృత్తి, చైతన్యాన్ని ప్రకాశింపజేస్తుంది. ఆధ్యాత్మ ఉపాసన


141


కేనోపనిషత్తు కర్మయోగం


ఉపనిషత్తు అనే ఆవుకు నాలుగుపాదాలు- తపస్సు, దమము, కర్మ, శమము


అంగాలు


అన్ని వేదాలు


సత్యం ఫలం


ఆయతనం


పాపరూప పాపాలు, పుణ్యరూప పాపాలు, అజ్ఞానరూప పాపాలు


నాశనమవుతాయి. సర్వాత్మ భావన కలుగుతుంది. జ్ఞాననిష్ఠలో నెలకొంటాడు. అంటే ఈ క్రింది భావనలోనే ఉంటాడు తదేవ బ్రహ్మత్వం విద్ధి వేదం యదిదముపాసతే


శాంతి పాఠం


ఓం ఆప్యాయను మమాజ్ఞాని వాక్పాణశ్చక్షుః శ్రోత్రమథోబలమిన్షియాణి చ సర్వాణి! సర్వం బ్రహ్మోపనిషదం మా_హం బ్రహ్మ నిరాకుర్యాం మా మా బ్రహ్మ నిరాకరోదనిరాకరణమస్త్వనిరాకరణం మే2 స్తు! తదాత్మని నిరతే య ఉ పనిషత్సు ధర్మాస్తే మయి సన్తు తే మయి సన్తు ||


ఓం శాస్త్రశ్శాస్తిశ్శాస్త్ర


కేనోపనిషత్తు అధ్యయనం మొదలుపెట్టే ముందు విఘ్నాలు లేకుండా చేయమని శాంతిపాఠం పఠిస్తాము. ఇప్పుడు అధ్యయనం నిరాటంకంగా సాగినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మళ్ళీ శాంతి పాఠాన్ని పఠిస్తాము.


సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు


142


కుండ మట్టి - జీవన్ముక్తి


మనిషి ఏం చేసినా శాంతి, సుఖం, భద్రత కోసమే చేస్తూంటాడు. అవి వస్తువుల్లోనూ, పరిస్థితుల్లోనూ, మనుషుల్లోనూ, సంఘటనల్లోనూ ఉందనుకుంటాడు. తన స్వరూపమే శాంతి, సుఖం, భద్రత అని తెలుసుకోలేక, బాహ్యంగా పరుగులు తీస్తూంటాడు. కస్తూరి మృగం తనలో సువాసన పెట్టుకుని బయట ఎక్కడో ఉందని, వెతికి, వెతికి అలసి సొలసి చనిపోతుందిట. సరిగ్గా మనిషి కూడా అలానే చేస్తాడు. తనే ఆనంద స్వరూపం అని గ్రహించడు.


కుండకు ఎవరో చెప్పారు. నీ గురించి నువ్వు తెలుసుకో! స్వరూపంగా నువ్వెవరో తెలుసుకో! స్వరూపతః నువ్వు మట్టివి. మట్టిని తెలుసుకుంటే, వెంపర్లాట, ఆరాటం పోయి జీవన్ముక్తి పొందుతావు అని చెప్పారు. వెంటనే కుండ మూటాముల్లే సర్దుకుని స్వరూపంగా మట్టిని చూద్దామని చార్ ధామ్ యాత్రకు బయలు దేరింది. యాత్ర అంతా పూర్తి అయింది కాని స్వరూపంగా మట్టి మాత్రం కనపించలేదు. యజ్ఞ యాగాదులు చేసింది మట్టి జాడే తెలియలేదు. ధ్యానం చెయ్యాలన్నారెవరో! ధ్యానం లోనూ మట్టి కనపడలేదు. కుండ మట్టిని వెతకాలి. ఎలా? మట్టి ఎక్కడ ఉంది? కుండ లోపల ఉందా? కుండ బయట ఉందా? కుండ మధ్యలో ఉందా? అసలు కుండకు మట్టికి దూరం ఎంత? కుండ అంతటా మట్టే. మట్టి తప్ప కుండే లేదు. కుండకు మట్టికి దూరం ఏమిటి? అవి రెండు వస్తువులైతే కదా! మట్టినే కుండ అంటున్నాం. కుండగా పరిమితత్వం, అల్పత్వం, అశాశ్వతత్త్వం ఉన్నాయి. అదే మట్టిగా అపరిమితత్త్వం, అనల్పత్వం, శాశ్వతత్త్వం. అదే జీవన్ముక్తి. ఇప్పుడు కుండ ఏం చేయాలి? అంతటా వెతకాలా? పూజలు చేయాలా? ధ్యానం చేయాలా? నేనే మట్టిని అని తెలుసుకుంటే చాలు. కుండ తయారుకాక ముందూ మట్టే, కుండగానూ మట్టే, కుండ పగిలినా మట్టే. మట్టిగా దానిలో ఏ మార్పూ లేదు. దానికి పుట్టుకా లేదు, మరణం లేదు. అదే కుండయితే మరణం, పుట్టుక తప్పవు.అదే విధంగా జీవుడు తను స్వరూపతః బ్రహ్మను అని తెలుసుకుంటే, తనే ఆనంద స్వరూపమని తెలుసుకుంటాడు. అదే జీవన్ముక్తి. జీవుడు ఎప్పుడూ ముక్తుడే. ఆ విషయం తెలుసుకోవడమే తరువాయి. దీనినే శాస్త్రం ప్రాప్తస్య ప్రాప్తం అంటుంది. మోక్షం సిద్ధవస్తువు, సాధ్యవస్తువు కాదు.


కంఠ చామీకర న్యాయం - ఒక రాజ్యంలో రాణిగారు చాలా ఖరీదైన నెక్లెస్ విదేశాలనుంచి తెప్పించుకున్నారు. అకస్మాత్తుగా ఆ నెక్లెస్ కనిపించడం లేదు. రాణిగారికి చాలా ప్రీతికరమైన నెక్లెస్ మాయమయింది. దాని మీదమోజు తీరకుండానే పోయింది. దానితో రాణిగారు విపరీతమైన ఆవేదన చెందారు. సేవకులతో రాజప్రాసాదమంతా అడుగడుగునా గాలింపు చేయిస్తున్నారు.


ఎంత వెతికినా ప్రయోజనం కన్పించటం లేదు. మంత్రి ఏమైనా మార్గం చూపుతాడేమోనని పిలిపించారు. మంత్రిగారు అసలు విషయం వాకబు చేస్తే రాణిగారి నెక్లెన్ పోయిందని తెలిసింది. రాణిగారిని చూడగానే మంత్రిగారికి నెక్లెస్ జాడ తెలిసిపోయింది. వెంటనే మంత్రి, “అమ్మా మీ సేవకులను వెతకడం ఆపమనండి,” అన్నారు.


మంత్రి తెలివితేటల మీద అచంచలమైన విశ్వాసం ఉన్న రాణిగారు చప్పట్లు కొట్టి నెక్లెస్ గురించి వెతకడం ఆపించింది.


“అమ్మా రాణిగారూ! మీ మెడను ఒకసారి తడుముకోండి,” అన్నారు మంత్రి. అప్పుడు రాణిగారికి మెడ తడుముకోకుండానే నెక్లెస్ బరువు తెలిసింది. ఆమె తన మెడలోనే నెక్లెస్ ను పెట్టుకుని, ఊరంతా వెతుకుతోంది. తనదగ్గరే వున్న నెక్లెస్ బయట ఎలా దొరుకుతుంది? విశ్వమంతా ఎంత వెతికినా దొరకదు. ఈ సమస్యకు పరిష్కారం - నెక్లెస్ పొయింది అనే అజ్ఞానం తొలిగి తన దగ్గరే, తన మెడలోనే ఉందని తెలిస్తే చాలు. దీనినే కంఠచామీకర న్యాయం అంటారు. ఇది తెలిస్తే ఇక ఎటువంటి ఆందోళన ఉండదు. కంఠచామీకరం అంటే నెక్లెస్ అని అర్థం.


సరిగ్గా ఇలాగే జీవుడు తనే స్వరూపతః బ్రహ్మనని తెలుసుకోలేక జన్మ జన్మలనుంచి బ్రహ్మను వెతుకుతూనే ఉన్నాడు. మన దగ్గరే కోహినూర్ డైమండ్ ఉంది. దానిని అజ్ఞానంతో పేపరు వెయిట్ లా వాడుతున్నాము.


ప్రయోజనం: నేనే శాంతి, సుఖం, ఆనందాలకు నెలవు అని తన పూర్ణత్వం దర్శించిన జ్ఞానికి ఎటువంటి వెలితి లేదు. అతను ఇక్కడే ఇప్పుడే జీవన్ముక్తి, ఆత్యంతిక ఆనందాన్ని అనుభవిస్తాడు.


అలవోకగా అద్వైతం పుస్తకరూపంలో రాబోతున్నది ...


144

అదే మాదిరిగా జీవుడు తను స్వరూపతః బ్రహ్మను అని తెలుసుకుంటే, తనే ఆనంద స్వరూపమని తెలుసుకుంటాడు. అదే జీవన్ముక్తి. జీవుడు ఎప్పుడూ ముక్తుడే. ఆ విషయం తెలుసుకోవడమే తరువాయి. దీనినే శాస్త్రం ప్రాప్తస్య ప్రాప్తం అంటుంది. మోక్షం సిద్ధవస్తువు, సాధ్యవస్తువు కాదు.


కంఠ చామీకర న్యాయం - ఒక రాజ్యంలో రాణిగారు చాలా ఖరీదైన నెక్లెస్ విదేశాలనుంచి తెప్పించుకున్నారు. అకస్మాత్తుగా ఆ నెక్లెస్ కనిపించడం లేదు. రాణిగారికి చాలా ప్రీతికరమైన నెక్లెస్ మాయమయింది. దానిమీదమోజు తీరకుండానే పోయింది. దానితో రాణిగారు విపరీతమైన ఆవేదన చెందారు. సేవకులతో రాజప్రాసాదమంతా అడుగడుగునా గాలింపు చేయిస్తున్నారు.


ఎంత వెతికినా ప్రయోజనం కన్పించ లేదు. మంత్రి ఏమైనా మార్గం చూపుతాడేమోనని పిలిపించారు. మంత్రిగారు అసలు విషయం వాకబు చేస్తే రాణిగారి నెక్లెస్ పోయిందని తెలిసింది. రాణిగారిని చూడగానే మంత్రిగారికి నెక్లెస్ జాడ తెలిసిపోయింది. వెంటనే మంత్రి అమ్మా మీ సేవకులను వెతకడం ఆపమనండి అన్నారు.


మంత్రి తెలివితేటల మీద అచంచలమైన విశ్వాసం ఉన్న రాణిగారు చప్పట్లు కొట్టి నెక్లెస్ గురించి వెతకడం ఆపింది.


“అమ్మా రాణిగారూ! మీ మెడను ఒకసారి తడుముకోండి,” అన్నారు మంత్రి. అప్పుడు రాణిగారికి మెడ తడుముకోకుండానే నెక్లెస్ బరువు తెలిసింది. ఆమె తన మెడలోనే నెక్లెస్ ను పెట్టుకుని, ఊరంతా వెతుకుతోంది. తనదగ్గరే వున్న నెక్లెస్ బయట ఎలా దొరుకుతుంది? విశ్వమంతా ఎంత వెతికినా దొరకదు. ఈ సమస్యకు పరిష్కారం నెక్లెస్ పొయింది అనే అజ్ఞానం తొలిగి తన దగ్గరే, మెడలోనే ఉందని తెలిస్తే చాలు. దీనినే కంఠచామీకర న్యాయం అంటారు. ఇది తెలిస్తే ఇక ఎటువంటి ఆందోళన ఉండదు. కంఠచామీకరం అంటే నెక్లెస్ అని అర్థం. -


సరిగ్గా ఇలాగే జీవుడు తనే స్వరూపతః బ్రహ్మనని తెలుసుకోలేక జన్మ జన్మలనుంచి బ్రహ్మను వెతుకుతూనే ఉన్నాడు. మన దగ్గరే కోహినూర్ డైమండ్ ఉంది. దానిని అజ్ఞానంతో పేపరు వెయిట్ లా వాడుతున్నాము.


ప్రయోజనం: నేనే శాంతి, సుఖం, ఆనందాలకు నెలవు అని తన పూర్ణత్వం దర్శించిన జ్ఞానికి ఎటువంటి వెలితి లేదు. అతను ఇక్కడే ఇప్పుడే జీవన్ముక్తి, అత్యంతిక ఆనందం అనుభవిస్తాడు.


అలవోకగా అద్వైతం పుస్తకరూపంలో రాబోతున్నది ...


***


146



కామెంట్‌లు లేవు: