26, ఆగస్టు 2023, శనివారం

తెలుగు లిపికి

 తెలుగు లిపికి మూలాధారం ఏమిటి?

1. భాషకు భౌతిక రూపమే లిపి.ప్రపంచంలో ఏ భాష అయినా ఏర్పడడం అనేది ఎంత ముఖ్యమో ఆ భాషకు లిపి ఏర్పడడం అనేది కూడా అంతే ముఖ్యం.ఎందుకంటే లిపి భాషకు ప్రత్యేక స్థితిని కల్పిస్తుంది.కాబట్టి భాషాధ్వనుల సంకేతాలే లిపి.

2. భారతదేశంలో లిపికి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ లిపి బాణాల్లా ఉండడం వల్ల బాణలిపి అని,క్యూనిఫారం అని అన్నారు.అరబ్బులు ఈ లిపి ని కీల లిపి అన్నారు.

3. బ్రాహ్మీ లిపి అచ్చమైన స్వదేశీ లిపి.ఖరోష్టీ లిపి సెమ్ జాతి వారి తెగ అయిన అరమీన్ల లిపి నుంచి ఉద్భవించి బ్రాహ్మీ ప్రభావంతో సంస్కృత ప్రాకృతాలు వ్రాయగల వర్ణమాలగా రూపుదాల్చింది.

4. ఇగ పోతే భారతదేశంలోని లిపులన్నింటికి మూలం ఈ బ్రాహ్మీ లిపే.

5. అశోకుని కాలానికి ముందు నుంచే బ్రాహ్మీ లిపి రెండు శాఖలుగా చీలిపోయింది.1.ఉత్తర బ్రాహ్మీ లిపి,2.దక్షిణ బ్రాహ్మీ లిపి.

6. ఉత్తర భారతదేశంలోని లిపులన్నింటికి మూలం "ఉత్తర బ్రాహ్మీ లిపి" కాగా,, దక్షిణ భారత దేశంలోని లిపులన్నింటికి "దక్షిణ బ్రాహ్మీ లిపి" మూలాధారం.

7. ఈ పై విధంగా దక్షిణ భారతంలోని తమిళభాష,,మలయాళంభాష,, కన్నడ భాష,, తెలుగు భాష,, మొదలగు భాషల లిపులన్నింటికి దక్షిణ బ్రాహ్మీ లిపినే మూలాధారం.

బ్రాహ్మీ లిపి అక్షరాలు…

కామెంట్‌లు లేవు: