6, మే 2023, శనివారం

ఆచార్య సద్బోధన:*

 


                *ఆచార్య సద్బోధన:*

                    ➖➖➖✍️


*మన ఆలోచనలు, ఆచరణ రెండూ సవ్యంగా ఉండాలి. వీటి యందు వక్రత ఉండరాదు.*


*శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గాలు, ఇంద్రియాలు గుర్రాలు. అదుపు తప్పిన మనస్సు కలవారి ఇంద్రియాలు విషయాల వైపుకి పరుగుతీస్తాయి. కానీ విచక్షణతో, వివేకంతో మనస్సుని అదుపులో ఉంచినప్పుడు ఇంద్రియాలు క్రమ శిక్షణ గల గుర్రాలవలె మెలగుతూ అంతర్ముఖుని చేస్తాయి.*


*మనస్సు నిగ్రహాన్ని కోల్పోయినప్పుడు అలజడి కలిగించేవాటిని, అవాంఛితాలని కోరుతుంది. అది సహజ స్థితి ఎంత మాత్రమూ కాదు.*


*సహజ స్థితి కాదని ఎందుకు చెబుతున్నామంటే దాని వలన కలిగే పరిణామాలు జీవుడిని బాధిస్తాయి. తనకు తాను నాశనం తెచ్చుకోకుండా ఇతరులకు హాని ఎవరూ చేయలేరు.*


*పగ, కోపం, అసూయలు మనస్సులో మొదలైతే దాని వలన ఆ వ్యక్తికి అంతర్గత హాని జరిగాకే, అవి ఇతరులను బాధిస్తాయి.*


*అందుచేత ఎప్పుడూ సద్భావనలను కలిగి ఉండాలి. అప్పుడు స్వీయహాని జరుగదు.*✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

కామెంట్‌లు లేవు: