10, అక్టోబర్ 2024, గురువారం

Palupu taadu పలుపు త్రాడు


 పలుపు తాడు

ప్రస్తుత సమాజంకు పలుపు తాడు అంటే ఏమిటో తెలియదు కానీ గ్రామీణ జీవనం చేసే వారికి పలుపు తాడు చిరపరిచయం వున్న మాటపలుపు తాడు అంటే పశువులను కట్టేసే త్రాడుఇది ఒకవైపు పశువు మెడ చుట్టూ కట్టే విధంగా ఉండి మరొకవైపు ఒక గుంజకు (స్తంబానికి )కట్టటానికి వీలుగా ఉంటుందిపలువు మేడలో  తాడు కట్టి గుంజకు కట్టి వున్నట్లయితే  పశువు కొట్టాన్ని (షెడ్డువదలి వెళ్ళదు . ఉదయం గోపాలుడు వచ్చి  పలుపు తాడును తీసి పశువులను మేపటానికి అడవికి తీసుకొని వెళ్లి మరల సాయంత్రం వచ్చి కొట్టంలో గుంజకు కట్టివేయటం రైతుల దినచర్యపలుపు తాడు పరిధిలోనే పశువులు సంచరించగలవు అంటే  త్రాడు నిడివికన్నా దూరంగా అవి వేళ్ళ లేవువాటి ముందు మేత (గడ్డికుడితి ఏర్పాటు చేసి రైతు వెళతాడు.  అవి వాటికి ఆకలి వేసినప్పుడు గడ్డి తిని కుడితి తాగుతాయి.

ఒక రోజు ఒక రైతు తన వద్ద వున్న ఒక పశువుకు పలుపు తాడు కట్టడానికి ప్రయత్నిస్తే  తాడు రోజు పసువు మల మూత్రాదులతో తడిసి ఉన్నందున చీకి తెగిపోయి వున్నదిమిగిలిన తాడును కలిపి ముడి వేయ ప్రయత్నిస్తే అది చాలా పోట్టిగా వుందిఇక  పశువుకు వేరే తాడు కట్టటం  మినహా ఇంకొక మార్గం లేకపోయిందిసమయానికి అతని వద్ద ఇంకొక త్రాడు లభ్యం కానందువల్ల ఏమి చేయాలా అని అలోచించి అక్కడ వున్న కొన్ని గడ్డి పోచలను పశువు మెడచుట్టు త్రాడు కట్టినట్లుగా త్రిప్పినాడటమరుసటి రోజు గోపాలుడు వచ్చి  పశువుకు త్రాడు లేకపోవటం గమనించి దానిని తోలుకొని పోవటానికి ప్రయత్నిస్తే అది అక్కడి నుండి కదలటం లేదుఇదేమి ఆశ్చర్యం మేడలో పలుపు లేనే లేదు కానీ పశువు మాత్రం కదలటం లేదు అని  రైతుకు చెపితే అప్పుడు రైతుకు గత దినం తానూ చేసిన పని గుర్తుకు వచ్చి మరల కొన్ని గడ్డి పోచలను తీసుకొని దాని మెడచుట్టు త్రాడు విడతీస్తున్నట్లు త్రిప్పాడట అప్పుడు  పశువు అక్కడినుండి కదిలి గోపాలునితో అడవికి వెళ్ళిందినిజానికి అప్పటిదాకా  పశువు తన మెడకు పలుపు తాడు లేకపోయినా ఉన్నట్లు భ్రాంతిలో ఉండీ వుంది .  అందుకే అక్కడినుండి కదల లేదు.

సాధక మిత్రమా నిజానికి ప్రతి సాధకుడు కూడా కేవలం  పశువు లాగానే ఆలోచిస్తున్నాడుతన మెడకు పలుపు తాడు లేకపోయినా ఉన్నట్లు భ్రాంతిలో ఉండీ వుంటున్నారు.ప్రతి మనిషి  చెరా చెర ప్రపంచంలోకి అంటే  జగత్తులోకి ఒంటరిగానే వస్తువున్నాడుఅంతే  కాదు  జగత్తుని నిష్క్రమించే వేళ ఒంటరిగా వెళుతున్నాడుఇంకొక విషయం ఏమిటంటే తానూ ఉన్నన్ని రోజులు ఇది నాది అది నాది వీరు నా వాళ్ళు నా భార్య నా భర్త నా పిల్లలు నా సోదరులు నా సోదరీమణులు అని భావిస్తూ ఒక గిరి గీసుకొని బ్రతుకుతున్నారు రకంగా అయితే పశువు తన మెడకు పలుపు తాడు ఉండి దాని పరిధిలో ఉంటున్నట్లునిజానికి పశువు తన మెడకు పలుపు లేకపోయినా రైతు తెలివిగా దానికి పలుపు తాడు ఉన్నట్లు బ్రాంతిని కలుగచేస్తే అదే నిజమని అనుకొని  పలుపుకు కట్టుబడి ఉన్నట్లుమనము కూడా  భగవంతుడు కల్పించిన శారీరిక బంధాలను శాశ్వితమైన బంధాలు అని అనుకోని వాటి పరిధిలోనే ఉండటమే కాకుండా వాటివరకు పరిమితం అయి అవే శాశ్వితం అని అనుకోని వాటి వెంటే జీవితాన్ని గడిపి అమూల్యమైన కాలాన్ని వృధా చేస్తూ విలువైన మానవ జీవితాన్ని శాశ్వితము నిత్యమూ అయినా బ్రహ్మపదం వైపు నడపకుండా మరల  జీవన మరణ చక్రంలో పరిబ్రమిస్తూవున్నామునిజానికి సాధకునికి సంసారం ఒక బంధనం కానే కాదుప్రతి సాధకుడు సాధారణ సంసారిక జీవనం చేస్తూ మోక్ష పదాన్ని చేరుకోవచ్చు.

 

కాకపొతే సాధకుడు గమనించవలసిన విషయం ఏమిటంటే తన సాధనకు ఏవి ఏవి అవరోధాలుగా ఉంటున్నాయి అని తెలుసుకొని  తెలివిగా అధిగమించాల్సి ఉంటుంది.

త్రివిధ అవరోధాలుప్రతి సాధకుడు మూడు విధములైన అవరోధాలను అధిగమించవలసి ఉంటుందని మన మహర్షులు వక్కాణించారు

1) ఆద్యాత్మికంఅంటే సాధనకు సాధకుని శరీరం సహకరించక పోవటంఉదాహరణకు సాధకుడు అనారోగ్యంతో ఉంటే శరీరము సాధనకు సహకరించదుఅంతే కాక బద్దకం అంటే తామస ప్రవ్రుత్తి కలిగి వున్నా సాధనకు ఉపక్రమించలేడు.

2) అది భౌతికము అంటే తన చుట్టు ప్రక్కల పరిసరాలు ప్రజలు తన సాధనకు అవరోధం కలిగించటంఅంటే సాధకుడు సాధనకు ఉపక్రమించినప్పుడు ఎక్కడో యేవో ధ్వనులులేక పరిసరాలలో కాలుష్యలో ఇతరులు లేక ఇతర జంతువులు కలిగించటం మొదలైనవిఇటీవల  సాధకుడు ఇంకొక విషయాన్ని  కోవకు చెందినదిగా తెలుసుకున్నాడుఎవరో మిత్రుడు భక్తి మార్గంలో వెళుతుంటాడుమంచిదే కానీ తానూ అంతటితో ఆగడు సాధకుని మిత్రుడు అవటం చేత సాధకుని నిరుత్సాహపరుస్తాడు ఎలాగంటె కలి యుగంలో జ్ఞ్యాన మార్గంతో పనిలేదు  కేవలం స్మరణాత్ ముక్తిహి అని అన్నారు కాబట్టి నీవు కూడా నామ స్మరణ చేయి లేక ఇంకొక నోమో వ్రతమోయజ్ఞమో చేయి అని తాను చేసిన చేస్తున్న దైవ కార్యాన్ని వివరించి అది ఆచరించమని ప్రబోధిస్తూ వుంటారువారి మాట వినక పొతే నీకు ఏమాత్రం భక్తి లేదు అందుకే నేను చెప్పింది వినటం లేదు అనో లేక నీవు కేవలం డాంబికుడివే నీకు ఏమి తెలియకపోయిన అన్ని తెలుసు అని తలుస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటూ ఇతరులను త్రప్పుడు తోవలో సూచనలిస్తున్నావు అని హెచ్చరించాను కూడా వచ్చునుఇవన్నీ ఎందుకు చెపుతున్నానంటే ప్రస్తుత సమాజంలో మన గురుదేవులు ఆది శంకరులు బోధించిన అద్వైత సిద్ధాంతాన్ని తెలుసుకొని ఆచరించే శక్తి లేకపోవటమే వీటన్నిటికీ కారణాలు.  ఎవరు ఏమి అన్న వాటిని వీటిని లెక్కలో పెట్టుకోకుండా సాధకుడు నిత్యం తన సాధనతో బ్రహ్మ పదాన్ని చేరవలసి ఉంటుందిఅనితర సాధన చేస్తే కానీ మోక్షాన్ని పొందలేరు.

ఇక మూడవ అవరోధాన్ని అది దైవికము అని అంటారు అవి ఏమిటంటే ప్రక్రుతి వలన ఏర్పడే బీబత్సవాలు ఉదాహరణకు తీవ్ర వానలుతుఫానులూ భూకంపాలు ఇతర ప్రళయాలువాటిని మనం అదుపులో వుంచుకోలేవుకానీ జాగ్రత్త వహిస్తే మొతటి రెండు అవరోధాలను సాధకులు అదుపులోకి తీసుకొని రావచ్చు.

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు మీ

భార్గవ శర్మ

 

కామెంట్‌లు లేవు: