6, మే 2023, శనివారం

మహోన్నతమైనది

 *ॐశ్రీవేంకటేశాయ నమః*

💝 *జీవితాలను మనం ఎలా గడపాలి?*

💖 *~ఒక అద్భుతమైన సమాధానం - ‘‘మీరింక ఒక్క గంట మాత్రమే బతుకుతారని తెలిస్తే ఏం చేస్తారో ఆ స్థితిలో జీవించాలి’’ అని చెప్పారు.*

💓 *”మరో గంటలో మరణిస్తా” అని తెలియగానే బాహ్యమైన వ్యవహారాలు వెంటనే చక్కబెడతారు. వీలునామా రాయడం, కుటుంబ సభ్యుల్నీ, మిత్రుల్నీ పిలిచి వాళ్ళకేదయినా నష్టం కలిగించి ఉంటే క్షమించాలని అడగడం, వాళ్ళు హాని చేసి ఉంటే వాళ్ళను క్షమించడంతో పాటు మనసుకు సంబంధించిన కోరికలనూ, ప్రపంచాన్ని వదిలేస్తారు.*

💞 *ఒకేఒక్క గంట కోసం ఇదంతా చేయగలిగినప్పుడు.. "మీరు ఉన్నంతకాలం ఎందుకు ఆ పని చేయలేరూ?” అని. మహోన్నతమైనది కదా ఈ ఆలోచన?.*

💕 *శ్రీరామకృష్ణ పరమహంస పొందిన నిర్వికల్ప సమాధి అయినా, శ్రీరమణ మహర్షి పొందిన ‘సహజస్థితి’ అయినా ఈ చట్రం లోనివే కదా.*

❤️ *నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః*

*శరీరం కేవలం కర్మ కుర్వనాప్నోతి కిల్బిషమ్‌.*

💕 *~”అంతఃకరణాన్నీ, ఇంద్రియాలనూ జయించినవాడు, సమస్త భోగ సామగ్రిని వదిలిపెట్టినవాడూ ఆశారహితుడైన సాంఖ్యయోగి.. శారీరక కర్మలను చేసినట్టు కనిపించినా, వాటి ఫలితం అంటకుండా జీవిస్తాడు” అని  శ్రీకృష్ణపరమాత్ముడు చెప్పాడు.*

💖 *మన భారతీయ పౌరాణిక, ఇతిహాస గాథల్లో భోగాలను తృణప్రాయంగా త్యజించిన చక్రవర్తులు కన్పిస్తారు. రుషభుడు కేవలానందావస్థలో సర్వం త్యజించి వెళ్ళిపోయాడు. అలాగే ఎందరో మహారాజులు అధికారాలనూ, భోగాలనూ అన్నింటినీ కాలితో తన్నేసి అంతర్ముఖులై జ్ఞానులయ్యారు.*

💓 *శ్రీరమణ మహర్షి, శ్రీరామకృష్ణ పరమహంస వంటి వాళ్ళు అతి ప్రమాదకరమైన క్యాన్సర్ రోగాన్ని కూడా లక్ష్యపెట్టకుండా అదే స్థితిలో జీవించారు. ఇంకొందరు సిద్ధ పురుషులు వాళ్ళకున్న యోగత్వాన్ని కూడా గమనించలేదు. అదొక కర్మబంధ విముక్తి. అయితే ఇక అందరూ సన్యాసం పుచ్చుకోవాల్సిందేనా*

*~అని ఎవరన్నారూ…?*

💖 *పలువురి ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదకారి ఔతున్న “మనం-మన ఆధ్యాత్మికత” పేర ఉన్న సత్సంగంలో చేరాలనే జిజ్ఞాస గల వారు మెసేజ్ పెట్టండి 9966870447 కి. 💝ఈ సందేశాన్ని అన్ని గ్రూపులకూ ఫార్వార్డ్ చేయండి.*

*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి.*

💖 *నిత్యజీవనంలో ఆ స్థితిని పొంది దానిలో నిలిచి ఉండడం. అపుడు ఏమీ మనల్ని అంటుకోవు. ముక్త జీవనమంటారు దానినే.*

💞 *ఎవరైతే ప్రకృతి స్వభావంలో ఇరుక్కుని అహంకారం అనే పాశంలో బందీలు అవుతారో వారు ఎప్పుడూ అన్ని రకాల ఆధిపత్యాల కోసం జీవిస్తూ ఉంటారు.*

💓 *సర్వ భూతాంతర్గతమైన ఈశ్వర దర్శనాన్ని పొందినవారికి అన్ని జీవుల్లో ‘ఆత్మదర్శనం’ కలుగుతుంది. ఆ స్థితిని నిలకడగా నిలబెట్టుకోవడాన్నే యోగమంటాం.*

💞 *~ ఏ వయసులో, ఏ పరిస్థితుల్లో మనకు ఆ దర్శనం కలిగినా అది ధారాపాతంగా కొనసాగుతూనే ఉంటుంది.*

💖 *చమత్కారంలా కన్పించే ఈ పరమోన్నత స్థితిని చాలా మంది మరణం తర్వాత ఆశిస్తుంటారు. కానీ, దేహం ఉండగానే ముక్తిని కలిగించే ఆ స్థితి మహోన్నతమైనది.*

💕 *దాన్ని తెలుసుకుంటే చాలు “జీవితం ఎలా గడపాలి?” అనే ప్రశ్నకు సరైన సమాధానం లభిస్తుంది.*

❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*

*~

కామెంట్‌లు లేవు: