26, ఆగస్టు 2023, శనివారం

 సొమ్మొకడిది సోకొకడిది!



రాజస్థాన్ లోని థార్ ఎడారి. చుక్కనీరు దొరకని ప్రదేశం. 1899-1900 సం: లో తీవ్రమైన కరవు వచ్చింది. అదిచూసి చలించిన బికనీర్ మహారాజు గంగా సింహ్ జీ రాథోడ్ , ప్రజల బాధలను తీర్చడానికి ఎడారి ప్రాంతంలో బికనీర్ వరకు ఒక కాలువను తవ్వించారు. అది ఆసియాలోనే అతిపెద్దకాలువ. దానికి గంగా నహర్ అని(గంగా కాలువ) పేరుపెట్టారు. ఆ కాలువ పనులు 5 డిసెంబర్ 1925 లోప్రారంభించారు. దాన్ని 26 అక్టోబర్ 1927 నుండి వాడటం ప్రారంభించారు. దానికి పంజాబ్ లోని సట్లెజ్ నది హరికే బారేజ్ నుండి నీరు తీసుకుని అక్కడనుండి బికనీర్ వరకూ కాలువ తవ్వారు. దానికోసం బ్రిటిష్ వారితో పోరాడి సాధించారు. గంగాసింగ్ రాథోడ్ గారికి మార్వాడా భగీరధుడని పేరు. ఆయన ఆకాలువకై తన సర్వాన్నీ సమర్పించి కాలువ తవ్వించారు. విశేషమేమంటే 650 కిలోమీటర్ల పొడవునా కాలువకింద రాగి ప్లేట్లను అమర్చి కాలువకిరువైపులా లైమ్ స్టోన్ రాళ్ళతో రివిటింగ్ చేయించారు. నీరు ఇసుకలో ఇంకి పోకుండా ఈఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇదేకాలువ మొదటిదశ మరమ్మతులు చేయించడానికి వరల్డ్ బాంక్ అప్పుగా 500కోట్లు ఇచ్చింది. రెండవ దశ కింకెంతవుతుందో తెలియదు. అంటే అసలు కాలువ నిర్మించచానికి 100సం: లక్రితం ఎన్నివేలకోట్ల రూపాయలు మహారాజా గంగాసింగ్ గారు ఖర్చుచేశారో ఊహించండి.. ఈకాలువ వలన 11-12 జిల్లాలకు తాగునీరు సాగునీరు అందుతుంది. ఈరోజు నవ్య బికనీర్ ఇలా ఉందీ అంటే అది గంగాసింహ్ జీ రాథోడ్ గారి చలవే! 

కట్ చేస్తే!

కాణీ ఖర్చు చెయ్యకుండా శ్రమలేకుండా ఎవరో చేసిన దాతృత్వాన్ని దొంగిలించడం మనదేశంలోని ఒక కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య. 1984 సం:లో ఆకస్మికంగా ఆకాలువ పేరును ఇందిరా గాంధీ కెనాల్ గా మార్చేశారు. కనీసం అడిగేవాడు లేడు ఈదేశంలో!!

తమ పేరు పెట్టుకోవడానికి వారికి సిగ్గులేదు. కనీసం ఇదేమన్యాయమని అడగకపోవడానికి ప్రజలకు కూడ సిగ్గులేదు.!

కామెంట్‌లు లేవు: