పోతన సరస్వతీ దేవిని హాటక గర్భు రాణి అని సంబోధించాడు. అంటే ఏమిటి?
కాటుక కంటినీరు
కాటుక కంటినీరు అన్న పోతన చాటువుని మనం చాలామంది వినే ఉంటాం. దీని గురించి ఒక రహస్యమైన కథ ప్రచారం లో ఉంది.
మాలిక్ కాఫిర్ ఓరుగల్లు సామ్రాజ్యాన్ని జయించిన తరువాత రాజు సింగభూుపాలుడు అడవులలోకి వెళ్ళి అఙ్ఞాతంగా ఉండి సైన్యాన్ని తయారు చేసుకుంటున్నాడు. ఆడవులో ఎన్ని కష్టాలు పడ్డాడో అన్యాపదేశంగా మనకు పొతన భాగవతం లొ చెప్పాడు. అతనికి రహస్యంగా పద్యాలరూపంలొ ఓరుగల్లు కోటలొ విషయాలు చేరవేసేవాడు. బలి చక్రవర్తి కోట వర్ణన మొత్తం మాలిక్ కాఫిర్ కోట భద్రతా విషయాలే ఉన్నాయి.
ప్రస్తుత మన పద్యానికి వస్తే, సింగ భూపాలుని కోడలు గర్భవతి అడవులలోని తీసుకొని వెళ్ళక పోతన ఇంట్లో మారు వేషం లొ ఒక పనిమనిషి లాగా లొ ఉంచేస్తారు. ఆవిడ పేరు సత్యవాణి. ఆవిడగురించి రాజ భటులు వెదుకుతూ ఉంటారు. పోతన ఇంటికి విచారించడానివచ్చి అతనికి చాలా ధన్నాన్ని ఆశచూపిస్తారు. పోతన లొంగలేదు. నాకు తెలియదు అని చెప్పి పంపించేసాడు. రాజ భటులు వెళ్ళిన తరువాత కంటికి మింటి కి ఏక ధారగా నిశ్శబ్ధంగా రోధిస్తున్న ఆవిడతో పోతన ఆశువుగా చెప్పిన పద్యం ఇది.
కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో
కైటక దైత్య మర్ధనుని గాదిలి కోడల, యో మదంబ యో
హాటుక గర్భు రాణి,నిను యాకటికిన్ గొని పోయి యల్ల క
ర్ణాట కిరాత కీచకులకమ్మ త్రి శుద్ధిగ నమ్ము భారతీ
వివరణ
ఎందుకు అంతలా ఏడుస్తావు, సింగభూపాలుని కొడలా, రాజు అంటే విష్ణు ముుర్తిగా భావించి, అదేకాకుండా ఎంతోమంది మహామ్మదీయ రాజులని మట్టు బెట్టి, మాలిక్ కాఫిర్ నికుడా ఒక సారి ఓడించాడు సింగ భూపాలుదు. మాలిక్ కాఫిర్ మారు వేషం తిరిగి లో వచ్చి కోట రహస్యాలు తెలుసుకొని, కొంతమందికి ధనం ఆశచూపి రహస్యంగా కోట తలుపులు తెరిపించుకొని అర్ధ రాత్రి దాడి చెసి జయించాడు.
మాందరికీ నీవే అమ్మవు. బంగారం లాంటి సంతానాన్ని, మాకు కాబోయే రాజుని గర్భంలొ ఉంచుకున్నావు.
ఆకలి కోసం తుచ్చమైన ధనం కోసం నిన్ను ఈ కర్ణాటకనుంచి వచ్చిన కిరాతకులు, కీచకులు అయిన మహమ్మదీయులుకు అమ్మను,
త్రిశుధ్ధిగ, మనసా వాచా, కర్మణా నన్ను నమ్ము భారతీ……
ఈ ఆసత్య దోషం పోవడానికే, వారిజాక్షులందు , వైవాహికములందు ఆన్న పద్యం రాసేడు. ఈ పద్యం కూడా మనకందరకి తెలిసిందే.
గంజేద్ర మోక్షం పద్యాలలొ రహస్యంగా ఎలా దాడి చెయ్యలొ సింగ భూపాలునికి చెప్పేడు, తను వేరుగా వంటరిగా , పరివారం వేరుగా, ఆయుధాలు వేరుగా తీసుకు వచ్చి మాలిక్ కాఫిర్ను తిరిగి జయించేడు.
పద్యాలను ఈ సందర్భగా పరికిస్తే మతి పొతుంది. ఎలా ఉండాలొ ఎవరికి చెప్పకుండా, ఆయుధాలు చేపట్టకుండా, వాహనం ఎక్కకుండా, జుత్తు సరిగా దువ్వకుండా, సరియైన బట్టకాకుండా ఆడువారి బట్టలు ధరించి రావాలని (శ్రీకుచోపరి చేలాంచమైన వీడడు).
వీరందరు ఎక్కడ కలవాలి, ఎలా కలవాలి అన్న విషయం కూడా పద్యాల లో ఉంది.(నగరిలో ఆమూల సౌధమ్ము దాపుల). అదంతా డీకొడ్ చేసి వివరించాలంటే ఈవ్యాసం చాలదు, ఒక పుస్తకమే వ్రాయాలి. పోతన కవితా శక్తి అద్భుతం. ఒక పక్క భక్తి, శ్రీ విద్యోపాసన, మరోపక్క స్వామి భక్తి, రాజుకు రహస్యంగా కార్యనిర్ణయం చేసే మహా మంత్రి.
భాగవతం లొ ఉన్న శ్రీవిద్యోపాసన బలం విజయానికి ఉపకరించింది. స్వామి భక్తుడైన పొతన తిరిగి హైందవ సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి తనవంతు కృషి చేసాడు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి