22, జనవరి 2025, బుధవారం

తొమ్మిది దారులు*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

        *తొమ్మిది దారులు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*దైవ సన్ని ధిని చేరుకోవడానికి తొమ్మిది దారులు ఉన్నాయని నారద భక్తి సూత్రాల ద్వా రా తెలుస్తోంది.*


*అవి- శ్రవణం , కీర్తనం , స్మరణం , పాదసేవ, అర్చన, వందనం , దాస్యం , సఖ్యం , ఆత్మ నివేదన.*


*ఈ మార్గాల ద్వా రా భగవంతుణ్ని చేరుకోవచ్చని భాగవతం సైతం సూచించింది. భక్తుడు తన అవకాశాన్ని బట్టి వీటిలో ఏ మార్గాన్నై నా ఎంచుకోవచ్చు .*       


*శ్రవణం అంటే వినడం . దైవం గురించిన విషయాలు, లీలలు, కథలు మొదలైన వాటిని తన్మయత్వం తో వినడం కూడా భగవంతుణ్ని అర్చిం చినట్లే అవుతుంది. ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే భగవంతుడి విషయాలను నారదుడి ద్వారా  విన్నాడు. శుకమహర్షి ఏడు రోజుల్లో చెప్పిన భాగవత పురాణాన్ని విని పరీక్షిత్తు ముక్తుడయ్యాడు. ధర్మ రాజు, జనమేజయుడు మొదలైనవారంతా దైవం గురించి విని తరించినవారే.*


*భగవంతుడి గొప్పదనాన్ని నోరారా చెప్పడమే కీర్తనం. నిత్యం భగవంతుడి సుగుణాలను తలచుకుంటూ, వాటి గురించి మాట్లాడటం , సంకీర్తన చేయడం లాంటి చర్యల వల్ల మనసు భగవంతుడి మీద సులభంగా లగ్నం అవుతుంది. ఈ మార్గంలో ముక్తి పొందినవాడు శుక మహర్షి. మీరాబాయి, త్యాగరాజు, అన్నమయ్య , కంచర్ల గోపన్న వంటి వారంతా భగవంతుణ్ని కీర్తించి తరించినవారే.*


*స్మరణం అంటే తలచుకోవడం . ఎక్క డ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దైవాన్ని తలచుకుంటూనే ఉండాలి. అదే స్మరణ భక్తి అనిపించుకుంటుంది. నారాయణ నామస్మరణతో నారదుడు, రామనామ స్మరణతో హనుమంతుడు భగవంతుడికి దగ్గరయ్యారు.*


*దైవం అనుసరించిన మార్గం లోనే నడవడం ‘పాదసేవ’ అవుతుంది. అంతే గానీ ఎల్లప్పుడూ భగవంతుడి పాదాల మీదే తదేకమైన శ్రద్ధ కలిగి ఉండటం పాదసేవ కాదు. భరతుడు రాముడి పాదుకలనే రామ స్వరూపం గా భావించడానికి కారణం ఆయన అనుసరించిన మార్గాన్నే తానూ అనుసరించడం . గుహుడు చేసిన పాదసేవకు పులకరించి అతడికి మోక్షాన్ని ప్రసాదించాడు రాముడు.*

   

*ధూపదీపాలు వెలిగించడం , భౌతిక పదార్థాలైన కుంకుమ, అక్షతలు, పూలతో దేవుడికి పూజ చెయ్యడం అర్చన భక్తి. భౌతిక దేహంతో ప్రారంభించిన అర్చన, క్రమంగా మానసికం గా దైవాన్ని దర్శించి, ఆ స్వామికి మనసనే కోవెలలో అర్చనలు చేసే స్థితికి చేరుకోవాలి. రామకృష్ణ పరమహంస కాళికాదేవిని అలాగే అర్చన చేసి తరించారు.*


*వందనం అంటే నమస్కరించడం . తనలోని అహాన్ని విడిచిపెట్టి అవతలి వ్య క్తి గొప్పదనాన్ని అంగీకరించడమే వందనంలోని అంతరార్థం . అన్ని ప్రాణుల పట్ల దయతో ఉన్నా కూడా భగవంతుడికి వందనం చేసినట్లే.*   


*దైవ సేవకుడు ఎలా ఉండాలో హనుమ ఆచరించి చూపించినంతగా మరొకరు చూపించలేరు.*


*భగవంతుడు తన చుట్టూ ఉన్న లోకానికి యజమాని అని భావించి, ఆయనను ఆరాధిస్తూ ఉండటమే దాస్యం అవుతుంది. వనవాసంలో పద్నాలుగు సంవత్స రాల పాటు లక్ష్మణుడు అన్న కు దాసుడిగా ఉం డి సేవలు చేశాడు. ఇది దాస్య భక్తి.*


*మంచి స్నే హితుడితో మెలిగినట్లే భగవంతుడితో స్నే హభావం ప్రదర్శించడమే సఖ్య భక్తికి నిదర్శనం . కృ ష్ణుడితో పాండవులు, కుచేలుడు సఖ్యతతో ఉండి, నిరంతరం రక్షణ పొంది తమ జీవితాల్ని తరింపజేసుకున్నారు.*


*తనను తాను పూర్తిగా భగవంతుడికి సమర్పించుకోవడమే ఆత్మ నివేదనం . తనదంటూ ఏదీ ఉంచుకోకుండా అంతా పరమాత్మకు సమర్పించాలి. బలిచక్రవర్తి, గోదాదేవి, మీరాబాయి ఈ మార్గం లోనే ఉన్నతి పొందారు.*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

కామెంట్‌లు లేవు: