6, మే 2023, శనివారం

రుక్మి

 


                       *రుక్మి*

                  ➖➖➖✍️


*కురుపాండవ సంగ్రామంలో ఎవరి పక్షానా చేరకుండా ఉండిపోయింది ఇద్దరే ఇద్దరు. ఒకరు బలరాముడు, మరొకరు రుక్మి.* 


*బలరాముడికి మహాజన క్షయకరమైన కురుపాండవ యుద్ధం ఇష్టం లేదు. ఈ అభిప్రాయాన్ని ఆయన కృష్ణుడి ఎదుట చాలా సార్లు వ్యక్తం చేశాడు.* 


*బంధుమిత్రులూ, క్షత్రియులూ అందరూ క్షేమంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. కాని తమ్ముడు ఏ పనిచేస్తే దానినే బలరాముడు అంగీకరిస్తాడు. తమ్ముడంటే ఆయనకు అంత ప్రేమ, అభిమానం, గౌరవం.     అలా అని కౌరవులు రణభూమిలో కూలిపోవడం కూడా ఆయన సహించలేడు. అన్నదమ్ములు ఒకరి నొకరు చంపుకోవాలనుకోవడం ఆయనకు బాధ కలిగించింది. అందుకే తీర్థయాత్రల పేరుతో సరస్వతీ నదీ తీరానికి వెళ్ళిపోయాడు.*


*భీష్మక మహారాజు కుమారుడు ‘రుక్మి’ మహా పరాక్రమవంతుడు. ఇంద్రుడికి ప్రాణస్నేహితుడు. ఇతన్నే …‘హిరణ్యరోముడ’ని కూడా పిలుస్తారు. రుక్మిణీదేవికి స్వయంగా అన్నగారు. గంధమాదన పర్వతం మీద వున్న ద్రుముడనే కింపురుషుడి అనుగ్రహం వల్ల 'విజయం ' అనే దివ్య ధనస్సు సంపాదించాడు.*


*లోకంలో శ్రేష్ఠమైన దివ్య ధనస్సులు మూడే ఉన్నాయి. దేవతల ధనస్సులేవీ వాటితో సాటిరావు.* 


*వాటిలో ఒకటి విష్ణుమూర్తి శార్ఞం అనే ధనువు. శత్రువులకు దానిపేరు చెబితేనే నిద్రాహారాలుండవు. శ్రీ కృష్ణుడు దానిని ధరించాడు.* 


*మరొకటి గాండీవం. ఖాండవ వనదహన సందర్భంలో అగ్నిదేవుడు అర్జునుడికీ ధనస్సు ఇచ్చాడు.* 


*ఇక మూడోవది విజయం. ద్రుముణ్ణి ఆరాధించి రుక్మి అతని దగ్గర శస్త్రాస్త్ర విద్యలు అనేకం అభ్యసించాడు. మేఘగర్జనవలె ధ్వనించే విజయ నామక చాపాన్ని అతనినుండి సంపాదించాడు రుక్మి.* 


*రుక్మిణీదేవిని వివాహం చేసుకోవడానికి శ్రీ కృష్ణుడు ఆమెను రథం మీద తీసుకుపోతుంటే రుక్మి బలగర్వితుడై డాంబికాలు పలుకుతూ కృష్ణుణ్ణి ఎదిరించి నిందారోపణలు చేశాడు.* 


*తీరా కృష్ణుడు రథం నిలిపి బలాబలాలు చూసుకుందాం రమ్మని పిలిస్తే ఎదుర్కోలేక అవమానాలపాలయ్యాడు.*


*కుఱుపాండవ సంగ్రామం జరగబోతోందని తెలిసి ఒక అక్షౌహిణి సేనతో పాండవుల దగ్గరకు వెళ్ళాడు రుక్మి. పాండవులు అతన్ని సాదరంగా ఆహ్వానించి గౌరవించారు. అతిథి సత్కారాలు అందుకున్నాక రుక్మి అందరూ వింటూవుండగా పార్థుణ్ణి పిలిచి, "అర్జునా! రాబోయే సంగ్రామం గురించి బాధపడుతున్నావేమో! నేను నీకు అండగా ఉంటాను. నా అండదండల వల్ల నీకు విజయం తథ్యం. నన్ను మించిన పరాక్రమవంతుడు లేడు. పైగా నా దగ్గర తేజోమయమయిన ధనస్సు ఉంది. దానితో ద్రోణ, భీష్మ, కృపాచార్యాది కౌరవులను క్షణాల్లో మట్టి కరిపిస్తాను. ఈ రాజ్యం నీ వశం చేస్తాను. సరేనా" అన్నాడు.* 


*అర్జునుడు నవ్వుకున్నాడు.*

*కృష్ణుడూ, ధర్మరాజూ వుండగా ఏమిటీ బీరాలు పలకటమని అందరూ చెవులు కొరుక్కున్నారు.*


*"ఓయీ! వీరాధివీరా! మాకు సాయం చేస్తానని ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. అయితే కృష్ణుడు మాకు ఎల్లవేళలా సాయంగా ఉంటాడన్న సంగతి మాత్రం మర్చిపోకు. ఆయన సాయం వుంటే ఇంకెవరి అండదండలూ అక్కర్లేదు మాకు. పైగా నా చేతిలో గాండీవం ఉంది. సాక్షాత్తూ ఇంద్రుడే వజ్రాయుధం ధరించి వచ్చినప్పటికీ నేను భయపడను" అన్నాడు అర్జునుడు రుక్మితో.*


*ఆ మాటలు రుక్మికి కోపం తెప్పించాయి. వెంటనే తన సైన్యాన్ని తీసుకుని సుయోధన సార్వభౌముడి దగ్గరకు వెళ్ళాడు.*

*"రాబోయే కుఱుపాండవ యుద్ధంలో నేను మీ పక్షం ఉంటాను, మీ విజయానికి నేను తోడ్పడతాను. పాండవుల పొగరు అణుద్దాం. నా చాపంతో వాళ్ళందర్నీ స్వర్గం చేరుస్తాను. నా ప్రతాపం చూపిస్తాను" అన్నాడు.* 


*అయితే సుయోధనుడు కూడా అభిమానం కలవాడు. అతను కూడా రుక్మి సహాయం అక్కర్లేదని మంచిగా చెప్పాడు.*’


*రుక్మి సిగ్గుపడ్డాడు.*


*దుర్యోధనుడు కూడా తిరస్కరించాక వచ్చినదారినే తన నగరానికి తిరిగి వెళ్ళాడు.*

*తన శక్తియుక్తుల్ని అధికంగా ఊహించుకోవడం, ఎదుటివారి తెలివితేటల్నీ, శక్తినీ తక్కువగా అంచనా వేయడం ఎవరికీ మంచిది కాదు.*

*రుక్మికి ఈ అలవాటు మొదటినుంచీ ఉంది. అందుకే అనేకసార్లు పరాభవాలు పొందాడు.*✍️


.                      🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

మధుమేహ వ్యాధి వచ్చాక తీసుకోవాలిసిన జాగ్రత్త తగ్గించే ఆయుర్వేద ఔషదాలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*

       ఆయుర్వేద వైద్యశాస్త్రం ప్రకారం, మధుమేహం కఫా రకానికి చెందిన రుగ్మతగా పేర్కొంటారు, 

*👉🏿ఆహార నియమాలలో మార్పులుఆయుర్వేద వైద్యశాస్త్రంలో, మధుమేహానికి చికిత్స* చేయుటకు గానూ, మొదటగా ఆహార నియమాలలో మార్పులను చేయాలి. వీటిలో చక్కెరలు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను ఆహారంలో తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోవటం వలన మూత్రపిండాలు ప్రమదానికి గురయ్యే అవకాశం ఉంది. మధుమేహ వ్యాధి గ్రస్తులలో కొవ్వు పదార్థాలు జీర్ణం అవటం కష్టం, కావున వీటిని కూడా తక్కువ స్థాయిలో తీసుకోవాలి. వీటికి బదులుగా *నారింజపండ్లు, నిమ్మరసం, చేదుగా ఉండే పండ్లు మరియు ఔషదాలను తీసుకోవటం వలన మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.*

*👉🏿పంచకర్మ*

చాలా మంది మధుమేహ వ్యాధి గ్రస్తులు తమ శరీరంలో ఉన్న ప్లీహ కణాలను నాశనం చేసే యాంటీ బాడీలను కలిగి ఉన్నారు. ఇలాంటి సమయంలో పంచకర్మను వాడటం వలన ఈ యాంటీబాడీలు శరీరం నుండి తొలగించబడతాయి. వీటిలో హెర్బల్ మసాజ్, హెర్బల్ స్టీమ్ మరియు శరీరాన్ని శుభ్రపరచే ఉపవాసం వంటివి కూడా ఉంటాయి. పైన తెలిపిన పద్దతుల ద్వారా కాలేయ కణాలను, ప్లీహ కణాలను, క్లోమ కణాలను శుభ్రపరుస్తాయి. కోలన్ థెరపీ ద్వారా పూర్తి జీర్ణవ్యవస్థ శుభ్రపరచపడుతుంది.

*👉🏿వ్యాయామాలు మరియు యోగా ప్రతి రోజులు చేయండి 3నెలలు లో అదుపులో ఉంటది*


భౌతిక వ్యాయామాలు, శ్వాస వ్యాయామాలు, యోగా వంటి వాటిని మధుమేహాన్ని తగ్గించటానికి గానూ ఆయుర్వేద వైద్య శాస్త్రంలో చికిత్సలుగా వాడతారు.


*👉🏿ఔషదాలు*

*వివిధ రకాల మూలికలు మరియు ఔషదాలు మధుమేహ వ్యాధిని తగ్గించటానికి వాడతారు. వీటిని కూడా ఆయుర్వేద వైద్యనిపుణుల సమక్షంలో మాత్రమే తీసుకోవాలి*. 1.-శీలజిత్, 

2.-గుడ్మార్ పసుపు, 

3.-వేప, అమాలాకి, గుగ్గుల్, మరియు 

4.-అర్జునలను, 

     మధుమేహం చికిత్స కోసం వాడే అత్యంత ముఖ్యమైన మూలికలుగా చెప్పవచ్చు. మధుమేహ వ్యాధి ప్రారంభ దశలో ఉన్నపుడు, పసుపు మరియు కలబంద రసాన్ని వాడటం వలన శక్తివంతంగా తగ్గించవచ్చు మరియు ఈ రెండింటి మిళితం, క్లోమ గ్రంధి మరియు కాలేయ విధులను సరియగు విధంగా నిర్వహించుటలో శక్తివంతంగా పని చేస్తాయి.


5.-కసినియా ఇండికా, 

6.-పవిత్ర తులసి, మెంతులు, మరియు 

7.-జిమ్నెమా సిల్వెస్ట్రె మరియు మూలికా సూత్రాలు అయినట్టి, ఆయుష్-82 మరియు D-400 వంటి మూలికలు గ్లూకోజ్ తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తాయని పరిశోధనలలో వెల్లడించబడింది.


https://fb.watch/9HmejHJJDS/


*👉🏿మధుమేహాన్ని తగ్గించే ఆయుర్వేద ఔషదాలు*


ఇక్కడ తెలిపిన మూలికలు మరియు ఇంట్లో ఉండే ఔషదాలు మధుమేహాన్ని మరియు డయాబెటిస్ మిల్లిటస్ వంటి వ్యాధులను శక్తివంతంగా తగ్గిస్తాయి.


1.-కాకరకాయ లేదా లేదా చేదు రుచి ఉన్న నిమ్మకాయ రసాన్ని రోజు ఉదయాన ఖాళీ కడుపుతో తీసుకోవాలి.


2.-పసుపు కాప్సిల్స్: రెండు కాప్సిల్ లను ప్రతి రోజు 3 పూటలు వాడాలి.


3.-రోజు ఆపిల్ లను రెండు సార్లు తినాలి.


4.-మెంతులు, ముస్తా, అర్జున, ట్రిఫాల, అజ్వన్ , నెయ్యి లో కలిపిన హరితాకి లను రోజు తీసుకోవాలి.


5.-అమ్లాకి పొడి, హల్ది పొడి మరియు తేనె కలిపిన మిశ్రమాలను రోజు రెండు సార్లు తీసుకోవాలి.


ఈ ఔషదాలు, శరీర రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి మరియు ఇతర అల్లోపతి మందులు మాత్రం రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.

*👉🏿అటికమామిడి  అంబలిమాడు కూర* - ఆకు పూవురంగును అనుసరించి తెలుపు ఎరుపు నలుపు మూడురకాలు


గలిజేరు -  ఇదికూడా   ఆకు పూవురంగును అనుసరించి తెలుపు ఎరుపు నలుపు మూడురకాలు. దీనిని సంస్కృతంలో పునర్నవ (పునర్జీవితున్ని చేస్తుందని) అని పిలుస్తారు. దీనిని ఆయుర్వేదం బాధా నివారిణిగా ఉపయోగిస్తారు. దీని ఆకులు భారతదేశం అంతా ఆకుకూరగా ఉపయోగంలో ఉన్నవి. ఇవి కంటిచూపును బాగుచేస్తుంది, మరియు మధుమేహం వ్యాధిగ్రస్తుల రక్తంలోని గ్లూకోజ్ ను తగ్గిస్తుంది. మూత్రపిండాల పనితీరు బాగుచేస్తుంది. లివర్ వ్యాధులను బాగుచేస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఇందులో తెల్లని పూలు గలది మంచిది.


అటకమామిడి గలిజేరు ఒకేరకంగా ఉన్నా ఒకటికాదు. పరిశీలనగా చూడండి. కానీ పనర్నవకన్నా కొద్దిగా తక్కువగా పనిచేస్తుంది.


*👉🏿నాకు తెలిసిన జాగ్రత్త మీ కోసం*

ఆయుర్వేదాల ఔషదాలు, మధుమేహ వ్యాధిని ఇవి శక్తివంతంగా తగ్గిస్తాయి, కానీ, నిపుణుల సలహా లేకుండా వీటిని తీసుకోవటం వలన ఇతర ఆరోగ్య సమస్యలను కలుగచేస్తాయి. ఒకవేళ మధుమేహాన్ని తగ్గించటానికి గానూ, అల్లోపతి మందులను కూడా వాడితే, ఆయుర్వేదాలను వాడే ముందు మీ అల్లోపతి వైద్యుడిని కలిసి అతడి సలహాలను తీసుకోండి. కొన్ని రకాల అల్లోపతి మందులు, శరీరంలో ఆయుర్వేద ఔషదాలతో, ఆహార పదార్థాలతో మరియు ఆహార ఉపభాగాలతో చర్యలను కొనసాగించే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కావున వీటిని వాడటానికి ముందు మీ వైద్యుడిని, సలహా మేరకు మెడిసన్ తీసుకోవాలి 

*ధన్యవాదములు 🙏*

*మీ నవీన్ నడిమింటి*  


*తాళ్ళపాక అన్నమాచార్యలు🙏*


*తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉంది. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పద కవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలములోని నరసింహస్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.*


*కన్నడ వాగ్గేయకారుడు* *పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. (సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉంది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు). త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు.*


*చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు. జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి. జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు,ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడు.*


*అన్నమయ్య మనుమడు తాళ్ళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలనుపొందుపరచాడు. ఈ గ్రంథం1948లో లభ్యమై ముద్రింపబడింది. అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు ఈ రచనే మౌలికాధారం. కాని బహువిధాలైన నమ్మకాలూ, అనుభవాలూ, ఘటనలూ, కథలూ ఈ వివరాలలో పెనవేసుకొని ఉన్నాయి.*


*నందవరీకుల గాధ*


*నందవరీకులు క్రీ.శ. 10వ శతాబ్దంలో కాశినుండి ఆంధ్ర దేశానికి వలస వచ్చిన శుద్ధవైదిక బ్రాహ్మణులని పరంపరాయాత ప్రతీత. క్రీ.శ. 10వ శతాబ్దంలో నేటి కర్నూలు జిల్లాలోని "నందవరం"అనే గ్రామాన్ని నందుడనే రాజు పాలించేవాడు. ఈ రాజు కాశియాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొందరు వైదిక బ్రాహ్మణులు చాముండేశ్వరీ ఉపాసకులు పరిచయం అయ్యారని, ఆ సమయంలో వారణాసిలో క్షామం రాగా ఆ బ్రాహ్మణ కుటుంబాలు కొన్ని ఆంధ్రదేశానికి వలసివచ్చి నంద రాజు ఆశ్రయంలో స్ధిరపడ్డారనీ, నందరాజుచే తీసుకొని రాబడిన వైదికిలు కావడంచే నందవైదికులుగా ప్రచారం పొందారని జనవాక్యం. కాలక్రమాన వీరు నేటి కర్నూలు, కడప జిల్లాలో స్ధిరపడ్డారని పరిశోధకులు అభిప్రాయం. తాళ్ళపాక గ్రామ నామం అన్నమయ్య వంశస్ధులకు ఇంటిపేరుగా నిలిచింది. అన్నమయ్య కూడా నందవరీకుడే. ద్విపద కావ్యం ప్రకారం అన్నమయ్య తాత నారాయణయ్య. చదువు అబ్బక , గురువులు పెట్టే హింసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలని అనుకొన్నాడట. వూరిలో గ్రామ దేవత  చింతలమ్మ గుడివద్ద విషసర్పం పుట్టలో చేయి పెట్టాడట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో మూడవతరంలో హరి అంశతో ఒకబాలుడు జన్మిస్తాడని చెప్పిందట.*


*అన్నమయ్య వంశీకులు*


*భరద్వజ గోత్రులైన అన్నమయ్య పూర్వుల ప్రస్తావన నాలుగు తరాలకు సంబంధించిన వివరాలను చిన్నన్న అన్నమాచార్య ద్విపద వల్లను, అష్టమహిషి కల్యాణం వల్లను గ్రహించవచ్చును.*


భరద్వాజ ఋషి - నారాయణయ్య - విఠలయ్య - నారాయణయ్య - విఠలుడు - నారాయణుడు - నారాయణసూరి - అన్నమాచార్య


*అన్నమయ్య తాతయ్య - నారాయణయ్య*


*కడప జిల్లా రాజంపేట తాలూకా పొత్తిపినాడు మండలం నడిబొడ్డున తాళ్లపాక గ్రామం విరాజిల్లుతుండేది. ఆ గ్రామంలో వెలసిన చెన్నకేశవస్వామి, సిద్ధేశ్వరస్వామిల కరుణాకటాక్షములతో ఆ గ్రామజనులు సుఖవంతులై జీవనం సాగించేవారు. ఇచ్చట చెన్నకేశవస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాడు. సస్యశ్యామలమై విరాజిల్లే ఈ గ్రామం సన్మునులకు, అఖిల దేవతలకు నిజవాసమై వుండేదని అంటారు స్థలజ్ఞులు. ఈ చెన్నకేశవస్వామిని దేవతలు, ఋషులు, సిద్ధులు ప్రతి రోజూ పూజిస్తారు. ఈ చెన్నకేశవస్వామి గుడిని ఆశ్రయించుకొని కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు జీవించేవి. ఆ గ్రామవాసులు తలపక ఇందిరారమణపదైక మానసులుగా జీవనం సాగించేవారు. వాళ్లల్లో నారాయణయ్య చాల ప్రసిద్ధుడు. ఇతని నాలుగోతరంలో మరో నారాయణయ్య వుండేవాడు. అన్నమయ్య పితృ పితామహులు నారాయణయ్య, విఠలయ్యలు విష్ణుభక్తిరతులై తాళ్ళపాక చెన్న కేశవస్వామిని సేవించుకొంటూ జీవితం గడిపేవారు. ఈ నారాయణయ్య కథ తోనే మన అన్నమయ్య కథ మొదలౌతుంది.*


*నారాయణయ్యకు చిన్నతనంలో ఎంతకీ చదువు రాలేదు. తండ్రి విఠలయ్య నయాన భయాన చెప్పి చూశాడు. లాభం లేక పోయింది. తన వద్ధ ప్రయోజనం లేదని ప్రక్కనే వున్న ఊటుకూరులో తన బంధువుల వద్ద వుంచాడు. ఊటుకూరు నేడు కడపజిల్లా రాజంపేట తాలూకాలో ఉంది. అన్నమయ్య మనవడు చినతిరుమలయ్య ఊటుకూరి చెన్నరాయని మీద కొన్ని సంకీర్తనలు కూడా రచించాడు. అక్కడ బళ్ళో ఉపాధ్యాయులు శతవిధాల ప్రయత్నించారు. గురువులు నారాయణయ్యను చతుర్విధ ఉపాయాలకు గురి చేశారు. అయినా బాలునికి చదువుపట్ల శ్రద్ధకలుగలేదు. నారాయుణిని కళ్లల్లో నీళ్లే తప్ప నోట సరస్వతి పలకలేదు. వాళ్లు విసిగిపోయి బాలుని రకరకాల శిక్షలకు గురిచేసారు. చివరకు గురువు నారాయణయ్యను కోదండమున వ్రేలాడదీశారు. కోలగగ్గెర విధించారు. గుంజిళ్లు తీయించారు. కోదండం అంటే దూలానికి తాడు కట్టి వ్రేలాడతీయడం. కోలగగ్గెర అంటే కాళ్ళు చేర్చికట్టి కూలద్రోయడం.*


*నారాయణయ్యను అయ్యవార్లు ఇంతటి కఠిన పరీక్షలకు గురిచేసినందుకు మనస్సు గాయపడింది. నలుగురూ అవహేళన చేస్తున్నారు. సిగ్గుతో, అవమానంతో క్రుంగిపోయాడు. ఇంతకంటె చావు మేలను కున్నాడు. నారాయణయ్య ఊటుకూరు  గ్రామశక్తి అయిన చింతలమ్మ గుడి సమీపాన పుట్టలో పాముందని ఎవరో చెబుతుండగా విన్నాడు. నారాయణుడు ఒంటరిగా గుడికి చేరి పుట్టలో చేయి పెట్టాడు. నేడు ఊటుకూరు నందు చింతలమ్మ ఆలయం కనిపించదు. కాని ఊటుకూరు శివాలయంలో ఒక గదిలో వున్న స్త్రీమూర్తి విగ్రహం "చింతలమ్మ" అని స్ధానికుల అభిప్రాయం. పాము కరవలేదు సరికదా, నారాయణయ్యకు త్రికాల వేదినియైన చింతలమ్మ ప్రత్యక్షమైంది. నారాయణయ్య ఏడుస్తూ ఆమె పాదాల మీద పడ్డాడు. చింతలమ్మ ఆ బాలుని ఓళ్ళో చేర్చుకొని వూరడించింది. "ఎందుకుబాబూ ఈ అఘాయిత్యం? నీ మూడోతరంలో గొప్ప హరి భక్తుడు జన్మిస్తాడు. అతని వల్ల మీ వంశమే తరిస్తుంది. నీకు చదువు రాకపోవడమేమిటి? వెళ్ళు, తాళ్ళపాక చెన్నకేశవస్వామే నీకు అన్నీ అనుగ్రహిస్తాడు" అని నారాయణయ్యను అనుగ్రహించి అంతర్థానమైనది. అమ్మవారి ఆదేశం ప్రకారం నారాయణయ్య తాళ్ళపాక చేరి ఆశ్రితక్లేశనాశకుడైన చెన్నకేశవస్వామిని సేవించి స్వామి అనుగ్రహించే వేదవేదాంగ పారంగతుడై సకలవిద్యలు పొందగలుగుతాడు. సర్వజ్ఞుడని కీర్తి పొందుతాడు. ఈ నారాయణయ్య కుమారుడే నారాయణసూరి.*


*అన్నమయ్య తండ్రి - నారాయణసూరి*


*అన్నమయ్య తండ్రి అయిన నారాయణసూరి గొప్ప కవి, పండితుడు, సకల విద్యాదురంధరుడుగా ప్రసిద్ధికెక్కినవాడు. అన్నమయ్య తండ్రి పేరు ’నారాయణసూరి’గా చిన్నన్న పేర్కొనడాన్నిబట్టి తాళ్ళపాకవారు అన్నమయ్య జననానికి ముందే పండిత వంశస్ధులుగా కీర్తించబడేవారని భావించవచ్చును. నారాయణసూరి ధర్మపత్ని లక్కమాంబ, మహా భక్తురాలు. మధురంగా పాడుతుంది. ఈమె స్వగ్రామం మాడువూరు, కడపజిల్లా సిద్దపట్నం తాలూకాలో వున్నది. అక్కడ చెన్నకేశవస్వామి ఈమెతో ప్రత్యక్షంగా మాట్లాడేవాడట.*


*అన్నమయ్య తండ్రి - తిరుమల పయనం*


*భాగవతసేవా పరాయణులైన నారాయణసూరి, లక్కమాంబ లకు సంతానం లేకపోవడం తీవ్రవ్యధకు గురిఅయినారు. ఈ పుణ్య దంపతులు సంతానం  కోసం చేయని వ్రతం లేదు , కొలవని దేవుడు లేడు. "మాకు మంచి కొడుకును ప్రసాదించు స్వామీ" అని ఏడుకొండలస్వామికి మ్రొక్కుకున్నారు. ముడుపులు కట్టుకున్నారు. ఒక మంచిరోజు చూసి ఇద్దరూ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ప్రయాణమయ్యారు. లక్కమాంబ, నారాయణసూరి తిరుమల చేరారు. స్వామి మందిరం ప్రవేశించారు. గరుడ స్తంభం వద్ద సాగిలి మ్రొక్కారు. వాళ్ళకేదో మైకం కమ్మినట్లైంది. కళ్లు మిరుమిట్లు గొలిపే తేజస్సు కనిపించి ధగధగ మెరిసే ఖడ్గాన్ని వాళ్ల చేతుల్లో పెట్టి అద్రుశ్యమైంది. వేంకటేశ్వరస్వామి తన నిజ ఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్య దంపతులకు ప్రసాదించాడు. వాళ్ళు పరమానంద భరితులయ్యారు. వేంకటపతిని దర్శించి స్తుతించారు. సంతోషంతో తాళ్లపాకకు తిరిగి వచ్చారు.*


*అన్నమయ్య జననం*


*ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రణామం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని గాథ. కొండలయ్య తాను ధరించే "బిరుదు గజ్జియల ముప్పిడి కఠారాన్ని" వారికి అందజేశాడట. అలా పుట్టిన శిశువే అన్నమయ్య.*


*లక్కమాంబ గర్భవతి అయింది. వైశాఖమాసం విశాఖ నక్షత్రంలో ఒక శుభలగ్నంలో మూడు గ్రహాలు ఉన్నతదశలో వుండగా నారాయణసూరి, లక్కమాంబలకు నందకాంశమున పుత్రోదయమైనది, మగశిశువు ఉదయించాడు. సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు (మే 9, 1408) కడప జిల్లాలోని రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామములో అన్నమయ్య జన్మించాడు. 8వ యేట అన్నమయ్యకు ఆయన గురువు ఘనవిష్ణు దీక్షనొసగినపుడు అన్నమాచార్య నామం స్థిరపడింది. నారాయణసూరి ఆ శిశువునకు ఆగమోక్తంగా జాతకర్మ చేశాడు.*


*"అన్నం బ్రహ్మేతి వ్యజనాత్" అనే శ్రుతి ప్రకారం నారాయణసూరి పరబ్రహ్మ వాచకంగా తన పుత్రునకు అన్నమయ్య అని నామకరణం చేశాడు. అన్నమయ్యకు అన్నమయ్యంగారు, అన్నమాచార్యులు, అన్నయగురు, అన్నయార్య, కోనేటి అన్నమయ్యంగారు అనే నామాంతరాలు తాళ్ళపాక సాహిత్యంలోను, శాసనాల్లోను కనిపిస్తాయి.*


*శ్రీమహావిష్ణువు వక్షస్ధలమందలి కౌస్తుభమే శఠకోపయతిగా, వేంకటేశ్వరస్వామి గుడి ఘంట వేదాంతదేశికులుగా స్వామి హస్తమందలి నందకమనే ఖడ్గాంశలో పేయాళ్వారులు, అన్నమయ్యలు అవతరించారని ప్రాజ్ఞుల విశ్వాసం.*


*అన్నమయ్య బాల్యం*


*"హరి నందకాంశజుం డగుట డెందమున పరమ సుగ్యాన సంపద పొదలంగ."*


*అన్నమయ్య బోసి నవ్వులు వొలకబోస్తూ నలుగురినీ మురిపించేవాడు. మాటిమాటికీ వెంకన్న పేరు చెబితేనే ఉగ్గుపాలు త్రాగేవాడు. వేంకటపతికి మొక్కుమని చెబితేనే మొక్కేవాడు. వేంకటపతిమీద జోలపాడనిదే నిద్రపోడు. లక్కమాంబ భక్తిగీతాలు పాడుతుంటే పరవశించి పోయేవాడు. నారాయణసూరి కావ్యాలలో అర్ధాలు వివరిస్తూవుంటే తానూ ఊ కొట్టేవాడు. ఇలా అన్నమయ్య శిశుప్రాయం నుండి వేంకటపతి మీది ధ్యానంతో ప్రొద్దులు గడిపేవాడు.*


*అన్నమయ్యకు అయిదు సంవత్సరాలు నిండాయి. నారాయణసూరి ఆర్యుల సమ్మతి ప్రకారం ఉపనయనం చెయించాడు అన్నమయ్యకు.*


అహినాయకాద్రి

వెన్నుని వరముచే విద్య లన్నియును

నమితంబు లగుచు జిహ్వరంగసీమ

తము దామె సొచ్చి నర్తనమాడ దొడగె


*అన్నమయ్య ఆడిన మాటల్లా అమృతకావ్యంగ, పాడినదల్లా పరమగానంగా భాసించేది. చిన్ననాటనే వేంకటపతి మీద వింత వింతలుగా సంకీర్తనలు ఆలపించేవాడు. కాని అన్నమయ్య సంకీర్తన రచనకు స్వామి ఆదేశం పొదినది తన పదహారవ సంవత్సరంలోనే! వేంకటేశ్వరస్వామి ఆదేశం ప్రకారం అన్నమయ్య తన పదహారో ఏటనుండి రోజుకొక్క సంకీర్తనకు తక్కువ కాకుండా వ్రాయడం ప్రారంభించాడు. ఈ విషయం రాగిరేకులమీద తొలి వ్యాక్యాలవల్ల కూడా స్పష్టమవుతున్నది. అన్నమయ్య ఏక సంథాగ్రాహి. గురువులు చెప్పిన పాఠాలు చెప్పినవెంటనే అప్పచెప్పేవాడు. వాళ్లు ఆశ్చర్యపడేవాళ్లు. ఇంక అన్నమయ్యకు నేర్పించవలసింది ఏమీ లేదని త్వరలోనే తెలుసుకున్నారు. అన్నమయ్య చెన్నకేశవుని గుడిచేరి "బుజ్జి కేశవా"అని పిలిచేవాడు.*


*బుజ్జిబాలుని ముద్దు మాటలకు మురిసి చెన్నకేశవుడు చిరునవ్వులు చిందించేవాడు.అన్నమయ్య ఎప్పుడూ ఆటల్లో పాటల్లో మునిగి తేలేవాడు. చెరువు కట్టలమీద చేరి చెట్టుమీద పిట్టలతో గొంతు కలిపేవాడు. చిరుగాలుల సవ్వడికి మురిసేవాడు. చెరువులోని అలలలో ఉయ్యాలలూగే కమలాలను చూస్తూ గంతులేసేవాడు. కన్నెపిల్లలు వెన్నెల రోజుల్లో జాజర పాడుతూంటే అక్కడ చేరుకొని వాళ్లను అల్లరి పెట్టేవాడు. రాగం పాడీ, తాళం వేసీ చూపేవాడు. "మీకేం తెలీదు పొ"మ్మని ఎగతాళి చేసేవాడు. కలుపు పాటల్లో, కవిల పాటల్లో జానపదులతో బాటు శ్రుతి కలిపేవాడు. అన్నమయ్య మాటన్నా పాటన్నా ఆ వూరి వాళ్లు ఎంతో సంబరపడిపోయే వాళ్లు.*


*నారాయణసూరిది పెద్ద కుటుంబం. ఉమ్మడి కుటుంబాలలో చిన్న చిన్న కలతలు తప్పవు. వాళ్ల కోపతాపాలు అర్థం లేనివి కావు. ఇంతలో తగువులాడతారు. అంతలో కలిసిపోతారు. అన్నమయ్య బాల్యంలో తల్లిదండ్రులు, వదిన చెప్పిన పనులు అన్నీ విసుగు చెందగ చేసేవాడు. ఉమ్మడి కుటుంబాలల్లో పనులు తప్పవు. అందుకనే అన్నమయ్య ఎప్పుడూ దండె భుజాన తగిలించుకొని పాటలు పాడడం ఇంటివారలకు అంతగా నచ్చేది కాదు. ఒకనాడు అందరు కలిసికట్టుగా అన్నమయ్య మీద విరుచుకు పడ్డారు. అన్నమయ్యకు దిక్కు తెలియలేదు. "ఎప్పుడూ ఆ దండె భుజాన తగిలించుకొని పిచ్చి పాటలు పాడుకోవడమేనా? ఇంట్లో పనీపాటా ఎవరు చూస్తారు?" అని ఇంటివాళ్లు దెప్పి పొడిచారు. "గాలి పాటలు కట్టిపెట్టి అడవికెళ్ళి పశువులకింత గడ్డి తెచ్చిపడేయ్. "ఏ విసుగులో వున్నాడో నారాయణసూరి కొడుకును కసిరినంత పనీచేశాడు. లక్కమాంబ మాత్రం కొడుకువైపు జాలిగా చూసింది. అన్నమయ్య ఏమీ బదులు పలకలేదు. కొడవలి భుజాన తగిలించుకొని అడవికి బయలుదేరాడు.*


*అన్నమయ్యకు అడవికి వెళ్ళడం అలవాటు లేదు. ఒక చెట్టు కింద చతికిలబడ్డాడు. తంబుర చేతిలోనే ఉంది. తీగలు సవరించి పాడబోయాడు. పక్కనే కొడవలి ఉంది. దాన్ని చూస్తూనే వచ్చిన పని గుర్తుకు వచ్చింది. లేచి చుట్టూ పరికించాడు. ఒక చోట పచ్చిక బాగా బలిసి ఉంది.*


*’పాపవల్లరుల శ్రీపతినామహేతి నే పార దఋగు యోగీంద్రు చందమున ’*

*అంటూ కొడవలితో పచ్చికను కోస్తున్నాడు. పచ్చిక కోస్తున్నా మనసంతా శ్రీహరి మీదనే ఉంది. అందుకే మరికొంత పచ్చికను కొయబోతున్న అన్నమయ్య ఒక్కసారి "అమ్మా!!" అని కేక పెట్టాడు. చిటికినవేలు తెగి రక్తం బొటబొటా కారుతున్నది. రక్తం చూస్తూనే కళ్లు తిరిగిపోయాయి. బాధతో మూలిగాడు. ఈ అవస్థకు కారణం ఎవరు? ఒక్కమారు తనబంధువుల్ని తల్లిదండ్రుల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. వేదనలో విరక్తి , భక్తి జన్మించాయి. వేదనలో వేదం ప్రభవించినట్లు ఈ సంఘటన అన్నమయ్య జీవితంలో భక్తిరసావేశానికి నాంది పలికింది. "అంతా అబద్ధం. తనకు ఎవ్వరూ లేరు. లౌకిక బంధాలతో తనకు పని లేదనుకున్నాడు.*


*"అయ్యోపోయ బ్రాయముగాలము మయ్యంచు మనసున నే మొహమతినెత్తి||*


*తగు బంధూలా తనకు దల్లులును దండ్రులును వగలబెట్టుచు దిరుగువారేకాక మిగుల వీరల పొందు మేలనుచు హరినాత్మ దగిలించలేక చింతాపరుడనైతి ||*


*అని చింతించి.*


*"తల్లియుదండ్రియు దైవంబు గురువు నెల్ల సంపదలునై యెల్ల చందముల ననుబ్రోచు శెశాద్రినాధుని, గొలిచి మనియెద." అని నిర్ణయించుకొంటాడు.*


*తిరుమల పయనం*


*అదే సమయాన తిరుమల వెళ్ళే యాత్రికుల గుంపును చూశాడు. వాళ్లు ఆడుతూ పాడుతూ వెళ్తున్నారు. చేతిలొ వున్న కొడవలిని విసిరేసాడు. తంబుర చేత పట్టుకొని ఆ గుంపులో కలిసిపోయాడు. ఆ యాత్రికులు ఎవరోకారు , సనకాదులనే భక్తబృందం. వాళ్ల వేశం తమాషాగా వుంది. జింక చర్మంతో చేసిన కిరీటాలు పెట్టుకున్నారు. అబ్రకము, ఆకులు కుట్టిన బట్టలు వేసుకున్నారు. నొసట పట్టెనామాలు, శంఖ చక్రాల ముద్రికలు, కాళ్లకు కంచు అందెలు, చేతిలో బాణాలున్నాయి. దండెలు మీటుకుంటూ చిట్టి తాళాలు వాయిస్తూ మద్దెల మ్రోగిస్తూ భక్తి పారవశ్యంతో పాడుతూ చిందులేస్తూ మధ్యలో "గోవిందా! గోవింద!"*


*"వేడ్కుందామా వేంకటగిరి వేంకటేశ్వరుని||*

*ఆమటి మ్రొక్కులవాడే ఆదిదేవుడే వాడు*

*తోమని పళ్యలవాడే దురితదూరుడే ||" అంటూ చిత్రగతుల పాడుకుంటూ కొండకు పయనమవుతున్న యాత్రికులతో కలిసి తిరుపతి చేరుతాడు అన్నమయ్య.*


*తిరుపతి పొలిమేరలోకల గ్రామసక్తి తాళ్ళపాక గంగమ్మను సేవించాడు. తిరుపతిలో ఇంకా తాతాయగుంట గంగమ్మ, అంకాళమ్మ, వేశాలమ్మ, కాళెమ్మ, నేరెళ్ళమ్మ, కావమ్మ, మారలయ్య అనే గ్రామశక్తులు కొలువై ఉన్నారు. పూర్వం తిరుపతికి  వచ్చే భక్తబృందం మొదట తాళ్ళపాక గంగమ్మను సేవించిన తరువాతనే తిరుమలను సందర్సించే ఆచారం వుండేది. నేటికి తిరుపతిలో మే నెలలో గ్రామసఖ్తి గంగమ్మజాతర వైభవోపేతంగా జరుగుతుంది.*


*గంగమ్మని దర్సించిన అనంతరం అన్నమయ్య "అదె చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగము లందు వెలుగొంది ప్రభమీరగాను "అని తిరుపతులను కీర్తిస్తూ అచ్చటి చక్రవర్తి పీఠాలు, దేశాంత్రుల మఠాలు, తపస్వుల గృహాలు, విశ్రాంత దేశాలను సందర్శిస్తాడు. తిరుమలకు పయనమవుతూ మార్గమధ్యంలోని అళిపురిసింగరి, తలయేరుగుండు, పెద్దయెక్కుడు, కపురంపు కాలువలను సందర్శిస్తాడు*.


*ఇక్కడ అళిపురిసింగరి, తలయేరుగుండు, కురువమండపం, పెద్దయెక్కుడు, కపురంపు కాలువ,మోకాళ్ళ ముడుపులను గూర్చి వివరించడం సమంజసం.*


*అన్నమయ్య ఇంటిలో తల్లి సంగీతం, తండ్రి పాండిత్యం ఛాయలలో పెరిగాడు. ఉపవీత సంస్కారం పొందిన తరువాత ఇంటి గురుకులంలోనే విద్యాభ్యాసం సాగింది. ఏక సంధాగ్రాహి అయినందున అనతికాలంలో ఉన్నత విద్యావంతుడయ్యాడు. తన పదహారవ యేట అన్నమయ్యకు శ్రీవేంకటేశ్వర దర్శనానుభూతి కలిగింది. అప్పటినుండి అన్నమయ్య అద్భుతమైన కీర్తనలను రచింపసాగాడు.*


*తిరుమల దర్శనం*


*ఒకనాడు (8వ ఏట)ఎవరికీ చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతి బయలుదేరాడు. సంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో కొండనెక్కుచుండగా అలసిపోయి ఒక వెదురు పొదలో నిద్రపోయెను. అప్పుడు ఆయనకు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించి , పాదరక్షలు లేకుండా కొండనెక్కమని బోధించింది. అప్పుడు పరవశించి  అలమేలుమంగను కీర్తిస్తూ అన్నమయ్య శ్రీవేంకటేశ్వర శతకము రచించాడు. తిరుమల శిఖరాలు చేరుకొన్న అన్నమయ్య స్వామి పుష్కరిణిలో స్నానం చేసి, వరాహస్వామి దేవాలయంలో ఆదివరాహ స్వామిని దర్శించుకొన్నాడు. పిదప వేంకటపతి కోవెల పెద్దగోపురము ప్రవేశించి "నీడ తిరుగని చింతచెట్టు"కు ప్రదక్షిణ నమస్కారాలు చేసి, గరుడ స్తంభానికి సాగిలి మ్రొక్కాడు. సంపెంగ మ్రాకులతో తీర్చిన ప్రాకారము చుట్టి "విరజానది"కి నమస్కరించాడు. భాష్యకారులైన రామానుజాచార్యులను స్తుతించి, యోగ నరసింహుని దర్శించి, జనార్దనుని (వరదరాజస్వామిని) సేవించి, "వంట యింటిలో వకుళా దేవి"కు నమస్కరించి, "యాగశాల"ను కీర్తించి, ఆనంద నిలయం  విమానమును చూచి మ్రొక్కాడు. కళ్యాణ మంటపమునకు ప్రణతులిడి, బంగారు గరుడ శేష వాహనములను దర్శించాడు. శ్రీభండారమును చూచి, బంగారు గాదెలను (హుండీని) సమర్పించి తన పంచె కొంగున ముడివేసుకొన్న కాసును అర్పించాడు. బంగారు వాకిలి చెంతకు చేరి, దివ్యపాదాలతో, కటివరద హస్తాలతో సకలాభరణ భూషితుడైన దివ్యమంగళ శ్రీమూర్తిని దర్శించుకొన్నాడు. తీర్ధ ప్రసాదాలను స్వీకరించి, శఠకోపముతోఆశీర్వచనము పొంది, ఆ రాత్రి ఒక మండపములో విశ్రమించాడు.*


*తరువాత అన్నమయ్య కొండపై కుమార ధార, ఆకాశ గంగ, పాప వినాశం వంటి తీర్ధాలను దర్శించి, కొండపైనే స్వామిని కీర్తిస్తూ ఉండిపోయాడు. అతని కీర్తనలు విని అర్చకులు అతనిని ఆదరించ సాగారు.*


*అన్నమయ్య చిత్రపటం తిరుమలలో ఘనవిష్ణువు అనే ముని స్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞను తెలిపి శంఖ చక్రాదికములతో శ్రీవైష్ణవ సంప్రదాయానుసారముగా పంచ సంస్కారములను నిర్వహించాడు. గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకొంటూ, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ, వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితం గడపసాగాడు.*


*అళిపురిసింగరి(అలిపిరి)*


*కొండ ఎక్కుటలో తొలిమెట్టుగల ప్రాంతం అళిపురి. అడిపడి, అలిపిరి అని కూడా పిలుస్తారు. అలిపిరి చేరాడు, అక్కడ వెలసిన నరసింహస్వామికి నమస్కారం చేశాడు. అలిపిరి కొండకు చుక్కల పర్వతం అని కూడా పేరు. భగవంతుని చేరడానికి ఇది తొలిపాదం.*


*సంసారం, సంకీర్తనం*


*అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి తిరిగి రమ్మని బ్రతిమాలారు. ముందు నిరాకరించినా గాని అన్నమయ్య గురువు ఆనతిపై తాళ్ళపాకకు తిరిగి వచ్చాడు. కాని నిరంతరం భగవధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. అతనికి యుక్త వయస్సు రాగానే తిమ్మక్క , అక్కమ్మ అనే పడతులతో వివాహం చేశారు తల్లిదండ్రులు. వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకమారు తన ఇద్దరు భార్యలతో కూడి తిరుమలను దర్శించాడు. ఆ సమయంలోనే శ్రీవేంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు.*


*అప్పటినుండి అన్నమయ్య పుంఖానుపుంఖాలుగా కీర్తనలు చెప్పాడు. అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కించసాగారు. తరువాత అన్నమయ్య తన భార్యలతో కలసి తీర్ధయాత్రలకు  బయలుదేరాడు. వారు ముందుగా తమ వూరిలో చెన్నకేశవుని అర్చించారు. మార్గంలో నందలూరు  సౌమ్యనాధుని, ఒంటిమిట్ట రఘురాముని, కడప  వేంకటరమణుని, చాగలమర్రి చెన్నకేశవుని దర్శించుకొన్నారు. తరువాత నవనారసింహ క్షేత్రం అయిన అహోబిలం చేరుకొని శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని ఆనందించారు. ఆ క్షేత్రాన్ని, తీర్ధాన్ని, దైవాన్ని అన్నమయ్య తన కీర్తనలతో స్తుతించాడు. అహోబల మఠ స్థాపనాచార్యుడైన ఆదివణ్ శఠకోపయతులవద్ద అన్నమయ్య సకల వైష్ణవాగమాలను అధ్యయనం చేశాడు. అతని బోధనల ద్వారా పరబ్రహ్మస్వరూపము నర్చించే దివ్యయోగంలో కుల విచక్షణ వంటి అడ్డుగోడలను కూలగొట్టాలని అవగతం చేసుకొన్నాడు. ఇంకా అన్నమయ్య దక్షిణాదిన ఎన్నో వైష్ణవ క్షేత్రాలను దర్శించుకొన్నాడు. అతని కీర్తనలు అంతటా ప్రసిద్ధం కాజొచ్చాయి.*


*రాజాశ్రయం*


*విజయగర రాజ ప్రతినిధి, దండనాధుడు అయిన సాళ్వ నరసింగరాయలు (ఇతడు శ్రీకృష్ణ దేవరాయలుకు తాత), టంగుటూరు కేంద్రంగా ఆ సీమ ("పొత్తపినాడు") పాలనా వ్యవహారాలు చూస్తుండేవాడు. అతనికి "మూరురాయర గండ" అనే బిరుదుండేది. అన్నమయ్య కీర్తనలు, అతని ఆశీర్వచన మహాత్మ్యం గురించి విన్న దండనాధుడు తాళ్ళపాకకు వెళ్ళి అన్నమయ్యను దర్శించి అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకొన్నాడు. తరువాత అతను పెనుగొండ ప్రభువయినాక అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. రాజ ప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడదేశంలో హరిదాసకూటాలలో ప్రసిద్ధమయ్యింది. తరువాతి కాలంలో ఆ రాజు అన్నమయ్యను తనపై కూడా ఒక్కపదాన్ని వినిపించమని కోరాడట. హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందున, కోపించి రాజు అతనిని చెరసాలలో సంకెళ్ళలో ఉంచాడట.*


*అంత్య కాలం* 


*రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు. తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు. ఈ దశలో బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడు. వేంకటాచలానికి సమీపంలో ఉన్న "మరులుంకు"అనే అగ్రహారంలో నివసించేవాడు. ఈ సమయంలో రాజ్యంలో కల్లోలాలు చెలరేగాయి. అంతఃకలహాలలో రాజవంశాలు మారాయి. అన్నమయ్య జీవితంపట్ల విరక్తుడై నిత్యసంకీర్తనలతో పొద్దుపుచ్చేవాడు. అతని కీర్తనలలోని ఆశీర్వచన మహాత్మ్యం కథలు కథలుగా వినిన ప్రజలు అతని సంకీర్తనా సేవకు జనం తండోప తండాలుగా రాసాగారు.*


*ఈ సమయంలోనే పురందర దాసు తిరుమలకు వచ్చాడు. ఇద్దరూ వయోవృద్ధులు. భక్తశ్రేష్టులు. విష్ణుసేవాతత్పరులు. సంగీత కళానిధులు. ఒకరినొకరు ఆదరంతో మన్నించుకొన్నారు. "మీ సంకీర్తనలు పరమ మంత్రాలు. వీటిని వింటే చాలు పాపం పటాపంచలౌతుంది. మీరు సాక్షాత్తు వేంకటపతి అవతారమే"అని పురందరదాసు అన్నాడట. అప్పుడు అన్నమాచార్యుడు "సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్ళు తెప్పించుకొన్న భాగ్యశాలివి. మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాఠాలు. మిమ్ము చూస్తే పాండురంగని దర్శించుకొన్నట్లే"అన్నాడట.*


*95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (1503 ఫిబ్రవరి 23) పరమపదించాడు. రాగి రేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ , మరణ దినాలు తెలుస్తున్నాయి.*


*ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు. అవసానకాలంలో తన కొడుకు పెద్ద తిరుమలయ్యను పిలచి, ఇంక దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడట.*

కామెంట్‌లు లేవు: